రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి


రాజుపాలెం: గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం అద్దంకి - నార్కట్‌పల్లి జాతీయ రహదారిపై నెమలిపురి గ్రామం వద్ద ఆగి ఉన్న లారీని ఆటో ఢీకొట్టింది. బుధవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. పిడుగురాళ్ల నుంచి నర్సారావు పేటకు ఆటో వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. మృతులు పిడుగురాళ్ల పట్టణానికి చెందిన సైదావలి(50), రాజావలి(48) గా గుర్తించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top