ఏపీలో కొత్తగా 24 కరోనా పాజిటివ్ కేసులు
సాక్షి, అమరావతి : ఏపీలో కొత్తగా 24 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 405కు చేరింది. జిల్లాల వారీగా చూస్తే.. గుంటూరు జిల్లాలో 17, కర్నూలులో 5, ప్రకాశం, వైఎస్ఆర్ జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైంది. రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకుని 11 మంది డిశ్చార్జ్ అయ్యారు.
అత్యధికంగా కర్నూలు జిల్లాలో 82 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 75, నెల్లూరు 48, ప్రకాశం 41, కృష్ణా 35 కేసులు, కడప 30, పశ్చిమగోదావరి జిల్లా 22, విశాఖ 20, చిత్తూరు జిల్లాలో 20, తూర్పుగోదావరిజిల్లాలో 17, అనంతపురం జిల్లాలో 15 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 388 యాక్టివ్ కేసులు ఉన్నాయి.