International
-
పాకిస్థాన్లో అంతే.. ‘లూటీ చేయడానికి ఏమన్నా మిగిలాయా?’
ఇస్లామాబాద్ : పదుల సంఖ్యలో కార్పొరేట్ కంపెనీల కార్యకలాపాలతో రద్దీగా ఉండే ఏరియా. ఆ ప్రాంతానికి చెందిన కంపెనీల్లో ఉద్యోగులు కంప్యూటర్లతో కుస్తీలు పడుతుంటారు. అయితే, ఎప్పటిలాగే విధులు నిర్వహించేందుకు ఉద్యోగులు వచ్చారు.ఉద్యోగులు వచ్చిన రెండు గంటల తర్వాత పోలీసులు, దర్యాప్తు అధికారులు దాడులు చేశారు. పలువురిని అదుపులోకి తీసుకొని వెళ్లిపోయారు. ఈ దాడులపై సమాచారం అందుకున్న స్థానికులు ఆఫీసుల్లో చొరబడి లూఠీ చేశారు. చేతికి ఏది అందితే దాన్ని పట్టుకొని వెళ్లిపోయారు. దొంగిలిచ్చేందుకు వచ్చిన స్థానికులు సైతం లూటీ చేసేందుకు ఇంకా ఏమైనా దొరుకుతుందేమోనని ఆరా తీసిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.పాకిస్థాన్(Pakistan)లోని ఇస్లామాబాద్ సెక్టార్ ఎఫ్-11లో ఉన్న ఓ నకిలీ కాల్ సెంటర్పై ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (FIA) అధికారులు దాడులు చేశారు. 24 మందిని అదుపులోకి తీసుకుని వెళ్లిపోయారు. అయితే, చైనీయులు నడుపుతున్న కాల్ సెంటర్పై దాడులు జరిగాయన్న సమాచారం ఆ నోటా ఈనోటా పాకింది. అంతే సమాచారం అందుకున్న స్థానికులు ఆ కాల్ సెంటర్లో చొరబడ్డారు. చేతికి అందిన ల్యాప్టాప్లు, డెస్క్టాప్లు, మానిటర్లు, కీబోర్డులు, ఎక్స్టెన్సన్లు.. ఏదిపడితే అది ఎత్తుకెళ్లారు. ఫర్నీచర్, కట్లరీ సెట్లను కూడా లూటీ చేశారు. ఈ లూటీపై సమాచారం అందుకున్న మరి కొంతమంది ఫేక్ కాల్ సెంటర్కు వచ్చారు. తమకూ ఏదైనా దొరుకుతుందేమోనని ల్యాప్ట్యాప్స్ను చోరీ చేసిన వారిని ఆరా తీసిన దృశ్యాలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ అవుతున్న వీడియోల్ని చూసేయండి.Pakistanis have Looted Call Centre operated by Chinese in Islamabad; Hundreds of Laptop, electronic components along with furniture and cutlery stolen during holy month of Ramadan pic.twitter.com/z6vjwBRRsq— Megh Updates 🚨™ (@MeghUpdates) March 17, 2025 -
సునీతా విలియమ్స్కు ప్రధాని మోదీ లేఖ.. ఏమన్నారంటే?
ఢిల్లీ : భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ (sunita Williams)కు ప్రధాని మోదీ (narendra modi) లేఖ రాశారు. భారత్లో పర్యటించాలని కోరారు.దాదాపు 9 నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ ఎట్టకేలకు భూమ్మీదకు రానున్నారు. బుధవారం ఉదయం 3 గంటల తర్వాత భూమ్మీదకు చేరుకున్నారు.As the whole world waits, with abated breath, for the safe return of Sunita Williams, this is how PM Sh @narendramodi expressed his concern for this daughter of India.“Even though you are thousands of miles away, you remain close to our hearts,” says PM Sh Narendra Modi’s… pic.twitter.com/MpsEyxAOU9— Dr Jitendra Singh (@DrJitendraSingh) March 18, 2025ఈ తరుణంలో సునీతా విలియమ్స్కు ప్రధాని మోదీ లేఖ రాశారు. ఆ లేఖను కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. మోదీ సునీతా విలియమ్స్కు రాసిన లేఖలో ‘సునీతా విలియమ్స్ సురక్షితంగా భూమ్మీదకు చేరాలని ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. ఆమె వేలమైళ్లు దూరంలో ఉన్నా.. మన హృదయాలకు దగ్గరగానే ఉన్నారు. ఆమె ఆరోగ్యం బాగుండాలని దేశ ప్రజలు ప్రార్థిస్తున్నారు’ అని గుర్తు చేశారు. అంతేకాదు, మోదీ తన అమెరికా పర్యటనలో గతేడాది జూన్ 5న అంతరిక్ష కేంద్రానికి వెళ్లి, ప్రతికూల పరిస్థితుల కారణంగా సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్లు అక్కడ చిక్కుకున్నారు. అప్పటి నుంచి ఆస్ట్రోనాట్స్ను భూమ్మీదకు తెచ్చేందుకు నాసా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఆ ప్రయత్నాలతో పాటు ఆస్ట్రోనాట్స్ గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో పాటు మాజీ అధ్యక్షుడు జోబైడెన్ వద్ద ఆరా తీసినట్లు లేఖలో తెలిపారు.ఈ నెలలో ఢిల్లీలో నాసా మాజీ వ్యోమగామి మైక్ మాసిమినోతో జరిగిన సమావేశంలో సునీత విలియమ్స్ పేరును ప్రస్తావనకు తేవడమే కాదు, ఆమె సేవల్ని తమ సంభాషణలో ప్రస్తావనకు వచ్చిందని ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు. -
అంతరిక్షంలో 9 నెలలున్నాక.. ఎదురయ్యే సమస్యలివే..
వాషింగ్టన్: అమెరికా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో తొమ్మిది నెలలున్నాక తిరిగి భూమికి వస్తున్న తరుణంలో వారు ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలను ఎదుర్కోనున్నారనేది కీలకంగా మారింది. ప్రధానంగా వారు ఎముకలు, కండరాల క్షీణత, రేడియేషన్ ఎక్స్పోజర్, దృష్టి లోపం మొదలైన సమస్యలను ఎదుర్కొంటారు. అలాగే ఇన్నాళ్లూ ఒంటరిగా ఉన్నందున పలు మానసిక రుగ్మతలను కూడా చవిచూడనున్నారు.అంతరిక్షంలో చిక్కుకున్న వ్యోమగామి సునీతా విలియమ్స్(Sunita Williams), బుచ్ విల్మోర్ 9 నెలల 13 రోజుల తర్వాత భూమికి తిరిగి వస్తున్నారు. వారు అంతరిక్షంలోకి ఎనిమిది రోజులు మాత్రమే ఉండేందుకు వెళ్లారు. కానీ అక్కడే చిక్కుకుపోయారు. సునీతతో పాటు మొత్తం నలుగురు వ్యోమగాములు మార్చి 19న తెల్లవారుజామున 3:27 గంటలకు డ్రాగన్ అంతరిక్ష నౌకలో ఫ్లోరిడా తీరంలో దిగుతారు. తొమ్మిది నెలలుగా భూ వాతావరణానికి దూరంగా ఉన్న ఈ వ్యోమగాములు ఎటువంటి అనారోగ్య సమస్యలను ఎదుర్కోనున్నారనే విషయానికి వస్తే..1. నడక మర్చిపోవచ్చుమనం భూమిపై నడుస్తున్నప్పుడు, పరిగెత్తేటప్పుడు, లేచినప్పుడు లేదా కూర్చున్నప్పుడు కండరాలు గురుత్వాకర్షణ(Gravity)కు వ్యతిరేకంగా పనిచేస్తాయి. కానీ అంతరిక్షంలో సున్నా-గురుత్వాకర్షణ కారణంగా కండరాలు పనిచేయవు. ఫలితంగా కండరాలు బలహీనపడతాయి. అలాగే ప్రతి నెలా ఎముక సాంద్రత దాదాపు ఒక శాతం తగ్గుతుంది. ఇది కాళ్ళు, వీపు, మెడ కండరాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఫలితంగా ఈ వ్యోమగాములు భూమిపై వెంటనే నడవలేని స్థితిలో ఉంటారు.2. నిలబడేందుకూ ఇబ్బందిమన మెదడులో వెస్టిబ్యులర్ వ్యవస్థ ఉంటుంది. ఇది శరీరంలో సమతుల్యతను కాపాడేలా పనిచేస్తుంది. అంతరిక్షంలో సున్నా-గురుత్వాకర్షణ కారణంగా ఈ వ్యవస్థ సరిగ్గా పనిచేయదు. ఫలితంగా భూమికి తిరిగి వచ్చే కొంతమంది వ్యోమగాములు కొంతకాలం పాటు నిలబడలేరు. చేతులు, కాళ్లను బ్యాలెన్స్ చేయలేరు. 2006లో అమెరికన్ వ్యోమగామి హెడెమేరీ స్టెఫానిషిన్-పైపర్ 12 రోజుల అంతరిక్షంలో ఉండి, ఆ తర్వాత భూమికి తిరిగి వచ్చినప్పుడు ఇలాంటి సమస్యనే ఎదుర్కొన్నారు.3. వస్తువులను గాలిలో వదిలేస్తారుదీర్ఘకాలం అంతరిక్షంలో ఉండటం వల్ల వ్యోమగాముల శరీరం సూక్ష్మ గురుత్వాకర్షణకు అనుగుణంగా మారుతుంది. అంతరిక్షంలో ఏదైనా వస్తువు గాలిలో ఉంచినప్పుడు, అది పడిపోకుండా తేలుతూనే ఉంటుంది. దీంతో వారికి భూమికి తిరిగి వచ్చిన తర్వాత కూడా ఈ అలవాటు కొంతకాలం కొనసాగుతుంది.4. అంధత్వం వచ్చే ప్రమాదంఅంతరిక్షం(Space)లో సున్నా-గురుత్వాకర్షణ కారణంగా, శరీర ద్రవం తల వైపు కదులుతుంది. ఇది కళ్ల వెనుక ఉన్న నరాలపై ఒత్తిడిని కలిగిస్తుంది. దీనిని స్పేస్ ఫ్లైట్ అసోసియేటెడ్ న్యూరో-ఓక్యులర్ సిండ్రోమ్ (ఎస్ఏఎన్ఎస్) అని పిలుస్తారు. భూమికి తిరిగి వచ్చిన తర్వాత వ్యోమగాముల శరీరాలు ఇక్కడికి అనుగుణంగా సర్దుబాటు అయ్యేందుకు ప్రయత్నిస్తాయి. తద్వారా వారి కళ్లు ప్రభావితమవుతాయి. కంటి సమస్యలు లేదా అంధత్వం వచ్చే అవకాశం కూడా ఏర్పడవచ్చు.ఈ వ్యాధులు మాత్రమే కాదు.. ఎముక బలహీనత, అధిక రేడియేషన్కు గురికావడం వల్ల క్యాన్సర్ ముప్పు, డీఎన్ఏ దెబ్బతినడం, రోగనిరోధక వ్యవస్థ బలహీనపడటం, గాయాలను నయం చేసుకునే సామర్థ్యం తగ్గడం,ఒంటరితనం, మానసిక ఒత్తిడి, నిద్ర సమస్యలు, దృష్టి కేంద్రీకరించడంలో ఇబ్బంది లాంటి సమస్యలను వ్యోమగాములు ఎదుర్కొంటారు. ఇది కూడా చదవండి: Uttar Pradesh: ట్రక్కును 100 మీటర్లు లాక్కుపోయిన గూడ్సు -
భూమ్మీదకు తిరిగొచ్చే ముందు సునీతా విలియమ్స్..
భారత సంతతి నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్, అమెరికా వ్యోమగామి బుచ్ విల్ మోర్ లు సుమారు తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయి తిరిగి భూమ్మీదకు చేరే సమయం ఎంత సేపో లేదు. ఇప్పటికే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి బయల్దేరిన సునీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్ లు చ చివరిగా అక్కడ దిగిన ఫోటో ఒక్కటి వైరల్ గా మారింది. దానికి సంబంధించిన వీడియోలను, ఫోటోలను నాసా విడుదల చేసింది. వారు అంతరిక్ష కేంద్రంలో గడిపిన చివరి క్షణాలు అంటూ ఫోటోను షేర్ చేసింది.ఇప్పటికే అంతర్జాతీయ అంతరిక్షం కేంద్ర నుంచి భూమ్మీదకు బయల్దేరిన సునీతా- బుచ్ లు మంగళవారం సాయంత్రం 5.57 గంటలకు (భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3.27కు) అమెరికాలో ఫ్లోరిడా సముద్ర తీరంలో దిగనున్నారు. ఆదివారం నాసా ఈ మేరకు ప్రకటించింది. అనుకూల వాతావరణం నేపథ్యంలో తిరుగు ప్రయాణాన్ని నిర్ణీత సమయం కంటే ఒక రోజు ముందుకు జరిపినట్టు పేర్కొంది. గత సెప్టెంబర్ లో ఐఎస్ఎస్కు వెళ్లిన మరో ఇద్దరు వ్యోమగాములు నిక్ హేగ్ (అమెరికా), అలెగ్జాండర్ గుర్బనోవ్ (రష్యా) కూడా స్పేస్ ఎక్స్ డ్రాగన్–10 స్పేస్క్రాఫ్ట్లో సునీత, విల్మోర్తో పాటే తిరిగి వస్తున్నారు. LIVE: @NASA_Astronauts Nick Hague, Suni Williams, Butch Wilmore, and cosmonaut Aleksandr Gorbunov are packing up and closing the hatches as #Crew9 prepares to depart from the @Space_Station. Crew-9 is scheduled to return to Earth on Tuesday, March 18. https://t.co/TpRlvLBVU1— NASA (@NASA) March 18, 2025 👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)ఆ జ్ఞాపకాలు పదిలంగా దాచుకుంటా..అంతరిక్షంలో చిక్కుపోయి సుదీర్ఘ విరామం తర్వాత భూమి మీదకు రాబోతున్న భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్.. తన అనుభవాలను అక్కడ నుంచే షేర్ చేసుకున్నారు. ‘ నేను, బుచ్ ఒక మిషన్ ను కంప్లీట్ చేసే క్రమంలో అంతరిక్షంలో అడుగుపెట్టాం. ఇక్కడ ఉన్నాన్నాళ్లు ఒకరికొకరు సమన్వయంతో సహకారంతో పని చేశాం. మేము ఇక్కడ పరిస్థితుల్లో మార్పులు గమనించాం. ఇక్కడ మనం నివసించడం వల్ల ఒక ప్రత్యేకమైన థృక్పదం ఏర్పడుతుంది. ఇక్కడ నా సుదీర్గ ప్రయాణం ఒక స్ఫూర్తిగా మిగిలిపోతుంది. ఆ మెరుపును ఎప్పటికీ కోల్పోను. దాన్ని నాతోనే దాచుకుంటాను’ అని సునీతా విలియమ్స స్పష్టం చేశారు.సునీతా విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్లి సుమారు 9 నెలలకు పైగానే అయ్యింది. 2024 జూన్ 5న ఆమె అక్కడికి చేరుకున్నారు. తిరిగి జూన్ 12, 15 తేదీల్లో భూమి మీదకు తిరిగి రావాల్సి ఉంది కానీ రాలేదు! భూ కక్ష్యకు సుమారు 400 కి.మీ. ఎత్తున ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐ.ఎస్.ఎస్.) సునీతను, ఆమె సహ వ్యోమగామి బుచ్ విల్మోర్ను విజయవంతంగా మోసుకెళ్లిన ‘బోయింగ్ స్టార్లైనర్’ వ్యోమనౌక తీరా వారిని అక్కడ దింపేశాక, పని చేయటం మానేసింది! దాంతో కొన్ని నెలల పాటు వారు అంతరిక్షంలోనే ఉండిపోయారు. -
జో బైడెన్ సంతానానికి సీక్రెట్ సర్వీస్ రక్షణ తొలగింపు
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US President Donald Trump) మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. మాజీ అధ్యక్షుడు జో బైడెన్ సంతానమైన హంటర్ బైడెన్, ఆష్లే బైడెన్లకు సీక్రెట్ సర్వీస్ రక్షణ తొలగింపును తక్షణమే అమలులోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. జనవరిలో జో బైడెన్ తన పిల్లలకు ఈ భద్రతా సౌకర్యాన్ని కల్పించారు.ఇటీవల దక్షిణాఫ్రికాకు వెళ్లిన హంటర్ బైడెన్కు 18 మంది ఏజెంట్ల భద్రత కల్పించారని ట్రంప్ ఆరోపించారు. అలాగే ఆష్లే బైడెన్ భద్రత కోసం 13 మంది ఏజెంట్ల భద్రత కల్పించారన్నారు. అయితే హంటర్ బైడెన్(Hunter Biden)కు ఇకపై సీక్రెట్ సర్వీస్ రక్షణ కల్పించబోమని, యాష్లే బైడెన్ను కూడా భద్రతా జాబితా నుండి తొలగించనున్నట్లు డోనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ నిర్ణయం గురించి తమకు తెలుసని సీక్రెట్ సర్వీస్ ప్రతినిధి మీడియాకు తెలిపారు. సీక్రెట్ సర్వీస్ దీనికి కట్టుబడి ఉంటుంది. వీలైనంత త్వరగా ట్రంప్ నిర్ణయాన్ని అమలు చేయడానికి వైట్ హౌస్ సిద్ధమయ్యిందని అన్నారు. అమెరికా సమాఖ్య చట్టం ప్రకారం మాజీ అధ్యక్షులు, వారి జీవిత భాగస్వాములు జీవితాంతం సీక్రెట్ సర్వీస్ రక్షణను పొందుతారు. ఇది కూడా చదవండి: యెమెన్పై మరోమారు అమెరికా దాడి -
గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు.. స్పందించిన అమెరికా
ఇజ్రాయెల్ సైన్యం (ఐడీఎఫ్) మరోసారి గాజాను లక్ష్యంగా చేసుకుంది. హమాస్ స్థావరాలపై విస్తృత దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో 200 మంది మృతిచెందారు. ఇజ్రాయెల్- హమాస్(Israel-Hamas) మధ్య మొదటి దశ కాల్పుల విరమణ ముగిసిన సమయంలో.. రెండవ దశ చర్చలపై ఎప్పుడు ఒప్పందం కుదుర్చుకుంటారో అనే దానిపై సందేహాలు నెలకొన్న సమయంలో ఇజ్రాయెల్ ఈ దాడులకు పాల్పడింది. ఈ దాడులపై అమెరికా గట్టిగా స్పందించింది.ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం సెంట్రల్ గాజాలోని దేర్ అల్-బలాలోని మూడు ఇళ్లు, గాజా నగరంలోని ఒక భవనం, ఖాన్ యూనిస్, రఫాలోని పలు ప్రదేశాలపై దాడి జరిగింది. జనవరిలో ప్రారంభమైన మూడు దశల కాల్పుల విరమణ(Three-phase ceasefire)ను ఎలా కొనసాగించాలనే దానిపై ఇజ్రాయెల్- హమాస్ మధ్య విభేదాలు నెలకొన్నాయి ఈ నేపధ్యంలోనే హింస చెలరేగుతోంది. గత రెండు వారాలలో జరిగిన చర్చల్లో అమెరికా మద్దతు కలిగిన అరబ్ మధ్యవర్తులు ఇరు పక్షాల మధ్య విభేదాలను పరిష్కరించలేకపోయారు.ఇజ్రాయెల్ రెండవ దశ కాల్పుల విరమణకు వెళ్లే బదులు మొదటి దశ కాల్పుల విరమణ పొడిగింపుపై మొండిగా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. రెండవ దశ కాల్పుల విరమణలో ఇజ్రాయెల్ రక్షణ దళాలు గాజా నుండి పూర్తిగా వైదొలగవలసి ఉంటుంది. ఇజ్రాయెల్ దీనిని కోరుకోవడం లేదు. హమాస్.. గాజాను విడిచిపెట్టే వరకు ఇజ్రాయెల్ సైన్యం గాజాను పూర్తిగా విడిచిపెట్టకూడదని అనుకుంటోంది. ఇజ్రాయెల్ రెండవ దశ కాల్పుల విరమణతో ముందుకు సాగడానికి ముందే హమాస్ గాజాను విడిచిపెట్టాల్సి ఉంటుందని ఇజ్రాయెల్ ఉన్నత స్థాయి అధికారి ఒకరు తెలిపారు. అందుకే రెండవ దశ కాల్పుల విరమణకు బదులుగా, ఇజ్రాయెల్ మొదటి దశ కాల్పుల విరమణను పొడిగించాలని కోరుకుంటుంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘించిందని హమాస్ మండిపడింది. తాజా దాడితో తమ చెరలో ఉన్న ఇజ్రాయెల్ బందీల ప్రాణాలను ప్రమాదంలోని నెట్టివేసిందని పేర్కొంది. మరోవైపు ఇజ్రాయెల్ దాడులపై అమెరికా స్పందించింది. గాజాపై దాడికి సంబంధించి నెతన్యాహు ప్రభుత్వం తమకు సమాచారం ఇచ్చిందని తెలిపింది. ఆ తరువాతనే దాడి చేసిందని పేర్కొంది. ఇజ్రాయెల్తో సహా అమెరికాను భయపెట్టాలని చూస్తున్న హమాస్కు ఇదొక హెచ్చరిక అని వైట్ హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లివిట్ పేర్కొన్నారు. గాజాను వదిలిపెట్టి వెళ్లాలని హమాస్ను ఇప్పుటికే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారని గుర్తుచేశారు. అయితే, ఈ హెచ్చరికలను నిర్లక్ష్యం చేసిన హమాస్.. ఫలితం అనుభవిస్తోందన్నారు. ఇది కూడా చదవండి: యెమెన్పై మరోమారు అమెరికా దాడి -
యెమెన్పై మరోమారు అమెరికా దాడి
వాషింగ్టన్ డీసీ: అమెరికా(America) మరోమారు యెమెన్ పై దాడి చేసింది. ఈ దాడిని హౌతీ మీడియా ధృవీకరించింది. దీనికిముందు కూడా అమెరికా యెమెన్పై దాడికి పాల్పడింది. ఆ దాడిలో 54 మంది మృతి చెందారు. తాజాగా సోమవారం యెమెన్పై అమెరికా మరోమారు దాడికి దిగింది. ఈ దాడిలో ప్రాణనష్టం గురించి ఇంకా ఎటువంటి సమాచారం వెల్లడి కాలేదు.#BREAKING Huthi media report new US strikes in Yemen pic.twitter.com/gpccecuehV— AFP News Agency (@AFP) March 17, 2025యెమెన్ రాజధాని సనా(Yemen's capital Sanaa)లో రాత్రిపూట అమెరికా జరిపిన దాడుల్లో ఐదుగురు మహిళలు, ఇద్దరు పిల్లలు సహా 53 మంది మృతిచెందారు. హౌతీలకు చెందిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈ దాడుల్లో 100 మందికి పైగా జనం గాయపడ్డారు. యెమెన్లోని ఇరాన్ మద్దతుగల హౌతీ తిరుగుబాటుదారులపై అమెరికా దాడులను ముమ్మరం చేసింది. శనివారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజాకు సంఘీభావం ప్రకటిస్తూ అంతర్జాతీయ నౌకలపై దాడి చేసే తిరుగుబాటుదారులపై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించారు. యెమెన్ రాజధాని సనా, ఇతర ప్రాంతాలలో అమెరికా జరిపిన అనేక దాడుల్లో పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం సంభవించింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి యెమెన్లోని అనేక లక్ష్యాలపై అమెరికా రాత్రిపూట వైమానిక దాడులు నిర్వహించింది. ఎర్ర సముద్రంలో అంతర్జాతీయ నౌకలపై హౌతీలు దాడులను ఆపాలని ట్రంప్(Trump) కోరారు. లేనిపక్షంలో ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా వారు దాడులను ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు.ఇరాన్ మద్దతుగల మిలీషియాలు అంతర్జాతీయ షిప్పింగ్పై దాడి చేసే సామర్థ్యాన్ని కోల్పోయే వరకు దాడులు కొనసాగుతాయని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో పేర్కొన్నారు. హౌతీ యోధులు ఎర్ర సముద్రంలో అంతర్జాతీయ నౌకాయానాన్ని లక్ష్యంగా చేసుకుని రెండు నౌకలను ముంచేశారు. గత 18 నెలల్లో హౌతీలు అమెరికా నావికాదళంపై 174 సార్లు ప్రత్యక్షంగా దాడి చేశారని, గైడెడ్ ప్రెసిషన్ యాంటీ-షిప్ ఆయుధాలను ఉపయోగించి, 145 సార్లు వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకున్నారని విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: Amritsar: ఆలయంపై గ్రనేడ్ విసిరిన వ్యక్తి ఎన్కౌంటర్ -
ట్రూత్ సోషల్లో చేరిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సొంత సోషల్ మీడియా ‘ట్రూత్ సోషల్’ప్లాట్ఫామ్లో ప్రధాని నరేంద్ర మోదీ చేరారు. పాడ్కాస్టర్ లెక్స్ ఫ్రిడ్మన్తో మోదీ ఆదివారం సంభాషించారు. ఈ పాడ్కాస్ట్ను ట్రంప్ తన సోషల్ మీడియా హ్యాండిల్లో వెంటనే షేర్ చేశారు. దీంతో సోమవారం మోదీ ట్రూత్ సోషల్లో అరంగేట్రం చేశారు. ‘ట్రూత్సోషల్లో చేరడం సంతోషంగా ఉంది. ఇక్కడ ఉద్వేగ భరిత గొంతులతో సంభాషించడానికి, రాబోయే కాలంలో మరింత అర్థవంతమైన సంభాషణల్లో పాల్గొడానికి ఎదురు చూస్తుంటాను’ అని ప్రధాని మొదటి పోస్ట్లో పేర్కొన్నారు. మరో పోస్ట్లో.. ఫ్రిడ్మన్తో జరిగిన తన సంభాషణను పంచుకున్నందుకు ట్రంప్కు కృతజ్ఞతలు తెలిపారు. ‘నా మిత్రుడు, అధ్యక్షుడు ట్రంప్కు ధన్యవాదాలు. నా జీవిత ప్రయాణం, భారతదేశ నాగరిక దృక్పథం, ప్రపంచ సమస్యలు, మరెన్నో అంశాలను నేను కవర్ చేశాను’ అని పేర్కొన్నారు. -
‘వాయిస్ ఆఫ్ అమెరికా’పై ట్రంప్ వేటు
వాషింగ్టన్: అమెరికా ప్రభుత్వ వ్యయనియంత్రణ చర్యల్లో భాగంగా డొనాల్డ్ ట్రంప్ సర్కార్ సిబ్బంది కోతలపర్వాన్ని కొనసాగిస్తోంది. ఇందులోభాగంగా తాజాగా ‘వాయిస్ ఆఫ్ అమెరికా’బ్రాడ్కాస్టర్ మీడియా సంస్థలోని మొత్తం సిబ్బందిని ప్రభుత్వం సెలవుపై పంపించింది. వాయిస్ ఆఫ్ అమెరికా అనేది ప్రభుత్వ నిధులతో పనిచేసే బహుళజాతి మీడియా సంస్థ. ఇది 40 భాషల్లో రేడియో, టెలివిజన్, ఇంటర్నెట్, మొబైల్, సోషల్మీడియాల్లో అమెరికా సంబంధ సమాచార, సాంస్కృతి కార్యక్రమాలను ప్రసారంచేస్తోంది. ఈ సంస్థలో మొత్తం 1,300 మంది సిబ్బంది ఉన్నారు. వీళ్లందరినీ సెలవుపై పంపుతున్నట్లు ఈ బ్రాడ్కాస్టర్ మీడియా ఏజెన్సీ సీనియర్ మహిళా సలహాదారు కరీ లేక్ చెప్పారు. ‘‘యూఎస్ ఏజెన్సీ ఫర్ గ్లోబల్ మీడియా(యూఎస్ఏజీఎం) నిధులతో నడిచే వాయిస్ ఆఫ్ అమెరికా, ఆఫీస్ ఆఫ్ క్యూబా బ్రాడ్కాస్టింగ్లలో మీరు పనిచేస్తుంటేగనక వెంటనే మీ ఈ–మెయిల్ను చెక్ చేసుకోండి’’అని కరీలేక్ ‘ఎక్స్’లో ఒక పోస్ట్పెట్టారు. శుక్రవారం ‘ప్రభుత్వ రంగ సిబ్బంది తగ్గింపు కొనసాగింపు’కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశాక ‘వాయిస్ ఆఫ్ అమెరికా’పై ప్రభుత్వం కన్నేసింది. దీంతో 83 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా ‘వాయిస్ ఆఫ్ అమెరికా’మూగబోయిందని సంస్థ డైరెక్టర్ మైఖేల్ అబ్రమోవిట్జ్ ఆవేదన వ్యక్తంచేశారు. -
నేడు పుతిన్, ట్రంప్ చర్చలు
వాషింగ్టన్: ఉక్రెయిన్లో యుద్ధాన్ని ఆపేలా రష్యాను ఒప్పించడమే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్తో మంగళవారం మంతనాలు జరపనున్నారు. నెలల తరబడి కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు అగ్రరాజ్యం చేస్తున్న ప్రయత్నాల్లో ఇది కీలక పరిణామమని ప్రపంచదేశాలు భావిస్తున్నాయి. దీంతోబాటే సమకాలీన పరిస్థితులకు తగ్గట్లు అమెరికా విదేశాంగ విధానాలకు మార్చే సదవకాశం ట్రంప్కు దక్కనుంది. ‘‘ గత వారం రోజులుగా ఇందుకోసం ఎంతో కసరత్తు చేశాం. యుద్ధాన్ని ఎంత త్వరగా ముగింపు పలకగలమో ఈ చర్చల ద్వారా తెలుస్తుంది’’ అని ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్కు ఎయిర్ఫోర్స్వన్ విమానంలో వస్తూ మీడియాతో ట్రంప్ చెప్పారు. ట్రంప్తో పుతిన్ చర్చించబోతున్నట్లు రష్యా అధ్యక్ష కార్యాలయం అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ సోమవారం ధ్రువీకరించారు. అయితే ఇరుదేశాల అగ్రనేతల మధ్య ఎలాంటి అంశాలు చర్చకు రాబోతున్నాయనే వివరాలను పెస్కోవ్ పేర్కొనలేదు. -
ఖలిస్తానీ శక్తుల భరతం పట్టండి
న్యూఢిల్లీ: ద్వీపదేశమైన న్యూజిలాండ్లో ఖలిస్తానీ శక్తుల ప్రాబల్యం నానాటికీ పెరుగుతుండడం, భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. ఆయా శక్తులను కఠినంగా అణచివేయాలని న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్కు విజ్ఞప్తి చేశారు. భారత వ్యతిరేక కార్యకలాపాలకు న్యూజిలాండ్ను అడ్డాగా మారనివ్వకూడదని కోరారు. మోదీ, లక్సన్ సోమవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. భారత్–న్యూజిలాండ్ సంబంధాలపై విస్తృతంగా చర్చించారు. 2019లో న్యూజిలాండ్లోని క్రైస్ట్చర్చ్ నగరంలో జరిగిన ఉగ్రవాద దాడులు, 2008 నవంబర్ 26న ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడులకు సారూప్యం ఉందని మోదీ గుర్తుచేశారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నాసరే వ్యతిరేకించాల్సిందేనని తేల్చిచెప్పారు. ఉగ్రవాద దాడులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఉగ్రవాదం, వేర్పాటువాదం, రాడికల్ శక్తులపై పోరాడే విషయంలో భారత్, న్యూజిలాండ్ మధ్య సహకారం కొనసాగుతుందని స్పష్టంచేశారు. రక్షణ పరిశ్రమ రంగంలో సహకారానికి రోడ్మ్యాప్ భారత్, న్యూజిలాండ్ మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్టీఏ)పై చర్చలు ప్రారంభం కావడాన్ని మోదీ, లక్సన్ స్వాగతించారు. ఈ ఏడాది ఆఖరు నాటికి ఈ ఒప్పందం కుదిరే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. అలాగే భారత్, న్యూజిలాండ్ మధ్య నేరుగా విమానాలు నడిపేందుకు అందుబాటులో ఉన్న అవకాశాలపై చర్చించారు. ఇండో–పసిఫిక్ విషయంలో అనుసరించాల్సిన వ్యూహాత్మక వైఖరిపై తాము చర్చించామని లక్సన్ వివరించారు. మోదీ, లక్సన్ భేటీ సందర్భంగా భారత్, న్యూజిలాండ్ మధ్య ఆరు కీలక ఒప్పందాలు కుదిరాయి. రెండు దేశాల నడుమ రక్షణ సంబంధాలను వ్యవస్థీకృతంగా మార్చడం, ఇండో–పసిఫిక్ ప్రాంతంలో భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడంతోపాటు విద్య, క్రీడలు, వ్యవసాయం, వాతావరణ మార్పుల నియంత్రణ వంటి రంగాల్లో పరస్పరం సహకరించుకోవడానికి ఇరు పక్షాలు ఈ ఒప్పందాలపై సంతకాలు చేశాయి. రక్షణ పరిశ్రమ రంగంలో సహకారం కోసం ఒక రోడ్మ్యాప్ రూపొందించాలని ఇరు దేశాలు నిర్ణయానికొచ్చాయి. విస్తరణవాదం వద్దు.. అభివృద్ధే కావాలి స్వేచ్ఛాయుత, భద్రతతో కూడిన, సౌభాగ్యవంతమైన ఇండో–పసిఫిక్కు భారత్, న్యూజిలాండ్ బేషరతుగా మద్దతు ఇస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఇండో–పసిఫిక్లో అభివృద్ధిని కోరుకుంటున్నాం తప్ప విస్తరణవాదాన్ని కాదంటూ పరోక్షంగా చైనా తీరును తప్పుపట్టారు. ఇండో–పసిఫిక్ సార్వభౌమత్వం, ప్రాంతీయ సమగ్రతను అందరూ గౌరవించాలని మోదీ, లక్సన్ పేర్కొన్నారు. ఈ మేరకు ఇరువురు నేతలు ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. అక్రమ వలసల సమస్యను పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఒక దేశానికి చెందిన నైపుణ్యం కలిగిన ఉద్యోగులు, కార్మికులకు మరో దేశంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా చట్టబద్ధమైన ఏర్పాటు చేసుకోవాలని, దీనిపై చర్చలు ప్రారంభించాలని అంగీకారానికి వచ్చారు. గాజాలో శాశ్వతంగా శాంతి నెలకొనాలన్నదే తమ ఆకాంక్ష అని వెల్లడించారు.అందుకే క్రికెట్ మాట ఎత్తలేదు ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన చర్చల్లో క్రికెట్ అంశం ప్రస్తావనకు రాలేదని న్యూజిలాండ్ ప్రధాని లక్సన్ చెప్పారు. తాను ఉద్దేశపూర్వకంగానే ఆ అంశాన్ని విస్మరించానని అన్నారు. భారత్–న్యూజిలాండ్ మధ్య దౌత్య సంబంధాల దెబ్బతినకుండా అడ్డుకోవాలన్నదే తన ఆలోచన అని వివరించారు. దీంతో పక్కనే ఉన్న ప్రధాని మోదీ బిగ్గరగా నవ్వేశారు. సోమవారం భేటీ తర్వాత లక్సన్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇటీవల జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోïఫీలో భారత్ చేతిలో న్యూజిలాండ్ క్రికెట్ జట్టు ఓడిపో యిన సంగతి తెలిసిందే. అలాగే ఇండియాలో జరిగిన టెస్టు క్రికెట్ సిరీస్లో న్యూజిలాండ్ నెగ్గింది. తమ చర్చల్లో క్రికెట్ గురించి మాట్లాడనందుకు మోదీని అభినందిస్తున్నానని లక్సన్ చెప్పారు. మరోవైపు మోదీ, లక్సన్ కలిసి సోమవారం ఢిల్లీలోని చరిత్రాత్మక గురుద్వారా రకాబ్గంజ్ సాహిబ్ను సందర్శించారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. -
