ఏపీలో కోలుకున్నవారు 20,298 మంది

Above 20000 Victims Discharged From Coronavirus - Sakshi

24 గంటల్లో 905 మంది డిశ్చార్జ్‌ 

యాక్టివ్‌ కేసులు 19,814

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 20 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో ఆస్పత్రుల నుంచి 905 మంది డిశ్చార్జ్‌ అవడంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 20,298కి చేరింది. గురువారం ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 వరకు 20,245 మందికి పరీక్షలు నిర్వహించగా 2,602 మందికి పాజిటివ్‌గా తేలినట్టు వైద్యారోగ్యశాఖ శుక్రవారం బులెటిన్‌లో పేర్కొంది. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసులు 40,646కి చేరాయి. ఇప్పటి వరకు మొత్తం 12,60,512 మందికి పరీక్షలు నిర్వహించారు. గడిచిన 24 గంటల్లో 42 మృతితో మొత్తం మరణాల సంఖ్య 534కి చేరింది. యాక్టివ్‌ కేసులు 19,814 ఉన్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top