డెంగ్యూతో ఆరు నెలల పాప మృతి


ముల్కలచెరువు (చిత్తూరు జిల్లా) : డెంగ్యూతో ఆరు నెలల పసికందు మృతి చెందింది. ఈ సంఘటన తిరుపతిలోని సిమ్స్ ఆస్పత్రిలో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ముల్కలచెరువు పట్టణ కేంద్రానికి చెందిన నజియాకు ఆరు నెలల ఆశియా సంతానం. కాగా గత వారం రోజులుగా ఆశియా జ్వరంతో బాధపడుతోంది. దీంతో స్థానికంగా రెండు రోజులు వైద్యం చేయించినా జ్వరం తగ్గకపోవడంతో తిరుపతి తరలించారు.



అయితే తిరుపతి తరలించే నాటికే జ్వరం తీవ్రత పెరిగింది. కాగా తిరుపతి సిమ్స్‌లో చికిత్స పొందుతున్న అశియా ఆదివారం మృతి చెందింది. పాప మరణించడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top