అంబటి రాంబాబుకు కరోనా పాజిటివ్
సాక్షి, గుంటూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో ఆయన ప్రస్తుతం ఐసోలేషన్లో ఉన్నారు. తాజాగా తన ఆరోగ్యంపై స్పందించిన అంబటి రాంబాబు.. కరోనా పాజిటివ్గా వచ్చిందని చెప్పారు. తాను చాలా ధైర్యంగా ఉన్నానని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ మేరకు ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. (ఘటనకు బాధ్యులైన వారిపై చర్యల తప్పవు: మంత్రి వనిత)
‘నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయం తెలిసి చాలా మంది కాల్స్ చేస్తున్నారు. కానీ ఐసోలేషన్లో ఉండటం వల్ల వారికి సమాధానం ఇవ్వలేకపోతున్నాను. ఒక ఆస్పత్రిలో చికిత్స చేయించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. చాలా ధైర్యంగా ఉన్నాను.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ రోజు ఉదయమే నాకు కరోనా సోకినట్టుగా నిర్దారణ అయింది. త్వరలోనే కోలుకుని మీ ముందుకు వస్తాను’ అని అంబటి రాంబాబు పేర్కొన్నారు. (చీరాల ఘటనపై సీఎం జగన్ ఫైర్)
ఈ రోజు వచ్చిన కోవిడ్ ఫలితాల్లో నాకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది
చాలా ధైర్యం గా వున్నాను, నా యోగ క్షేమాలు తెల్సుకోవడానికి నాకు చాలా మంది కాంటాక్ట్ చేస్తున్నారు, అందరికి ధన్యవాదాలు,
త్వరలోనే పూర్తిగా కోలుకుని మరలా ఎప్పటిలానే ప్రజల్లోకి వస్తాను. pic.twitter.com/u12NxudPNT
— Ambati Rambabu #StayHomeStaySafe (@AmbatiRambabu) July 22, 2020