రాజన్నను దర్శించుకున్న ఏసీపీ అంజిత


వేములవాడ, న్యూస్‌లైన్ : ఢిల్లీ సైబర్‌క్రైం ఏసీపీ, ఎన్టీపీసీకి చెందిన ఐపీఎస్ అధికారిణి చెప్యాల అంజిత వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామిని బుధవారం దర్శించుకున్నారు. తమ ఇలవేల్పు అయిన రాజన్న సన్నిధిలో కుటుంబసమేతంగా పూజలు నిర్వహించారు.

 

 2008 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అంజిత గత సంవత్సరం ఢిల్లీ సైబర్‌క్రైం ఏసీపీగా విధుల్లో చేరారు. ఆధునిక యుగంలో సైబర్ నేరాలు బాగా పెరిగాయని, ఇదులోనూ మహిళలను అంగడి సరుకుగా చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సైబర్ క్రైం నేరాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top