3న సీఎం వైఎస్‌ జగన్‌ రాక

AP CM YS Jagan Mohan Reddy Tour in Visakhapatnam - Sakshi

శారదాపీఠం వార్షికోత్సవాల్లో పాల్గొననున్న ముఖ్యమంత్రి

సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల మూడో తేదీన నగరానికి రానున్నారు. శ్రీశారదాపీఠం వార్షికోత్సవాల్లో ఆయన పాల్గొంటారని పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. మూడో తేదీ ఉదయం 9 గంటలకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లి నుంచి బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి 9.20కి చేరుకుంటారు. అక్కడి నుంచి  విమానంలో బయలుదేరి 10.10 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. రోడ్డు మార్గంలో విమానాశ్రయం నుంచి బయలుదేరి 10.40 గంటలకు చినముషిడివాడలోని శారదా పీఠానికి చేరుకుంటారు. 12.30 గంటల వరకు వార్షిక మహోత్సవ ముగింపు కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతర శారదాపీఠం నుంచి 12.50కి విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఒంటిగంటకు విమానంలో బయలుదేరి 1.40కి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి 2.10 గంటలకు తాడేపల్లిలోని స్వగృహానికి చేరుకుంటారని పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top