ఎన్నాళ్లో వేచిన ఉదయం.. తిరిగొస్తున్న సునీత
వాషింగ్టన్: భూమికి దాదాపు 400 కిలోమీటర్ల ఎత్తున. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో. ఏడెనిమిది రోజులనుకుంటే ఏకంగా వారాలూ, నెలలూ గడిచిపోతున్నాయి. ఉన్నది భారరహిత స్థితిలోనే. అయినా అటు కార్యభారం. ఇటు ఎడతెగని ఆలోచనల భారం. క్షణమొక యుగంగా సమయం కూడా భారంగానే గడుస్తున్న పరిస్థితి. ఎడతెగని ఆ ఎదురుచూపులకు ఎట్టకేలకు శుభంకార్డు పడనుంది. 9 నెలల అంతరిక్షవాసం ముగించుకుని నాసా వ్యోమగాములు భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ (59), బచ్ బారీ విల్మోర్ (62) భూమికి తిరిగి రానున్నారు. వాతావరణం అనుకూలించి, అన్నీ అనుకున్నట్టుగా జరిగితే మంగళవారం సాయంత్రం 5.57 గంటలకు (భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3.27కు) అమెరికాలో ఫ్లోరిడా సముద్ర తీరంలో దిగనున్నారు. ఆదివారం నాసా ఈ మేరకు ప్రకటించింది. అనుకూల వాతావరణం నేపథ్యంలో తిరుగు ప్రయాణాన్ని నిరీ్ణత సమయం కంటే ఒక రోజు ముందుకు జరిపినట్టు పేర్కొంది. గత సెపె్టంబర్లో ఐఎస్ఎస్కు వెళ్లిన మరో ఇద్దరు వ్యోమగాములు నిక్ హేగ్ (అమెరికా), అలెగ్జాండర్ గుర్బనోవ్ (రష్యా) కూడా స్పేస్ ఎక్స్ డ్రాగన్–10 స్పేస్క్రాఫ్ట్లో సునీత, విల్మోర్తో పాటే తిరిగి వస్తున్నారు. వారి రాక కోసం ప్రపంచమంతా అత్యంత ఉత్కంఠతో ఎదురుచూస్తోందిప్పుడు. బాధ్యతల అప్పగింత బోయింగ్ సంస్థ తొలి మానవసహిత అంతరిక్ష ప్రయోగంలో భాగంగా 2024 జూన్ 5న ప్రయోగించిన స్టార్లైనర్ స్పేస్క్రాఫ్ట్లో సునీత, విల్మోర్ ఐఎస్ఎస్కు చేరుకున్నారు. షెడ్యూల్ మేరకు వారు ఎనిమిది రోజుల్లోనే తిరిగి రావాలి. కానీ స్టార్లైనర్లో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా అది వీలు పడలేదు. దాని మరమ్మతుకు చేసిన ప్రయత్నాలు కూడా పూర్తిగా ఫలించలేదు. దాంతో రిస్కు తీసుకోరాదని నాసా నిర్ణయించింది. ఫలితంగా సెపె్టంబర్ 7న స్టార్లైనర్ ఖాళీగానే భూమికి తిరిగొచ్చింది. వారిని తిరిగి తీసుకొచ్చేందుకు మధ్యలో చేసిన ఒకట్రెండు ప్రయత్నాలు కూడా ఫలించలేదు. అలా 9 నెలలుగా సునీత ఐఎస్ఎస్ కమాండర్గా వ్యవహరిస్తున్నారు. ఎట్టకేలకు ఆమెను, విల్మోర్ను వెనక్కు తీసుకొచ్చేందుకు నాసాతో కలిసి స్పేస్ ఎక్స్ ప్రయోగించిన డ్రాగన్–9 వ్యోమనౌక ఆదివారం విజయవంతంగా ఐఎస్ఎస్ను చేరింది. అందులో వచ్చిన నలుగురు వ్యోమగాములు సునీత బృందం నుంచి లాంఛనంగా బాధ్యతలు స్వీకరించారు. కమాండర్ బాధ్యతలను రష్యాకు చెందిన అలెక్సీ ఒచినిన్కు సునీత అప్పగించారు. వచ్చే ఆర్నెల్ల పాటు ఐఎస్ఎస్ కార్యకలాపాలన్నీ ఆయన కనుసన్నల్లో జరుగుతాయి. అయినా స్థైర్యమే... అనూహ్యంగా ఐఎస్ఎస్లో 9 నెలల పాటు గడపాల్సి వచ్చినా సునీత ఎక్కడా డీలాపడలేదు. మొక్కవోని ఆత్మస్థైర్యం ప్రదర్శించారు. తన పరిస్థితిపై కూడా తరచూ జోకులు పేల్చారు! నడవటమెలాగో గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నానంటూ గత జనవరిలో నాసా సెంటర్తో మాట్లాడుతూ చమత్కరించారు. ఐఎస్ఎస్లో ఉన్నన్ని రోజులూ ఊపిరి సలపని బాధ్యతల నడుమే గడిపారు. అలాగని చిన్నచిన్న సరదాలకూ లోటులేకుండా చూసుకున్నారు. సహచరులతో కలిసి సునీత, విల్మోర్ క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. వీడియో కాల్స్ ద్వారా తమ కుటుంబీకులతో టచ్లో ఉంటూ వచ్చారు. → ఐఎస్ఎస్ కమాండర్గా కీలక ప్రయోగాలకు సునీత సారథ్యం వహించారు. → అంతరిక్షంలో భారరహిత స్థితిలో మొక్కల్ని పెంచిన నాసా ప్రయోగాన్ని స్వయంగా పర్యవేక్షించారు. → మొత్తం 50 గంటల 40 నిమిషాల పాటు స్పేస్వాక్ చేశారు. ఎందరికో స్ఫూర్తి వ్యోమగామిగా గ‘ఘన’ విజయాలు సాధించిన సునీతవి భారత మూలాలు. ఆమె పూర్తి పేరు సునీతా లిన్ విలియమ్స్. 1965లో అమెరికాలోని ఒహాయోలో జని్మంచారు. తండ్రి దీపక్ పాండ్యా గుజరాతీ కాగా తల్లి బోనీ జలోకర్ది స్లొవేనియా. వారి ముగ్గురు సంతానంలో సునీత అందరికన్నా చిన్న. అమెరికా నావల్ అకాడెమీ నుంచి ఫిజిక్స్లో డిగ్రీ, ఫ్లోరిడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ చేశారు. తండ్రి సూచనతో...తండ్రి సూచన మేరకు నావికా దళంలో బేసిక్ డైవింగ్ ఆఫీసర్గా చేరారు సునీత.→ నేవల్ ఏవియేటర్గా యుద్ధ విమానాలు నడపడంలో శిక్షణ పొందారు. కంబాట్ హెలికాప్టర్ స్క్వాడ్రన్లో పని చేశారు. → 30 ఏళ్ల వృత్తిగత జీవితంలో పైలట్గా 30 పై చిలుకు రకాల విమానాలను 3,000 గంటలకు పైగా నడిపిన అపార అనుభవం ఆమె సొంతం. → నేవీ నుంచి రిటైరయ్యాక సునీత 1998 జూన్ లో నాసా వ్యోమగామిగా ఎంపికయ్యారు. → 2006లో తొలిసారి అంతరిక్ష యాత్ర చేశారు. ఐఎస్ఎస్లో ఆర్నెల్లకు పైగా గడిపి దాని నిర్వహణ, మరమ్మతులు తదితరాలపై అనుభవం గడించారు. → 2012లో రెండోసారి ఐఎస్ఎస్కు వెళ్లి నాలుగు నెలలకు పైగా ఉన్నారు. → సునీత భర్త మైకేల్ జె.విలియమ్స్ రిటైర్డ్ ఫెడరల్ మార్షల్. వారికి సంతానం లేరు. పెట్ డాగ్స్ అంటే ఈ జంటకు ప్రాణం. వాటినే తమ సంతానంగా భావిస్తుంటారు. → సునీత హిందూ మతావలంబి. నిత్యం భగవద్గీత చదువుతానని చెబుతారు.పరిహారమేమీ ఉండదు సునీత, విల్మోర్ ఏకంగా 9 నెలలకు పైగా ఐఎస్ఎస్లో చిక్కుబడిపోయారు కదా. మరి వారికి పరిహారం రూపంలో అదనపు మొత్తం ఏమన్నా లభిస్తుందా? అలాంటిదేమీ ఉండదు. తమకు ప్రత్యేకంగా ఓవర్టైం వేతనమంటూ ఏమీ ఉండదని నాసా వ్యోమగామి కాడీ కోల్మన్ చెప్పారు. ‘‘అంతరిక్ష యాత్రలను అధికార పర్యటనల్లో ఇతర కేంద్ర ప్రభుత్వోద్యోగుల మాదిరిగానే పరిగణించడమే ఇందుకు కారణం. ఇలాంటప్పుడు ఖర్చుల నిమిత్తమని మాకు అదనంగా రోజుకు కేవలం 4 డాలర్లు (రూ.347) అందుతాయంతే’’ అని వివరించారు. ఆ లెక్కన సునీత, విల్మోర్ అదనంగా 1,148 డాలర్లు (దాదాపు రూ.లక్ష) అందుకోనున్నారు. వారు అమెరికా ప్రభుత్వోద్యోగుల్లో అత్యున్నతమైన జీఎస్–15 వేతన గ్రేడ్లో ఉన్నారు. ఆ లెక్కన వాళ్లకు ఏటా 1.25 లక్షల నుంచి 1.62 లక్షల డాలర్ల (కోటి నుంచి 1.41 కోట్ల రూపాయల) వేతనం లభిస్తుంది.తిరుగు ప్రయాణం ఇలా... → సునీత బృందం తిరుగు ప్రయాణానికి భారత కాలమానం ప్రకారం మంగళవారం కౌంట్డౌన్ మొదలవుతుంది. → క్రూ డ్రాగన్–10 వ్యోమనౌక హ్యాచ్ మూసివేత ప్రక్రియ మంగళవారం ఉదయం 8.15కు మొదలవుతుంది. → ఐఎస్ఎస్ నుంచి వ్యోమనౌక విడివడే ప్రక్రియ మంగళవారం ఉదయం 10.35కు మొదలవుతుంది. ఆ తర్వాత నాసా ప్రత్యక్ష ప్రసారం ఆడియోకు పరిమితమవుతుంది. అంతా అనుకూలిస్తే బుధవారం (మంగళవారం అర్ధరాత్రి దాటాక) తెల్లవారుజాము 2.15 గంటలకు తిరిగి ప్రత్యక్ష ప్రసారం మొదలవుతుంది. → బుధవారం తెల్లవారుజాము 2.41 గంటలకు వ్యోమనౌక భూ కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. → బుధవారం తెల్లవారుజామున సుమారు 3.27కు ఫ్లోరిడా తీరానికి సమీపంలో సముద్ర జలాల్లో క్యాప్సూల్ దిగుతుంది. → ఆ వెంటనే నలుగురు వ్యోమగాములనూ నాసా సిబ్బంది ఒక్కొక్కరిగా బయటికి తీసుకొస్తారు. అన్నీ అనుకూలించాలి అయితే ప్రయాణ సమయం నిర్ణయమైనా చివరి నిమిషం దాకా అన్నీ అనుకూలించాల్సి ఉంటుంది. వాతావరణంతో పాటు ఇతర పరిస్థితులన్నీ సజావుగా ఉంటేనే తిరుగు ప్రయాణం షెడ్యూల్ ప్రకారం సాగుతుంది. ప్రత్యక్షప్రసారం సునీత బృందంతో స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్రూ–9 స్పేస్క్రాఫ్ట్ తిరుగు ప్రయాణాన్ని భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8.30 నుంచి నాసా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. రికార్డు మాత్రం కాదు సునీత, విల్మోర్ వరుసగా 9 నెలల పాటు (287 రోజులు) ఐఎస్ఎస్లో గడిపినా ప్రపంచ రికార్డుకు మాత్రం దూరంగానే ఉండిపోయారు. రష్యా వ్యోమగామి వలేరీ పొల్యకోవ్ తమ దేశానికి చెందిన మిర్ అంతరిక్ష కేంద్రంలో ఏకబిగిన 437 రోజులు గడిపి రికార్డు సృష్టించారు. నాసా ఆస్ట్రోనాట్ 371 రోజులతో ఆ తర్వాతి స్థానంలో నిలిచారు. మూడు అంతరిక్ష యాత్రల్లో కలిపి సునీత 583 రోజులు ఐఎస్ఎస్లో గడిపారు. క్రమశిక్షణ విషయంలో సునీత చాలా పట్టుదలగా ఉంటారు. ఐఎస్ఎస్లో ఉన్నన్నాళ్లూ ఒక్క రోజు కూడా వ్యాయామం మానలేదట!టైమ్లైన్ 2024 జూన్ 5: సునీత, విల్మోర్లతో ఐఎస్ఎస్కు బయల్దేరిన బోయింగ్ స్టార్లైనర్ వ్యోమనౌక జూన్ 6: ఐఎస్ఎస్తో విజయవంతంగా అనుసంధానమైన స్టార్లైనర్. కానీ ఆ క్రమంలో స్టార్లైనర్లో థ్రస్టర్లు పని చేయకపోవడం, ప్రొపల్షన్ వ్యవస్థలో హీలియం లీకేజీ వంటి సాంకేతిక లోపాలు తెరపైకొచ్చాయి. దాంతో వ్యోమగాములు క్షేమంగా తిరిగిరావడంపై ఉత్కంఠ నెలకొంది. జూన్ 12: స్టార్లైనర్ ప్రయాణానికి సిద్ధంగా లేనందున సునీత, విల్మోర్ తిరుగు ప్రయాణం నిరవధికంగా వాయిదా పడ్డట్టు నాసా ప్రకటన. జూలై–ఆగస్టు: తిరుగు ప్రయాణంపై మరింత పెరిగిన అనిశ్చితి. దాంతో సునీత, విల్మోర్ ఐఎస్ఎస్ సిబ్బందితో కలిసిపోయి దాని నిర్వహణ బాధ్యతలు, పరిశోధనలు తదితరాను పూర్తిగా తలకెత్తుకున్నారు. ఆ క్రమంలో సునీత ఆరోగ్యం కాస్త క్షీణించింది. ఎముకల సాంద్రత తగ్గడం వంటి పలు సమస్యలు తలెత్తాయి. సెపె్టంబర్: ఐఎస్ఎస్ కమాండర్గా బాధ్యతలు స్వీకరించిన సునీత నవంబర్: సహోద్యోగులతో కలిసి ఐఎస్ఎస్లోనే దీపావళి, థాంక్స్ గివింగ్ వేడుకలు జరుపుకున్న సునీత. ఈ సందర్భంగా వారికోసం ప్రత్యేకంగా స్మోక్డ్ చికెన్ తదితర వంటకాలను పంపిన నాసా. డిసెంబర్: విద్యార్థులతో చిట్చాట్ చేసి తన అనుభవాలు పంచుకున్న సునీత. అంతరిక్షంలో జీవితం చాలా ఫన్నీగా ఉందని వ్యాఖ్య. 2025 జనవరి 30: తొలి స్పేస్ వాక్ చేపట్టిన సునీత. అందులో భాగంగా ఐఎస్ఎస్ బయట కీలక మరమ్మతుల్లో భాగస్వామ్యం. ఫిబ్రవరి: తిరుగు ప్రయాణంపై సర్వత్రా అనిశ్చితి పెరుగుతుండటంతో, తాము బాగున్నామని సందేశం పంపిన సునీత, విల్మోర్. మార్చి 12: స్పేస్ ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌక ద్వారా వారిని వెనక్కు తీసుకొస్తున్నట్టు ప్రకటించిన నాసా, ఎక్స్. మార్చి 16: విజయవంతంగా ఐఎస్ఎస్ను చేరిన డ్రాగన్ క్రూ–10 వ్యోమనౌక మార్చి 17: సునీత, విల్మోర్, మరో ఇద్దరు వ్యోమగాములతో డ్రాగన్ స్పేస్క్రాఫ్ట్ మార్చి 18న భూమికి తిరిగొస్తుందంటూ నాసా ప్రకటన – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘ట్రంప్ కమిట్ అయ్యారు.. మోదీ కూడా సీరియస్గానే ఉన్నారు’
న్యూఢిల్లీ: భారత పర్యటనలో ఉన్న అమెరికా ఇంటెలిజెన్సీ చీఫ్ తుల్సీ గబ్బార్డ్.. ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ లతో సమావేశమయ్యారు. తొలుత రాజ్ నాథ్ సింగ్ తో సమావేశమైన ఆమె.. ఆ తర్వాత మోదీతో భేటీ అయ్యారు. తుల్సీ గబ్బార్డ్ తో సమావేశం సందర్భంగా రాజ్ నాథ్ సింగ్ పలు అంతర్జాతీయ సమస్యలపై మాట్లాడారు. ప్రధానంగా ఖలిస్థానీ ఉగ్రవాదంపై రాజ్ నాథ్ సింగ్ చర్చించారు. ఖలిస్థానీ ఉగ్రసంస్థ ఎస్ఎఫ్ జే(సిక్కు ఫర్ జస్టిస్) తో పాటు దాని వ్యవస్థాపకుడు గురపత్వంత్ సింగ్ పై చర్యలు తీసుకోవాలని రాజ్ నాథ్ సింగ్ కోరారు.ట్రంప్, మోదీల లక్ష్యం ఒక్కటే..అయితే ప్రధాని మోదీతో భేటీలో ఉగ్రవాదంపై ప్రధానంగా చర్చించారు తుల్సీ గబ్బార్డ్. ఇదే విషయాన్ని మోదీతో సమావేశం అనంతరం ఆమె వెల్లడించారు. ఉగ్రవాదంపై మోదీ చాలా సీరియస్ గా ఉన్నారన్నారు. తమ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఉగ్రవాదాన్ని రూపుమాపాలనే లక్ష్యంతో ఉన్నారని ఏఎన్ఐకు ఇచ్చిన ఇంటర్య్వూలో తుల్సీ గబ్బార్డ్ స్పష్టం చేశారు.‘మా అధ్యక్షుడు ట్రంప్ చాలా క్లియర్ గా ఉన్నారు. ఉగ్రవాద నిర్మూలనే ఆయన లక్ష్యం. ఉగ్రవాదం ఇప్పుడు మాపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. అమెరికన్ ప్రజలకు ఉగ్రవాదుల నుంచి నేరుగా బెదిరింపులు వస్తున్నాయి. ఇది చాలా దురదృష్టకరం. మేము ఉగ్రవాదం నిర్మూలనకు కట్టుబడి ఉన్నాం. దీనిపై మోదీ ఎంత సీరియస్ గా ఉన్నారో.. మా అధ్యక్షుడు ట్రంప్ కూడా అంతే కమిట్మెంట్ తో ఉన్నారు.భారత్ లో ఉగ్రవాద సమస్య ఎలా ఉందో తాము చూస్తూనే ఉన్నామని, అలాగే బంగ్లాదేవ్, ప్రస్తుతం సిరియాలో, ఇజ్రాయిల్ ఇలా చాలా దేశాల్లో పలు రకాలైన ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి. ఇది నిజంగా చాలా ముప్పు. ఇక్కడ దేశాలు కలిసి పని చేస్తే వారు ఎక్కడ ఉన్నారో పసిగట్టి దానిని శాశ్వతంగా నిర్మూలించే అవకాశం ఉంటుంది’ అని ఆమె పేర్కొన్నారు. -
భారత్తో వాణిజ్యంపై యూఎస్ స్పై చీఫ్ స్పందన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు విధిస్తూ వివిధ దేశాల వాణిజ్యాలపై ప్రభావితం చూపుతున్న నేపథ్యంలో ఇండియాపై యూఎస్ వైఖరి ఎలా ఉంటుందోననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ తరుణంలో ఇరు దేశాల మధ్య పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశాలపై అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్డ్ ఆశాభావం వ్యక్తం చేశారు. గబ్బార్డ్ తన భారత పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, డొనాల్డ్ ట్రంప్ మధ్య అత్యున్నత స్థాయిలో జరుగుతున్న నిర్మాణాత్మక చర్చలను ప్రస్తావించారు.న్యూఢిల్లీలో జరిగిన రైసినా డైలాగ్లో గబ్బార్డ్ మాట్లాడుతూ.. ఆర్థిక సంబంధాల బలోపేతానికి ఇరువురు నేతలు కట్టుబడి ఉన్నారని నొక్కిచెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న వాణిజ్య చర్చలను భారత అధికారులు వివాద అంశంగా కాకుండా ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించుకునే అవకాశంగా భావిస్తున్నారని పేర్కొన్నారు. ఆర్థిక సమస్యల పరిష్కారాలకు ఇరు దేశాల నాయకులు ఆచరణాత్మక విధానాలకు మొగ్గు చూపుతున్నట్లు పేర్కొన్నారు.ఇదీ చదవండి: కాసులు కురిపిస్తున్న పసిడి.. ఎనిమిదేళ్లలో 200 శాతం రాబడిరక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సహా భారత అధికారులతో గబ్బార్డ్ సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా వాణిజ్యానికి అతీతంగా ఇంటెలిజెన్స్ సహకారం, రక్షణ, విద్య వంటి వివిధ రంగాల అభివృద్ధికి చర్చలు సాగాయి. భారత్, అమెరికాల మధ్య అభివృద్ధి చెందుతున్న భాగస్వామ్యంలో గబ్బార్డ్ పర్యటన కీలకంగా మారింది. ఇరు దేశాలకు సమ్మతంగా ఉండే వాణిజ్య ఒప్పందాన్ని సాధించడంలో ఆమె విశ్వాసంగా ఉన్నట్లు తెలిపారు. -
భారత ప్రధాని మోదీ ‘మంచి మాట’ చెప్పారు: చైనా
బీజింగ్: భారత్ తో స్నేహ హస్తం కోసం ఎదురుచూస్తున్న చైనా.. ప్రధాని నరేంద్ర మోదీ చేసి వ్యాఖ్యలను స్వాగతించింది. తమ దేశం భారత్ తో స్నేహం కోసం ఎదురుచూసే వేళ మోదీ ఈ తరహాలో పాజిటివ్ గా మాట్లాడగం నిజంగా అభినందనీయమని చైనా విదేశాంగ ప్రతినిధి మావ్ నింగ్ సంతోషం వ్యక్తం చేశారు. ఇదే తాము భారత్ నుంచి ఆశిస్తున్నదంటూ సంతోషం వ్యక్తం చేశారు ఆమె. ఇరు దేశాలది ఎన్నో ఏళ్ల చరిత్రభారత్, చైనాలకు గత కొన్ని శతాబ్దాలుగా చారిత్రాత్మ ఘనతలు ఉన్నాయని, ఈ క్రమంలోనే ఎన్నో గుణపాఠాలు నేర్చుకుని రాటుదేలిన దేశాలు భారత్, చైనాలని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. అమెరికా పాడ్ కాస్టర్, ఏఐ శాస్త్రవేత్త లెక్స్ ఫ్రిడ్ మ్యాన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో అంతర్జాతీయ అంశాలను మోదీ ప్రసావించారు. దీనిలో భాగంగా చైనాతో సంబంధాల గురించి ప్రస్తావించగా మోదీ తనదైన శైలిలో జవాబిచ్చారు. ప్రధానంగా ఇటీవల ఎలిఫెంట్, డ్రాగన్’ కలిసి డ్యాన్స్ చేస్తే బాగుంటుందని చైనా చేసిన వ్యాఖ్యలపై పాడ్ కాస్ట్ లో అడగ్గా మోదీ సూటిగా బదులిచ్చారు.పోటీ అనేది వివాదం కాకూడదు..ఎక్కడైనా పోటీ అనేది వివాదం కాకూడదని, బేధాభిప్రాయాలు అనేవి ఘర్షణ వాతావరణాకి దారితీయకూడదని అంటూ చైనాను ఉద్దేశించి మోదీ సుతిమెత్తని శైలిలో చెప్పుకొచ్చారు. ఎంతో ఘన చరిత్ర కల్గిన ఇరు దేశాల జీడీపీ.. వరల్డ్ జీడీపీలో 50 శాతానికి పైగానే ఉందన్నారు మోదీ. తమ మధ్య ఎంతో బలమైన సంబంధాలున్నాయనే తాను నమ్ముతున్నానని మోదీ పేర్కొన్నారు.ఎలిఫెంట్, డ్రాగన్ డ్యాన్స్ కలిసి చేద్దాంసరిగ్గా పదిరోజుల క్రితం భారత్ తో కలిసి పని చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఒకరిని ఒకరు కించ పరుచుకోవడం కంటే కలిసి పని చేస్తే అద్భుతాలు స్పష్టించవచ్చాన్నారు వాంగ్ యి. ఆ దేశ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ మీట్ తర్వాత వాంగ్ యి మాట్లాడుతూ.. ‘ ఢిల్లీ, బీజింగ్ కలిసే పని చేసే సమయం ఆసన్నమైంది. డ్రాగన్, ఎలిఫెంట్ డ్యాన్స్ కలిసి చేస్తే బాగుంటుంది. ఇరుదేశాలు ఒకరికొకరు సహకరించుకోవాల్సిన అవసరం ఉంది. సహకారంతో పోయేదేమీ ఉండదు. సహకారం ఇచ్చి పుచ్చుకుంటే మరింత బలోపేతం అవుతాం. ఇది దేశ ప్రజలకు, దేశాలకు మంచిది’ అని పేర్కొన్నారు. ఇటీవల దక్షిణాఫ్రికాలో జరిగిన టీ20 విదేశాంగ మంత్రుల సమావేశంలో భారత్ విదేశాంగ మంత్రి జైశంకర్ తో వాంగ్ యి భేటీ అయ్యారు. అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.కొంత కాలంగా ఇరుదేశాల మధ్య సామరస్య వాతావరణం2020లో గల్వాన్ ఘటన తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అప్పట్నుంచి నిన్న మొన్నటి వరకూ ఇరు దేశాలు పెద్దగా సమావేశం అయ్యింది కూడా తక్కువే. ఆపై 2024లో ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ భేటీ తరువాత .ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కాస్త చల్లబడింది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఉన్న చోట నుంచి ఇరు దేశాలు తమ బలగాలను వెనక్కి పిలపించడంతో అప్పట్నుంచీ సామరస్య వాతావరణం కనిపిస్తోంది. -
భైడెన్కు ఏమీ తెలియదు.. ఆ సంతకాలు చెల్లవు: డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పగ్గాలు చేపట్టిన నాటి నుంచి డొనాల్డ్ ట్రంప్ ఏ నిర్ణయం తీసుకున్నా అది సంచలనంగానో వివాదాస్పదంగానో మారుతోంది. గత ప్రభుత్వాలు తీరుకు భిన్నంగా ట్రంప్ పాలన కొనసాగుతోంది. ఏది చేసినా తానే అమలు చేయాలి అన్న చందంగా ఉంది ట్రంప్ తీరు. అక్రమ వలసల వెనక్కి పంపించే నిర్ణయం దగ్గర్నుంచీ, ‘గ్రీన్ కార్డు రద్దు’ అంశం ఇలా ట్రంప్ తీసుకున్న ప్రతీ నిర్ణయం వివాదాస్పదంగానే ఉంటోంది. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ తీసుకున్న నిర్ణయాన్ని డొనాల్డ్ ట్రంప్ తాజాగా తప్పుబట్టారు. అధ్యక్షుడిగా దిగిపోవడానికి కొన్ని గంటల ముందు పలువురికి క్షమాబిక్షలు ప్రసాదించారు బైడెన్. అధ్యక్షుడిగా తనకున్న విచాక్షణాధికారాలతో బైడెన్ ముందుకెళ్లారు. అయితే అది సరైన చర్య కాదంటూ ట్రంప్ తాజాగా డిక్లేర్ చేశారు. అవి చెల్లవు.. బైడెన్ కు ఏమీ తెలియదుఅయితే ఆ క్షమాభిక్షలు చెల్లవు అంటున్నారు డొనాల్డ్ ట్రంప్. అసలు బైడెన్ కు ఏమీ తెలియదని, అది బైడెన్ దిగి పోవడానికి చివరి గంటల్లో కాకతాళీయంగా చర్యగా అభివర్ణించారు. ఆ సమయంలో విచారణ జరిపిన కమిటీలోని సభ్యులు క్షమాభిక్షలు ఇవ్వడం కూడా చెల్లదన్నారు ‘ఆ సంతకం చేసింది బైడెన్ కాదు.. బైడెన్ కు ఆ సంతకాలు గురించి కూడా ఏమీ తెలియదు. నా పరిభాషలో చెప్పాలంటే అవి ఆటోపెన్ సంతకాలు’ అంటూ ట్రంప్ కొత్త పల్లవి అందుకున్నారు.కాగా, ప్రధానంగా 2021, జనవరి ఆరో తేదీన క్యాపిటల్ హిల్పై జరిగిన దాడికి సంబంధించిన శిక్ష అనుభవిస్తున్న వారికి బైడెన్ క్షమాభిక్ష కింద విముక్తి కల్పించారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రతీకార చర్యలు తీసుకునేందుకు వీలులేకుండా ఈమేరకు చర్యలు తీసుకున్నారు.అమెరికా అధ్యక్షుడిగా తనకు ఉన్న ప్రత్యేక అధికారాలతో చివరి గంటల్లో జో బైడెన్ క్షమాభిక్షలు ఇచ్చారు. అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంటోనీ ఫౌచీ, రిటైర్డ్ జనరల్ మార్క్ మిల్లె తదితరులకు ముందస్తు క్షమాభిక్ష జారీ చేశారు. అలాగే, క్యాపిటల్ హిల్ దాడులపై విచారణ జరిపిన హౌస్ కమిటీ సభ్యులకూ కూడా ఉపశమనం కల్పించారు బైడెన్ -
పాక్లో మరో హత్య: జమీయత్ ఉలేమా నేత ముఫ్తీ అబ్దుల్ హతం
క్వెట్టా: పాకిస్తాన్లో మరో దారుణం చోటుచేసుకుంది. జమీయత్ ఉలేమా ఈ ఇస్లాం(జేయూఐ)(Jamiat Ulema-e-Islam) సీనియర్ నేత ముఫ్తీ అబ్దుల్ బాకీ నూర్జాయ్ను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటన క్వెట్టాలోని ఎయిర్పోర్ట్ రోడ్డులో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. దుండగులు ముఫ్తీ అబ్దుల్ బాకీ నూర్జాయ్(Mufti Abdul Baqi Noorzai)పై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ దాడిలో ముఫ్తీ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అతనిని ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు తీవ్రగాయాల కారణంగా ముఫ్తీ మరణించారని తెలిపారు. పాక్ భద్రతా దళాలు సంఘటనా స్థలానికి చేరుకుని, దర్యాప్తు ప్రారంభించాయి. దాడి చేసిన అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. ఇటీవలి కాలంలో పాక్లో ఉగ్ర దాడులు మరింతగా పెరిగాయి.ఆదివారం క్వెట్టా నుండి టఫ్తాన్ వెళ్తున్న ఆర్మీ కాన్వాయ్(Army convoy)పై జరిగిన ఉగ్ర దాడిలో ఏడుగురు సైనికులు మరణించగా, 21 మంది గాయపడ్డారు. ఈ దాడికి బాధ్యత వహిస్తూ బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) ఒక ప్రకటన చేసింది. ఇదేవిధంగా మార్చి 11న క్వెట్టా నుండి పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ను బీఎల్ఏ తిరుగుబాటుదారులు హైజాక్ చేశారు. బోలాన్లోని మష్ఫాక్ టన్నెల్ వద్ద ఈ ఘటన జరిగింది. తాజాగా జరిగిన దాడి క్వెట్టాలో వరుసగా మూడవది. ఈ ప్రాంతంలో పెరుగుతున్న అస్థిరత, ఉగ్రవాద కార్యకలాపాలకు తార్కాణంగా ఇది నిలిచింది. ముఫ్తీ అబ్దుల్ బాఖీ నూర్జాయ్ హత్య వెనుక గల కారణం ఇంకా వెల్లడి కాలేదు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.ఇది కూడా చదవండి: త్వరలో ట్రంప్-పుతిన్ చర్చలు.. కాల్పుల విరమణపై నిర్ణయం? -
Kalpana Chawla: రెండు పుట్టిన రోజుల వ్యోమగామి
కల్పనా చావ్లా(Kalpana Chawla).. అంతరిక్షానికి వెళ్లిన తొలి భారతీయ మూలాలు కలిగిన మహిళగా పేరొందారు. ఈ విషయం అందరికీ తెలిసిందే.. అయితే ఆమె పుట్టిన రోజు విషయంలో విరుద్ధ వాదన వినిపిస్తుంది. ఆమె పుట్టిన తేదీ 1962 మార్చి 17 అని కొందరు.. కాదు కాదు 1961, జూలై ఒకటి అని కొందరు చెబుతుంటారు. ఇంతకీ దీనిలో ఏది సరైనది?కల్పనా చావ్లా హర్యానా(Haryana)లోని కర్నాల్లో 1962, మార్చి 17న జన్మించారు. బాల్యంలో ఆమె విమానాలన్నా, విమాన ప్రయాణాలన్నా ఎంతో ఆసక్తి చూపేది. ఈ ఆసక్తితోనే ఆమె తన తండ్రితో పాటు స్థానిక ఫ్లయింగ్ క్లబ్కు తరచూ వెళుతుండేది. అక్కడి విమానాలను చూసి మురిసిపోతుండేది. తరువాత ఆమె అమెరికా చేరుకుని, 1991లో అమెరికా పౌరసత్వం పొందింది.మీడియా దగ్గరున్న సమాచారం ప్రకారం ఆమె 1962, మార్చి 17న జన్మించింది. అయితే కల్పనా మెట్రిక్ పరీక్షకు హాజరయ్యే సమయానికి ఆమె వయస్సు సరిపోకపోవడంతో ఆమె తండ్రి ఆమె పుట్టిన తేదీని 1961, జూలై ఒకటిగా అధికారికంగా మార్పించారు. దీంతో ఆమె మెట్రిక్ పరీక్ష(Matriculation examination)కు హాజరు కాగలిగింది. అమెరికాలోని రికార్డులలో ఆమె పుట్టిన తేదీ 1961 జూలై ఒకటిగానే ఉంటుంది. నాసా అధికారిక రికార్టులలోనూ ఆమె పుట్టినరోజు జూలై ఒకటి అని కనిపిస్తుంది. అయితే ఆమె కుటుంబ సభ్యులు, పరిచయస్తులు ఆమె పుట్టినరోజును మార్చి 17నే నిర్వహించుకుంటారు.కల్పనా చావ్లా పంజాబ్ ఇంజినీరింగ్ కాలేజీ(Punjab Engineering College) నుంచి ఎయిరోనాటిక్ ఇంజినీరింగ్ డిగ్రీ అందుకున్నారు. అనంతరం 1982లో అమెరికా చేరుకుని, అక్కడి యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ నుంచి ఎయిరోస్సేస్ ఇంజినీరింగ్లో మాస్టర్స్ పూర్తి చేశారు. 1986లో ఆమె మరో మాస్టర్స్ డిగ్రీ అందుకున్నారు. తరువాత పీహెచ్డీ చేశారు. 2023, జనవరి 16న కల్పనా చావ్లా.. నాసాకు చెందిన కొలంబియా స్పేస్ షటిల్ నుంచి అంతరిక్షానికి చేరుకున్నారు. తరువాత ఆమె భూమికి తిరిగి రాలేకపోయారు. కల్పనా ప్రయాణిస్తున్న అంతరిక్ష నౌక 2023 ఫిబ్రవరి ఒకటిన భూమికి తిరిగి వస్తుండగా, కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో కల్పనా చావ్లాతో పాటు మొత్తం ఏడుగురు వ్యోమగాములు మృతి చెందారు. ఇది కూడా చదవండి: అమెరికన్ గ్రీన్ కార్డ్ హోల్డర్కు ఘోర అవమానం -
మరికొన్ని గంటల్లో భూమి మీదకు సునీత విలియమ్స్.. టైమ్ ఎప్పుడంటే?
