కాకినాడ తీరంలో 20 బోట్లు గల్లంతు!
తూర్పుగోదావరి (కాకినాడ): కాకినాడ సముద్రతీరంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు గల్లంతయినట్లు బోటు యజమాని వాసుపల్లి సింహాచలం శుక్రవారం పోలీసులకు ఫిర్యాదుచేశారు. కాకినాడ తీరం నుంచి ఈ నెల 17న చేపల వేటకు 20 బోట్లు వెళ్లాయి. వేటకు వెళ్లిన వారు 18వ తేదీలోపు వచ్చేస్తామని తెలిపారు. కానీ ఇంతవరకూ ఒక్క బోటు కూడా రాలేదు. ఒక బోటు యజమాని ఈ విషయం గురించి ఫిర్యాదు చేశాడు. గల్లంతైన బోటులో ఆరుగురు మత్స్యకారులు ఉన్నట్లు తెలిసింది.
కాకినాడలో భారీ వర్షం కురుస్తుండటంతో వేటకు వెళ్లిన వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు. గల్లంతైన వారిలో వాసుపల్లి సత్తిబాబు, కర్రి దుర్గారావు, మైలపల్లి నూకరాజు, రాగిటి చిట్టయ్య, కుందు కాసులయ్య, కొండ్రు శివాజీలు ఉన్నారు.