ఏపీలో కొత్తగా రెండు కరోనా కేసులు

2 new COVID19 positive cases reported in Andhra pradesh - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అనంతపురం జిల్లాలో ఈ రెండు కొత్త కేసులు నమోదయ్యాయి. గురువారం రాత్రి 9 నుంచి శుక్రవాం ఉదయం 9 వరకు జరిగిన పరీక్షల్లో ఇవి వెలుగుచూశాయి. కొత్తగా నమోదైన రెండు కేసులతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య 365కు చేరింది. కరోనాతో కోలుకుని ఇప్పటివరకు ఏపీలో 10 మంది డిశ్చార్జ్ కాగా.. ఆరుగురు మరణించారు.

ఇప్పటివరకు అత్యధికంగా కర్నూలు జిల్లాలో 75 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక మిగతా జిల్లాల వారీగా చూస్తే... గుంటూరు జిల్లాలో 51, నెల్లూరు జిల్లాలో 48, ప్రకాశం జిల్లాలో 38, కృష్ణా జిల్లాలో 35, వైఎస్ఆర్‌ జిల్లాలో 29,  పశ్చిమగోదావరి జిల్లాలో 22, చిత్తూరు జిల్లాలో 20, విశాఖలో 20 పాజిటివ్ కేసులు, అనంతపురం జిల్లాలో 15, తూర్పాగోదావరి జిల్లాలో 12 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top