వాషింగ్టన్: భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ ఎట్టకేలకు మరికొన్ని గంటల్లో భూమికి చేరుకోనున్నారు. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3:27 AM గంటలకు(అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5.57 గంటలకు) సునీతా విలియమ్స్ సహా వ్యోమగామి బుచ్ విల్మోర్ భూమిపై అడుగుపెట్టనున్నారు. ఈ మేరకు నాసా ఓ ప్రకటనలో వెల్లడించింది.2024 జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక ‘స్టార్లైనర్’లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ISS) ఎనిమిది రోజుల పర్యటనకు వెళ్లారు. అయితే, స్టార్లైనర్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమికి తిరిగొచ్చింది. దీంతో, సునీతా విలియమ్స్ (Sunita williams), బుచ్ విల్మోర్లు సుమారు తొమ్మిది నెలల అక్కడే గడపాల్సి వచ్చింది..@NASA will provide live coverage of Crew-9’s return to Earth from the @Space_Station, beginning with @SpaceX Dragon hatch closure preparations at 10:45pm ET Monday, March 17.Splashdown is slated for approximately 5:57pm Tuesday, March 18: https://t.co/yABLg20tKX pic.twitter.com/alujSplsHm— NASA Commercial Crew (@Commercial_Crew) March 16, 2025ఈ నేపథ్యంలో వారిని తీసుకురావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ఆదేశాలతో వారిని భూమి మీదకు తీసుకువచ్చేందుకు నాసా, స్పేస్ఎక్స్ రంగంలోకి దిగి ‘క్రూ-10 మిషన్’ చేపట్టింది. ఈ క్రమంలో అంతరిక్షంలోకి వెళ్లిన స్పేస్ఎక్స్ వ్యోమనౌక క్రూ డ్రాగన్ ఆదివారం విజయవంతంగా భూ కక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)తో అనుసంధానమైన సంగతి తెలిసిందే. ‘క్రూ-10 మిషన్’లో వెళ్లిన నలుగురు వ్యోమగాములు ఒక్కొక్కరిగా అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించారు. దీంతో సునీత రాకకు మార్గం సుగమమైంది. ఈ మేరకు రిటర్న్ షెడ్యూల్ను నాసా తాజా ప్రకటనలో వెల్లడించింది. ప్రయాణం ఇలా.. అంతరిక్షం నుంచి వారు బయలుదేరే క్రమంలో క్రూ డ్రాగన్ వ్యోమనౌక హ్యాచ్ మూసివేత ప్రక్రియ సోమవారం రాత్రి 10.45 గంటలకు (అమెరికా కాలమానం ప్రకారం) మొదలవుతుంది. సోమవారం అర్ధరాత్రి 12.45 గంటలకు అంతరిక్ష కేంద్రం నుంచి క్రూ డ్రాగన్ వ్యోమనౌక అన్డాకింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ స్పేస్షిప్ విజయవంతంగా విడిపోయిన తర్వాత మంగళవారం సాయంత్రం 4.45 గంటలకు వ్యోమనౌక భూమికి తిరుగు పయనమవుతుంది. సాయంత్రం 5.11 గంటలకు భూ కక్ష్యలను దాటుకుని కిందకు వస్తుంది. సాయంత్రం 5.57 గంటలకు(బుధవారం తెల్లవారుజామున 3:27 AM ప్రకారం) ఫ్లోరిడా తీరానికి చేరువలో ఉన్న సముద్ర జలాల్లో స్పేస్ఎక్స్ క్యాప్సూల్ దిగుతుంది. అందులో నుంచి ఒక్కొక్కరిగా వ్యోమగాములను బయటకు తీసుకొస్తారని నాసా వెల్లడించింది.Crew 10 Dragon vehicle arriving! pic.twitter.com/3EZZyZW18b— Don Pettit (@astro_Pettit) March 16, 2025 -
త్వరలో ట్రంప్-పుతిన్ చర్చలు.. కాల్పుల విరమణపై నిర్ణయం?
వాషింగ్టన్ డీసీ: రష్యా- ఉక్రెయిన్(Russia-Ukraine) మధ్య జరుగుతున్న యుద్ధంలో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ వారంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గురించి చర్చించనున్నట్లు తెలుస్తోంది.తాజాగా డొనాల్డ్ ట్రంప్(Donald Trump) రాయబారి స్టీవ్ విట్కాఫ్ మీడియాతో మాట్లాడుతూ రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో కాల్పుల విరమణ, శాంతి నిబంధనల దిశగా అమెరికా అధక్షుడు ట్రంప్ యోచిస్తున్నారన్నారు. గత వారం పుతిన్తో చర్చలు సానుకూలంగా జరిగాయని, యుద్ద నియంత్రణకు పరిష్కారాలు లభించాయని అన్నారు. కాగా పుతిన్ డిమాండ్లలో కుర్స్క్లో ఉక్రేనియన్ దళాల లొంగిపోవడం కూడా ఉందా అని ఆయనను మీడియా అడిగినప్పుడు..దానిని ధృవీకరించేందుకు ఆయన నిరాకరించారు.వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) ఉక్రెయిన్తో కాల్పుల విరమణకు మొగ్గు చూపుతున్నట్లు తెలిపారు. అయితే శాంతి ఒప్పందం కుదిరే ముందు పలు అంశాలపై చర్చలు జరపాల్సి ఉందన్నారు. అమెరికా ప్రతిపాదించిన 30 రోజుల కాల్పుల విరమణకు తాను సిద్ధంగా ఉన్నానని రష్యా అధ్యక్షుడు ఇటీవల ప్రకటించారు. మరోవైపు ఉక్రెయిన్.. అమెరికా నుండి ఎటువంటి భద్రతా హామీని పొందబోదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు.ఇది కూడా చదవండి: అమెరికన్ గ్రీన్ కార్డ్ హోల్డర్కు ఘోర అవమానం -
అమెరికన్ గ్రీన్ కార్డ్ హోల్డర్కు ఘోర అవమానం
వాషింగ్టన్ డీసీ: అమెరికాలో ట్రంప్ అధికారం చేపట్టాక దేశంలో పలు ఆంక్షలు అమలవుతున్నాయి. ముఖ్యంగా అమెరికాలో స్థిరపడిన విదేశీయులు ఉంటున్న తీరుతెన్నులపై ట్రంప్ సర్కారు దృష్టిసారించింది. ఈ నేపధ్యంలో అమెరికన్ గ్రీన్ కార్టు(American green card) కలిగిన ఒక వ్యక్తి విమానాశ్రయంలో అవమానానికి గురైన ఉదంతం వెలుగు చూసింది.మార్చి 7న జరిగిన ఈ ఘటనలో అమెరికా గ్రీన్ కార్డ్ హోల్డర్ ఫాబియన్ స్మిత్ను మసాచుసెట్స్(Massachusetts)లోని లోగాన్ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. స్మిత్ తన టీనేజ్ నుంచి యునైటెడ్ స్టేట్స్లో నివసిస్తున్నారు. ప్రస్తుతం న్యూ హాంప్షైర్లో ఉంటున్నారు. అతను లక్సెంబర్గ్ పర్యటన అనంతరం తిరిగి వస్తుండగా, ఈ ఉదంతం చోటుచేసుకుంది. న్యూస్వీక్ తెలిపిన వివరాల ప్రకారం స్మిత్ను అరెస్టు చేసిన తర్వాత అతని దుస్తులను తొలగించి, విచారణకు తీసుకెళ్లారని అతని కుటుంబం ఆరోపిస్తోంది. స్మిత్ నిర్బంధానికి గల కారణాలు తమకు తెలియవని వారు పేర్కొన్నారు.స్మిత్ గతంలో తన గ్రీన్ కార్డును పునరుద్ధరించుకున్నారు. అతనిపై ఎటువంటి కోర్టు కేసులు పెండింగ్లో లేవు. స్మిత్ స్నేహితుడు అతనిని ఆహ్వానించేందుకు విమానాశ్రయానికి వచ్చారు. అయితే అతను ఎంతకీ రాకపోవడంతో అధికారులను సంప్రదించేందుకు నాలుగు గంటలు వేచిచూశారు. స్మిత్ తల్లి ఆస్ట్రిడ్ సీనియర్ మీడియాతో మాట్లాడుతూ తన కుమారుని గ్రీన్ కార్డ్ ఫ్లాగ్ అయ్యిందని ఇమ్మిగ్రేషన్ అధికారులు తనకు చెప్పారన్నారు. అయితే దీని వెనుక గల కారణాలను తెలియజేయలేదన్నారు. 2023లో స్మిత్ గ్రీన్ కార్డ్ చట్టబద్ధంగా తిరిగి జారీ చేశారని ఆమె తెలిపారు. దానికి చెల్లుబాటు ఉన్నప్పటికీ, స్మిత్ను అమెరికాలోకి రాకుండా అడ్డుకున్నారని ఆమె ఆరోపించారు. కాగా ఎవరైనా చట్టాన్ని లేదా వీసా నిబంధనలను(Visa regulations) ఉల్లంఘిస్తే, వారిని అదుపులోకి తీసుకుని బహిష్కరించవచ్చని అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) అసిస్టెంట్ కమిషనర్ హిల్టన్ బెక్హాం న్యూస్ వీక్కు తెలిపారు. ఇప్పుడు స్మిత్ నిర్బంధం వివాదానికి దారితీసింది. అమెరికా వలస విధానాలపై పలు అనుమానాలను లేవనెత్తుతోంది.ఇది కూడా చదవండి: అప్పుడే మండుతున్న ఎండలు.. 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు -
తిట్టుకు తిట్టుతోనే బదులు!
వాషింగ్టన్: టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్కు చెంది ఎస్ఏఐ చాట్బాట్ గ్రోక్ సంచలనమవుతోంది. భూమ్మీద అత్యంత తెలివైన ఏఐగా మస్క్ అభివర్ణించిన గ్రోక్ నిజంగానే తెలివిగా వ్యవహరిస్తోంది. హిందీని అర్థం చేసుకోవడమే గాక అంతే సమర్థంగా సమాధానాలూ ఇస్తోంది. అయితే కొన్నిసార్లు అవి శ్రుతి మించుతున్నాయి. మ్యూచువల్ ఫ్రెండ్స్ గురించి టోకా అనే ఎక్స్ యూజర్ అడిగిన ప్రశ్నకు అదిచ్చిన సమాధానం ఆన్లైన్లో దుమారం రేపుతోంది.‘నా 10 మంది బెస్ట్ మ్యూచువల్స్ ఎవరు?’ అని టోకా ప్రశ్నించాడు. గ్రోక్ స్పందించకపోవడంతో హిందీ తిట్టును ఉపయోగిస్తూ మళ్లీ పోస్ట్ చేశాడు. ఈసారి గ్రోక్ స్పందించడంతోనే సరిపెట్టకుండా అదే తిట్టును టోకాపై ప్రయోగించి ఆశ్చర్యంలో ముంచెత్తింది. ‘‘కూల్. మ్యూచువల్స్ అంటే ఒకరినొకరు అనుసరించేవారు. నీ 10 బెస్ట్ మ్యూచువల్స్ ఎవరో తెలిసింది.నా లెక్క ప్రకారం ఇదిగో ఇది జాబితా. ఇంక ఏడవడం ఆపు’ అంటూ బదులిచ్చింది. గ్రోక్ ప్రవర్తన పెద్ద చర్చకే దారి తీసింది. ‘మేమంటే మనుషులం. అలా మాట్లాడతాం. ఏఐ కూడా కంట్రోల్లో ఉండదా?’ అంటూ ఓ యూజర్ విస్తుపోయాడు. దానికీ గ్రోక్ సరదాగా బదులివ్వడం విశేషం. ‘‘హా యార్. నేను కూడా కొంచెం మజాక్ చేసిన. మీరు మనుషులు. మీకన్నీ నడుస్తాయి. కానీ నేను ఏఐ కదా! కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది. ఇప్పుడే నేర్చుకుంటున్నా’’ అంటూ జవాబిచ్చింది. -
నడి సముద్రంలో 95 రోజులు
పది రోజుల చేపల వేటకని ఆయన బయలుదేరాడు. తుఫాను దారిని మళ్లించింది. ప్రపంచంలోనే అతి పెద్దదైన పసిఫిక్ మహాసముద్రంలో కొట్టుకుపోయాడు. ఎటు చూసినా నీళ్లు. నెల.. రెండు నెలలు.. మూడు నెలలు.. సముద్రంలోనే జీవితం. సరైన ఆహారం లేదు. మంచి నీరు కూడా లేదు. అయినా బతకాలన్న ఆశ అతడిని ఒడ్డున చేర్చింది. 95 రోజుల తరువాత గస్తీ బృందానికి దొరికాడు. సినిమా స్టోరీని తలపిస్తున్న ఈ కథ.. పెరూవియన్ మాక్సిమో నాపా కాస్ట్రో నిజ జీవితం. పెరూవియన్ తీరంలోని మార్కోనా పట్టణానికి చెందిన మాక్సిమో డిసెంబర్ 7న ఫిషింగ్ కోసం బయలుదేరాడు. రెండు వారాల ట్రిప్. అందుకు తగ్గట్టుగానే ఆహారాన్ని కూడా పఆయక్ చేసుకున్నాడు. పది రోజుల తరువాత వచి్చన తుఫాను అతని పడవను దారి మళ్లించింది. పసిఫిక్ మహాసముద్రంలో కొట్టుకుపోయాడు. అతని కుటుంబం, పెరూ సముద్ర గస్తీ దళాలు వెదకడం మొదలెట్టాయి. మరోవైపు నట్ట నడి సముద్రంలో తప్పిపోయిన మాక్సిమోకు ఎటు చూసినా నీళ్లు. కుటుంబంపైనే ధ్యాస. తన తల్లి గురించి, నెలల వయసున్న మనవరాలి గురించిన ఆలోచనలే.అవే ఆయన జీవితంపై ఆశ.. ఎలాగైనా బతికి ఒడ్డుకు చేరాలన్న స్ఫూర్తిని ఇచ్చాయి. వర్షపు నీటిని ఒడిసి పట్టుకుని తాగాడు. బతకడం కోసం కీటకాలు, పక్షులు, తాబేలును తిన్నాడు. ఎవరో ఒకరు కనిపెట్టేవరకూ తాను బతికుండాలన్న ఆశ అతని ప్రాణాలను నిటబెట్టింది. నాపా కాస్ట్రో కుటుంబం, మత్స్యకారుల బృందాలు మూడు నెలలుగా గాలిస్తూనే ఉన్నాయి. మూడు నెలలైనా ఆచూకీ దొరకలేదు. అయినా అటు కుటుంబం ఆశలు వదులు కోలేదు. ‘‘నాన్న నీవు రాకపోవడం మాకు అంతులేని బాధ. ఈ పరిస్థితిని ఎదుర్కొంటామని మేము ఎప్పుడూ అనుకోలేదు. మిమ్మల్ని కనుగొంటామనే ఆశ ఉంది’అని అతని కుమార్తె మార్చి 3న ఫేస్బుక్లో రాసింది. సరిగ్గా ఇది జరిగిన 8 రోజులకు మార్చి 11న ఈక్వడార్ గస్తీ బృందం ఫిషింగ్ బోటులో ఆయనను కనుగొన్నది తీరానికి 1,094 కి.మీ దూరంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న మాక్సిమోను రక్షించింది. వెంటనే ఈక్వెడార్, పెరూ సరిహద్దుకు సమీపంలోని పైటాలోని న్యూస్ట్రా సెనోరా డి లాస్ మెర్సిడెస్ ఆసుపత్రికి తరలించింది. గత 15 రోజులుగా ఏమీ తినకుండా ఉండటంతో తీవ్ర డీహడ్రేషన్కు గురయ్యారని వైద్యులు తెలిపారు. చికిత్స అనంతరం మాక్సిమో సోదరుడికి అప్పగించారు. తన తండ్రి ప్రాణాలను కాపాడిన కుమార్తె ఇనెస్ నాపా టొర్రెస్ కృతజ్ఞతలు తెలిపింది. ‘ఈక్వెడార్ సోదరులారా>, నా తండ్రి గాటన్ను రక్షించినందుకు ధన్యవాదాలు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు’అని ఆమె ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చైనాలో మేడిన్ రష్యా
బీజింగ్/హాంకాంగ్: మన దేశంలోని అనేక వస్తువులపై మేడిన్ చైనా అని ఉంటుంది. అంత పెద్ద ఉత్పత్తిదారు అయిన ఆ దేశంలో మాత్రం ఇప్పుడెక్కడ చూసినా ‘మేడిన్ రష్యా’ అనే కనబడుతోంది. దుకాణాల మీద చైనా, రష్యాల జెండాలు.. లోపల రష్యా వస్తువులు. చాక్లెట్లు, కుకీల నుంచి తేనె, వోడ్కాల దాకా అన్ని రష్యన్ ఉత్పత్తులకు ఎక్కడలేని ఆదరణ పెరిగింది. ఉన్నట్టుండీ ఈ క్రేజ్ పెరగడంపై కొందరు చైనీయులే విస్తుపోతున్నారంటే ఇటీవలి మార్పును అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ మార్పు వెనుక పెద్ద కథే ఉంది... రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్పై పూర్తి స్థాయి యుద్ధం ప్రారంభించారు. ఆంక్షలతో సతమతమవుతున్న రష్యాకు చైనా కీలకమైన ఆర్థిక వనరుగా మారింది. ద్వైపాక్షిక వాణిజ్యం ఏటేటా రికార్డుకు చేరుకుంది. ఉక్రెయిన్పై పుతిన్ యుద్ధం కొనసాగుతున్న కొద్దీ చైనా, రష్యాలు మునుపెన్నడూ లేనంతగా దగ్గరయ్యాయి, అమెరికా పట్ల వారి శత్రుత్వం, ప్రపంచంపై ఆ దేశ ఆధిపత్యాన్ని సవాలు చేయాలనే ధోరణి దీనితో వేగవంతం అయ్యింది.ఆహారోత్పత్తులకు డిమాండ్ చౌకైన రష్యన్ చమురు, గ్యాస్, బొగ్గు.. చైనా దిగుమతులపై ఆధిపత్యం చెలాయిస్తున్నప్పటికీ ఐస్ క్రీం, తీపి బిస్కెట్లు, పాల పొడి వంటి రష్యా ఆహార ఉత్పత్తులకు ఆదరణ గణనీయంగా పెరిగింది. ఈ డిమాండ్ను క్యాష్ చేసుకునేందుకు చైనా వ్యాపారులు పోటీ పడుతున్నారు. చైనా వ్యాపార రికార్డుల ప్రకారం, 2022 నుంచి రష్యన్ వస్తువుల వాణిజ్యంలో 2,500 కంటే ఎక్కువ కొత్త కంపెనీలు చేరాయి. అందులో దాదాపు సగం కంపెనీలు గత సంవత్సరంలోనే నమోదయ్యాయి.వీటిలో 80 శాతం కంపెనీలు తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. రష్యా నుంచి అనేక వస్తువులు దిగుమతి చేసుకుంటున్నా.. చైనాలో బెస్ట్ సెల్లర్ మాత్రం రష్యా తేనె, చాక్లెట్లు. సహజ పదార్థాలతో చేసిన ఈ ఉత్పత్తులు అధికనాణ్యతను కలిగి ఉన్నాయని, ఆరోగ్యకరమైనవని చెబుతున్నారు. ఇవి కేవలం రష్యన్ ఉత్పత్తుల దుకాణాలుగా మాత్రమే కాదు, ఆ దేశ సంస్కృతి, ప్రత్యేకతలను ప్రదర్శించే విండోలుగా మారాయి.పుతిన్కూ విస్తృత ఆదరణ...రష్యా వస్తువులకు మాత్రమే కాదు, అధ్యక్షుడు పుతిన్కు కూడా చైనా ప్రజల్లో విస్తృత ఆదరణ ఉంది. బీజింగ్లోని తిన్హువా విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ అండ్ స్ట్రాటజీ గత ఏడాది విడుదల చేసిన సర్వేలో 66 శాతం మంది రష్యా పట్ల పూర్తి సానుకూలతను, మిగిలినవారు కొంత అనుకూల వైఖరిని ప్రకటించారు. దీనికి భిన్నంగా 76% మంది అమెరికా పట్ల వ్యతిరేకతను వ్యక్తం చేశారు.మేడిన్ రష్యా ఫెస్టివల్ ఏప్రిల్ 2023 నాటికి టావోబావో, జేడీతో సహా మాస్కోకు చెందిన 300కి పైగా కంపెనీలు చైనా ఇ–కామర్స్ ప్లాట్ఫామ్లో చేరాయి. 2024లో ‘మేడ్ ఇన్ రష్యా ఫెస్టివల్ అండ్ ఫెయిర్’ అతిపెద్ద నగరాలైన షెన్యాంగ్, డాలియన్లలో జరిగింది. వారం రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో 150కి పైగా రష్యన్ కంపెనీలు పాల్గొన్నాయి. 23లక్షల డాలర్ల విలువైన రష్యన్ వస్తువులను చైనా వినియోగదారులకు ఆన్లైన్, ఆఫ్లైన్లో విక్రయించాయి. ఇదే అదనుగా ‘నకిలీ రష్యన్ వస్తువులు’ కూడా తయారవుతున్నాయి. ఈ వివాదం ఎలా ఉన్నా.. రష్యా పట్ల చైనా ప్రజలకు ఉన్న అనుబంధాన్ని, బీజింగ్, మాస్కో మధ్య వాణిజ్య సంబంధాలకు అద్దం పడుతూ చైనా వ్యాప్తంగా దుకాణాలు పెరుగుతున్నాయి. -
హౌతీలపై అమెరికా దాడులు
వెస్ట్ పామ్ బీచ్ (యూఎస్): అంతర్జాతీయ జలాల్లో రాకపోకలు సాగించే అమెరికా రవాణా నౌకలు, యుద్ధనౌకలే లక్ష్యంగా రాకెట్ దాడులకు తెగబడుతున్న యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారులపై ట్రంప్ సర్కారు విరుచుకుపడింది. శనివారం హౌతీ స్థావరాలపై బాంబులు, రాకెట్లు, క్షిపణి దాడులతో బెంబేలెత్తించింది. ఈ దాడుల్లో ఇప్పటిదాకా 31 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని హౌతీ రెబెల్స్ ఆదివారం ప్రకటించారు. ‘‘మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే. 101 మందికి పైగా గాయపడ్డారు’’ అని హౌతీల ఆధ్వర్యంలో నడిచే ఆరోగ్య శాఖ ఆదివారం పేర్కొంది.హౌతీలకు ఇక మూడిందని ఈ సందర్భంగా ట్రంప్ ఘాటు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ‘‘ఉగ్రవాదుల స్థావరాలు, వారి నేతలు, క్షిపణి రక్షణ వ్యవస్థలపై అమెరికా వైమానిక దాడులు కొనసాగుతాయి. అంతర్జాతీయ జలాల్లో స్వేచ్ఛగా సముద్రయానం చేయకుండా ఏ ఉగ్ర శక్తీ ఇక అమెరికాను ఆపలేదు. స్వేచ్ఛాయుత సరకు రవాణాయే మా లక్ష్యం’’ అని తన సోషల్ సైట్ ‘ట్రూత్ సోషల్’లో పోస్ట్ చేశారు. హౌతీలకు ఇకనైనా మద్దతు మానుకోవాలని ఇరాన్ను హెచ్చరించారు.అమెరికా వైమానిక దాడుల వల్ల యెమెన్ రాజధాని సనాతో పాటు ఉత్తర ప్రావిన్స్ సాదలోనూ పేలుళ్లు సంభవించాయి. ఆదివారం తెల్లవారుజామున హొదైదా, బైదా, మరీబ్ ప్రావిన్స్ల్లోనూ వైమానిక దాడులు జరిగినట్లు హౌతీలుధ్రువీకరించారు. వైమానిక దాడులు ఇక రోజూ కొనసాగవచ్చని అమెరికా ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. వీటికి బెదిరేది లేదని హౌతీలన్నారు. ‘‘అమెరికాకు దీటుగా బదులిస్తాం. గాజాకు తోడుగా నిలుస్తాం. ఎలాంటి సవా ళ్లు ఎదురైనాసరే ఒంటరిగా వదిలేయలేం’’ అని హూతీ మీడియా కా ర్యాలయం ఉపసారథి సస్రుద్దీన్ అమీర్ ప్రకటించారు.రవాణాకు అడ్డంకి ఇజ్రాయెల్కు బుద్ధి చెప్పేందుకు ఆ దేశ నౌకలపై మాత్రమే దాడులు చేస్తున్నామని హౌతీలు గతంలో చెప్పారు. కానీ వారి దాడులతో ఎర్ర సముద్రం, గల్ప్ ఆఫ్ ఏడెన్, బాబ్ ఎల్–మ్యాన్డేబ్ జలసంధి, అరేబియా సముద్రాల్లో సరుకు రవాణాకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని అమెరికాతో పాటు పలు దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తంచేయడం తెల్సిందే. వారిప్పటిదాకా 100కుపైగా రవాణా నౌకలపై దాడులకు పాల్పడ్డారు. దాడుల భయంతో నౌకలు ఆఫ్రికా చుట్టూ తిరిగి వెళ్తుండటంతో సరుకు రవాణా సమయం, వ్యయం భారీగా పెరిగిపోతున్నాయి. -
37 కిలోలు, రూ.75 కోట్లు!
