ఏపీలో మరో 5,041 కరోనా కేసులు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఆదివారం 5,041 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 49,650కి చేరుకుంది. గత 24 గంటల్లో కోవిడ్ నుంచి కోలుకుని 1,106 మంది క్షేమంగా డిశ్చార్జ్ కాగా, ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 22,890మంది డిశ్చార్జ్ అయ్యారు. గత 24 గంటల్లో 31,148 శాంపిల్స్ను పరీక్షించగా ఇందులో 5041 కరోనా కేసులు పాజిటివ్గా నమోదయ్యాయి. కరోనాతో ఆదివారం అత్యధికంగా 56మంది ప్రాణాలు కోల్పోగా, ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 642 మంది మృతి చెందారు. ఇప్పటివరకు 13లక్షల 15వేల 532 మందికి పరీక్షలు నిర్వహించారు.
గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి తూర్పుగోదావరిలో పది మంది, శ్రీకాకుళంలో ఎనిమిది మంది, కర్నూలులో ఏడుగురు, విశాఖలో ఏడుగురు, కృష్ణాలో ఏడుగురు, ప్రకాశంలో నలుగురు, అనంతపురంలో ముగ్గురు, కడపలో ముగ్గురు, విజయనగరంలో ముగ్గురు, గుంటూరులో ఇద్దరు, చిత్తూర్లో ఇద్దరు కరోనా బారిన పడి మరణించారు.