ఏపీ ఎస్సై ప్రాథమిక ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎస్సై ప్రాథమిక పరీక్షల ఫలితాలను పోలీస్ నియామక మండలి ఛైర్మన్ కుమార్ విశ్వజిత్ బుధవారం విడుదల చేశారు. ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షలకు 51,926 మంది అర్హత సాధించారని ఆయన తెలిపారు. గురువారం నుంచి పోలీస్ రిక్రూట్మెంట్ వెబ్సైట్లో ఓఎంఆర్ పేపర్స్ను అందుబాటులో ఉంచుతామని ఆయన వెల్లడించారు. ఈనెల 28 నుంచి 30 వరకు అభ్యర్థుల సందేహాలను స్వీకరిస్తామని, జనవరి 18 నుంచి ఫిజికల్ టెస్ట్లు నిర్వహిస్తామని పేర్కొన్నారు. విశాఖపట్నం, ఏలూరు, గుంటూరు, కర్నూలు నగరాల్లో ఫిజికల్ టెస్ట్లు జరుగుతాయన్నారు.