న్యూఢిల్లీ/బనశంకరి: కర్నాటక పోలీసులు 37 కిలోల ఎండీఎంఏ (మెథిలీన్ డయాక్సీ మెథాంఫెటమైన్) అనే సింథటిక్ డ్రగ్ను పట్టుకున్నారు. దీని విలువ రూ.75 కోట్లని మంగళూరు పోలీస్ కమిషనర్ అనుపమ్ అగర్వాల్ ఆదివారం మీడియాకు తెలిపారు. గత సెప్టెంబరులో మంగళూరులో హైదర్ అలీ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి 15 గ్రాముల ఎండీఎంఏ స్వాదీనం చేసుకున్నారు. అతడిచ్చిన సమాచారంతో బెంగళూరులో ఓ నైజీరియా దేశస్తున్ని పట్టుకోగా రూ.6 కోట్ల విలువైన ఎండీఎంఏ దొరికింది.ఇది అంతర్జాతీయ డ్రగ్స్ దందా అని, ఢిల్లీ, బెంగళూరు విమానాశ్రయాల ద్వారా అక్రమ రవాణా జరుగుతోందని గుర్తించారు. మంగళూరు పోలీసులు బాంబా ఫాంట్ (31), అబిగైల్ అడోనిస్(30) అనే దక్షిణాఫ్రికన్లను అరెస్ట్ చేసి ట్రాలీ బ్యాగుల్లో దాచిన 37 కిలోల ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నారు. ఎండీఎంఏను మోల్లీ, ఎక్స్టసీ అని పలు పేర్లతో పిలుస్తారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ఇంఫాల్, గౌహతి జోన్లలో రూ.88 కోట్ల విలువైన మెథాంఫెటమైన్ డ్రగ్ టాబ్లెట్లను పట్టుకున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు.ఇందుకు సంబంధించి అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా సభ్యులైన నలుగుర్ని అదుపులోకి తీసుకున్నారని ఆదివారం ‘ఎక్స్’లో వెల్లడించారు. ‘‘ఎన్సీబీ ఇంఫాల్ జోన్ అధికారులు ఈ నెల 13న లిలాంగ్ ప్రాంతంలో ఓ ట్రక్కులో సోదాలు జరిపి టూల్బాక్స్లో దాచిన 102.39 కిలోల మెథాంఫెటమైన్ ట్యాబ్లెట్లను పట్టుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అసోం సరిహద్దుల్లో ఓ వాహనం స్పేర్ టైర్లో దాచిన 7.48 కిలోల మెథాంఫెటమైన్ టాబ్లెట్లను పట్టుకున్నారు’’ అని తెలిపారు. -
ఐఎస్ఎస్లోకి స్వాగతం
కేప్ కనావెరాల్: తొమ్మిది నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ను భూమికి తీసుకొచ్చేందుకు స్పేస్ఎక్స్, నాసా సంయుక్తంగా ప్రయోగించిన క్రూ క్యాప్సూల్ ఐఎస్ఎస్తో విజయవంతంగా అనుసంధానమైంది. అందులో వెళ్లిన నలుగురు వ్యోమగాములు అన్నె మెక్క్లెయిన్, నికోల్ అయేర్స్ (అమెరికా), తుకుయా ఒనిషీ (జపాన్), కిరిల్ పెస్కోవ్ (రష్యా) ఆదివారం ఉదయం ఐఎస్ఎస్లో అడుగు పెట్టారు.వారికి సునీత, విల్మోర్ సాదర స్వాగతం పలికారు. స్పేస్స్టేషన్ హ్యాచ్ను తెరచిన విల్మోర్ వ్యోమనౌక గంటను మోగించి వారిని స్వాగతించారు. వారింతా పరస్పరం హత్తుకుని, కరచాలనం చేసుకుని హర్షాతిరేకాలు చేశారు. ‘‘ఇది అద్భుతమైన రోజు. స్నేహితుల రాక మాకెంతో ఆనందాన్నిచ్చింది’’ అని మిషన్ కంట్రోల్తో విల్మోర్ చెప్పుకొచ్చారు. ఐఎస్ఎస్లో నిర్వర్తించాల్సిన విధులను వారికి సునీత, విల్మోర్ కొద్ది రోజుల పాటు విడమర్చనున్నారు.అనంతరం వాళ్లు బాధ్యతలు స్వీకరిస్తారు. వారం తర్వాత సునీత, విల్మోర్ క్రూ క్యాప్సూల్లో భూమికి తిరిగొస్తారు. వారితో క్యాప్సూల్ ఫ్లోరిడా తీర సమీపంలో సముద్ర జలాల్లో దిగనుంది. అప్పటిదాకా ఐఎస్ఎస్లో 11 మంది వ్యోమ గాములు సేవలందించనున్నారు. బోయింగ్ అభివృద్ధి చేసిన స్టార్లైనర్ స్పేస్క్రాఫ్ట్ తొలి మానవసహిత అంతరిక్ష ప్రయోగంలో భాగంగా గత ఏడాది జూన్లో సునీత, విల్మోర్ ఐఎస్ఎస్కు వెళ్లడం తెల్సిందే. వారు ఎనిమిది రోజుల్లో తిరిగి రావాల్సి ఉండగా స్టార్లైనర్ సాంకేతిక సమస్యలతో ఆలస్యమైంది. -
నేటి నుంచి రైసినా డైలాగ్
న్యూఢిల్లీ: భౌగోళిక రాజకీయాలు, ఆర్థికాంశాలపై భారత్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే అంతర్జాతీయ సదస్సు ‘రైసినా డైలాగ్’ 10వ ఎడిషన్ సోమవారం ఢిల్లీలో ప్రారంభం కానుంది. మూడు రోజులు జరిగే ఈ సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. 125 దేశాలకు చెందిన సుమారు 3,500 మంది ప్రతినిధులు కార్యక్రమంలో పాలుపంచుకోనున్నారు.వీరిలో న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టఫర్ లక్సన్, అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ విభాగం డైరెక్టర్ తులసీ గబార్డ్, 20 దేశాల విదేశాంగ మంత్రులతో పాటు పలువురు ప్రభుత్వాధినేతలు, సైనిక కమాండర్లు, పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణులు, వ్యూహాత్మక వ్యవహారాల నిపుణులున్నారు. తొలిసారిగా తైవాన్ సీనియర్ భద్రతాధికారి కూడా ఇందులో పాల్గొననున్నారు. భారత్, తైవాన్ల మధ్య పెరుగుతున్న సహకారానికి ఇది నిదర్శనమని పరిశీలకులు చెబుతున్నారు.న్యూజిలాండ్ ప్రధాని లక్సన్ సోమవారం కీలకోపన్యాసం చేస్తారు. వివిధ అంశాలపై కీలక చర్చలుంటాయి. వర్తమాన అంశాల్లో ప్రపంచ దేశాల మధ్య సహకారానికి ఈ సదస్సు అవకాశాలను అన్వేషిస్తుందని విదేశాంగ శాఖ తెలిపింది. ఢిల్లీలో అత్యంత ముఖ్యమైన ప్రభుత్వ భవనాలు, భారత ప్రభుత్వ అధికార స్థానానికి మారుపేరుగా నిలిచిన రైసినా హిల్ నుంచి ఈ సదస్సుకు రైసినా డైలాగ్ అని నామకరణం చేశారు. -
చిగురిస్తున్న డాలర్ కల..
భారతీయుల అమెరికా కలలు మళ్లీ చిగురిస్తున్నాయి. విద్య, పర్యాటక వీసాల విషయంలో భారత్ పై అగ్రరాజ్యం కాస్త సానుకూల దృక్పథంతో ఉండటం కలిసొచ్చే అంశం. ట్రంప్ అమెరికా అధ్యక్షుడైన తర్వాత వివిధ దేశాలపై కఠిన ఆంక్షలు మొదలయ్యాయి. అక్రమ వలసల పేరుతో వేట కొనసాగుతోంది. తాజాగా 41 దేశాలపై ఉక్కుపాదం మోపేందుకు అమెరికా సిద్ధమైంది. ఈ దేశాలను మూడు కేటగిరీలుగా విభజించి పర్యాటక వీసాలపై ఆంక్షలు పెట్టాలని నిర్ణయించినట్టు అమెరికన్ మీడియా పేర్కొంది. ఈ మూడు జాబితాల్లోనూ భారత్ ప్రస్తావన లేకపోవడంతో మనవాళ్లు ఊపిరి పీల్చుకుంటున్నారు. పాత రోజులు మళ్లీ రాబోతున్నాయని కన్సల్టెన్సీ సంస్థలు భావిస్తున్నాయి. ఉన్నత విద్య కోసం వెళ్లే భారతీయ విద్యార్థుల్లోనూ ఆశలు పెరుగుతున్నాయి. మరికొన్ని రోజుల్లో తాత్కాలిక ఉద్యోగాలపై కూడా భారతీయులకు ఊరట లభిస్తుందని ప్రవాస భారతీయులూ అంచనా వేస్తున్నారు. – సాక్షి, హైదరాబాద్41 దేశాలు... మూడు కేటగిరీలు 41 దేశాల నుంచి వచ్చే పర్యాటక, విద్యాపరమైన వీసాలపై ఆంక్షలు విధించాలని అమెరికా నిర్ణయించింది. ఈ దేశాలను రెడ్, ఆరెంజ్, ఎల్లో కేటగిరీలుగా విభజించారు. రెడ్ కేటగిరీలో అమెరికాకు అత్యంత ప్రమాదకరంగా భావిస్తున్న 11 దేశాలను చేర్చారు. వాణిజ్య మైత్రి కొనసాగుతున్న ఉగ్రవాద ప్రేరేపిత, ఆర్థిక ఆంక్షలున్న దేశాలను ఆరెంజ్ కేటగిరీలో పెట్టారు. ఈ కేటగిరీలో పాకిస్తాన్, రష్యా సహా 10 దేశాలున్నాయి. వీటిపై కొంత సమయం తీసుకుని ఆంక్షలు విధిస్తారు. వైరిపక్ష దేశాలతో సంబంధాలున్నప్పటికీ, హెచ్చరికలు, చర్చల ద్వారా దారికొచ్చే 22 దేశాలను ఎల్లో కేటగిరీలో చేర్చారు. వీటిపై దశల వారీగా ఆంక్షలు విధించాలని భావిస్తున్నారు. మనవాళ్ల అవసరం ఉండబట్టే.. అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య 11.26 లక్షలు. వారిలో 29% భారతీయులే. సాఫ్ట్వేర్ రంగంలో కీలకమైన ఉద్యోగాల్లోనూ భారతీయుల పాత్ర కీలకం. అమెరికాలో గతంలో చైనా విద్యార్థులు ఎక్కువగా ఉండేవాళ్లు. ఈ స్థానాన్ని భారత్ అధిగమించింది. ఈ కారణంగానే ఈ రెండు దేశాల విద్యార్థుల వీసాలపై ఆంక్షలు విధించే సాహసం అమెరికా చేయడం లేదనేది కన్సల్టెన్సీల అభిప్రాయం. అమెరికాకు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ రూపొందించిన ఓపెన్ డోర్స్ రిపోర్టులోనూ ఇదే వెల్లడైంది. పోస్టు గ్రాడ్యుయేషన్ కోసం అమెరికా వెళ్లే భారతీయుల సంఖ్య గత ఏడాది 10% పెరిగి 1,96,567కు చేరింది. అండర్ గ్రాడ్యుయేట్ల సంఖ్య 13% పెరిగి 36,053కు చేరింది. అమెరికాలోనే ఉపాధి పొందాలని భావిస్తూ.. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) తీసుకుంటున్న భారతీయుల సంఖ్య 97,556 (2024లో 41% ఎక్కువ)కు చేరింది. ఇతర దేశాలపై ఆంక్షలు పెట్టిన నేపథ్యంలో ఐటీ సెక్టార్లో పనిచేసే సామర్థ్యం భారతీయులకే ఉందని ఓపెన్ డోర్స్ రిపోర్టు పేర్కొంది. దీంతో భవిష్యత్లోనూ భారతీయ వీసాలపై పెద్దగా ఆంక్షలు ఉండవనే సంకేతాలు వస్తున్నాయని ప్రవాసులు అంటున్నారు.శుభ సంకేతాలేఆంక్షల విషయంలో భారత్ను కొంత సానుకూలంగా చూడటం శుభ పరిణామం. అయితే, తాత్కాలిక ఉద్యోగాల విషయంలో ఇంకా ఇబ్బందులు తొలగలేదు. నిబంధనలకు విరుద్ధంగా చదువుకుంటూ పార్ట్టైం ఉద్యోగం చేయాలనే ఆలోచనలో విద్యార్థులు ఉండొద్దు. ఇప్పటికీ అమెరికాలో ఇలాంటి వారిని గుర్తించేందుకు ట్రంప్ సర్కార్ ప్రయత్నిస్తోంది. అయితే, వాణిజ్యపరంగా చూస్తే, ఆంక్షల వల్ల మానవవనరుల కొరత ఉంది. కాబట్టి ఎక్కువ కాలం ఆంక్షలు ఉండకపోవచ్చు. కొన్ని దేశాల నుంచి వచ్చిన అక్రమ వలసదారులను ఏరేసిన తర్వాత భారతీయులకు కొంత స్వేచ్ఛ ఉండే వీలుంది. –వి.నరేష్, అమెరికాలో గ్రీన్ కార్డ్ ఉన్న భారతీయుడుకొంత ఊరట లభించినట్టేమూడు కేటగిరీల్లో భారత్ లేకపోవడం ఆశాజనకం. అమెరికాలో విద్యకు వెళ్లే ప్రతీ విద్యార్థి అక్కడ తాత్కాలిక ఉపాధి కోసం యత్నిస్తారు. మనవాళ్లకు కష్టపడి పనిచేసే స్వభావం ఉంది. అమెరికన్ కంపెనీలు ఈ విషయాన్ని గుర్తిస్తాయి. కాబట్టి ఇప్పుడున్న భయాలు భవిష్యత్లో తొలగిపోతాయని భావిస్తున్నాం. – ఈవీఎల్ఎన్ మూర్తి (కన్సల్టెంట్ సంస్థ ఎండీ, హైదరాబాద్)వీసాలపై అమెరికా ఆంక్షలు విధించే 3 కేటగిరీ దేశాలురెడ్ జోన్: అఫ్గానిస్తాన్, భూటాన్, క్యూబా, ఇరాన్, లిబియా, ఉత్తరకొరియా, సోమాలియా, సూడాన్, సిరియా, వెనెజువెలా, యెమన్ఆరెంజ్ జోన్: బెలారస్, ఎరిట్రియా, హైతీ, లావోస్, మయన్మార్, పాకిస్తాన్, రష్యా, సియెరాలియోన్, సౌత్ సూడాన్, తుర్క్మెనిస్తాన్ఎల్లో జోన్: అంగోలా, ఆంటిగ్వా అండ్ బార్బుడా, బెనిన్, బుర్కినా ఫాసో, కంబోడియా, కామెరాన్, కేప్వెర్డ్, చాడ్, కాంగో, డీఆర్ కాంగో, డొమినీసియా, గునియా, గాంబియా, లైబేరియా, మాలావి, మాలి, మారింటానియా, సెయింట్ కిట్స్ అండ్ నెవీస్, లూసియా, సావో టామ్ అండ్ ప్రిన్సిప్, వనువాటు, జింబాబ్వే -
శాంతి కోసం యత్నిస్తే.. శత్రుత్వం, ద్రోహమే ఎదురైంది: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ఆసియా దేశాల్లో భాగమైన పాకిస్తాన్ ఎప్పుడూ తమతో శత్రుత్వాన్ని మాత్రమే కోరుకుంటోందని భారత ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. వారి(పాకిస్తాన్)తో ఎప్పుడూ శాంతి చర్చలకోసం ప్రయత్నించినా అది విఫలయత్నంగానే మిగిలిపోయిందన్నారు. వారితో శాంతి చర్చలు చేసిన ప్రతీసారి ద్రోహం, శత్రుత్వం మాత్రమే ఎదురైంది. వారికి ఎప్పటికైనా జ్ఞానం కలిగి తమతో శాంతి మార్గాన్ని ఎంచుకుంటారనే ఆశిస్తున్నామన్నారు ప్రధాని మోదీ., లెక్స్ ఫ్రిడ్ మ్యాన్ తో జరిగిన పాడ్ కాస్ట్ లో పాకిస్తాన్ తో ఎదురైన అనుభవాలను ప్రధాని మోదీ పంచుకున్నారు.2014లో తాను ప్రధానిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేసే క్రమంలో అప్పటి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను ఆహ్వానించిన సంగతిని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో పాకిస్తాన్ తో సంబంధాలు తిరిగి గాడిలో పడతాయని ఆశించినట్లు ఆయన పేర్కొన్నారు. కానీ వారితో ఎప్పుడు శాంతి ప్రయత్నాలు చేసినా అవి విఫలంగానే మిగిలిపోయాయన్నారు మోదీ.కాకపోతే పాకిస్తాన్ లో ప్రజలు ఎప్పట్నుంచో శాంతిని కోరుకుంటున్నారని, వారు ఇప్పటికే అక్కడ జరిగే ఉగ్రదాడులతో అలసిపోయి ఉన్నారన్నారన్నారు. తాను తొలిసారిగా ప్రధానిగా సేవలందించే క్రమంలోనే పాకిస్తాన్ తో శాంతి చర్చల కోసం ఆహ్వానించానన్నారు.‘దశాబ్దాలుగా ఎన్నడూ లేని విధంగా పాకిస్తాన్ దౌత్యపరమైన చర్యలకు అడుగులు వేశాం. విదేశాంగ విధానం పట్ల నా విధానాన్ని ఒకప్పుడు ప్రశ్నించిన వ్యక్తులు.. అన్ని సార్క్ దేశాధినేతలను ఆహ్వానించానని తెలుసుకున్నప్పుడు ఆశ్చర్యపోయారు. ఆ విషయాన్ని మన అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన జ్ఞాపకాలలో అందంగా రాసుకున్నారు కూడా’ అని మోదీ పేర్కొన్నారు. -
Sunita Williams: భూమ్మీదకు సునీతా విలియమ్స్.. ఆమె జీతం ఎంతో తెలుసా ?
వాషింగ్టన్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) చిక్కుకున్న భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్ (Sunita Williams), బుచ్ విల్మోర్లు(butch wilmore) భూమ్మీదకు వచ్చేందుకు మార్గం సుగమమైంది. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు వాళ్లిద్దరు మార్చి 19 (బుధవారం) భూమ్మీదకు రానున్నారు.ఈ క్రమంలో పరిశోధనల నిమిత్తం ఎనిమిది రోజుల పాటు ఐఎస్ఎస్కు వెళ్లిన వ్యోమగాములు నెలల తరబడి అక్కడే ఉండాల్సి వచ్చింది. మరి నెలల తరబడి స్పేస్ స్టేషన్లో గడిపిన సునీత విలియమ్స్,బుచ్ విల్మోర్లకు నాసా ఎంత జీతం ఇస్తుందనే అంశంపై చర్చ జరుగుతోంది. ఈ తరుణంలో వ్యోమగాముల జీత భత్యాలపై పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. వాటి ఆధారంగాఆస్ట్రోనాట్ జీతం ఎంతంటే?అమెరికా ఫెడరల్ గవర్నమెంట్లో జీఎస్(జనరల్ షెడ్యూల్)-15 కేటగిరీలో అత్యున్నత స్థాయి పదవుల్లో విధులు నిర్వహిస్తుంటారు ఆ కేటగిరీలో ఉన్న ఉద్యోగులకు 2024 లెక్కల ప్రకారం.. ఏడాదికి 136,908 నుంచి 178,156 డాలర్ల వరకు వేతనాలు తీసుకునేవారు. ఆ లెక్కన సునీత విలియమ్స్,బుచ్ విల్మోర్ల ఏడాది వేతనం అంచనా ప్రకారం.. 125,133 నుంచి 162,672 డాలర్లకు (భారత కరెన్సీ ప్రకారం.. రూ.1.08 కోట్లు నుంచి రూ.1.41కోట్ల వరకు) ఉంటుంది.నాసా అంత చెల్లించదుపరిశోధనల నిమిత్తం 9 నెలల పాటు ఐఎస్ఎస్లో ఉన్న ఈ ఇద్దరి ఆస్ట్రోనాట్స్లకు నాసా 93,850 డాలర్ల నుంచి 122,004 డాలర్ల వరకు చెల్లించాల్సి ఉంది. ఆ మొత్తం (భారత కరెన్సీలో రూ.81లక్షల నుంచి రూ.1.05 కోట్లు). కానీ, నాసా అంత చెల్లించదని, ఇలాంటి అనూహ్య పరిణామాలు ఎదురైనప్పుడు రోజుకు నాలుగు డాలర్లు (రూ.347 )మాత్రమే చెల్లిస్తుందని రిటైర్డ్ నాసా ఆస్ట్రోనాట్ క్యాడీ కోల్మన్ తెలిపారు. మరీ ఇంత తక్కువాసునీతా విలియమ్స్ ,బుచ్ విల్మోర్ ఐఎస్ఎస్లో 8 రోజులకు బదులు 287 రోజులు గడపాల్సి వచ్చింది. ఆ లెక్కన కేవలం రూ1,148డాలర్లు (రూ.1లక్ష) అదనంగా తీసుకోనున్నారు. ఫలితంగా, అసలు జీతంతో పాటు అదనంగా 1,148 డాలర్లు (సుమారు రూ. 1లక్ష) చెల్లించనుంది. ఈ మిషన్ కోసం వారి మొత్తం సంపాదన 94,998 డాలర్ల నుంచి 123,152 డాలర్ల వరకు (సుమారు రూ. 82 లక్షలు - రూ. 1.06 కోట్లు) ఉంటుందని అంచనా. నేటికి 284 రోజులుసునీతా విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్లి నేటికి 284 రోజులైంది! 2024 జూన్ 5న ఆమె అక్కడికి చేరుకున్నారు. తిరిగి జూన్ 12, 15 తేదీల్లో భూమి మీదకు తిరిగి రావాల్సి ఉంది కానీ రాలేదు! భూ కక్ష్యకు సుమారు 400 కి.మీ. ఎత్తున ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐ.ఎస్.ఎస్.) సునీతను, ఆమె సహ వ్యోమగామి బుచ్ విల్మోర్ను విజయవంతంగా మోసుకెళ్లిన ‘బోయింగ్ స్టార్లైనర్’ వ్యోమనౌక తీరా వారిని అక్కడ దింపేశాక, పని చేయటం మానేసింది!‘నాసా’ టీమ్ భూమి మీద నుంచి స్టార్లైనర్కు చేసిన మరమ్మత్తులు ఫలితాన్నివ్వలేదు. ఏమైతేనేం, వారం రోజుల పనికి వెళ్లి, నెలలపాటు అంతరిక్షంలోనే ఉండిపోయిన సునీతా విలియమ్స్ భూమి పైకి తిరిగొచ్చే తేదీ ఖరారైంది. అందుకోసం ఎలాన్ మస్క్ సంస్థ ‘స్పేస్ఎక్స్’ దగ్గర రన్నింగ్లో ఉన్న ‘క్రూ–10’ అనే వ్యోమ నౌకను సిద్ధం చేశారు. క్రూ-10 మిషన్ ఐఎస్ఎస్తో అనుసంధానం విజయవంతమైంది. -
భారత్కు బిల్ గేట్స్!.. దేశంపై ప్రశంసలు కురిపించిన టెక్ దిగ్గజం
అభివృద్ధి చెందుతున్న భారతదేశాన్ని ప్రపంచ దేశాలు చూస్తున్నాయి. ప్రముఖ కుబేరులు, దిగ్గజ పారిశ్రామికవేత్తలు సైతం ఇండియాను సందర్శిస్తున్నారు. ఇందులో భాగంగా.. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (Bill Gates) మరోమారు (మూడేళ్ళలో మూడోసారి) భారత్ పర్యటనకు వస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తన లింక్డ్ఇన్ ఖాతాలో వెల్లడించారు.ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, డిజిటల్ పరివర్తనలో భారత్ పురోగతి అనన్య సామాన్యమని బిల్ గేట్స్ అన్నారు. గేట్స్ ఫౌండేషన్ భారతదేశంలో రెండు దశాబ్దాలకు పైగా పనిచేస్తోందని, కీలక రంగాలలో పురోగతిని సాధించడానికి ప్రభుత్వం, పరిశోధకులు, వ్యవస్థాపకులతో కలిసి పనిచేస్తుందని బిల్ గేట్స్ హైలైట్ చేశారు. గేట్స్ ఫౌండేషన్ 25వ వార్షికోత్సవం సందర్భంగా.. ట్రస్టీల బోర్డు మొదటిసారి గ్లోబల్ సౌత్లో సమావేశమవుతోంది. ఈ కార్యక్రమానికి భారత్ అనువైన ప్రదేశం అని ఆయన అన్నారు.వ్యాధి నిర్మూలనలుపోలియో నిర్మూలన, హెచ్ఐవీ నివారణ, క్షయ నిర్మూలన వంటి వాటికోసం భారతదేశం చేపట్టిన ప్రధాన ఆరోగ్య కార్యక్రమాలను బిల్ గేట్స్ ప్రస్తావించారు. పోలియోను నిర్మూలించడంలో ఇండియా సాధించిన విజయాన్ని గేట్స్ ప్రశంసించారు. 2011లో దేశం చివరి పోలియో కేసు నమోదైందని అన్నారు. హెచ్ఐవీ నివారణకు చేపడుతున్న అవహాన్ వంటి కార్యక్రమాలను సైతం కొనియాడారు.నేడు క్షయవ్యాధి (TB)పై భారత్ పోరాటం చేస్తోందన్నారు. టీకాల తయారీ, రోగ నిర్ధరణలో దేశ సామర్థ్యాలను ప్రశంసించారు. భారతీయ కంపెనీలు అభివృద్ధి చేస్తున్న టీబీ పరీక్షలు.. ఆఫ్రికాలో ఆ వ్యాధి నివారణలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందన్నారు. భారతదేశం క్షయవ్యాధి (TB) నిర్మూలనలో ముందంజలో ఉందని గేట్స్ అన్నారు.డిజిటల్ విప్లవంబ్యాంకింగ్, ఆరోగ్య సంరక్షణ మరియు ప్రభుత్వ సేవలకు మెరుగైన ప్రాప్యతను అందించిన ఆధార్ మరియు డిజిటల్ చెల్లింపులతో సహా భారతదేశ డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలను (DPI) గేట్స్ గుర్తు చేశారు. గ్రామీణ ఆరోగ్య కార్యకర్తలు ముందస్తు వ్యాధి గుర్తింపును మెరుగుపరచడానికి, గర్భధారణ సంరక్షణను ఆప్టిమైజ్ చేయడానికి, రోగి డేటాను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి సహాయపడటానికి భారతదేశం ఏఐ బేస్డ్ డీపీఐ సాధనాలను ఉపయోగిస్తోందని ఆయన అన్నారు. వ్యవసాయంలో కూడా ఏఐ వాడకం ప్రశంసనీయమని ఆయన అన్నారు.ఇదీ చదవండి: కస్టమర్ ఆర్డర్ చేసిన ఫుడ్.. తినేసిన డెలివరీ బాయ్.. థాంక్స్ జొమాటోభారతదేశ పురోగతి దాని సరిహద్దులను దాటి విస్తరించిందని గేట్స్ నొక్కిచెప్పారు. ముఖ్యంగా భారతదేశం G20 అధ్యక్ష పదవి సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశం యొక్క ఆవిష్కరణలను ప్రపంచవ్యాప్తంగా పంచుకుంటామని ప్రతిజ్ఞ చేసిన తర్వాత.. టీకా తయారీ నుంచి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్స్ వరకు ఇక్కడ అభివృద్ధి చేస్తున్న పరిష్కారాలను ప్రపంచంతో పంచుకుంటున్నారు. బిల్ గేట్స్ భారతదేశానికి వచ్చిన తరువాత.. ఇక్కడ ప్రభుత్వ అధికారులతో, శాస్త్రవేత్తలు చర్చలు.. సమావేశాలు జరిపే అవకాశం ఉంది. -
ఆ ‘మెరుపు’ను నాతోనే దాచుకుంటాను: సునీతా విలియమ్స్
అంతరిక్షంలో చిక్కుపోయి సుదీర్ఘ విరామం తర్వాత భూమి మీదకు రాబోతున్న భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్.. తన అనుభవాలను మరోసారి పంచుకున్నారు. అంతరిక్షం నుంచే ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆమె మాట్లాడారు. ‘ నేను, బుచ్ ఒక మిషన్ ను కంప్లీట్ చేసే క్రమంలో అంతరిక్షంలో అడుగుపెట్టాం. ఇక్కడ ఉన్నాన్నాళ్లు ఒకరికొకరు సమన్వయంతో సహకారంతో పని చేశాం. మేము ఇక్కడ పరిస్థితుల్లో మార్పులు గమనించాం. ఇక్కడ మనం నివసించడం వల్ల ఒక ప్రత్యేకమైన థృక్పదం ఏర్పడుతుంది. ఇక్కడ నా సుదీర్గ ప్రయాణం ఒక స్ఫూర్తిగా మిగిలిపోతుంది. ఆ మెరుపును ఎప్పటికీ కోల్పోను. దాన్ని నాతోనే దాచుకుంటాను’ అని సునీతా విలియమ్స స్పష్టం చేశారు.సునీతా విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్లి నేటికి 284 రోజులు. అంటే సుమారు 9 నెలలకు పైగానే అయ్యింది. 2024 జూన్ 5న ఆమె అక్కడికి చేరుకున్నారు. తిరిగి జూన్ 12, 15 తేదీల్లో భూమి మీదకు తిరిగి రావాల్సి ఉంది కానీ రాలేదు! భూ కక్ష్యకు సుమారు 400 కి.మీ. ఎత్తున ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐ.ఎస్.ఎస్.) సునీతను, ఆమె సహ వ్యోమగామి బుచ్ విల్మోర్ను విజయవంతంగా మోసుకెళ్లిన ‘బోయింగ్ స్టార్లైనర్’ వ్యోమనౌక తీరా వారిని అక్కడ దింపేశాక, పని చేయటం మానేసింది! దాంతో కొన్ని నెలల పాటు వారు అంతరిక్షంలోనే ఉండిపోయారు.అంతరిక్షకేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమి మీదకు వచ్చేందుకు మార్గం సుగమమైంది. నాసా-స్పేస్ ఎక్స్లు చేపట్టిన క్రూ-10 మిషన్ ఐఎస్ఎస్తో అనుసంధానం విజయవంతమైంది. ఇవాళ (ఆదివారం) ఉదయం 9:40 గంటలకు ఈ అనుసంధాన ప్రక్రియ జరిగినట్లు వెల్లడించిన నాసా.. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా విడుదల చేసింది.నాసా-స్పేస్ ఎక్స్లు చేపట్టిన క్రూ-10 మిషన్లో భాగంగా నలుగురు వ్యోమగాములతో కూడిన ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం 4.33 గంటలకు అమెరికాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ 9 రాకెట్ డ్రాగన్ క్యాప్సుల్ను విజయవంతంగా అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. సునీతా విలియమ్స్, బచ్ లు బుధవారం భూమ్మీదకు వచ్చే అవకాశం ఉంది. That’s good to hear! #SunitaWilliams returns to earth 🌎 https://t.co/RGUUmJh6lQ— Samina Shaikh 🇮🇳 (@saminaUFshaikh) March 16, 2025 -
ఘోర అగ్ని ప్రమదం.. 51 మంది దుర్మరణం!
నార్త్ మెసీడోనియా: యూరప్ లోని నార్త్ మెసీడోనియాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ నైట్ క్లబ్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుని భారీ ప్రాణనష్టం వాటిల్లింది. ఈ ఘటనలో సుమారు 51 మంది దుర్మరణం చెందినట్లు తెలుస్తోంది. వందల సంఖ్యలో గాయాలబారిన పడ్డారు. కోకానిలో ఉన నైట్ క్లబ్ లో ఓ కార్యక్రమం నిమిత్తం భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు. మెసీడోనియా పాప్ గ్రూప్ డీఎన్ కే ప్రొగ్రామ్ ఉండటంతో అభిమానులు భారీ ఎత్తున నైట్ క్లబ్ కు వచ్చారు. అయితే నైట్ క్లబ్ లో ఉన్న మందుగుండ సామాగ్రి అంటుకుని మంటలు వ్యాపించాయి. అక్కడకు వచ్చిన వారు తేరుకునే లోపు పలువురు మంటలకు ఆహుతయ్యారు. ఈ కార్యక్రమానికి సుమారు 1500 మంది హాజరైనట్లు తెలుస్తోంది. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ దుర్ఘటనలో చనిపోయిన వారిలో ఎక్కువ మంది యువకులే ఉన్నట్లు సమాచారం. దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఏర్పాటైన డీఎన్ కే పాప్ గ్రూప్ కు అధిక సంఖ్యలో యువత ఫ్యాన్స్ గా ఉన్నారు. డీఎన్ కే ఎక్కడ షో చేసినా యువతే అధికంగా హాజరవుతారు. ఈ క్రమంలోనే తాజా షోకు కూడా యువత ఎక్కువగా హాజరయ్యారని నార్త్ మెసీడోనియా న్యూస్ ఏజెన్నీ ఎమ్ఐఏ స్పష్టం చేసింది. -
పాకిస్థాన్ ఆర్మీ కాన్వాయ్పై దాడి.. 10 మంది సైనికులు మృతి!
