ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి
డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ద్వారా గ్రామీణ వైద్యులకు జీవో నంబర్ 429 వెయ్యి గంటలు శిక్షణ ఇప్పించారు. ఆయన తరువాత ముఖ్యమంత్రులు మెమో ద్వారా జీవోను నిలిపివేశారు. చంద్రబాబు 2014లో ఈ జీవోపై హామీ ఇచ్చారు. నాలుగేళ్లయినా న్యాయం చేయలేదు సరికదా 2017 ఆగష్టులో జీవో 465 విడుదల చేసి ఊరుకున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి జీవో 429 ప్రకారం గ్రామీణ వైద్యులకు శిక్షణ ఇప్పించండని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఏపీ బేసిక్ హెల్త్ కేర్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వినతి పత్రం అందజేశారు.
– ఏపీ బేసిక్ హెల్త్ కేర్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు