ఏపీలో 226కు చేరిన కరోనా కేసులు

34 New Corona Positive Cases Registered In AP - Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. శనివారం రాత్రి 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9గంటల వరకు కొత్తగా 34 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ సీఎస్‌ జవహర్‌ రెడ్డి ఆదివారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. ఒంగోలు 2, చిత్తూరు 7, నెల్లూరు 2, కర్నూలు 23 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో నిన్నటి వరకు  190 ఉన్న కరోనా కేసులు నేడు 226కు చేరాయి. కర్నూలు జిల్లాలో ఒక్కరోజే 23 కొత్త కేసులు నమోదు కావటం గమనార్హం. దీంతో ఆ జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 27కు చేరింది. కాగా, కరోనా బారిన పడి రాష్ట్రంలో ఇప్పటివరకు ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడ్డారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top