నాకేమీ అక్కర్లేదంకుల్‌

8th class student meet ys jagan in praja sankalpa yatra - Sakshi

అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం వేపరాళ్ల గ్రామానికి చెందిన రాఘవేంద్రగౌడ్‌ కుమారుడు కార్తీక్‌ బళ్లారిలో 8వ తరగతి చదువుతున్నాడు. అతనికి వైఎస్‌ జగన్‌ అంటే ఎనలేని అభిమానం. జిల్లాలో ప్రజా సంకల్పయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి జగన్‌ను కలవాలని, తనను ఆయన వద్దకు తీసుకెళ్లాలని ఇంట్లో వాళ్లను అడుగుతూ వచ్చాడు. ఆదివారం బడికి సెలవు కావడంతో తండ్రి రాఘవేంద్ర గౌడ్, పెదనాన్న మంజునాథగౌడ్‌ కార్తీక్‌ను తీసుకొని పాదయాత్ర జరుగుతున్న ధర్మవరం మండలం తుమ్మల గ్రామం వద్దకు చేరుకున్నారు. విపరీతమైన జనాలు ఉండటంతో జగన్‌ను కలిసేందుకు వీలు కాలేదు. అంతటి జనంలోనూ కార్తీక్‌ తన తండ్రి, పెద్దనాన్నతో కలిసి సుమారు రెండు కిలోమీటర్లు నడిచాడు.

అప్పటికి జగన్‌ను కలిసే అవకాశం వచ్చింది. తన అభిమాన నేతతో ఫొటో తీయించుకున్నాడు. ‘అంత దూరం నుంచి ఎందుకొచ్చావు.. ఇబ్బంది కదా?’ అని జగన్‌ అంటే.. ‘మీరంటే అభిమానం అంకుల్‌’ అని బదులిచ్చాడు. ‘ఏమైనా సమస్యలున్నాయా.. మరేమైనా పని ఉందా?’ అని అడిగితే ‘నాకేమీ అవసరం లేదు. మీరు ముఖ్యమంత్రి కావాలన్నదే నా ఆశ’ అని చెప్పాడు. ఆ తర్వాత మరో మూడు కిలోమీటర్లు జగన్‌ వెంట నడిచి తర్వాత ఊరికి బయలుదేరి వెళ్లాడు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top