168వరోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

168th Day PrajaSankalpaYatra Schedule released - Sakshi

సాక్షి, తాడేపల్లి గూడెం :  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేస్తున్న ప్రజాసంకల్పయాత్ర 168వ రోజు షెడ్యూల్‌ ఖరారైంది. మంగళవారం ఉదయం తాడేపల్లిగూడెం మార్కెట్‌ నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభిస్తారు.  అనంతరం పెంటపాడు, బోడపాడు క్రాస్‌ మీదుగా ముదునూరు చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. 

అనంతరం మధ్యాహ్నం 2.45కి పాదయాత్ర తిరిగి ప్రారంభమౌతుంది. అక్కడ నుంచి కాశిపాడు క్రాస్‌, చిలకం పాడు, వీరేశ్వరపురం క్రాస్‌ మీదుగా పిప్పర వరకూ పాదయాత్ర కొనసాగిస్తారు. రాత్రికి వైఎస్‌ జగన్‌ అక్కడే బస చేస్తారు. ఈ మేరకు వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top