ఏపీలో ఒకే రోజు 49,553 పరీక్షలు
దేశంలోనే సరికొత్త రికార్డు సృష్టించిన రాష్ట్రం
ఒకే రోజు 6,553 మంది డిశ్చార్జ్
కొత్తగా 6,045 మందికి పాజిటివ్
సాక్షి, అమరావతి: కరోనా నిర్ధారణ పరీక్షలు, డిశ్చార్జ్లలో ఏపీ సరికొత్త రికార్డులు నెలకొల్పింది. దేశంలో ఇంతవరకూ ఏ రాష్ట్రం చేయని విధంగా ఒకే రోజు 49,553 పరీక్షలు నిర్వహించింది. దీంతో మొత్తం పరీక్షల సంఖ్య 14,35,827కి చేరింది. ప్రతి పది లక్షల జనాభాకు సగటున 26,888 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు.
గడిచిన 24 గంటల్లో ఆస్పత్రుల నుంచి రికార్డు స్థాయిలో 6,553 మంది డిశ్చార్జ్ అయినట్టు వైద్యారోగ్యశాఖ బుధవారం బులెటిన్లో పేర్కొంది. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 32,127కి చేరింది. కొత్తగా 6,045 కేసులు నమోదవడంతో మొత్తం కేసులు 64,713కి చేరాయి. తాజాగా 65 మంది మృతితో మొత్తం మరణాలు 823కి చేరాయి. యాక్టివ్ కేసులు 31,763 ఉన్నాయి.