ఏపీ ‘మా’ ఆవిర్భావం
తెనాలి: ఆంధ్రప్రదేశ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (ఏపీ మా) గుంటూరు జిల్లా తెనాలిలో ఆవిర్భావమైంది. స్థానిక ప్రిన్స్ హోటల్ కాన్ఫరెన్స్ హాలులో శుక్రవారం సీనియర్ నటీనటులు సమావేశమయ్యారు. కేంద్ర సెన్సారు బోర్డు సభ్యుడు దిలీప్రాజా వ్యవస్థాపక చైర్మన్గా ఏర్పాటైన ‘ఏపీ మా’కు అధ్యక్షురాలిగా ప్రముఖ సినీనటి కవిత, ప్రధాన కార్యదర్శిగా సీనియర్ నటుడు నరసింహరాజు నియమితులయ్యారు. ఉపాధ్యక్షుడుగా బాలాజీ, కార్యదర్శులుగా సీనియర్ నటీమణులు అన్నపూర్ణ, గీతాంజలి, సంయుక్త కార్యదర్శిగా శ్రీలక్ష్మి వ్యవహరిస్తారు. వీరితోపాటు తొమ్మిది మంది కార్యవర్గ సభ్యులను నియమించారు. వీరందరితో దిలీప్రాజా ప్రమాణస్వీకారం చేయించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోనూ చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతోనే ప్రత్యేకంగా అసోసియేషన్ ఏర్పాటు చేసినట్టు కవిత తెలిపారు.