20 ఇసుక లారీలు స్వాధీనం

అజిత్‌సింగ్‌నగర్‌(విజయవాడ సెంట్రల్‌): నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా ఇసుకను విక్రయిస్తున్న వారిపై విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు శుక్రవారం దాడులు చేశారు. పాయకాపురం పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఇసుకను అక్రమంగా నిల్వ ఉంచి విక్రయిస్తున్నట్లుగా విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబుకు సమాచారం రావడంతో విజిలెన్స్, మైనింగ్, రెవెన్యూ అధికారులు దాడులు చేసి అక్కడ నిల్వ ఉంచిన 20 లారీల ఇసుకను స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు మాట్లాడుతూ ఇసుకను ప్రజలకు అందుబాటులో ఉంచేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అడ్డుకుని ఇలా అక్రమంగా ఇసుకను విక్రయించడం చట్ట విరుద్ధమని, ఈ నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. దాడుల్లో విజిలెన్స్‌ డీఎస్పీ ఆర్‌.విజయ్‌పాల్, మైనింగ్‌ డిపార్ట్‌మెంట్‌ అసిస్టెంట్‌ జియాలజిస్ట్‌ బాలాజీ నాయక్, ఏఆర్‌ వెంకటేశ్వరరావు, ఎస్‌ఐ సత్యనారాయణ, ఆర్‌ఐ అరవింద్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top