అక్టోబర్లో అమరావతి డిక్లరేషన్!
శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ వెల్లడి
సాక్షి, అమరావతి: మహిళా సాధికారతకు సంబంధించి అమరావతి ప్రకటనను అక్టోబర్ రెండో వారంలో విడుదల చేయాలని నిర్ణయించినట్లు శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ తెలిపారు. బుధవారం స్పీకర్ కోడెల అధ్యక్షతన వెలగపూడిలోని శాసనసభ భవనంలోని సమావేశ మందిరంలో అమరావతి డిక్లరేషన్పై సమావేశం నిర్వహించారు. కార్యక్రమాన్ని రాజకీయాలకతీతంగా నిర్వహించాలని, వారంలోగా అమరావతి డిక్లరేషన్ ముద్రణ పూర్తవుతుందని స్పీకర్ కోడెల తెలిపారు.
అక్టోబరు 10వ తేదీ నుంచి 14వ తేదీ లోపు విజయవాడలోని ఏ–కన్వెన్షన్ హాలులో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. సభలో సీఎం చంద్రబాబుతో పాటు నలుగురు ముఖ్య అతిథులు ప్రసంగించే విధంగా కార్యక్రమం రూపొందిద్దామన్నారు.
సంబంధిత వార్తలు