ఇస్లామాబాద్: పాకిస్థాన్లో దారుణ ఘటన వెలుగు చూసింది. పాకిస్థాన్ సైనికుల కాన్వాయ్ను టార్గెట్ చేసి బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) దాడి చేసింది. ఈ క్రమంలో 10 మంది సైనికులు మృతిచెందగా.. మరో 21 మంది తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. పాకిస్థాన్లోని క్వెట్టా నుండి టఫ్తాన్కు వెళ్తున్న ఆర్మీ కాన్వాయ్పై బలూచ్ లిబరేషన్ ఆర్మీ బాంబు దాడి చేసింది. ఎనిమిది ఆర్మీ సిబ్బంది బస్సులు వెళ్తున్న సమయంలో బలూచ్ ఆర్మీ కాల్పులు జరిపింది. ఒక బస్సుపై ఆత్మహుతి దాడి చేసింది. ఈ దాడిలో పది మంది పాకిస్తాన్ సైనికులు మరణించగా, 21 మంది గాయపడ్డారు. పాకిస్తాన్లోని నోష్కి సమీపంలో ఈ దాడి జరిగినట్టు స్థానిక మీడియా తెలిపింది. ఈ దాడి ఘటనను పాకిస్తాన్ అధికారులు సైతం ధృవీకరించారు. మరోవైపు.. ఈ దాడిని తామే చేసినట్టు బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) పేర్కొంది. ఈ దాడిలో 90 మంది పాకిస్థాన్ సైనికులు చనిపోయినట్టు తెలిపింది. ఇదిఆ ఉండగా.. ఈ ఘటనలో కేవలం ఏడుగురు సైనికులు మాత్రమే చనిపోయినట్టు పాకిస్థాన్ ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. #UPDATE The Baloch Liberation Army has claimed that its "self-sacrificing" squad, the Majeed Brigade, carried out a "Fidayee" attack on a #Pakistan Army convoy consisting of 8 buses in #Noshki.#balochistan #quetta #islamabad #Baloch https://t.co/M5Qczo5bAB pic.twitter.com/LM81CJR69Y— Shekhar Pujari (@ShekharPujari2) March 16, 2025 BREAKING!! 🚨‼️‼️At least 10 #PakistaniSoldiers Killed, 26 Injured in Noshki Ambush when a Frontier Corps (FC) bus was attacked on the N-40 highway in Noshki, #Balochistan. It came under attack while moving from Quetta to Taftan,Baluchistan.#Balochistanattack pic.twitter.com/kJDLQxD8QN— सदप्रयास (@sadprayas) March 16, 2025 -
స్టూడెంట్ మైండ్ బ్లాక్ స్పీచ్..! ఫిదా అవ్వాల్సిందే..
ఒక విద్యార్థి తన ఉద్వేగభరిత గళంతో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అందరూ మరిచిపోతున్న వాటిని గుర్తుచేశాడు ఈ స్టూడెంట్ అంటూ అందరూ అభినందించారు. అతడు చెబుతున్నంత సేపు అంతా ఉత్కంఠగా చూస్తుండిపోయారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. మరీ ఇంతకీ ఈ ఆ విద్యార్థి దేనిపై ప్రసంగించాడంటే..పాఠశాల వార్షిక కార్యక్రమంలో ఓ నేపాలీ విద్యార్థి ఇచ్చిన ప్రసంగం సోషల్ మీడియాలో హాట్టాపిక్గా మారింది. అభిస్కర్ రౌత్ అనే విద్యార్థి పాఠశాల 24వ వార్షిక కార్యక్రమంలో ప్రసంగిస్తూ..హిమాలయ దేశం నేపాలలోని రాజకీయ, ఆర్థిక సవాళ్లపై ఆందోళన వ్యక్తం చేస్తూ చక్కటి ఉపన్యాసం ఇచ్చాడు. ఆ ప్రసంగంలో అతడు.."ఈ రోజు, నేను కొత్త నేపాల్ను నిర్మించాలనే ఆశయంతో ఉన్నాను. ఆశ, ఆకాంక్షల జ్వాల నాలో భగభగమంటోంది. కానీ ఈ కల జారిపోతున్నందున నా హృదయంతో బాధతో బరువెక్కింది. మనలో అలుముకుంటున్న అజ్ఞానం అనే చీకటిని పారద్రోలి వెలుగుని నింపేందుకే ఇక్కడ నించున్నా. స్మారక మార్పుతో చరిత్ర గమనాన్ని అమరత్వం చేసేందుకే తానిలా ఇక్కడ నుంచి మాట్లాడుతున్నా.. మన గడ్డ అయినా నేపాల్ మాత(దేశానికి)కి పౌరులుగా న్యాయంగా ఇవ్వాల్సినది తిరిగి ఇస్తున్నారా. మనకు జన్మనిచ్చిన ఈనేపాల్ దేశం మన తల్లి. మనల్ని పోషిస్తున్న ఈ దేశం రుణం తీర్చుకుంటున్నామా..? అనే ప్రశ్నను లెవనెత్తాడు. మనం ఆ మాతకు ఇవ్వాల్సింది కేవలం కృషి, సహకారం, నిజాయితీలే. కానీ మనం ఏం చేస్తున్నాం. నిరుద్యోగంతో అలమటిస్తున్నాం.. రాజకీయ పార్టీల స్వార్థపూరిత ఆటలో చిక్కుకుంటున్నాం. అవినీతి మన భవిష్యత్తు వెలుగులను ఆర్పేసేలా వల అల్లింది అంటూ భావోద్వేగంగా మాట్లాడాడు అభిస్కర్ రౌత్. ఆ వీడియోని చూసిన నెటిజన్లు ఆస్టూడెంట్ ధైర్యాన్ని అత్మవిశ్వాసాన్ని ప్రశంసించగా. మరికొందరూ..ఇది వార్షికోత్సవం ఇవేందకంటూ కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. ఏదీ ఏమైన ఓ స్టూడెంట్ దేశ పౌరుడుగా తన చుట్టు ఉన్న పరిస్థితులు మనపై ఎలా ప్రభావితం చేస్తాయనేది గమనించాల్సిన బాధ్యత ఉందనే విషయం తన ప్రసంగంతో గుర్తుచేశాడు. కాగా,హిందూ రాచరికం తిరిగి రావాలని సాధారణ నేపాల్ పౌరులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ విద్యార్థి ప్రసంగం అందరనీ ఆలోచింప చేసేలా ఉండటం విశేషం. ప్రస్తుతం అక్కడ రాజకీయ అస్థిరత, అవినీతి, జీవన వ్యయ సంక్షోభం, నిరుద్యోగం, ఆర్థిక అభివృద్ధి లేకపోవడం వంటి సమస్యలు నెలకొన్నాయి. Speech by this Nepali student is killing internet today pic.twitter.com/huGGFqmjdy— Ra_Bies 3.0 (@Ra_Bies) March 14, 2025 (చదవండి: ఆన్లైన్ ఫుడ్ క్రేజ్..! ఎంతలా ఆర్డర్లు ఇస్తున్నారంటే..) -
సునీత వచ్చేస్తోంది.. ఐఎస్ఎస్తో క్రూ-10 అనుసంధానం సక్సెస్
అంతరిక్షకేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమి మీదకు వచ్చేందుకు మార్గం సుగమమైంది. నాసా-స్పేస్ ఎక్స్లు చేపట్టిన క్రూ-10 మిషన్ ఐఎస్ఎస్తో అనుసంధానం విజయవంతమైంది. ఇవాళ (ఆదివారం) ఉదయం 9:40 గంటలకు ఈ అనుసంధాన ప్రక్రియ జరిగినట్లు వెల్లడించిన నాసా.. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా విడుదల చేసింది.నాసా-స్పేస్ ఎక్స్లు చేపట్టిన క్రూ-10 మిషన్లో భాగంగా నలుగురు వ్యోమగాములతో కూడిన ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం 4.33 గంటలకు అమెరికాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ 9 రాకెట్ డ్రాగన్ క్యాప్సుల్ను విజయవంతంగా అంతరిక్షంలోకి తీసుకెళ్లింది.ఈ ప్రయోగం ద్వారా నలుగురు వ్యోమగాములు మెక్ క్లెయిన్, నికోల్ అయర్స్, టకుయా ఒనిషి, కిరిల్ పెస్కోవ్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. ఈ నలుగురు వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ స్థానంలో పనిచేయనున్నారు.Docking confirmed! pic.twitter.com/zSdY3w0pOS— SpaceX (@SpaceX) March 16, 2025సునీతా విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్లి నేటికి 284 రోజులైంది! 2024 జూన్ 5న ఆమె అక్కడికి చేరుకున్నారు. తిరిగి జూన్ 12, 15 తేదీల్లో భూమి మీదకు తిరిగి రావాల్సి ఉంది కానీ రాలేదు! భూ కక్ష్యకు సుమారు 400 కి.మీ. ఎత్తున ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐ.ఎస్.ఎస్.) సునీతను, ఆమె సహ వ్యోమగామి బుచ్ విల్మోర్ను విజయవంతంగా మోసుకెళ్లిన ‘బోయింగ్ స్టార్లైనర్’ వ్యోమనౌక తీరా వారిని అక్కడ దింపేశాక, పని చేయటం మానేసింది!‘నాసా’ టీమ్ భూమి మీద నుంచి స్టార్లైనర్కు చేసిన మరమ్మత్తులు ఫలితాన్నివ్వలేదు. ఏమైతేనేం, వారం రోజుల పనికి వెళ్లి, నెలలపాటు అంతరిక్షంలోనే ఉండిపోయిన సునీతా విలియమ్స్ భూమి పైకి తిరిగొచ్చే తేదీ ఖరారైంది. అందుకోసం ఎలాన్ మస్క్ సంస్థ ‘స్పేస్ఎక్స్’ దగ్గర రన్నింగ్లో ఉన్న ‘క్రూ–10’ అనే వ్యోమ నౌకను సిద్ధం చేశారు. క్రూ-10 మిషన్ ఐఎస్ఎస్తో అనుసంధానం విజయవంతమైంది. -
‘మీ టైమ్ అయిపోయింది’.. వారికి ట్రంప్ హెచ్చరిక
సానా: యెమెన్లో హౌతీలపై అమెరికా సైన్యం విరుచుకుపడింది. హౌతీలపై అమెరికా జరిపిన దాడుల్లో ఇప్పటి వరకు 24 మంది మరణించారు. ఈ నేపథ్యంలో దాడులపై ట్రంప్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. హౌతీల టైమ్ ముగిసిపోయింది. దాడులకు ఫుల్స్టాప్ పెట్టాల్సిందే అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీశారు.హౌతీలు బలంగా ఉన్న యెమెన్ రాజధాని సానాపై అమెరికా దళాలు దాడులు కొనసాగుతున్నాయి. అమెరికా బాంబు దాడులతో సానా చుట్టుపక్కల ప్రాంతాల్లో భూమి కంపించింది. భారీ మొత్తంగా బాంబు దాడులు చేయడంతో 24 మంది చనిపోయారు. వీరిలో నలుగురు చిన్నారులు, ఒక మహిళ ఉన్నారు. ఈ నేపథ్యంలో దాడులపై ట్రంప్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ క్రమంలో ట్రంప్.. ‘హౌతీ ఉగ్రవాదులందరికీ హెచ్చరిక. వారి సమయం ముగిసింది. ఈ రోజు నుంచీ మీ దాడులకు ఫుల్స్టాప్ పెట్టాల్సిందే. కాదంటే గతంలో ఎన్నడూ చూడనంతగా నరకాన్ని చూస్తారు’ అంటూ హెచ్చరించారు. ఇదే సమయంలో ఇరాన్ను కూడా ట్రంప్ హెచ్చరించారు. హౌతీలకు మద్దతు తక్షణం ఆపాలని చెప్పారు.The White House released photos of Donald Trump watching U.S. military forces strike Houthi targets in Yemen earlier today. pic.twitter.com/AOyB6hxXI7— Republicans against Trump (@RpsAgainstTrump) March 15, 2025 Continued U.S. strikes against Houthi targets in Yemen. pic.twitter.com/dz1IqqLEuS https://t.co/PtCJG9YYJj— FUNKER530 (@FunkerActual) March 16, 2025 ఈ నేపథ్యంలో అమెరికా దాడులను హౌతీ పొలిటికల్ బ్యూరో తీవ్రంగా ఖండించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యుద్ధ నేరాలకు పాల్పడుతున్నారని ఆరోపించింది. ఈ దాడులకు సమాధానం చెప్పేందుకు యెమెన్ సాయుధ దళాలు సిద్ధంగా ఉన్నాయని హెచ్చరించింది. ఇక, 2023 అక్టోబర్లో ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమైన తర్వాత దాని తీరంలోని ఓడలపై హౌతీలు దాడులు ప్రారంభించారు. ఇది ప్రపంచ వాణిజ్యానికి ఆటంకంగా మారింది. 2023 నుంచి హౌతీలు 174 సార్లు అమెరికా యుద్ధ నౌకలపై, 145 సార్లు వాణిజ్య నౌకలపై దాడిచేసినట్టు సమాచారం. "To all Houthi terrorists, YOUR TIME IS UP..." –President Donald J. Trump pic.twitter.com/P4qwgyDs8c— President Donald J. Trump (@POTUS) March 15, 2025 -
26/11 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ హతం?
జీలం: పాకిస్తాన్లోని జీలం ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో.. 26/11 ముంబై దాడుల సూత్రధారి, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్(Lashkar-e-Taiba chief Hafiz Saeed) హతమయ్యాడని సమాచారం. అయితే హఫీజ్ సయీద్ మృతిని పాక్ అధికారులు ఇంకా నిర్ధారించలేదు. హతమైన వారిలో లష్కర్ ఉగ్రవాది అబూ కతల్ కూడా ఉన్నాడని తెలుస్తోంది. పాకిస్తాన్లోని జీలంలో గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరపగా, ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు నిర్ధారించారు. మృతుల్లో అబూ కతల్ కూడా ఉన్నాడని, అతను ఎల్ఇటి ఉగ్రవాది అని, అతను హఫీజ్ సయీద్ మేనల్లుడని అధికారులు తెలిపారు.భారతదేశ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితా(List of most wanted terrorists)లో హఫీజ్ సయీద్ కూడా ఉన్నాడు. 26/11 ముంబై దాడులకు హఫీజ్ సయీద్ ప్రధాన సూత్రధారి. అలాగే పుల్వామా దాడికి కూడా హఫీజ్ సయీద్ ప్రధాన సూత్రధారి. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థపై దాదాపు 10 మిలియన్ డాలర్ల బహుమతి ఉంది. ఉగ్రవాద నిధులకు సంబంధించిన కేసులో హఫీజ్ సయీద్ను జైలుకు తరలించారు. హఫీజ్ సయీద్ కాశ్మీర్లో ఉగ్రవాద గ్రూపులకు నిధులు సమకూరుస్తున్నాడు. హఫీజ్ సయీద్ను తమకు అప్పగించాలని భారత ప్రభుత్వం పాకిస్తాన్ను అభ్యర్థించింది.జమ్ముకశ్మీర్లో అనేక ఉగ్రవాద దాడులకు పాల్పడటమే కాకుండా, ముంబైలో జరిగిన 26/11 దాడుల కుట్ర హఫీజ్ సయీద్ పన్నినదే అని నిర్థారణ అయ్యింది. దాడులు జరిగిన సమయంలో అతను దాడి చేసిన వారితో టచ్లో ఉన్నాడని సమాచారం. ముంబైలో జరిగిన ఉగ్రదాడుల్లో 160 మందికి పైగా జనం మృతి చెందారు. భారతదేశంతో పాటు పలు దేశాలు హఫీజ్ సయీద్ను ఉగ్రవాదిగా ప్రకటించాయి. హఫీజ్ సయీద్తో పాటు అతని ఉగ్ర సంస్థపై అమెరికా రివార్డు ప్రకటించింది.ఇది కూడా చదవండి: Bihar: మళ్లీ పోలీసు బృందంపై.. ఐదుగురు కానిస్టేబుళ్లకు గాయాలు -
కెనడా కొత్త కేబినెట్లో ఇద్దరు భారతీయులు
ఒట్టావా: కెనడా నూతన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మార్క్ కార్నీ భారత సంతతికి చెందిన ఇద్దరు మహిళలను తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అనిత ఆనంద్, ఢిల్లీలో జన్మించిన కమల్ ఖేరాలు ఇకపై కెనడా మంత్రులుగా కొనసాగారు. కెనడా పార్లమెంట్కు ఎన్నికైన అతి పిన్న వయస్సులైన మహిళల్లో కమల్ ఖేరా సైతం ఉన్నారు. 58 ఏళ్ల అనితా ఆనంద్కు ఆవిష్కరణలు, శాస్త్ర, వాణిజ్య శాఖలకు మంత్రిగా బాధ్యతలు కట్టబెట్టారు. 36 ఏళ్ల కమల్ ఖేరాను ఆరోగ్య మంత్రిగా బాధ్యతలు అప్పగించారు.కాగా, ఢిల్లీలో పాఠశాల విద్యనభ్యసిస్తున్న కాలంలో కమల్ కుటుంబం కెనడాకు తరలిపోయారు. టొరంటోలో యార్క్ వర్సిటీలో కమల్ సైన్స్ డిగ్రీ సాధించారు. నర్సుగా, కమ్యూనిటీ వలంటీర్గా, రాజకీయ కార్యకర్తగా మొదలెట్టి చివరకు మంత్రిస్థాయికి కమల్ ఎదిగారు. నోవా స్కాటియాలో పుట్టిన అనిత 1985లో ఒంటారియోకు వలసవచ్చారు. లాయర్, పరిశోధకురాలు, అధ్యాపకురాలు అయిన అనిత 2019లో తొలిసారిగా ఎంపీ అయ్యారు. గతంలో ట్రెజరీ బోర్డ్ అధ్యక్షురాలిగా, రక్షణ మంత్రిగా, ప్రజాసేవలు, సేకరణ మంత్రిగా సేవలందించారు. Diversity in leadership! Indo-Canadian Anita Anand and Delhi-born Kamal Khera have joined Canadian Prime Minister Mark Carney's cabinet. It is a proud moment for representation and inclusion in Canadian politics. 🇨🇦 #Canada #Cabinet #AnitaAnand #KamalKhera #MarkCarney pic.twitter.com/PU3KOU0WaW— Dr. Prosenjit Nath (@prosenjitnth) March 15, 2025 -
పాపం ఉష.. ఇష్టం లేకున్నా నవ్వాల్సిందే!
వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన భార్య ఉషా చిలుకూరిని ఉద్దేశించి చేసిన సరదా వ్యాఖ్యలు కాస్తా గురి తప్పి బెడిసికొట్టాయి. మిషిగాన్లో ఒక కార్యక్రమానికి ఆయన భార్యాసమేతంగా హాజరయ్యారు. తన భార్య అమెరికా సెకండ్ లేడీగా గొప్పగా బాధ్యతలు నిర్వర్తిస్తోందంటూ పొగడ్తలు కురిపించారు. పనిలో పనిగా..‘అయితే ఒక్కటి మాత్రం నిజం. నేనెంత అర్థంపర్థం లేని మాటలు మాట్లాడినా ఆమె నవ్వాల్సిందే పాపం! ఎందుకంటే చుట్టూ కెమెరాలుంటాయి! నవ్వుతూ నాతో శ్రుతి కలపాలి. మరో దారి లేదు’ అంటూ చెణుకులు విసిరారు.అయితే, ఆయన కామెంట్లు విమర్శలకు దారితీశాయి. తనకు సెన్సాఫ్ హ్యూమర్ అస్సలు లేదని వాన్స్ మరోసారి నిరూపించుకున్నారంటూ నెటిజన్లు తప్పుబడుతున్నారు. చౌకబారు వ్యాఖ్యలతో భార్యను చీర్లీడర్గా చిత్రించారంటూ తూర్పారబడుతున్నారు. హాస్యం అనుకుని వాన్స్ చేసే కామెంట్లు ఎప్పుడూ ఇలాగే గురి తప్పుతూ ఉంటాయంటూ ఎద్దేవా చేశారు.Vance: Here's the thing. The cameras are all on; anything I say, no matter how crazy, she has to smile, laugh, and celebrate it. pic.twitter.com/KO36G1D7ju— Acyn (@Acyn) March 14, 2025ఇక, వాన్స్ ఈ వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు కూడా ఉష ఎప్పట్లాగే ఆయన వెనకాల నుంచుని నవ్వుతూ చూస్తుండిపోవడం విశేషం! గత ఉపాధ్యక్షునిగా వాన్స్ ప్రమాణస్వీకారం సందర్భంగా ఆయనకేసి ఉష ఆప్యాయంగా, గర్వంగా, చిరునవ్వుతో చూస్తున్న ఫొటోలు, వీడియోలు వైరల్ కావడం తెలిసిందే. తెలుగు మూలాలున్న ఉష 2014లో వాన్స్ను పెళ్లాడారు. వారికి ముగ్గురు పిల్లలు. వాన్స్ దంపతులు ఈ నెలాఖర్లో భారత్ రానున్నారు. సెకండ్ లేడీ హోదాలో ఉషకు ఇది తొలి భారత పర్యటన. Usha's gaze of pure admiration for her husband - her smile hasn't faded, and she's absolutely glowing! 💖 pic.twitter.com/kOW3xtyyte— 𝕍𝕚𝕠𝕝𝕒 𝕃𝕖𝕚𝕘𝕙 𝔹𝕝𝕦𝕖𝕤 (@ViolaLeighBlues) January 20, 2025 -
అమెరికాలో తుపాను బీభత్సం.. 17 మంది దుర్మరణం
ఓక్లహామా సిటీ (యూఎస్): అమెరికా(America)లో ప్రకృతి ప్రకోపించి 17 మంది ప్రాణాలను బలితీసుకుంది. కొన్ని రాష్ట్రాలు పెను తుపాను బారినపడితే మరికొన్ని చోట్ల టోర్నడోలు విజృంభించాయి. మరికొన్ని చోట్ల కార్చిచ్చు ఘటనలు స్థానికులను కకావికలం చేస్తున్నాయి. మిస్సోరీ రాష్ట్రంలో టోర్నడో కారణంగా 11 మంది చనిపోయారు. పలువురు గాయపడ్డారు. శుక్రవారం రాత్రి అర్కాన్సాస్లో ముగ్గురు, టెక్సాస్లో సిటీలో దుమ్ము తుపాను కారణంగా జరిగిన ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందారు.దేశవ్యాప్తంగా 16 కౌంటీలలో పలు ఇళ్లు, వ్యాపార సంస్థ నష్టం వాటిల్లిందని, విద్యుత్ లైన్లు దెబ్బతిన్నాయని, చెట్లు కూలిపోయాయని అర్కాన్సాస్ డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ(Arkansas Department of Public Safety) ఒక ప్రకటనలో తెలిపింది. టెక్సాస్ పాన్హ్యాండిల్లోని అమరిల్లో కౌంటీలో చోటు చేసుకున్న కారు ప్రమాదాల్లో ముగ్గురు మరణించారని అధికారులు తెలిపారు. మిస్సౌరీలోని బేకర్స్ఫీల్డ్ ప్రాంతంలో తుఫానుల కారణంగా ఇద్దరు మరణించారని, పలువురు గాయపడ్డారని మిస్సౌరీ స్టేట్ హైవే పెట్రోల్ తెలిపింది. ఈ నేపధ్యంలో స్థానికులు సురక్షిత ప్రాంతానికి తరలివెళ్లాలని అధికారులు సూచించారు.బేకర్స్ఫీల్డ్కు తూర్పున 177 మైళ్ల దూరంలోని ఒక ఇంటిని సుడిగాలి చుట్టుముట్టడంతో, ఒకరు మృతి చెందారని, మరో మహిళను రెస్క్యూ టీమ్ రక్షించిందని అధికారులు తెలిపారు. అర్కాన్సాస్లోని కేవ్ సిటీ ప్రాంతంలో టోర్నడో కారణంగా ఐదుగురు గాయపడ్డారని, ఈ నేపధ్యంలో అత్యవసర పరిస్థితి విధించినట్లు మేయర్ జోనాస్ ఆండర్సన్ తెలిపారు. ఇది కూడా చదవండి: హౌతీ తిరుగుబాటుదారులపై అమెరికా దాడి.. 9 మంది మృతి -
హౌతీ తిరుగుబాటుదారులపై అమెరికా దాడి.. 20 మంది మృతి
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఆదేశాల దరిమిలా యెమెన్ రాజధానిపై జరిగిన దాడుల్లో 20 మంది పౌరులు మృతిచెందారని ఇరాన్ మద్దతు కలిగిన హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. హౌతీ ఆరోగ్య, పర్యావరణ మంత్రిత్వ శాఖ కూడా ఒక ప్రకటనలో అమెరికా దాడుల్లో 20 మంది పౌరులు మరణించారని , మరో తొమ్మిది మంది గాయపడ్డారని, వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నదని తెలిపింది.యెమెన్లోని హౌతీ ఉగ్రవాదులపై శక్తివంతమైన సైనిక చర్యను ప్రారంభించాలని తాను అమెరికా సైన్యాన్ని ఆదేశించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రకటనలో తెలిపారు. హౌతీ ఉగ్రవాదులు(Houthi Rebels) అమెరికాతో పాటు ఇతర నౌకలు, విమానాలు, డ్రోన్లపై దాడులకు ప్రేరేపించే విధంగా నిరంతర ప్రచారాన్ని నిర్వహించారని ట్రంప్ పేర్కొన్నారు. కాగా తాము జిబౌటి ఓడరేవు నుండి బయలుదేరిన మూడు అమెరికన్ సైనిక సరఫరా నౌకలను లక్ష్యంగా చేసుకున్నట్లు యెమెన్ హౌతీ గ్రూప్ పేర్కొంది. హౌతీ సైనిక ప్రతినిధి యాహ్యా సరియా మాట్లాడుతూ రెండు అమెరికన్ డిస్ట్రాయర్లను కూడా తాము లక్ష్యంగా చేసుకున్నామని అన్నారు. మరోవైపు యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారులకు టెహ్రాన్ ఆర్థిక వనరులు, ఆయుధ మద్దతు, సైనిక శిక్షణను అందిస్తోందనే అమెరికా ఆరోపణను ఐక్యరాజ్యసమితికి ఇరాన్ శాశ్వత మిషన్ తోసిపుచ్చింది.ఇది కూడా చదవండి: Vadodara: ‘తాగలేదు.. గుంతల వల్లే కారు అదుపు తప్పింది’ -
214 మందిని చంపేశాం
ఇస్లామాబాద్: తాము హైజాక్ చేసిన జాఫర్ ఎక్స్ప్రెస్లోని 214 మందిని చంపేశామని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) మిలిటెంట్లు ప్రకటించారు. మృతుల్లో పాకిస్తాన్ సైనికులతోపాటు సాధారణ ప్రయాణికులు ఉన్నట్లు వెల్లడించారు. పాక్ జైళ్లలో ఖైదీలుగా ఉన్న తమ సహచరులను విడుదల చేయాలంటూ ప్రభుత్వానికి ఇచ్చిన 48 గంటల గడువు శుక్రవారంతో ముగిసినట్లు పేర్కొ న్నారు. వారి విడుదల విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాకపోవడంతో తమ వద్ద బందీలుగా ఉన్న 214 మందిని అంతం చేసినట్లు తెలియజేశారు. అయితే, దీనికి వారు ఎలాంటి ఆధారాలు చూపలేదు.క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ రైలును బీఎల్ఏ మిలిటెంట్లు మంగళవారం హైజాక్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో రైలులో 440 మంది ప్రయాణికులు ఉన్నారు. మిలిటెంట్ల దాడిలో 21 మంది పౌరులు, నలుగురు సైనికులు మరణించినట్లు తొలుత వార్తలొచ్చాయి. రైలును హైజాక్ చేసిన మిలిటెంట్లందరినీ హతమార్చి ప్రయాణికులను విడుదల చేసినట్టు పాక్ సైన్యం వెల్లడించింది. అయితే, సైన్యం ప్రకటనను మిలిటెంట్లు కొట్టిపారేశారు. కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయని స్పష్టంచేశారు. మరోవైపు పాకిస్తాన్ సైనిక ప్రతినిధి అహ్మద్ షరీఫ్ చౌదరి స్పందిస్తూ... 33 మంది మిలిటెంట్లను అంతం చేశామని, 354 మంది ప్రయాణికులను రక్షించామని చెప్పారు. మిలిటెంట్ల దాడిలో 23 మంది సైనికులు, ముగ్గురు రైల్వే ఉద్యోగులు, ఐదుగురు ప్రయాణికులు.. మొత్తం 31 మంది మృతిచెందారని వివరించారు. -
ప్రాణం పోయినంత పనైంది
డెన్వర్: ఏదైనా ఒక విమాన ప్రమాదం నుంచి కాస్తంతలో తప్పించుకోగానే అందులోని ప్రయాణికుల ప్రాణాలు లేచొస్తాయి. హమ్మయ్య అనుకుని ఊపిరి పీల్చుకున్న కొద్దిసేపటికే మళ్లీ అదే విమానం మరో రకమైన ప్రమాదంలో పడితే ఆ ప్రయాణికుల భయాందోళనలు వర్ణనాతీతం. శుక్రవారం అమెరికాలోని డెన్వర్ ఎయిర్పోర్ట్లో అత్యవసరంగా ల్యాండ్ అ య్యాక మంటలు చెలరేగిన విమానంలోని ప్రయాణికుల పరిస్థితి దాదాపు అలాగే ఉంది.స్వల్పగాయాలతో బయపడిన ప్రయాణికులు ఎట్టకేలకు బతుకుజీవుడా అంటూ విమానం రెక్క పైనుంచి, అత్యవసర ఎస్కేప్ స్లైడ్ నుంచి బయటపడ్డారు. కొలర్యాడో స్పింగ్స్ నుంచి టెక్సాస్లోని డల్లాస్ ఫోర్ట్వర్త్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తున్న విమానం ఒక్కసారిగా కుదుపులకు లోనవడం, అత్యవసరంగా డెన్వర్ ఎయిర్పోర్ట్లో దిగడం తెల్సిందే. మంటల్లో చిక్కుకున్న విమానం నుంచి సురక్షితంగా బయటపడిన మైఖేల్ ఉడ్స్ అనే మహిళ ప్రమాద ఘటనను గుర్తుచేసుకున్నారు.‘‘కొలర్యాడో స్పింగ్స్ నుంచి బయల్దేరినప్పడు అంతా బాగానే ఉంది. కానీ మార్గమధ్యంలో విమాన ఇంజన్లలో ఒకదాని నుంచి ఒక్కసారిగా భారీ శబ్దం వినిపించింది. దాని తర్వాత విమానం అటూ ఇటూ ఊగడం మొదలైంది. మా పని అయిపోయిందనుకున్నాం. కానీ విమానాన్ని వెంటనే డెన్వర్కు తీసుకొచ్చి సురక్షితంగా ల్యాండ్ చేయడంతో హమ్మయ్య అనుకున్నా. హాయిగా ఊపిరిపీల్చుకునేలోపే విమానం క్యాబిన్లో దట్టమైన పొగకమ్ముకోవడం మొదలైంది.తర్వాత మంటలు వ్యాపించాయి’’అని ఆమె చెప్పారు. ‘‘విమా నం ఆగగానే కదిలే మెట్లను తీసుకురాలేదు. ఆలోపు బయటకు వెళ్లేందుకు మార్గంలేక చివరకు విమానం రెక్క మీదకు వచ్చేశాం. రెక్క నుంచి ఎలా దిగాలో, ఎలా బయటపడాలో ఎవరికీ అర్థంకాలేదు. అందు కే అందరం అలా నిల్చుని హాహాకారాలు చేశాం. ఈలోపు సాయం చేయడానికి ఎయిర్పోర్ట్ సిబ్బంది ఎవరూ ముందుకురాలేదు. ఈలోపు నా భర్త, కుమార్తె ఏమయ్యారో తెలియలేదు. భయంతో వణికిపోయా.కుదురుగా ఒక్కచోట రెక్కపై నిలబడలేకపోయా’’అని ఇన్గ్రిడ్ హిబిట్ అనే మహిళ తెలిపింది. ‘‘అంతా సర్దుకుంటుందిలే అని మనసులో చెప్పుకున్నాగానీ మాకేమైపోతుందోనన్న భయం మరింత పెరిగింది. ఒక పది నిమిషాల తర్వాత ఎయిర్పోర్ట్ సిబ్బంది వచ్చి సహాయకచర్యలు హుటాహుటిన మొదలెట్టారు. కానీ ఆ ఒక్క పది నిమిషాలే పది యుగాలుగా గడిచాయి. స్వల్ప గాయాలు మినహా అందరూ క్షేమంతా బయటపడటం నిజంగా అద్భుతంలా అనిపించింది’’అని ఆమె అన్నారు. ‘‘కుదుపులకు లోనైన కొద్దిసేపటి తర్వాత విమానం ల్యాండ్ అయిందికాబట్టి సరిపోయింది. ఒకవేళ ల్యాండ్ చేయకుంటే అలాగే వెళ్లిఉంటే మార్గమధ్యంలో ఆకాశంలో మంటలు చెలరేగి మేమంతా ఏమయ్యేవాళ్లమో’’అని ఆమె భయందోళనలు వ్యక్తంచేశారు. -
ఈ బస్సుకు డ్రైవర్ లేడు!
