రేపు ఢిల్లీ వెళ్లనున్న సీఎం వైఎస్‌ జగన్‌

AP CM YS Jagan Mohan Reddy Will Go To Delhi Tomorrow - Sakshi

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీ వెళ్లనున్నారు. అక్కడ కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్‌ షాను కలవనున్నారు. ఏపీ అభివృద్ధి పనుల నిమిత్తం అక్కడే రెండు మూడు రోజుల పాటు ఉండనున్నారు. ఎల్లుండి నీతి అయోగ్‌ సమావేశంలో పాల్గొననున్నారు.

అలాగే ఎల్లుండి వైఎస్సార్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి కూడా హాజరుకానున్నారు. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎంపీలతో చర్చించనున్నారు. ఏపీ సమస్యలపై ఎలా వ్యవహారించాలో వైఎస్సార్‌సీపీ ఎంపీలకు వైఎస్‌ జగన్‌ దిశా నిర్దేశం చేయనున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top