16 ఎర్ర చందనం దుంగలు స్వాధీనం


నెల్లూరు : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 16 ఎర్ర చందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన నెల్లూరులో గురువారం చోటుచేసుకుంది. ఎర్ర చందనం దుంగల నిల్వపై సమాచారం అందుకున్న స్పెషల్ బ్రాంచ్, త్రీ టౌన్ పోలీసులు పట్టణంలోని ఓ ఇంటిపై దాడి చేసి 16 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top