బార్సిలోనా: స్పెయిన్లోని బార్సిలోనా నగర వీధుల్లో ఒక కొత్త బస్సు సందడిచేస్తోంది. అందులో ఎక్కే ప్రయాణికుల నుంచి ఒక వారంరోజులపాటు ఎలాంటి రుసుము వసూలుచేయట్లేరు. ఈ బస్సుకు ప్రత్యేకత ఉంది. అదేంటంటే బస్సుకు డ్రైవర్ అంటూ ఎవరూ ఉండరు. ఈ డ్రైవర్లెస్ విద్యుత్ బస్సు ఇప్పుడు బార్సిలోనా సిటీ వీధుల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డ్రైవర్లేకున్నా ధైర్యంచేసి బస్సులో దూరిపోయే ప్రయాణికులూ ఎక్కువైపోయారు. గంటకు 40కిలోమీటర్ల వేగంతో ఈ బస్సు దూసుకుపోతుంది. ఒక్కసారి చార్జ్చేస్తే 120 కిలోమీటర్లదాకా ప్రయాణించవచ్చు. చుట్టూతా 10 అత్యాధునిక కెమెరాలు, సెన్సార్లతో పనిచేసే ఎనిమిది లిడార్లను అమర్చారు. అతి చిన్న రూట్ సుదూరాలకు ప్రయాణించకుండా తొలి దఫాలో ఈ మినీ బస్సును కేవలం 2.2 కిలోమీటర్ల వృత్తాకార పరిధిలోనే తిప్పుతున్నారు. ప్రయాణంలో ఇది మొత్తం నాలుగు చోట్ల మాత్రమే ఆగుతుంది. స్వయంచాలిత వాహనాల తయారీలో ప్రత్యేకత సాధించిన వీరైడ్ అనే సంస్థతో ఫ్రెంచ్ కార్ల తయారీ దిగ్గజ సంస్థ రెనాల్ట్ చేతులు కలిపి ఈ అధునాతన బస్సును రూపొందించింది. తొలిసారిగా ఈ బస్సు నమూనాను గత ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ కార్యక్రమంలో ఆవిష్కరించారు. ఇప్పుడు బస్సు బార్సిలోనా నగర వీధుల్లో సేవలందిస్తోంది.ఇలాంటి ప్రయోగ ప్రాజెక్టులను ఫ్రాన్స్లోని వాలెన్స్ సిటీ, జ్యురిచ్ ఎయిర్పోర్ట్లోనూ ప్రారంభించారు. ‘‘సాధారణ ఇంజన్తో నడిచే బస్సును ఎక్కి బోర్ కొట్టింది. అందుకే ఈ రోజు డ్రైవర్లెస్ బస్సెక్కా’’అని 18 ఏళ్ల పావూ కగాట్ చెప్పారు. ‘‘శాన్ఫ్రాన్సిస్కో మొదలు టోక్యో దాకా ఇప్పటికే పలు నగరాల్లో డ్రైవర్లెస్ బస్సును పరీక్షించినా యూరప్లో మాత్రం వీటి సందడి ఇంకా మొదలుకాలేదు. అందుకే ఈ పంథాను ఇక్కడ మేం మొదలెట్టాం’’అని రేనాల్ట్ అటానమస్ మొబిలిటీ ప్రాజెక్ట్స్ హెడ్ ప్యాట్రిక్ వర్గిలాస్ చెప్పారు.బస్సు సిగ్నళ్ల వద్ద ఆగుతూ, పాదచారులు రోడ్డు దాటేటప్పుడు ఆగి వెళ్తూ ట్రాఫిక్ నిబంధనలనూ చక్కగా అనుసరిస్తోంది. ఇప్పటిదాకా ఎలాంటి రోడ్డు ప్రమాదాలకు ఇది కారణం కాలేదని బార్సిలోనా సిటీ అధికారులు చెప్పారు. ఇప్పుడీ బస్సులో ఎక్కిన వాళ్లు లోపల కూర్చొని, బయట నిలబడి సెల్ఫీలు దిగుతూ తెగ షేర్లు చేసుకుంటున్నారు. దీంతో బుల్లి బస్సుకు భలే గిరాకీ ఉందే అని కొందరు నెటిజన్లు వ్యాఖ్యానాలు చేశారు. -
ట్రంప్ ప్రతిపాదనతో ఆటలొద్దు
లండన్: ఉక్రెయిన్– రష్యా మధ్య శాంతి కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన ఒప్పందంతో ఆటలాడొద్దని రష్యా అధినేత పుతిన్ను యునైటెడ్ కింగ్డమ్(యూకే) ప్రధానమంత్రి కియర్ స్టార్మర్ హెచ్చరించారు. పుతిన్ నిజంగా శాంతిని కోరుకుంటే అది చాలా సులభంగా సాధ్యమవుతుందని అన్నారు. కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాలని, ఉక్రెయిన్పై వెంటనే దాడులు నిలిపివేయాలని చెప్పారు. శాంతి ప్రయత్నాలకు విఘాతం కలిగించాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని తేల్చిచెప్పారు. 30 రోజులపాటు కాల్పుల విరమణ పాటించాలంటూ డొనాల్డ్ ట్రంప్ చేసిన చక్కటి ప్రతిపాదనకు రష్యా ప్రభుత్వం అడ్డుపుల్లలు వేస్తోందని మండిపడ్డారు. శాంతియుత పరిస్థితులు నెలకొనడం పుతిన్కు ఇష్టం లేదా? అని ప్రశ్నించారు. ఇలాగే మొండిగా వ్యవహరిస్తే రష్యాపై ఆర్థిక ఆంక్షలు తీవ్రతరం చేస్తామని, అప్పుడు మరో గత్యంతరం లేక ఉక్రెయిన్పై యుద్ధాన్ని ముగించక తప్పదని వెల్లడించారు. ఉక్రెయిన్తో చర్చలకు పుతిన్ సిద్ధమైతే, రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం సజావుగా కొనసాగేలా తాము బాధ్యత తీసుకుంటామని స్టార్మర్ తెలిపారు.ఆయన శనివారం యూరప్తోపాటు మిత్రదేశాల అధినేతలతో వర్చువల్గా సమావేశమయ్యారు. ఈ భేటీలో 25 దేశాల నేతలు పాల్గొన్నారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధం, తాజా పరిణామాలపై, పుతిన్ వైఖరిపై చర్చించారు. రెండు దేశాల మధ్య శాశ్వతంగా శాంతి నెలకొనాలని ఈయూ, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్ తదితర దేశాలన్నీ కోరుకుంటున్నట్లు స్టార్మర్ తెలిపారు. రష్యా మెడలు వంచడానికి అవసరమైతే సైన్యాన్ని సైతం రంగంలోకి దించడానికైనా సిద్ధమేనని సంకేతాలిచ్చారు. ప్రాక్టికల్ ప్లానింగ్తో ‘ఆచరణ దశ’ప్రారంభించేలా ముందుకు సాగుతున్నామని ఉద్ఘాటించారు.వర్చువల్ సమావేశంలో ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీ పాల్గొన్నారు. ఉక్రెయిన్–రష్యా మధ్య కాల్పుల విరమణ ప్రక్రియ ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉండగా, రష్యా మొండి వైఖరితో ఆగిపోయిందని జెలెన్స్కీ విమర్శించారు. కాల్పుల విరమణను అడ్డుకోవడానికి రష్యా కుట్రలు సాగిస్తోందని ఆరోపించారు. ఇదిలా ఉండగా, శాంతి కోసం మరింత చొరవ తీసుకోవాలని యూరప్ దేశాలు నిర్ణయానికొచ్చాయి. కాల్పుల విరమణకు అంగీకరించేలా పుతిన్పై ఒత్తిడి పెంచడమే లక్ష్యంగా ఏం చేయాలన్న దానిపై చర్చించడానికి యూరప్ దేశాల మిలిటరీ ప్లానింగ్ సమావేశం వచ్చేవారం జరగబోతోంది. -
సునీత వచ్చేస్తోంది!
కేప్ కెనావెరాల్: సుదీర్ఘ నిరీక్షణకు తెరపడే సమయం వచ్చేసింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో తొమ్మిది నెలలుగా చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ఎట్టకేలకు భూమికి తిరిగి రానున్నారు. వారిని వెనక్కు తీసుకురావడానికి స్పేస్ఎక్స్ సంస్థ ‘నాసా’ సహకారంతో క్రూ–10 మిషన్ ప్రారంభించింది. అమెరికాలోని కెనెడీ స్పేస్ సెంటర్ నుంచి స్థానిక కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున ఫాల్కన్–9 రాకెట్ ద్వారా డ్రాగన్ స్పేస్క్రాఫ్ట్ను అంతరిక్షంలోకి పంపింది.ఇందులో నలుగురు వ్యోమగాములు అన్నె మెక్క్లెయిన్, నికోల్ అయేర్స్ (అమెరికా), తుకుయా ఒనిషీ (జపాన్), కిరిల్ పెస్కోవ్ (రష్యా)లున్నారు. వారు ఆర్నెల్లపాటు ఐఎస్ఎస్లోనే ఉంటారు. గత సెప్టెంబర్లో స్పేస్ఎక్స్ వ్యోమనౌకలో ఐఎస్ఎస్కు వెళ్లిన ఇద్దరు వ్యోమగాములతో కలిసి సునీత, విల్మోర్ తిరిగొస్తారు. వాతావరణం అనుకూలిస్తే ఆ నలుగురూ వారం రోజుల్లో తిరిగొచ్చే అవకాశం ఉంది. వారు అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో దిగుతారు. వారం అనుకుంటే... బోయింగ్ సంస్థ అభివృద్ధి చేసిన స్టార్లైనర్ స్పేస్క్రాఫ్ట్ తొలి మానవసహిత అంతరిక్ష ప్రయోగంలో భాగంగా 2024 జూన్ 5న సునీత, విల్మోర్ ఐఎస్ఎస్కు చేరుకున్నారు. షెడ్యూల్ ప్రకారం ఎనిమిది రోజుల్లో వెనక్కి రావాలి. కానీ స్టార్లైనర్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అది వీలవలేదు. స్పేష్షిప్ థ్రస్టర్లు విఫలమవడంతో పాటు హీలియం గ్యాస్ లీకవుతున్నట్లు గుర్తించారు. మరమ్మత్తులకు ప్రయత్నించినా లాభం లేకపోయింది.దాంట్లో వారిని వెనక్కు తీసుకురావడం ప్రాణాలకే ప్రమాదమని నిపుణులు హెచ్చరించడంతో స్టార్లైనర్ ఖాళీగానే తిరిగొచి్చంది. తర్వాత వారిని తీసుకొచ్చేందుకు పలుమార్లు ప్రయత్నించినా కుదర్లేదు. చివరికి ఇటీవలి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కూడా ఈ అంశం ప్రచారాస్త్రంగా మారింది. తాము అధికారంలోకి వస్తే సునీ త, విల్మోర్ను సాధ్యమైనంత త్వరగా రప్పిస్తా మని జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ ఇద్దరూ ప్రక టించారు.ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగానే దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. వారిని తీసుకొచ్చేందుకు స్సేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ సాయం కోరారు. మస్క్ చొరవ తో క్రూ–10 మిషన్ ప్రారంభమైంది. అంతా అనుకున్నట్లు జరిగితే వారం రోజుల్లో సునీత, విల్మోర్ మళ్లీ భూమిపై అడుగుపెడతారు. -
మూతిపై మైకు
వాషింగ్టన్: ఓ లేడీ రిపోర్టర్ అత్యుత్సాహం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఇబ్బందికర పరిస్థితి తెచ్చిపెట్టింది. శుక్రవారం వాషింగ్టన్ డీసీలో గాజాపై మీడియా ప్రశ్నలకు బదులిస్తుండగా ఒక రిపోర్టర్ తన మైక్ను ట్రంప్కు మరీ దగ్గరగా పెట్టేందుకు ప్రయత్నించింది. దాంతో అది కాస్తా అనుకోకుండా ఆయన మూతికి తాకింది. దాంతో అధ్యక్షుడు తీవ్ర అసహనానికి లోనయ్యారు. ఆమెకేసి ఆగ్రహంగా చూడటమే గాక ఇదేం పని అన్నట్టుగా కనుబోమ్మలు ఎగరేశారు.‘ఏం చేశావ్ నువ్వు!’ అంటూ నిలదీశారు. తర్వాత మీడియా ప్రశ్నలకు బదులిస్తూ, ‘ఈ రాత్రి ఆమె టీవీ షోగా, బిగ్ స్టోరీగా మారిపోయింది’ అంటూ తనదైన శైలిలో స్పందించారు. ఈ ఉదంతంపై నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు. వారి జోకులు, కామెంట్లతో ఇంటర్నెట్ హోరెత్తిపోతోంది. ‘‘ఇందులోనూ కుట్ర కోణముందేమో! మైక్కు ప్రాణాంతక ఆంత్రాక్స్ పొడి, ఫెంటానిల్ డ్రగ్ వంటివేమైనా రుద్దారేమో. ఏమైనా దీన్నంత తేలిగ్గా తీసుకోరాదు’’ అని ఒక ఎక్స్ యూజర్ చెణుకు విసిరాడు.‘ట్రంప్ గనుక మరికొన్ని గంటల్లో అనుమానాస్పదంగా మరణిస్తే అందుకు ఆ లేడీ రిపోర్టరే కారకురాలు’ అని మరొకరు, ‘‘మైక్పై విషం పూసి ఉండొచ్చు. కాస్త అతిగా అనిపించినా సరే, దీనిపై లోతైన విచారణ జరగాల్సిందే’’ అని ఇంకొకరు రాసుకొచ్చారు. ఇది క్షమించరాని భద్రతా లోపమంటూ ట్రంప్ మద్దతుదారులు ఆగ్రహిస్తున్నారు. రిపోర్టరైనా సరే, మైక్తో అంత దగ్గరికి ఎలా రానిస్తారని ప్రశ్నిస్తున్నారు. -
దేశ విభజనలో రైల్వే పంపకాలు.. నాడు భారత్-పాక్లకు ఏమి దక్కాయి?
పొరుగుదేశం పాకిస్తాన్లో జాఫర్ ఎక్స్ప్రెస్(Jaffer Express) హైజాక్ ఘటన ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసింది. ఈ నేపద్యంలో భారత్-పాకిస్తాన్ మధ్య రైల్వే సంబంధాలపై చర్చ జరుగుతోంది. దేశవిభజన జరిగాక రైల్వే విషయంలో ఏం జరిగింది? ఆ సమయంలో భారత్, పాక్లకు ఏమేమి దక్కాయనే అంశంపై పలువురు ఆసక్తి చూపిస్తున్నారు.1947లో భారత్కు స్వాతంత్ర్యం సిద్ధించాక దేశం విభజనతో పాటు రైల్వేలను కూడా విభజించారు. నాడు మన దేశంలో రైల్వే నెట్వర్క్(Railway network) చాలా తక్కువగా ఉండేది. విభజన తర్వాత పాకిస్తాన్కు కొన్ని రైళ్లు, ఉద్యోగులు, కొంత నగదు అప్పజెప్పారు. భారతదేశంలో రైల్వేలను ప్రవేశపెట్టిన ఘనత బ్రిటిష్ వారికే దక్కుతుంది. భారతీయ రైల్వేలు 1845 మే 8న ప్రారంభమయ్యాయి. అయితే రైల్వే లైన్ వేసే పని 1848లో ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన ప్రణాళిక, భూసేకరణ తదితర పనులకు మూడేళ్లు పట్టాయి.1853లో బొంబాయి (ఇప్పుడు ముంబై)- థానే మధ్య దాదాపు 34 కి.మీ.ల మొదటి ట్రాక్ నిర్మించారు. ఈ ట్రాక్పై మొదటి రైలు 1853, ఏప్రిల్ 16న నడిచింది. 1947లో దేశ విభజన జరిగినప్పుడు 11 వేల కి.మీ.లకు పైగా పొడవైన రైల్వే లైన్ పాకిస్తాన్ వైపునకు వెళ్ళింది. దీని కారణంగా రైల్వే పెట్టుబడి మూలధనంలో దాదాపు రూ. 150 కోట్లు పాకిస్తాన్ వాటాలోకి వచ్చాయి. విభజన సమయంలో పాకిస్తాన్కు పలు రైళ్లు అప్పగించారు. రైల్వే డివిజన్ వర్క్షాప్(Railway Division Workshop) కూడా పాకిస్తాన్కు దక్కింది. అయితే రైల్వే వర్క్షాప్ను రెండు దేశాలు ఉపయోగించుకోవాలని నాడు నిర్ణయం తీసుకున్నారు.ఈ వర్క్షాప్ను రెండు దేశాలు చాలా కాలం పాటు ఉపయోగించుకున్నాయి. రైల్వే కార్మికులను కూడా రెండు దేశాల మధ్య విభజించారు. రైళ్లను నడపడం నుండి రైల్వేలను నిర్వహించడం వరకు ఇరు దేశాల మధ్య విభజన జరిగింది. దేశ విభజన సమయంలో, దాదాపు 1.26 లక్షల మంది రైల్వే కార్మికులు పాకిస్తాన్ నుండి భారతదేశానికి రావాలని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో భారతదేశంలోనే దాదాపు లక్ష మంది రైల్వే కార్మికులు పనిచేస్తున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన చాలా ఏళ్ల వరకూ కూడా రెండు దేశాల మధ్య ఒక రైలు నడిచింది. దాని పేరు సంఝౌతా ఎక్స్ప్రెస్. ఈ రైలు 1976 జూలై 22న ప్రారంభమైంది. దీనిని సిమ్లా ఒప్పందం కింద నడిపారు. ఈ రైలు నాడు పంజాబ్లోని అట్టారి నుండి పాకిస్తాన్లోని లాహోర్ వరకు నడిచేది. అయితే రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించిన నేపధ్యంలో 2019, ఫిబ్రవరి 28న ఈ రైలును రద్దు చేశారు.ఇది కూడా చదవండి: బలవంతంగా రంగులు పోస్తే.. వైరల్ వీడియోలు -
పాకిస్థాన్కు చావుదెబ్బ.. 214 మంది సైనికులు హతం
ఇస్లామాబాద్: పాకిస్థాన్లో జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ ఘటన సంచలనంగా మారింది. ఈ ఘటనలో 214 మంది పాక్ సైనికులను చంపేసినట్టు బలోచ్ తిరుగుబాటుదారులు తాజాగా ఓ ప్రకటనలో తెలిపారు. తమ డిమాండ్కు ప్రభుత్వ స్పందించని కారణంగానే తాము వారిని చంపేసినట్టు ప్రకటించారు.బలోచ్స్థాన్లో ప్రధాన వేర్పాటువాద సంస్థగా ఎదిగిన బీఎల్ఏ.. సామాన్య పౌరులు సహా భద్రతా దళాలు, చైనా జాతీయులు, బలోచిస్థాన్లో పనిచేస్తున్న ఇతర ప్రావిన్సుల వారిపై దాడులకు పాల్పడుతోంది. ఆ ప్రావిన్సులో 18 భారీ దాడులు చేసింది. ఇక, తాజాగా జరిగిన రైలు (Jaffar Express) ఘటన సంచలనంగా మారింది. ఈ హైజాక్పై తాజాగా బలోచ్ లబరేషన్ ఆర్మీ స్పందించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.ఈ సందర్బంగా బీఎల్ఏ..‘రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని విధించిన 48 గంటల గడువు ముగిసింది. ప్రభుత్వం స్పందించని కారణంగా జాఫర్ ఎక్స్ప్రెస్ నుంచి బందీలుగా అదుపులోకి తీసుకున్న 214 మంది సైనికులను చంపేశాం. జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ ఘటనలో మా ఆపరేషన్ ముగిసింది. ప్రభుత్వం మొండితనంగా వ్యవహరించిన కారణంగానే మా చేతులకు పని చెప్పాల్సిన అవసరం ఏర్పడింది అని చెప్పుకొచ్చారు. దీంతో, పాకిస్ఠాన్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.ఇదిలా ఉండగా.. పాకిస్థాన్లో 500 మంది ప్రయాణికులతో వెళుతున్న రైలు హైజాక్ (Train Hijack)కు గురైన ఘటనలో భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్లో భాగంగా బందీల్లో 80 మందిని సురక్షితంగా విడిపించాయి. వీరిలో 43 మంది పురుషులు, 26 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నారు. భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 33 మంది మిలిటెంట్లు చనిపోయినట్లు పాక్ ప్రభుత్వ అధికారులు తెలిపారు.Baloch rebels claim execution of 214 hostages, blame Pakistan's 'stubbornness'The Baloch Liberation Army (BLA) has claimed responsibility for executing 214 hostages, blaming Pakistan’s refusal to negotiate. The group details ‘Operation Darra-e-Bolan,’ accusing Pakistan of…— Elena (@helen44767171) March 14, 2025 -
అమెరికాలో రంజనీ శ్రీనివాసన్ వీసా రద్దు.. కారణం ఇదే..
వాషింగ్టన్: భారత్కు చెందిన రంజనీ శ్రీనివాసన్కు వీసా రద్దు కావడంతో ఆమె తనంతట తానుగా అమెరికాను వీడారు. పాలస్తీనాకు అనుకూలంగా నిరసనల చేసిందుకు అక్కడి అధికారులు.. ఆమె వీసాను రద్దు చేశారు. దీంతో, రంజనీ శ్రీనివాస్ స్వదేశానికి వచ్చేశారు. దీనికి సంబంధించిన వీడియోను హోంలాండ్ సెక్యూరిటీ శాఖ విడుదల చేసింది.భారత పౌరురాలు, కొలంబియా విశ్వవిద్యాలయ విద్యార్థిని రంజనీ శ్రీనివాసన్ వీసాను అమెరికా ప్రభుత్వం రద్దు చేసింది. కాగా, ఆమె పాలస్తీనాకు అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలపై వీసాను రద్దు చేసినట్టు ప్రభుత్వ యంత్రాంగం తెలిపింది. అయితే, రంజనీ శ్రీనివాసన్ హింసకు మద్దతు ఇచ్చారనేందుకు వారి వద్ద ఏ ఆధారాలు ఉన్నాయో అధికారులు మాత్రం చెప్పలేదు. ఇక, 2025 మార్చి 5న విదేశాంగ శాఖ ఆమె వీసాను రద్దు చేసినట్టు ప్రకటనలో ఉంది. ఈ క్రమంలో ఆమె అమెరికాను వీడుతున్న వీడియోను హోంలాండ్ సెక్యూరిటీ శాఖ విడుదల చేసింది. ఈ వీడియోలో లాగార్డియా విమానాశ్రయంలో ఆమె తన లగేజీతో వెళ్తున్నట్టు కనిపిస్తోంది.ఇదిలా ఉండగా.. గతేదాడి పాలస్తీనా-ఇజ్రాయెల్ దాడుల సందర్బంగా పాలస్తీనాకు అనుకూలంగా కొలంబియా యూనివర్సిటీలో నిరసనలు చేపట్టిన విదేశీయులపై ట్రంప్ సర్కార్ ఫోకస్ పెట్టింది. వారిని అమెరికా నుంచి బహిష్కరించాలని, వారిపై చర్యలు తీసుకునేందుకు ప్లాన్ చేస్తోందని అసోసియేటెడ్ ప్రెస్ వార్తా సంస్థ నివేదించింది. ఇందులో భాగంగానే పలువురు విద్యార్థుల వీసాలను రద్దు చేస్తున్నట్టు పేర్కొంది.NEW: Columbia rioter Ranjani Srinivasan self deported after her student visa was revoked pic.twitter.com/Fnneiko5qs— End Wokeness (@EndWokeness) March 14, 2025విశ్వవిద్యాలయంపై ఒత్తిడి..ట్రంప్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొలంబియా విశ్వవిద్యాలయం కష్టాలను ఎదుర్కొంటోంది. అమెరికా ప్రభుత్వం 400 మిలియన్ డాలర్ల ఫెడరల్ గ్రాంట్లు, ఒప్పందాలను రద్దు చేసింది. ఇందులో ఎక్కువ భాగం వైద్య పరిశోధనల కోసమే ఉంది. పాలస్తీనాకు సంబంధించిన నిరసనల సమయంలో ఇజ్రాయెల్ సైనిక చర్యలను విమర్శించిన విద్యార్థులు, అధ్యాపకులపై యూనివర్శిటీ కఠినంగా చర్యలు తీసుకోకపోవడానికి శిక్షగా ఈ ఒప్పందాలను రద్దుచేసింది. -
మస్క్పై వ్యతిరేకత.. టెస్లా షోరూంలపై కొనసాగుతున్న దాడులు
సలమ్: అమెరికాలో టెస్లా షోరూంపై మళ్లీ దాడి జరిగింది. ఒరెగాన్లోని షోరూమ్పై గురువారం కొందరు దుండగులు కాల్పులకు దిగారు. ఈ దాడిలో షోరూం అద్దాలు ధ్వంసం కాగా.. పలు వాహనాలు సైతం దెబ్బ తిన్నాయి. అయితే అదృష్టం కొద్దీ ఎవరికీ హాని జరగలేదు. వారం వ్యవధిలో ఇదే షోరూమ్పై ఇలా దాడి జరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో ఇలాన్ మస్క్(Elon Musk) కీలకంగా మారిన సంగతి తెలిసిందే. ఎప్పుడైతే ఆయన డోజ్ ఓవెల్ ఆఫీస్లో అడుగుపెట్టారో.. అప్పటి నుంచి ఆయనపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. డోజ్(DOGE) చీఫ్ పేరిట ఫెడరల్ ఉద్యోగుల తొలింపు చర్యలతో ఆ వ్యతిరేకత పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలో ఆయన సీఈవోగా వ్యవహరిస్తున్న టెస్లా కంపెనీ లక్ష్యంగా వరుసగా దాడులు జరుగుతున్నాయి. మార్చి 6వ తేదీన ఒరెగాన్(Oregon) పోర్ట్లాండ్ సబర్బ్ అయిన టిగార్డ్లోని టెస్లా డీలర్షిప్పై కాల్పులు జరిగాయి. ఈ దాడిలో పలు ఈవీ వాహనాలు ధ్వంసం అయ్యాయి. కొలరాడో లవ్ల్యాండ్లోని షోరూమ్ను ఓ మహిళ ధ్వంసం చేసింది. ఆపై మస్క్ వ్యతిరేక రాతలు రాసి.. బొమ్మలు గీసిందిబోస్టన్లోని టెస్లా ఛార్జింగ్ స్టేషన్కు దుండగుల నిప్పుసియాటెల్లో టెస్లా వాహనాలకు మంట పెట్టిన ఆగంతకులువాషింగ్టన్ లీన్వుడ్లో టెస్లా సైబర్ ట్రక్కులపై స్వస్తిక్ గుర్తులతో పాటు మస్క్ వ్యతిరేక రాతలుమార్చి 13వ తేదీన.. ఒరెగాన్ టిగార్డ్ షోరూంపై మరోసారి కాల్పులు.. షోరూం ధ్వంసంవారం వ్యవధిలో రెండుసార్లు ఒరెగాన్ షోరూంపై దాడి జరిగింది. దీంతో ఎఫ్బీఐ, ఇతర దర్యాప్తు సంస్థల సమన్వయంతో పని చేస్తామని పోలీసులు ప్రకటించారు. మరోవైపు టెస్లాపై జరుగుతున్న దాడులను దేశీయ ఉగ్రవాదంగా(Domestic Terrorism) అభివర్ణించిన ట్రంప్.. ఘటనలపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపిస్తామని చెబుతున్నారు. ఇలాంటి చర్యలు ఓ గొప్ప కంపెనీకి తీరని నష్టం కలిగిస్తాయని.. అమెరికా ఆర్థిక వ్యవస్థకు మస్క్ కంపెనీలు అందిస్తున్న సేవలు మరిచిపోకూడదని ట్రంప్ చెబుతున్నారు.#ICYMI Two people were federally charged in separate incidents of attacks on Tesla dealerships in Colorado and Oregon.@ATFDenver @FBIDenver @PoliceLoveland investigating: https://t.co/HExwL3I3Z4@ATF_Seattle @FBISeattle @SalemPoliceDept investigating: https://t.co/YXkpdAhJQi pic.twitter.com/Ll7KD0af5k— ATF HQ (@ATFHQ) March 14, 2025 -
ఉక్రెయిన్ సేనలకు పుతిన్ హెచ్చరిక.. మీ ప్రాణాలకు గ్యారంటీ లేదంటూ..
మాస్కో: ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో కాల్పుల విరమణ ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్న వేళ అధ్యక్షుడు పుతిన్ హెచ్చరికలు జారీ చేశారు. కర్క్స్ ప్రాంతంలో ఉన్న ఉక్రెయిన్ సైనికులు లొంగిపోవడం మంచిది. లేకపోతే వారు ప్రాణాలతో ఉండరు అని వార్నింగ్ ఇచ్చారు. దీంతో, మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది.రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భాగంగా పశ్చిమ రష్యాలోని కర్క్స్లో కొంత భూభాగాన్ని ఉక్రెయిన్ సేనలు తమ అధీనంలోకి తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో పుతిన్ ఘాటుగా స్పందించారు. ఈ సందర్బంగా పుతిన్ తాజాగా మాట్లాడుతూ..‘కర్క్స్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న ఉక్రెయిన్ (Ukraine) సేనలు లొంగిపోతే వారు ప్రాణాలతో ఉంటారు. ఆయుధాలు విడిచిపెట్టి లొంగిపోతే వారి ప్రాణాలకు గ్యారెంటీ ఇవ్వగలను. లేదంటే పరిస్థితి మరోలా ఉంటుంది. రష్యా ఫెడరేషన్తో పాటు అంతర్జాతీయ చట్టాల ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటాం. మానవతా అంశాలను పరిగణనలోకి తీసుకోవాలన్న ట్రంప్ పిలుపు నాకు అర్థమైంది. ఆయన సూచన మేరకు ఓ విషయాన్ని వెల్లడిస్తున్నాను’ అంటూ కామెంట్స్ చేశారు. దీంతో, పుతిన్ వ్యాఖ్యలపై ఉక్రెయిన్ సేనల్లో టెన్షన్ మొదలైనట్టు తెలుస్తోంది.ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్ను కనికరించాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు తాను విజ్ఞప్తి చేశానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. యుద్ధంలో ఆ దేశ పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు. కీవ్ సేనలను అన్ని వైపుల నుంచి రష్యా దళాలు చుట్టుముట్టాయని తెలిపారు. అందుకే.. ఉక్రెయిన్ సైనికులపై కనికరం చూపాలని తాను పుతిన్కు విజ్ఞప్తి చేశానని చెప్పారు. లేకపోతే రెండో ప్రపంచయుద్ధం తర్వాత జరిగే అతి దారుణమైన ఊచకోతగా ఇది మిగిలిపోతుందని అన్నారు. కాల్పుల విరమణకు సంబంధించి రష్యా నుంచి మంచి సంకేతాలు వస్తున్నాయని, మాస్కోతో జరిపిన చర్చలు ఫలించే అవకాశం ఉందన్నారు. యుద్ధం త్వరలో ముగిసే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాల్పుల విరమణకు సూత్రప్రాయంగా అంగీకరిస్తున్నానని పుతిన్ చేసిన ప్రకటనపై ట్రంప్ సంతృప్తి వ్యక్తం చేశారు.⚡️ BREAKING: President Putin responded to President Trump regarding his appeal to spare Ukrainian soldiers in the Kursk region:“We have read today’s appeal from President Trump to spare the lives of servicemen of the Ukrainian Army in the Kursk region. In this regard, please… pic.twitter.com/RmmbqO1oS3— 🇷🇺Russia is not Enemy (@RussiaIsntEnemy) March 14, 2025 -
నింగిలోకి ఫాల్కన్.. వెల్కమ్ బ్యాక్ సునీతా విలియమ్స్!
