కొనసాగుతున్న ఏపీ మంత్రివర్గ సమావేశం

Andhra Pradesh Cabinet Meeting Starts - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రాష్ట్రంలోని కీలకమైన అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి‌ అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. భౌతిక దూరం‌ కోసం వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఈ భేటీ జరుగుతోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళల వైఎస్‌ఆర్ చేయూత పథకంపై సమావేశంలో చర్చిస్తున్నారు. చిరువ్యాపారుల ప్రభుత్వ సహాయం పథకం ప్రధానంగా సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. వీటితో పాటు మూడు సవరణ బిల్లుల ముసాయిదాలపై కేబినెట్‌ చర్చించే అవకాశం ఉంది. పర్యావరణ, జీఎస్టీ, ఉన్నత విద్యా కమిషన్ సవరణ బిల్లులపై చర్చించనున్నారు. ఇక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ, కురుపాం ఇంజినీరింగ్ కాలేజీ, 3 నర్సింగ్ కాలేజీలకు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. వైద్య, ఆరోగ్య శాఖలో భారీగా పోస్టుల భర్తీపైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. (అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల నిర్వహణపై చర్చ)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top