‘బాబు యాత్ర చేపడితే ప్రజలు చెప్పులు విసురుతారు’
ఏలూరు: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు యాత్ర చేపడితే ప్రజలు చెప్పులు విసురుతారని వైఎస్సార్సీపీ నేత ఆళ్లనాని విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి సీఎం అవుతారనే ఉద్దేశంతో విభజనకు బాబు సహకరించారన్నారు. వచ్చే ఐదేళ్లు అధికారంలో ఉండాలని ఉంటే వైఎస్సార్ పథకాలు అమలు చేయాలన్నారు. రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా చేయాలని భావిస్తే సీమాంధ్ర ప్రజలు కాంగ్రెస్కు బుద్ధి చెబుతారని మండిపడ్డారు.
ప్రస్తుతం ఏర్పాటు చేసిన ఆంటోని కమిటీకి నిబద్ధత లేదని ఆళ్లనాని తెలిపారు. సమైక్యాంధ్రపై చంద్రబాబు స్పష్టమైన వైఖరి తెలపాలని ఆయన డిమాండ్ చేశారు.