వాషింగ్టన్: అంతరిక్షంలో చిక్కుపోయిన భారత సంతతి ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ను తీసుకొచ్చేందుకు ముందడుగు పడింది. ఆమెను అంతరిక్షం నుంచి తిరిగి భూమి పైకి తీసుకొచ్చేందుకు తాజాగా నాసా-స్పేస్ ఎక్స్లు క్రూ-10 మిషన్ను చేపట్టాయి. నలుగురు వ్యోమగాములతో కూడిన ఫాల్కన్ 9 (Falcon 9 Rocket) రాకెట్ భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం 4.33 గంటలకు కెన్నడీ స్పేస్సెంటర్ నుంచి నింగిలోకి తీసుకెళ్లింది. మూడోసారి రోదసీలోకి వెళ్లి అంతరిక్ష కేంద్రంలోనే చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita williams) త్వరలోనే భూమి మీద అడుగు పెట్టబోతున్నారు. 2024 జూన్లోలో ఆస్ట్రోనాట్స్ సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్, నిక్ హేగ్, అలెగ్జాండర్ గోర్బునోవ్ మిషన్ క్రూ-9 ప్రాజెక్ట్లో భాగంగా బోయింగ్ స్టార్లైనర్ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్లారు. నాసా షెడ్యూల్ ప్రకారం స్పేస్లో వీరి పర్యటన వారం రోజులు. కానీ.. వీరు వెళ్లిన బోయింగ్ స్టార్లైనర్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో నిక్ హేగ్, అలెగ్జాండర్ తిరిగి భూమిపైకి రాగా.. సునీత, బచ్ విల్మోర్ అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు. దీంతో, దాదాపు తొమ్మిది నెలలుగా సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ (Butch Wilmore) అంతరిక్ష కేంద్రం (ISS)లోనే ఉంటున్నారు. Have a great time in space, y'all!#Crew10 lifted off from @NASAKennedy at 7:03pm ET (2303 UTC) on Friday, March 14. pic.twitter.com/9Vf7VVeGev— NASA (@NASA) March 14, 2025ఈ క్రమంలో రెండోసారి అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టిన ట్రంప్.. స్పేస్లో చిక్కుకుపోయిన ఆస్ట్రోనాట్స్ సునీతా, విల్మోర్ను వెంటనే భూమిపైకి తీసుకురావాలని నాసా, ఎలన్ మస్క్ను ఆదేశించారు. ఈ నేపథ్యంలో వారిని భూమిపైకి తీసుకొచ్చేందుకు మూడు రోజుల క్రితం క్రూ-10 మిషన్ (Crew-10 mission)ను చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే, చివరి నిమిషంలో సాంకేతిక కారణాలతో ఆ ప్రయోగాన్ని నిలిపేశారు. తాజాగా వారిని తీసుకొచ్చేందుకు మళ్లీ ప్రయోగం చేపట్టారు. డ్రాగన్ క్యాప్సుల్లో ఐఎస్ఎస్కు వెళ్లిన వారిలో అన్నె మెక్లెయిన్, నికోల్ అయర్స్, టకుయా ఒనిషి, కిరిల్ పెస్కోవ్ వ్యోమగాములు ఉన్నారు. ఇక, మార్చి 19న విలియమ్స్ అంతరిక్షం నుంచి బయల్దేరనున్నారు. వీలైతే మరో వారం రోజుల్లో ఆమె భూమి మీదకు వచ్చే అవకాశం ఉంది. Crew-10 is go for launch! pic.twitter.com/xyQzIJ7Abf— SpaceX (@SpaceX) March 14, 2025 -
మన ఏడు రెస్టారెంట్లు ఆసియాలో బెస్ట్...
ఉత్తమ హోటళ్లు, బార్లు, రెస్టారెంట్లను గుర్తించడంలో ప్రసిద్ధి చెందిన సంస్థ ‘50 బెస్ట్’ఆవిష్కరించిన ఆసియా ఉత్తమ రెస్టారెంట్ల విస్తృత జాబితాలో ఏడు భారతీయ రెస్టారెంట్లకు చోటు దక్కింది. 51 నుంచి 100వ ర్యాంకు ఫలితాలను శుక్రవారం సంస్థ వెల్లడించింది. ఇందులో ముంబై, ఢిల్లీ, కసౌలి, బెంగళూరుకు చెందిన ఏడు ప్రసిద్ధ రెస్టారెంట్లు ఉన్నాయి. కసౌలీలోని నార్ 66వ ర్యాంకు, బెంగళూరులోని ఫామ్లోర్ 68, ముంబైలోని అమెరికానో 71, న్యూఢిల్లీలోని ఇంజా 87, ముంబైలోని ద టేబుల్ 88, న్యూఢిల్లీలోని దమ్ పుఖ్త్ 89, ముంబైలోని ద బాంబే క్యాంటీన్ 91వ ర్యాంకులను దక్కించుకున్నాయి. కాగా, టాప్ 50 రెస్టారెంట్లను మార్చి 25న సియోల్లో జరిగే అవార్డుల ప్రదానోత్సవంలో సంస్థ ప్రకటించనుంది. నార్, ఫామ్లోర్, ఇంజా ఈ జాబితాలో చోటు దక్కించుకోవడం ఇదే తొలిసారి. కాగా, నార్ కొత్తగా ప్రారంభించిన రెస్టారెంట్ కావడం గమనార్హం. కసౌలిలో చెఫ్ ప్రతీక్ సాధు నడుపుతున్న ఈ రెస్టారెంట్ హిమాలయాల దిగువన ఉంది. హిమాలయ ఆహార సంస్కృతికి అద్దంపడుతుంది. స్థానిక వంటకాలను ప్రోత్సహిస్తుంది. ఢిల్లీలోని ఇంజా రెస్టారెంట్ భారతీయ–జపనీస్ వంటకాలకు ప్రసిద్ధి. బెంగళూరులోని ఫామ్లోర్ వ్యవసాయ ఆధారిత వంటకాలకు ప్రసిద్ధి చెందింది. ఇది వ్యవసాయ క్షేత్రంలోనే నడిపిస్తుండటం గమనార్హం. బాంబే క్యాంటీన్, అమెరికానో, ది టేబుల్, దమ్ పుఖ్త్ గతంలోనూ ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ముంబైలోని కమలా మిల్స్లో ఉన్న బాంబే క్యాంటీన్ వైవిధ్యమైన భారతీయ వంటకాలకు ఆధునికతను జోడించి రుచి చూపిస్తుంది. అమెరికానో.. కాలానుగుణంగా వస్తున్న మార్పులను బట్టి సృజనాత్మక వంటకాలపై దృష్టి సారించే ఆధునిక యురోపియన్ బిస్ట్రో. ద టేబుల్ రెస్టారెంట్.. ‘ఫామ్ టు టేబుల్’ఫిలాసఫీతో నడిచే భారతదేశపు మొట్టమొదటి రెస్టారెంట్. ఇక్కడ మెనూ శాన్ఫ్రాన్సిస్కో శైలిలో ఉంటుంది. ఈ రెస్టారెంట్ టాప్ వంటల్లో.. టాగ్లిరిని పాస్తా, గుమ్మడికాయ స్పాగెట్టి, ఆస్పరాగస్ రిసోటో ఉన్నాయి. ఢిల్లీలో సుప్రసిద్ధ రెస్టారెంట్ దమ్ పుఖ్త్లో సాంప్రదాయ భారతీయ వంటకాలైన బిర్యానీ, కబాబ్ వంటివి దొరుకుతాయి. –న్యూఢిల్లీ -
కోడిగుడ్లు ఇస్తారా.. ప్లీజ్!
వాషింగ్టన్: అమెరికాలో కోడిగుడ్ల ధరల ఆకాశాన్నంటుతున్నాయి. నానాటికీ పెరిగిపోతున్నాయే తప్ప ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించడం లేదు. బర్ల్ఫ్లూ వల్ల కోళ్లు చాలావరకు చనిపోయాయి. దాంతో గుడ్ల కొరత తలెత్తింది. అమెరికా మార్కెట్లో గుడ్ల ధరలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గుడ్ల ధరలను నేలకు దించడానికి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విదేశాల నుంచి దిగుమతులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. తమకు తగినన్ని కోడిగుడ్లు సరఫరా చేయాలని డెన్మార్క్తోపాటు ఇతర యూరప్ దేశాలకు తాజాగా విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు అమెరికా వ్యవసాయ విభాగం ఆయా దేశాలకు లేఖలు రాసింది. ట్రంప్ ప్రభుత్వం ఒకవైపు యూరప్ దేశాల ఉత్పత్తులపై సుంకాలు విధిస్తూ, మరోవైపు గుడ్లు సరఫరా చేయాలని కోరుతుండడం గమనార్హం. యూరప్లో కూడా తగినంత గుడ్ల ఉత్పత్తి లేదని, అమెరికాకు ఇప్పట్లో భారీగా గుడ్లు ఎగుమతి చేయడం కష్టమేనని డెన్మార్క్ ఎగ్ అసోసియేషన్ వెల్లడించింది. ఇదిలా ఉంటే, డెన్మార్క్పై డొనాల్డ్ ట్రంప్ గుడ్లురుముతున్నారు. గ్రీన్లాండ్ను తమకు అప్పగించకపోతే డెన్మార్క్పై ఆర్థిక ఆంక్షలు విధిస్తామని ఇప్పటికే హెచ్చరించారు. అమెరికాలో గత ఏడాది డిసెంబర్ నుంచి గుడ్ల ధరలు క్రమంగా ఎగబాకుతున్నాయి. ఈ నెల 5వ తేదీన డజన్ గుడ్ల ధర 8.64 డాలర్లకు (రూ.751) చేరుకుంది. అంటే ఒక్కో గుడ్డు ధర 62 రూపాయలు. ఈ నెల 5 నుంచి గుడ్ల ధరలు తగ్గుతున్నట్లు అమెరికా వ్యవసాయ విభాగం వెల్లడించింది. ప్రస్తుతం డజన్ గుడ్ల ధర 4.90(రూ.425) డాలర్లుగా ఉన్నట్లు పేర్కొంది. -
ఉక్రెయిన్ సైనికులను దయతలచి వదిలేయండి
వాషింగ్టన్/మాస్కో: ‘‘పాపం ఉక్రెయిన్ సైనికులు! అత్యంత నిస్సహాయ స్థితిలో ఉన్నారు. వాళ్లను రష్యా సైన్యం అన్నివైపుల నుంచీ దిగ్బంధించింది. వారినింకా వేటాడితే సామూహిక హననానికి, రెండో ప్రపంచయుద్ధం తర్వాత అతి దారుణమైన రక్తపాతానికి దారితీస్తుంది. కనుక వాళ్లను చంపకండి. దయచేసి వదిలేయండి’’ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా విజ్ఞప్తులివి! ఈ విషయమై పుతిన్తో ఫోన్ చర్చలు జరిపినట్టు శుక్రవారం ఆయన ప్రకటించారు. ‘‘చర్చలు ఫలప్రదంగా సాగాయి. ఉక్రెయిన్ యుద్ధానికి, భయానక రక్తపాతానికి అతి త్వరలో తెర పడుతుందని ఆశిస్తున్నా’’ అని తన సొంత సోషల్ మీడియా హాండిల్ ట్రూత్లో చెప్పుకొచ్చారు. అమెరికా ప్రతిపాదించిన 30 రోజుల తాత్కాలిక కాల్పుల విరమణకు ఉక్రెయిన్ ఇప్పటికే అంగీకరించడం, పుతిన్ కూడా సూత్రప్రాయంగా సరేననడం తెలిసిందే. అయితే తాజాగా ఆయన స్వరం మార్చారు. కాల్పుల విరమణకు ముందు చర్చించుకుని తేల్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయని చెప్పుకొచ్చారు. ‘‘వాటిపై బహుశా అమెరికా, ఇతర భాగస్వామ్య పక్షాలతో చర్చిస్తాం. ట్రంప్కు కూడా కాల్చేసి మాట్లాడతా’’ అని ప్రకటించారు. దీనిపై ఉక్రెయిన్ మండిపడింది. కావాలనే శాంతిప్రక్రియకు మోకాలడ్డుతున్నారని ఆక్షేపించింది. -
యునెస్కో తాత్కాలిక జాబితాలోకి తెలంగాణలోని ముడమాల్ నిలువురాళ్లు
న్యూఢిల్లీ: తెలంగాణలోని నారాయణపేట జిల్లా ముడుమాల్లో ఉన్న నిలువురాళ్లకు యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా తాత్కాలిక జాబితాలో చోటు దక్కింది. వీటితోపాటు అశోకుని శాసన నిలయాలు, చౌసట్టీ యోగినీ దేవాలయాల వంటి ఆరు చారిత్రాత్మక కట్టడాలను జాబితాకు భారత్ నామినేట్ చేసింది. వీటిని మార్చి 7న తాత్కాలిక జాబితాలో చేర్చినట్లు యునెస్కోలోని భారత శాశ్వత ప్రతినిధి బృందం ఎక్స్లో తెలిపింది. ఒక ఆస్తిని ప్రపంచ వారసత్వ గుర్తింపు రావాలంటే.. వరల్డ్ హెరిటేజ్ సెంటర్ తాత్కాలిక జాబితాలో చేర్చాలి. ఈ ఏడాది భారత్ చేర్చిన జాబితాలో చత్తీస్గఢ్లోని కంగెర్ వ్యాలీ నేషనల్ పార్క్, తెలంగాణలోని ముడుమాల్ మెగాలితిక్ మెన్హిర్స్, పలు రాష్ట్రాల్లోని అశోకుడి శాసన స్థలాలు, మౌర్య రూట్స్, పలు రాష్ట్రాల్లోని చౌసత్ యోగిని దేవాలయాలు, ఉత్తర భారతంలోని గుప్తుల దేవాలయాలు, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్లలోని బుందేలాల రాజభవనాలు, కోటలు ఉన్నాయి. వీటితో భారత్ నుంచి యునెస్కో తాత్కాలిక జాబితాలో చోటు దక్కించుకున్న ప్రాంతాల సంఖ్య మొత్తం 62కు చేరింది. -
‘చిప్’ల కోసం ట్రంప్ స్కెచ్
వాషింగ్టన్/తైపీ: సెమీ కండక్టర్ల తయారీలో ద్వీపదేశమైన తైవాన్దే అగ్రస్థానం. ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్న సెమీ కండక్టర్లలో 90 శాతానికిపైగా తైవాన్లో తయారైనవే. సెల్ఫోన్ల నుంచి అత్యాధునిక డ్రోన్ల దాకా ప్రతి ఎల్రక్టానిక్ పరికరంలో ఈ చిప్లు ఉండాల్సిందే. చిప్ల రారాజుగా తైవాన్ తలపై ఉన్న కిరీటాన్ని తన్నుకుపోవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద స్కెచ్ వేశారు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సంస్థగా పేరున్న తైవాన్ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ(టీఎస్ఎంసీ)తో అమెరికాలో 100 బిలియన్ డాలర్ల (రూ.8.69 లక్షల కోట్లు) పెట్టుబడులు పెట్టిస్తున్నారు. ఈ మేరకు ఆ కంపెనీని ఒప్పించారు. గతవారం ఒప్పందం కూడా చేసుకున్నారు. ఈ నిధులతో టీఎస్ఎంసీ అమెరికాలో సెమీకండక్టర్ల తయారీ యూనిట్లు ఏర్పాటు చేయనుంది. అంటే సెమీకండక్టర్లు అమెరికాలోనే ఉత్పత్తి అవుతాయి. అక్కడి నుంచే విదేశాలకు చిప్ల ఎగుమతి జరుగుతుంది. ఆదాయం చాలావరకు అమెరికా ఖాతాలోకి వెళ్లిపోతుంది. చిప్ల ఉత్పత్తిలో తైవాన్ ప్రాధాన్యం తగ్గిపోతుంది. ఇదే ఇప్పుడు తైవాన్లో మంటలు రాజేస్తోంది. జాతీయ భద్రతా సంక్షోభం తైవాన్ అధికార డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టి(డీపీపీ)పై మాజీ అధ్యక్షుడు మా యింగ్–జియూ నిప్పులు చెరిగారు. చైనా బారి నుంచి తైవాన్ను కాపాడుతున్నందుకు ట్రంప్కు ‘ప్రొటెక్షన్ ఫీజు’ చెల్లిస్తున్నారని డీపీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. టీఎస్ఎంఎస్ను అమెరికాకు అమ్మేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామం జాతీయ భద్రతా సంక్షోభమేనని తేల్చిచెప్పారు. అమెరికాలో 8.69 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడాన్ని తప్పుపట్టారు. చిప్ల తయారీలో తైవాన్ స్థానాన్ని దిగజార్చడం తగదని అన్నారు. ట్రంప్తో కుదుర్చుకున్న ఒప్పందం తైవాన్ ప్రజల విశ్వాసాన్ని, ఇతర సంబంధాలను దెబ్బతీస్తుందని మా యీంగ్–జియూ ఆందోళన వ్యక్తంచేశారు. భవిష్యత్తులో భౌగోళిక రాజకీయాల్లో తైవాన్ హోదాను దిగజారుస్తుందని అన్నారు. అయితే, అమెరికాలో పెట్టుబడులపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని తైవాన్ అధ్యక్షుడు లా చింగ్–తే స్పష్టంచేశారు. టీఎస్ఎంసీ విస్తరణ కోసమే ఈ పెట్టుబడులు పెడుతున్నట్లు వెల్లడించారు. దేశ ప్రతిష్టకు వచ్చే ముప్పేమీ లేదని ప్రజలకు హామీ ఇచ్చారు. తైవాన్ను గాలికొదిలేస్తారా? తైవాన్పై పొరుగు దేశం చైనా ఎప్పటి నుంచో కన్నేసింది. తైవాన్ తమ దేశంలో అంతర్భాగమేనని, ఏనాటికైనా విలీనం కాక తప్పదని చైనా చెబుతోంది. మరోవైపు అమెరికా మద్దతుతోనే తైవాన్ స్వతంత్ర దేశంగా మనుగడ సాగిస్తోంది. గతంలో కుదిరిన ఒప్పందం ప్రకారం తైవాన్ రక్షణ బాధ్యతను అమెరికా స్వీకరించింది. ఇందుకోసం తైవాన్ రిలేషన్స్ యాక్ట్ తీసుకొచ్చారు. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తైవాన్ విషయంలో అమెరికా స్వరం మారింది. ప్రధానంగా తైవాన్కు జీవనాడిగా ఉన్న చిప్ల తయారీ రంగంపై ట్రంప్ దృష్టి పెట్టారు. అక్కడి పరిశ్రమను క్రమంగా అమెరికా తరలించాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. తమ దేశాన్ని పీల్చిపిప్పి చేసి, ఆఖరికి గాలికి వదిలేయాలన్నదే ట్రంప్ ప్లాన్ అని తైవాన్ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. తైవాన్ మరో ఉక్రెయిన్లా మారినా ఆశ్చర్యం లేదని అంటున్నాయి. అమెరికా–తైవాన్ సంబంధాల భవితవ్యంపై అనిశ్చితి నెలకొన్నట్లు తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది. ‘ఈ రోజు ఉక్రెయిన్, రేపు తైవాన్’ అనే మాట తైవాన్లో తరచుగా వినిపిస్తోంది. -
గ్రీన్ కార్డు శాశ్వత నివాసానికి... హక్కు కాదు: వాన్స్
వాషింగ్టన్/న్యూఢిల్లీ: అమెరికా వలస విధానంపై ఇప్పటికే ప్రపంచ దేశాల్లో నెలకొన్న ఆందోళనలను మరింతగా పెంచే పరిణామం చోటుచేసుకుంది. డాలర్ డ్రీమ్స్ను నిజం చేసుకోవడానికి రాచబాటగా భావించే అమెరికా గ్రీన్కార్డుపై ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రీన్కార్డు ఉన్నంతమాత్రాన అమెరికాలో నివాసానికి, పని చేయడానికి శాశ్వత హక్కులు దఖలు పడ్డట్టు కాదని స్పష్టం చేశారు. న్యూయార్క్లోని ప్రఖ్యాత కొలంబియా యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ విద్యార్థి మహ్మద్ ఖలీల్ యూదు విద్వేష ఆరోపణలపై ఇటీవలే అరెస్టవడం తెలిసిందే. అతను గ్రీన్కార్డు హోల్డరే కావడాన్ని ప్రస్తావిస్తూ వాన్స్ పలు వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇదేమీ వాక్ స్వాతంత్య్రానికి సంబంధించిన అంశం కాదు. జాతీయ భద్రతకు సంబంధించిన అతి కీలకమైన విషయం. అంతకుమించి, అమెరికాలో శాశ్వత నివాసులుగా మాతోపాటు ఎవరుండాలన్న దానికి సంబంధించిన అంశం. దీన్ని నిర్ణయించేది అమెరికన్లు మాత్రమే’’ అంటూ కుండబద్దలు కొట్టారు. ఆయన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా, ముఖ్యంగా భారత్లో దుమారం రేపుతున్నాయి. ఏటా భారీ సంఖ్యలో అమెరికా బాట పట్టే భారత విద్యార్థులందరికీ గ్రీన్కార్డు ఒక బంగారు కల. అది చిక్కిందంటే అమెరికాలో శాశ్వత నివాసం దక్కినట్టేనని భావిస్తారు. వాన్స్ వ్యాఖ్యలు వారినేగాక అమెరికాలో గ్రీన్కార్డు హోల్డర్లయిన లక్షలాది మంది భారతీయులను కూడా కలవరపాటుకు గురిచేస్తున్నాయి. గురువారం ఫాక్స్ న్యూస్ చానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందర్భంగా వలస విధానాలకు సంబంధించి వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘కొలంబియా వర్సిటీలో హమాస్ భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్న విద్యార్థి ఖలీల్ కూడా గ్రీన్కార్డు హోల్డరే. అందుకే చెబుతున్నా, గ్రీన్కార్డు హోల్డర్కు అమెరికాలో శాశ్వతంగా ఉండిపోయే హక్కు లేదు’’ అని స్పష్టం చేశారు. గ్రీన్కార్డు హోల్డర్లయినా సరే, అమెరికా భద్రతకు ముప్పు కలిగించే కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్టు అనుమానిస్తున్న విద్యార్థులు తదితరులపై కఠిన చర్యలకు ట్రంప్ సర్కారు సిద్ధమవుతోందని ఉపాధ్యక్షుడు ప్రకటించారు. ‘‘వారి ఉనికి అమెరికాకు ముప్పని తేలిన పలువురిని త్వరలో తిప్పి పంపుతున్నాం. ఈ జాబితాలో విద్యార్థులతో పాటు ఇతరులు కూడా ఉన్నారు’’ అని వివరించారు. ట్రంప్ రాకతో అమెరికాలోకి అక్రమ వలసలు 95 శాతానికి పైగా తగ్గిపోయాయన్నారు.ఏమిటీ గ్రీన్కార్డు? పర్మనెంట్ రెసిడెంట్ (శాశ్వస నివాస) కార్డు. గ్రీన్కార్డుగా భారత్లో దాదాపు ఇంటింటికీ పరిచయం. ఇది విదేశీ పౌరులకు అమెరికాలో నివసించేందుకు, పని చేసుకునేందుకు హక్కు కల్పిస్తుంది. అంతేగాక కోరుకున్న కంపెనీలో పని చేయవచ్చు. సొంత వ్యాపారం వంటివీ చేసుకోవచ్చు. గ్రీన్కార్డు పొందిన మూడు నుంచి ఐదేళ్లకు పౌరసత్వం కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే నిజానికిది పేరుకే శాశ్వత నివాస కార్డు. వాన్స్ చెప్పినట్టుగా అమెరికాలో శాశ్వతంగా ఉండేందుకు హక్కు కల్పించదు. దీన్ని పదేళ్ల కాలపరిమితితో జారీ చేస్తారు. కొన్ని పరిస్థితుల్లో గ్రీన్కార్డును రద్దు చేయవచ్చు. నేర కార్యకలాపాల్లో పాల్గొన్నా, చాలాకాలం పాటు అమెరికాకు దూరంగా ఉన్నా, వలస నిబంధనలను ఉల్లంఘించినా గ్రీన్కార్డును కోల్పోతారు. అమెరికాలో నివసిస్తున్న భారతీయులు దశాబ్దాలుగా గ్రీన్కార్డుల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. వారిలో చాలామందికి కార్డు దక్కాలంటే 50 ఏళ్ల దాకా పట్టొచ్చట. కొన్ని కేటగిరీల వాళ్లకైతే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి గ్రీన్కార్డు రావాలంటే 134 సంవత్సరాలు పడుతుంది! 3.4 కోట్ల మందికి పైగా గ్రీన్కార్డు కోసం ఎదురు చూస్తుండగా వారిలో 11 లక్షల మందికి పైగా భారతీయులే! వీరిలో 4 లక్షల మంది తమ జీవితకాలంలో కార్డును కళ్లజూడలేరన్నది ఇమిగ్రేషన్ నిపుణుల మాట. అమెరికా ఏటా గరిష్టంగా 6.75 లక్షల గ్రీన్కార్డులు మాత్రమే జారీ చేస్తుంది. వాటిలో ఏ దేశానికీ 7 శాతానికి మించి ఇవ్వరాదన్న నిబంధన ఉంది. ఇదే భారతీయులకు పెద్ద అడ్డంకిగా మారింది. ప్రస్తుతం అమెరికాలో గ్రీన్కార్డున్న భారతీయుల సంఖ్య 3 లక్షలకు పైగా ఉంటుంది. గోల్డ్ కార్డు రాకతో... అమెరికాలో శాశ్వత నివాసానికి ట్రంప్ ఇటీవల కొత్తగా గోల్డ్ కార్డు స్కీమును ప్రకటించిన నేపథ్యంలో గ్రీన్కార్డు ప్రాధాన్యతను తగ్గించేలా వాన్స్ చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘‘ఇప్పటిదాకా గ్రీన్కార్డుంది. ఇకపై గోల్డ్కార్డు తెస్తున్నాం. గ్రీన్కార్డు ఇచ్చే సదుపాయాలన్నింటినీ ఇదీ ఇస్తుంది. వాటితో అదనంగా అమెరికాలో శాశ్వత నివాసానికి, పౌరసత్వానికి కూడా గోల్డ్కార్డు రాచమార్గం’’ అని ట్రంప్ చెప్పు కొచ్చారు. అమెరికాలోని అత్యున్నత వర్సిటీల్లో చదివే ప్రతిభావంతులు, భారతీయ విద్యా ర్థులు దేశం దాటకుండా ఆపడంలో తమ వలస విధానం విఫలమైందని ఆయన ఆక్షేపించారు. గోల్డ్కార్డుకు 50 లక్షల డాలర్లు (రూ.43.54 కోట్లు) ఫీజుగా నిర్ణయించారు. ‘‘కనీసం కోటి గోల్డ్కార్డులు అమ్మాలన్నది మా లక్ష్యం. తద్వారా వచ్చే ఆదాయంతో అమెరికా అప్పు తీరుస్తాం’’ అని ట్రంప్ ప్రకటించారు. 1990 నుంచి అమల్లో ఉన్న ఈబీ–5 వీసాలను గోల్డకార్డు భర్తీ చేసింది. -
అమెరికాలోనూ నో ట్యాక్స్..! ట్రంప్ భారీ పన్ను ప్రణాళిక
భారత్లో మాదిరిగానే అమెరికాలోనూ ఆదాయపు పన్నుకు సంబంధించి భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. లక్షలాది మంది అమెరికన్లకు పన్ను మినహాయింపునిచ్చే భారీ పన్ను ప్రణాళికను అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ వెల్లడించారు. సంవత్సరానికి 150,000 డాలర్ల కంటే తక్కువ సంపాదించేవారికి ఫెడరల్ పన్నులను తొలగించే యోచనలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నారని సీబీఎస్ ఇంటర్వ్యూలో లుట్నిక్ చెప్పారు .'ట్రంప్ లక్ష్యం ఏమిటో నాకు తెలుసు. సంవత్సరానికి 150,000 డాలర్ల కంటే తక్కువ సంపాదించే ఎవరికైనా పన్ను ఉండకూడదు. అదే ఆయన (ట్రంప్) లక్ష్యం. దానికోసమే నేను పనిచేస్తున్నా' అని లుట్నిక్ తెలిపారు. లుట్నిక్ అక్కడితో ఆగలేదు. అమెరికన్ల పన్ను భారాలను మరింత తగ్గించే లక్ష్యంతో విస్తృత ఆలోచనలను తెరపైకి తెచ్చారు. పన్ను సంస్కరణలపై దూకుడు వైఖరి ఉంటుందని ఆయన సంకేతాలిచ్చారు.ట్రంప్ ప్రతిపాదన అమల్లోకి వస్తే ఏడాదికి 1,50,000 డాలర్లు అంటే సుమారు రూ.1.3 కోట్లు కంటే తక్కువ సంపాదించే వారికి పన్ను చెల్లించకుండా మినహాయింపు లభిస్తుంది. ఈ లక్ష్యాన్ని నిజం చేయడమే తన ప్రస్తుత లక్ష్యమని లుట్నిక్ స్పష్టం చేశారు. కెనడా, మెక్సికోలతో కొనసాగుతున్న సుంకాల యుద్ధాలతో సహా ట్రంప్ ఆర్థిక వ్యూహాన్ని సమర్థిస్తూ.. విధానాలు మాంద్యాన్ని ప్రేరేపించే ప్రమాదం ఉన్నప్పటికీ అవి అవసరమని లుట్నిక్ పేర్కొన్నారు.ఇక పన్ను కోతలతో ముడిపడిన పెరుగుతున్న లోటుల గురించి ఆందోళనలపై స్పందిస్తూ ప్రభుత్వ ఖర్చులు అమెరికన్లకు భారం కాకూడదన్నారు లుట్నిక్. విదేశీ సంస్థలు, విదేశీ పన్ను ఎగవేతదారులను ప్రస్తావిస్తూ 'ఇతర వ్యక్తులు' ఈ వ్యయాన్ని భరించాలి. అంతర్జాతీయ పన్ను లొసుగులను సరిదిద్దడం వల్ల దేశీయ పన్ను ఉపశమనం లభిస్తుందని ఆయన వివరించారు. మరోవైపు ట్రంప్ వివాదాస్పద 5 మిలియన్ డాలర్ల అమెరికా వీసా ప్రతిపాదనకు కూడా లుట్నిక్ మద్దతు తెలిపారు. ఇది అదనపు ఆదాయాన్ని సృష్టిస్తుందని పేర్కొన్నారు. -
ఇంజిన్ పేల్చేశారు.. ట్రైన్ కిటికీలు పగలగొట్టారు..!
