కరోనాను జయించిన 9 నెలల చిన్నారి
నెల్లూరు(అర్బన్): నెల్లూరు నగరంలోని కోటమిట్ట ప్రాంతానికి చెందిన తొమ్మిది నెలల చిన్నారి కరోనాను జయించింది. కోటమిట్ట ప్రాంతంలో కరోనా తీవ్రత అధికంగా ఉండటంతో ఆ ప్రాంతంలోని వారందరికీ ప్రభుత్వం కరోనా పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షల్లో పాపకు పాజిటివ్గా తేలింది. ఆస్పత్రికి తరలించి ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందించారు. రెండు వారాల తర్వాత పాప కోలుకోవడంతో సోమవారం డిశ్చార్జ్ చేశారు. కరోనాను జయించి వచ్చిన తమ చిన్నారిని చూసుకుని ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.
(నోట్: ఆంధ్రప్రదేశ్లో మొత్తం పాజిటివ్ కేసుల్లో ఒడిశా రాష్ట్రం నుంచి 10, మహారాష్ట్ర 101, గుజరాత్ 26, రాజస్థాన్ 11, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరు చొప్పున మొత్తం 150 మంది వలస కార్మికులకు సంబంధించినవి)