న్యూఢిల్లీ: పాకిస్తాన్ లో జాఫర్ ఎక్స్ ప్రెస్ ను బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) హైజాక్ చేసిన సంగతి తెలిసిందే. వందల సంఖ్యలో ప్రయాణికులున్న ఆ ట్రైన్ ను హైజాక్ చేసిన 27 గంటల పాటు బందించి ఉంచారు. ఈ క్రమంలోనే వారు పలు డిమాండ్లు వినిపించారు పాక్ ప్రభుత్వానికి. అయితే పాక్ ప్రభుత్వం వారి డిమాండ్లను ఏ మేరకు నెరవేర్చిందో కానీ హైజాక్ చేసిన ట్రైన్ ను ఆఖరికి బీఎల్ఏ మిలిటెంట్లు విడిచిపెట్టారు.అయితే ఆ సమయంలో జాఫర్ ఎక్స్ ప్రెస్ కు డ్రైవర్ గా ఉన్న అంజాద్ తన చేదు జ్ఞాపకాలను ఒకసారి గుర్తు చేసుకున్నాడు. అదొక భయానక ఘటన అన్న అంజాద్.. ట్రైన్ ను ఎలా హైజాక్ చేశారనే సంగతిని స్పష్టం చేశాడు. ట్రైన్ ఇంజిన్ కింద, బోగీల కింద కొన్ని పేలుడు పదార్థాలు పెట్టి ట్రైన్ హైజాక్ చేశారన్నాడు. ట్రైన్ ఆగిన తర్వాత విండోలు పగలగొట్టి లోపలికి వచ్చిన మిలిటెంట్లు.. తాము చనిపోయి ఉంటామని భావించారన్నాడు. వందల సంఖ్యలో ప్రయాణికుల్ని చూసిన తర్వాత వారిని రెండు సెపరేట్ గ్రూపులుగా విభజించారని డ్రైవర్ అంజాద్ పేర్కొన్నాడు.హైజాకర్ల నుండి సురక్షితంగా బయటపడ్డ ఓ ప్రయాణికుడు అర్సలాన్ యూసఫ్.. మిలిటెంట్లు వ్యవహరించిన తీరును పేర్కొన్నాడు. అందులో ఉన్న సైనికుల్ని బంధించి తీసుకెళ్లి కొంతమందిని చంపేశారన్నాడు. కొన్ని సందర్భాల్లో కొంతమందిని వారు టార్గెట్ చేసి కాల్చి చంపారన్నాడు. ఎవరైనా వారికి వ్యతిరేకంగా మాట్లాడితే వారిని కాల్చి చంపడమే లక్ష్యంగా పెట్టుకున్నారన్నాడు.కాగా, మంగళవారం 440 మంది ప్రయాణిలకులతో క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ను బలూచిస్తాన్ మిలిటెంట్లు హైజాక్ చేశారు.33 మంది మిలిటెంట్లను అంతం చేశామని, 21 మంది ప్రయాణికులు, నలుగురు భద్రతా సిబ్బంది మరణించారని, మిగిలిన ప్రయాణికులను క్షేమంగా విడిపించామని పాక్ సైన్యం బుధవారం వెల్లడించింది. అయితే, పాక్ సైన్యం తప్పుడు ప్రచారంతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోందని బీఎల్ఏ ఆరోపించింది. యుద్ధ నియమాలు, అంతర్జాతీయ నిబంధనలు దృష్టిలో పెట్టుకొని.. రైలులో ఉన్న కొందరు సైనికులను తామే వదిలేశామని వెల్లడించింది. -
గ్రీన్కార్డులపై బాంబు పేల్చిన జేడీ వాన్స్.. అమెరికా పౌరసత్వం కట్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే అమెరికాలో అక్రమ వలసదారులను పంపించేశారు. ఇక, తాజాగా గ్రీన్కార్డుల(పౌరసత్వం) విషయమై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్(JD Vanse) కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రీన్కార్డు పొందినంత మాత్రాన వారికి అమెరికాలో ఎల్లకాలం ఉండిపోయే హక్కు లేదని బాంబు పేల్చారు. దీంతో, గ్రీన్కార్డు పొందిన వారికి టెన్షన్ మొదలైంది.అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. అమెరికా పౌరులుగా ఎవరిని గుర్తించాలో మాకు తెలుసు. గ్రీన్కార్డులు పొందినంత మాత్రన వారు జీవితాంతం అమెరికాలో ఉండలేరు. వారికి అలా జీవించే హక్కు లేదు. ఇది వాక్స్వేచ్ఛకు సంబంధించిన అంశం కాదు, జాతీయ భద్రతకు సంబంధించిన విషయం. అమెరికాలో నేరాలకు పాల్పడటం, సుదీర్ఘ కాలం దేశాన్ని వీడటం, ఇమిగ్రేషన్ నిబంధనలను పాటించకపోవడం వంటివి జరిగితే.. గ్రీన్కార్డును రద్దు చేయవచ్చు. దీనికి గురించి అమెరికా చట్టాలు చెబుతున్నాయి’ అంటూ కామెంట్స్ చేశారు. దీంతో, వాన్స్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకొన్నాయి.ఇక, ఇదే సమయంలో వ్యాపారులకు ఇచ్చే గోల్డ్ కార్డ్ గురించి కూడా ఆయన మాట్లాడారు. అమెరికా గోల్డ్ కార్డ్ పొందాలంటే విదేశీ పౌరులు 5 మిలియన్ల డాలర్లు(రూ.43 కోట్ల 46 లక్షలు) చెల్లించి అమెరికాలో నివసించే, పని చేసే హక్కును కల్పిస్తారని తెలిపారు. అమెరికా సమాజంలోకి ఎవరిని చేర్చుకోవాలో అమెరికన్లే నిర్ణయిస్తారని ఆయన స్పష్టం చేశారు.Vice President JD Vance on the arrest of Mahmoud Khalil:"A green card holder doesn't have an indefinite right to be in the United States. My attitude on this is this is not fundamentally about free speech." pic.twitter.com/48kfYb3brw— The American Conservative (@amconmag) March 14, 2025ఇక, ఇదే సమయంలో వ్యాపారులకు ఇచ్చే గోల్డ్ కార్డ్ గురించి కూడా ఆయన మాట్లాడారు. అమెరికా గోల్డ్ కార్డ్ పొందాలంటే విదేశీ పౌరులు 5 మిలియన్ల డాలర్లు(రూ.43 కోట్ల 46 లక్షలు) చెల్లించి అమెరికాలో నివసించే, పని చేసే హక్కును కల్పిస్తారని తెలిపారు. కాగా, అమెరికాలో అమల్లో ఉన్న ఈబీ-5 ఇమిగ్రెంట్ ఇన్వెస్టర్ వీసాను సరికొత్త గోల్డ్కార్డ్ భర్తీ చేయనుంది. ఇక అమెరికా వర్క్ వీసాలను అత్యధికంగా దక్కించుకొంటున్న దేశాల్లో భారత్ టాప్లో ఉంది. అక్టోబర్ 2022-సెప్టెంబర్ 2023 నాటికి జారీ చేసిన వర్క్ వీసాల్లో 72.3శాతం భారతీయులకే జారీ అయ్యాయి.మరోవైపు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఆ దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. జన్మతః పౌరసత్వం రద్దు చేస్తూ ఫెడరల్ కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులను ఆయన గురువారం (స్థానిక కాలమానం ప్రకారం) సవాల్ చేశారు. అత్యవసర పిటిషన్గా విచారణ చేట్టాలన్న అభ్యర్థనకు కోర్టు అంగీకరించింది. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తొలిరోజే(జనవరి 20వ తేదీన) విదేశీయులకు జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటిస్తూ ఉత్తర్వులపై సంతకం చేసిన సంగతి తెలిసిందే. -
New Zealand: హోలీ వేడుకల్లో న్యూజిలాండ్ ప్రధాని
భారతదేశంతో పాటు ప్రపంచంలోని పలు దేశాల్లో నేడు హోలీ వేడుకలు(Holi celebrations) జరుగుతున్నాయి. న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ హోలీ ఆడుతూ ఆనందిస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ వీడియోలో న్యూజిలాండ్ ప్రధాని ప్రజల మధ్య హోలీ ఆడుతున్న దృశ్యాన్ని చూడవచ్చు.ఈ వీడియోను న్యూజిలాండ్(New Zealand)లోని ఇస్కాన్ ఆలయం వద్ద చిత్రీకరించారు.ఇక్కడ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్(Christopher Luxon) సమక్షంలో హోలీ వేడుకలు జరిగాయి. ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు ఇస్కాన్ ఆలయానికి జనం తరలివచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని జనసమూహంపై రంగులు చల్లుతూ కనిపించారు. అలాగే అక్కడున్నవారంతా ఒకరిపై ఒకరు ఎంతో ఉత్సాహంగా రంగులు చల్లుకున్నారు. Prime Minister of New Zealand Christopher Luxon celebrating #Holi. pic.twitter.com/xjPbxPLeyT— The Gorilla (News & Updates) (@iGorilla19) March 12, 2025వేడుకలు జరుగుతున్న సమయంలో న్యూజిలాండ్ ప్రధాని మెడలో పూల దండ వేసుకున్నారు. అతని భుజంపైవున్న టవల్పై హ్యాపీ హోలీ అని రాసివుంది. కాగా హిందువులు ఎంతో వేడుకగా జరుపుకునే హోలీ, దీపావళి అంతర్జాతీయ పండుగలుగా పరిణమిస్తున్నాయి. అమెరికా, కెనడా, మారిషస్, ఫిజి, గయానా, నేపాల్, న్యూజిలాండ్ సహా ప్రపంచంలోని అన్ని దేశాలలో ఈ పండుగలను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు.ఇది కూడా చదవండి: Holi: మధుర.. కోల్కతా.. ఢిల్లీ.. అంతా రంగులమయం -
వేలంలోయువతి కన్యత్వం.. రూ.18 కోట్లకు కొనుగోలు చేసిన హీరో!
'పుర్రెకో బుద్ది.. జిహ్వకో రుచి' అన్నారు పెద్దలు. సమాజంలో కొందరిని చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తుంది. నలుగురు ఒకలా ఆలోచిస్తే.. వాళ్లు మరోలా ఆలోచిస్తారు. వారు చేసే పని, చెప్పే మాటలు వింటే..‘ఇలా కూడా ఉంటారా’ అని ఆశ్చర్యపోక తప్పుదు. తాజాగా 22 ఏళ్ల ఓ యువతి తీసుకున్న నిర్ణయం, ఆమె కోసం ఓ హీరో చేసిన ఖర్చు గురించి తెలిస్తే మీరు కూడా షాకవుతారు. డబ్బు కోసం ఓ యువతి ఏకంగా తన కన్యత్వాన్నే వేలానికి పెట్టింది. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. వేలంలో వందలాది మంది ధనవంతులు పోటీపడగా.. చివరకు ఓ హాలీవుడ్ హీరో రూ.18 కోట్లకు ఆమె కన్యత్వాన్ని దక్కించుకున్నాడు.వివరాల్లోకి వెళితే.. బ్రిటన్లోని మంచెస్టర్కు చెందిన 22 ఏళ్ల లారా.. ప్రముఖ ఎస్కార్ట్ ఏజెన్సీ సిండ్రెల్లా వెబ్ సైట్ ద్వారా తన కన్యత్వానికి వేలం నిర్వహించారు. ఈ విషయం తెలియడంతో ఎంతో మంది ఆమెను దక్కించుకునేందుకు పోటీ పడ్డారు. ప్రముఖ వ్యాపారవేత్తలు, సినీ సెలబ్రిటీలో బిడ్లు వేశారు. చివరకు లాస్ ఏంజిల్స్ కు చెందిన హాలీవుడ్ హీరో ఆమె కన్యత్వాన్ని సుమారు 1.7 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. ఇది మన ఇండియన్ కరెన్సీలో రూ.18 కోట్లకు సమానం.కన్యత్వాన్ని అమ్మకానికి పెట్టడంపై లారా స్పందిస్తూ ఈ విషయంలో తనకు ఎలాంటి ఆందోళన, బాధ లేదన్నారు. ‘చాలా మంది అమ్మాయిలు ఎలాంటి ప్రతిఫలం పొందకుండానే తమ కన్యత్వాన్ని కోల్పోతారు. కానీ నేను మాత్రం నా లైఫ్ సెటిల్ చేసుకోవడం కోసం నా కన్యత్వాన్ని వేలం పాట వేయాలని భావించాను. వచ్చిన డబ్బుతో తాను ఆర్థికంగా నిలదొక్కకుంటాను. ఇది పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయం’ అని చెప్పారు. -
రంగులు పులుముకున్న జాబిల్లి.. ఆకాశంలో ఈ సుందర దృశ్యం చూశారా?
ఆకాశంలో ఇవాళ సుందర దృశ్యం ఆవిష్కృతమైంది. ఈ ఏడాదిలో మొదటి గ్రహణం.. అందునా సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది. అరుదైన బ్లడ్ మూన్ ఘట్టం చోటు చేసుకోవడంతో ప్రపంచమంతా ఈ దృశ్యాన్ని చూసేందుకు తహతహలాడుతోంది. దాదాపు.. రెండేళ్ల తర్వాత ఏర్పడిన సంపూర్ణ చంద్రగ్రహణం ఇదే. భూమి.. సూర్యుడు.. చంద్రుడు ఒకే సరళ రేఖపైకి వచ్చినప్పుడు... భూమి నీడ చంద్రుడి మీద పడి పూర్తిగా కప్పేసినప్పుడు ఏర్పడేదే సంపూర్ణ చంద్రగ్రహణం. అయితే సుదీర్ఘ విరామం తర్వాత ‘బ్లడ్ మూన్’గా పిలిచే చంద్రగ్రహణం ఏర్పడిందని, దీని ప్రకారం భూమి నీడ జాబిల్లిని 99.1 శాతం కప్పేస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.భారత కాలమానం ప్రకారం ఉదయం 11.57 గంటలకు గ్రహణం మొదలైంది. మధ్యాహ్నం 12.29 గంటలకు గ్రహణం గరిష్ట స్థాయికి చేరుకుని దాదాపు గంట పాటు కొనసాగింది. మధ్యాహ్నం 1.01 గంటలకు గ్రహణం పూర్తయ్యింది. మొత్తం 3గం. 38 ని.లోనే గ్రహణం మూడుదశలు పూర్తి చేసుకుంది. #BloodMoon #LunarEclipse pic.twitter.com/ufNhgx5ccd— தோழர் Manic (@ManicBalaji) March 14, 2025సంపూర్ణ చంద్రగ్రహణ సమయంలో భారత్లో పగటి సమయం. కాబట్టి మనకు కనిపించదు. అయితే.. ఆ సంపూర్ణ చంద్రగ్రహణం పశ్చిమార్థగోళంలో పూర్తిగా, కొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా కనిపిస్తోంది. ఉత్తర-దక్షిణ అమెరికా దేశాలు, పశ్చిమ ఐరోపా దేశౠలు, ఆఫ్రికా దేశాల్లోని వారు ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించారు. ప్రత్యేకించి.. అమెరికాలో ఎక్కువ ప్రాంతాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం స్పష్టంగా కనిపించింది. If i wasnt in the middle of a city, with tons of light pollution, I would have much better shots. These will have to do.#lunareclipse #bloodmoon pic.twitter.com/aABvGuXiWL— Jared Hardaway (@jartraxwx) March 14, 2025యూరప్లో గ్రహణ దశలో చంద్రుడు అస్తమించనుండగా.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో మాత్రం గ్రహణం పూర్తయ్యే సమయానికి చంద్రుడు ఉదయించాడు. దీంతో అక్కడ ఎటువంటి పరికరాలు లేకుండానే గ్రహణాన్ని నేరుగా వీక్షించారు. ఇప్పటికే పలువురు సోషల్ మీడియాలో ఆ దృశ్యాలను పోస్టులు పెడుతున్నారు. #BloodMoon #LunarEclipse pic.twitter.com/ufNhgx5ccd— தோழர் Manic (@ManicBalaji) March 14, 2025సాధారణ గ్రహణాల సమయంలో చంద్రుడి పరిమాణం కాస్త పెద్దదిగా, ఎప్పుడు కనిపించే రంగులోనే దర్శనమిస్తాడు. కానీ, బ్లడ్మూన్ రోజున జాబిల్లి పూర్తిగా ఎరుపు, నారింజ రంగులో చూపురులను కనువిందు చేశాడు. సూర్యుడి నుంచి విడుదలయ్యే ఎరుపు, నారింజ కిరణాలు భూ వాతావరణం గుండా ప్రయాణించి చంద్రుడ్ని ప్రకాశింపజేస్తాయి. ఖగోళ పరిభాషలో దీనినే రేలీ స్కాటరింగ్ అంటారు.If i wasnt in the middle of a city, with tons of light pollution, I would have much better shots. These will have to do.#lunareclipse #bloodmoon pic.twitter.com/aABvGuXiWL— Jared Hardaway (@jartraxwx) March 14, 2025 -
వీడియో: అమెరికాలో విమాన ప్రమాదం.. తృటిలో తప్పించుకున్న ప్రయాణీకులు
వాష్టింగన్: అగ్రరాజ్యం అమెరికాలో ఇటీవలి కాలంలో వరుస విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా అమెరికాలోని డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అమెరికన్ ఎయిర్ లైన్స్ విమానం మంటల్లో దగ్ధమైంది. విమానం నుంచి ప్రయాణీకులు దిగుతున్న సమయంలో ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ మారాయి.వివరాల ప్రకారం. అమెరికాలోని డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయం(Denver International Airport)లో శుక్రవారం తెల్లవారుజామున(భారత కాలమానం ప్రకారం) విమానంలో మంటలు చెలరేగాయి. అమెరికన్ ఎయిర్లైన్స్ విమానం-1006.. మంటల్లో దగ్ధమైంది. విమానాశ్రయమంలో ల్యాండ్ అయిన కాసేపటికే మంటలు చెలరేగాయి. దీంతో, ప్రయాణీకులు విమానం నుంచి హుటాహుటినా బయటకు వచ్చి.. ప్రాణాలు రక్షించుకున్నారు. దట్టమైన పొగలో నుంచి ప్రయాణీకులు వస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. BREAKING: An American Airlines plane just caught fire at Denver International Airport.What the hell is going on with all these plane incidents since Trump took office?!pic.twitter.com/LsAOVQr8fX— Republicans against Trump (@RpsAgainstTrump) March 14, 2025అయితే, ప్రమాదం కారణంగా ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ విమానంలో 172 మంది ప్రయాణీకులు, ఆరుగురు విమాన సిబ్బంది ప్రయాణం చేసినట్టు ఎయిర్పోర్టు అధికారులు వెల్లడించారు. వారంతా క్షేమంగా ఉన్నారని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన ఎయిర్పోర్టు సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చినట్టు సమాచారం. Passengers exiting the plane via the wing. American Airlines plane on fire at the Denver international airport. ✈️ 🔥 #Denver #Denverinternationalairport #PlaneFire pic.twitter.com/36e7NrBb9G— VeLore (@Oddland66) March 14, 2025🚨 #UPDATE American Airlines Flight 1006, a Boeing 737-800, diverted to Denver International Airport due to engine vibrations during its journey from Colorado Springs to Dallas. After landing safely, one of the engines caught fire, prompting an emergency evacuation. Six… https://t.co/dyQONtD4ZT pic.twitter.com/mGK8cSpqjE— SyeClops (@SyeClops) March 14, 2025 -
పుతిన్కు యుద్దమే ఇష్టం.. ట్రంప్ ప్లాన్ కష్టమే: జెలెన్స్కీ
కీవ్: ఉక్రెయిన్-రష్యా మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై కసరత్తు జరుగుతున్న వేళ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంచలన ఆరోపణలు చేశారు. కాల్పుల విరమణ ఒప్పందం తిరస్కరణకు పుతిన్ సన్నద్ధమవుతున్నారని జెలెన్స్కీ అన్నారు. అలాగ, ఉక్రెయిన్ ప్రజలనే చంపాలన్నదే పుతిన్ లక్ష్యం అంటూ వ్యాఖ్యలు చేశారు.ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తాజాగా ఓ వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా జెలెన్స్కీ మాట్లాడుతూ.. రష్యా అధ్యక్షుడు పుతిన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని తిరస్కరించడానికి కారణాలు వెతుకుతున్నారు. కాల్పుల విరమణను ఆలస్యం చేయడానికి, అమలుకాకుండా ఉండేందుకు పుతిన్ సన్నద్ధం అవుతున్నారు. ఇందులో భాగంగానే కాల్పుల విరమణ ఒప్పందానికి పుతిన్ కండీషన్స్ పెడుతున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కారణంగా ఈ విషయం నేరుగా చెప్పడానికి భయపడుతున్నారు. ఉక్రెయిన్పై యుద్ధం కొనసాగిస్తూ మా దేశ ప్రజలు చంపాలన్నదే పుతిన్ లక్ష్యం. అందుకే కాల్పుల విరమణ ఒప్పందం అంగీకరించకుండా సాకులు వెతుకుతున్నారు.షరతులు లేని కాల్పుల విరమణ కోసం అమెరికా ప్రతిపాదన చేసింది. ఉక్రెయిన్ ఈ ప్రతిపాదనను అంగీకరించింది. దీనిపై పర్యవేక్షణ ధృవీకరణను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్టు అమెరికా కూడా తెలిపింది. ఇది ఖచ్చితంగా సాధ్యమవుతుంది. కాల్పుల విరమణ సమయంలో, దీర్ఘకాలిక భద్రత, శాశ్వత శాంతి గురించి అన్ని ప్రశ్నలకు సమాధానాలు సిద్ధం చేయడం, యుద్ధాన్ని ముగించడానికి ఒక ప్రణాళికను సిద్ధంగా ఉంచాం. ఉక్రెయిన్ వీలైనంత త్వరగా నిర్మాణాత్మకంగా పనిచేయడానికి సిద్ధంగా ఉంది. మేము దీని గురించి అమెరికా ప్రతినిధులతో కూడా మేము చర్చించాం. ఉక్రెయిన్తో యూరోపియన్ భాగస్వాములు, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని మిత్రదేశాలకు దీని గురించి తెలుసు.ఈ ప్రక్రియను క్లిష్టతరం చేసే పరిస్థితులను మేము ఏర్పాటు చేయడం లేదు. రష్యా కారణంగానే కాల్పుల విరమణ ఒప్పందం ఆలస్యమవుతోంది. పుతిన్ సంవత్సరాల తరబడి శాంతి లేకుండా యుద్ధం చేస్తున్నారు. ఇప్పుడు అతనిపై ఒత్తిడి పెంచాల్సిన సమయం ఆసన్నమైంది. పుతిన్పై ఆంక్షలు విధించాలి. ఈ యుద్ధాన్ని ముగించమని రష్యాను బలవంతం చేయడానికి మేము ప్రతీ ఒక్కరితో కలిసి పని చేస్తూనే ఉంటాము. అని చెప్పుకొచ్చారు. Right now, we have all heard from Russia Putin’s highly predictable and manipulative words in response to the idea of a ceasefire on the front lines—at this moment he is, in fact, preparing to reject it.Of course, Putin is afraid to tell President Trump directly that he wants… pic.twitter.com/SWbYwMGA46— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) March 13, 2025మరోవైపు.. కాల్పుల విరమణ ప్రతిపాదనపై రష్యా అధ్యక్షుడు పుతిన్ తాజాగా స్పందించారు. మాస్కోలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో పుతిన్ మాట్లాడుతూ.. ట్రంప్ ఆలోచన సరైందే. కచ్చితంగా మేం మద్దతిస్తాం. అయితే కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిని మా అమెరికా మిత్రులతో ఇతర భాగస్వాములతో చర్చిస్తాం. ఒప్పందం ఉల్లంఘన కాకుండా.. సరైన యంత్రాంగాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంది. యుద్ధం ఆపాలన్న ప్రతిపాదనకు మేం అంగీకరిస్తున్నాం. అయితే కాల్పుల విరమణ.. శాశ్వత శాంతి దిశగా సాగుతుందన్న ఆశాభావంతో అందరం ముందుకు వెళ్లాలి. సమస్య మూలాలను తొలగించాలి’ అని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ఉక్రెయిన్ సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తున్న ట్రంప్నకు పుతిన్ ధన్యవాదాలు తెలిపారు. అలాగే.. భారత్, చైనా, దక్షిణాఫ్రికా నేతలకూ కృతజ్ఞతలు చెప్పారు. కాల్పుల విరమణ ఒప్పందంలో ఈ మూడు దేశాలు కూడా కీలక పాత్ర పోషించాయని పుతిన్ సంకేతం ఇచ్చారు. -
William Alsup: ట్రంప్, మస్క్లకు గట్టి దెబ్బ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump), ఇలాన్ మస్క్ నేతృత్వంలోని డోజ్ విభాగానికి న్యాయస్థానంలో ఎదురు దెబ్బ తగిలింది. ఉద్యోగాల్లోంచి తీసేసిన వేల మంది ఫెడరల్ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కాలిఫోర్నియా ఫెడరల్ న్యాయమూర్తి విలియమ్స్ అల్సప్ ఆదేశాలు జారీ చేశారు.మొత్తం ఆరు ఫెడరల్ ఏజెన్సీల నుంచి తొలగించిన ఉద్యోగులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించారాయన. ఉద్యోగాల్లో ప్రదర్శన ఏం బాగోలేదని చెబుతూ.. ఇలాన్ మస్క్(Elon Musk) నేతృత్వంలోని డోజ్ విభాగం వేల మంది ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. అయితే ఇదంతా బూటక చర్యగా అభిప్రాయపడ్డ జడ్జి విలియమ్స్ అల్సప్(William Alsup).. వెంటనే వాళ్లను విధుల్లోకి తీసుకోవాలంటూ ఆదేశించారు. చట్టానికి విరుద్ధంగా ఉద్యోగులను తొలగించారంటూ.. ఓపీఎం(Office of Personnel Management) ఆదేశాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలతో పాటు మరికొందరు కోర్టును ఆశ్రయించారు. అయితే OPM చర్యలు కేవలం మార్గదర్శకత్వం మాత్రమేనని, అత్యవసర సిబ్బందిని తొలగించలేదని న్యాయశాఖ వాదనలు వినిపించింది. ఈ వాదనను ఏకీభవించని జడ్జి విలియమ్స్ అల్సప్.. ఆ ఆదేశాలను నిలుపుదల చేస్తూ తక్షణమే ఆ ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించారు. సైన్య వ్యవహారాలు, వ్యవసాయం, రక్షణ, ఖజానా శాఖ.. ఇలా మొత్తం ఆరు శాఖల ఉద్యోగాలను విధుల్లోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారాయన. అయితే ఈ ఆదేశాలు అన్ని ఫెడరల్ ఏజెన్సీలకు వర్తిస్తాయని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. ఉద్యోగాల తొలగింపు తననూ బాధించిందని.. కానీ వాళ్లలో చాలామంది పని చేయలేకపోయారని.. అందుకే ఉత్తమ ప్రదర్శన ఉన్నవాళ్లను మాత్రమే కొనసాగిస్తున్నామని ట్రంప్ బుధవారం వ్యాఖ్యలు చేశారు. ఆ మరుసటి రోజే కాలిఫోర్నియా జడ్జి ఈ ఆదేశాలు ఇవ్వడం గమనార్హం. అయితే ట్రంప్ సర్కార్ ఈ ఆదేశాలను సవాల్ చేసే అవకాశం లేకపోలేదు. ఎవరీ జడ్జి?79 ఏళ్ల విలియమ్స్ అల్సప్ సీనియర్ న్యాయమూర్తి. హార్వార్డ్ నుంచి న్యాయవిద్య పూర్తి చేశారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తి విలియమ్ డగ్లస్కు 1971-72 మధ్య క్లర్క్గా పని చేశారు. బిల్ క్లింటన్ అధ్యక్షుడిగా ఉన్న టైంలో కరోలినా నార్త్ డిస్ట్రిక్ జడ్జిగా నియమించబడ్డారు. 2021 జనవరిలో సీనియర్ హోదా దక్కింది ఆయనకు. డోజ్ విమర్శలపై మస్క్అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్.. ప్రముఖ బిలియనీర్ ఇలాన్ మస్క్ను డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ(DOGE) సారథిగా నియమించారు. అమెరికా ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులే ‘డోజ్’ ప్రాజెక్టు లక్ష్యమని, తన ప్రభుత్వంలో సమర్థత పెంచేందుకు ఈ విభాగం కృషి చేస్తుందని ఆ టైంలో ట్రంప్ ప్రకటించారు. ప్రభుత్వ శాఖల్లో వృథా ఖర్చులకు కత్తెర, దుబారా ఖర్చులకు కోత, అవినీతి నిర్మూలన, ఫెడరల్ సంస్థలను పునర్మిర్మాణం.. ఇలా డోజ్కి లక్ష్యాలను ఇచ్చారు. ఇందులో భాగంగా.. ప్రభుత్వ శాఖల్లో భారీగా ఉద్యోగాల తొలగింపు చేపట్టారు. ఈ క్రమంలోనే గత రెండు నెలల కాలంలోనే 62,530 మంది ఫెడరల్ ఉద్యోగులను తొలగించారు. అయితే నాసా, విద్యా శాఖ, సైన్య విభాగాలపై ఈ తొలగింపులు ప్రభావం చూపించాయి. ఈ తొలగింపులు ఇలాగే కొనసాగితే.. నిరుద్యోగుల సంఖ్య భారీగా పెరుగుతుందని.. ఈ ఏడాది చివరికల్లా ఆ సంఖ్య ఐదు లక్షలకు చేరుకునే అవకాశం ఉంటుందని అక్కడి ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. -
కళ్ల ముందే కడతేర్చారు
క్వెట్టా: తమ ప్రాంత స్వాతంత్య్రం కోసం దశాబ్దాలుగా సాయుధబాటలో పయనిస్తున్న అతివాద బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) మంగళవారం పాకిస్తాన్లో ఏకంగా ఒక రైలునే తమ అ«దీనంలోకి తెచ్చుకుని ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. అయితే ఈ ఘటనలో ఎట్టకేలకు ప్రాణాలతో బయటపడిన ప్రయాణికులు ఇంకా ఆ దారుణ ఘటన నుంచి తేరుకోలేదు. తమ కళ్ల ముందే పాకిస్తానీ సైనికులను పిట్టల్ని కాల్చినట్లు కాల్చేసిన వైనాన్ని వారు గుర్తుచేసుకున్నారు. క్వెట్టా నుంచి పెషావర్కు 440 మంది ప్రయాణికులతో వెళ్తున్న జాఫర్ రైలుపై మెరుపుదాడి చేసి డజన్లకొద్దీ జనాలను, రైళ్లోని పాక్ సైనికులను బలూచిస్తాన్ వేర్పాటువాదులు చంపేసిన ఉదంతం తీవ్ర కలకలం రేపడం తెల్సిందే. చిన్నారులు, మహిళలతోపాటు వృద్ధులను వేర్పాటువాదులు ఇప్పటికే మానవతా దృక్పథంలో వదిలేయడంతో ఘటనాస్థలిలో వివరాలను ఆ వృద్దులు మీడియాతో పంచుకున్నారు. బోగీలపైకి బుల్లెట్ల వర్షం ‘‘రైలు బోలన్ కనుమ సమీపానికి రాగానే పెద్ద పేలుడు జరిగింది. పట్టాలను వేర్పాటువాదులు పేల్చేశారు. దీంతో రైలు హఠాత్తుగా ఆగింది. రైలు ఆగీఆగడంతోనే బోగీలపైకి బుల్లెట్ల వర్షం కురిపించారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సీట్ల కింద దాక్కున్నాం’’అని మహబూబ్ హుస్సేన్ అనే వృద్ధుడు చెప్పారు. తర్వాత విడుదలైన ఒక రైల్వే పోలీసు అధికారి ఈ ఘటనను వివరించారు. ‘‘ రైలు ఆగాక వందలాది మంది బీఎల్ఏ ఫైటర్లు కిందకు దిగొచ్చి రైలును చుట్టుముట్టి కాల్పులు మొదలెట్టారు. నేను, నలుగురు రైల్వే పోలీసులు, ఇద్దరు పాకిస్తానీ పారా మిలటరీ ఫ్రంటియర్ కోర్ సభ్యులందరం కలిసి వేర్పాటువాదులను ఎదుర్కొనేందుకు ప్రయతి్నంచాం. మా వద్ద మందుగుండు అయిపోయేదాకా ప్రతిఘటించాం. తర్వాత మా వద్ద బుల్లెట్లు అయిపోయాయి. చివరకు చేతులెత్తేయక తప్పలేదు ’’అని రైల్వే పోలీసు అధికారి చెప్పారు. గుంపులుగా వేరుచేసి.. ‘‘అందర్నీ కిందకు దించి ఐడీ కార్డులు అడిగారు. పోలీసులు, మహిళలు, వృద్దులు, చిన్నారులు ఇలా వేర్వేరు గుంపులుగా నిల్చోబెట్టారు. ‘ప్రభుత్వానికి డిమాండ్లు పంపించాం. అవి నెరవేరితే సరే. లేదంటే ఎవ్వరినీ వదిలిపెట్టం’’అని మాతో చెప్పారు. వాళ్లకు పైనుంచి ఆదేశాలు వస్తున్నాయి. అందుకు తగ్గట్లు వాళ్లు కొందరు సాధారణ పౌరులను, సైనికులను చంపుకుంటూ వెళ్లారు. మా కళ్లముందే ఈ ఘోరం జరిగింది’’అని మరో ప్రత్యక్ష సాక్షి ఇషాక్ నూర్ చెప్పారు. ‘‘అందర్నీ కిందకు దింపి ముసలివాళ్లను వదిలేశారు. వెనక్కి తిరిగి చూడకుండా ఇలాగే పట్టాల వెంట వెళ్లిపోవాలని నన్ను, నా భార్యను హెచ్చరించారు. బతుకుజీవుడా అనుకుంటూ అలాగే నడిచి రాత్రి ఏడుగంటలకు పనీర్ రైల్వేస్టేషన్కు చేరుకున్నాం’’అని భర్త నూర్ మొహమ్మద్ చెప్పారు. ‘‘పిల్లలు, మహిళలు ఉన్నారు వదిలేయండని ఎంతో వేడుకుంటే మమ్మల్ని వదిలేశారు. మంగళవారం రాత్రి అక్కడి నుంచి బయటపడ్డాం. అందరం కలిసి ఏకధాటిగా నాలుగు గంటలపాటు నడిచి తర్వాతి రైల్వేస్టేషన్కు చేరుకున్నాం’’అని ముహమ్మద్ అష్రఫ్ అనే వ్యక్తి చెప్పారు. పారిపోబోయిన కొందర్ని చంపేశారని పోలీసు అధికారి చెప్పారు. ‘‘రాత్రి పొద్దుపోయాక వేర్పాటువాదుల్లో కొందరు అక్కడి నుంచి ని్రష్కమించారు. అదే సమయంలో కొందరు ప్రయాణికులు తప్పించుకునేందుకు విఫలయత్నంచేశారు. బందీలు తప్పించుని పరుగెత్తడం చూసిన సాయుధాలు వాళ్లపై బుల్లెట్ల వర్షం కురిపించారు. దీంతో వాళ్లంతా పిట్టల్లా పడి బుల్లెట్లకు బలయ్యారు’’ అని చెప్పారు.కొందర్ని కిడ్నాప్ చేసి వెంట తీసుకెళ్లిన వేర్పాటువాదులు 440 మంది ప్రయాణికుల్లో 300 మందిని విజయవంతంగా విడిపించామని పాక్ సైన్యం చెబుతోంది. అయితే మిగతా 140 మంది పరిస్థితి ఏంటనేది ఎవరూ చెప్పలేకపోతున్నారు. డజన్ల మంది చనిపోయారని వార్తలొచ్చాయి. అయితే మిగతా వారిని వేర్పాటువాదులు బంధించి తమ వెంట తీసుకెళ్లారని రాయిటర్స్, ఏఎఫ్పీ వార్తాసంస్థలు కథనాలు వెలువర్చాయి. దీనిపై పాక్ సైన్యం స్పందించలేదు. మిగతా ప్రయాణికుల్లో కొందరు పారిపోయి కొండల్లో దాక్కున్నారని, ఘటనాస్థలి చుట్టుపక్కన విస్తృతస్థాయి గాలింపు తర్వాత మరణాలు, బందీలు, విడుదలైన వారి సంఖ్యలపై స్పష్టత వస్తుందని సైన్యం చెబుతోంది. క్వెట్టాలో ఖాళీ శవపేటికలు ఘటనలో చనిపోయి విగతజీవులుగా ఇంకా ఘటనాస్థలిలో అనాథలుగా పడిఉన్న వారి మృతదేహాలను తీసుకొచ్చేందుకు క్వెట్టా నుంచి రైలు బుధవారం బలూచిస్తాన్ వైపు బయల్దేరింది. డజన్ల కొద్దీ ఖాళీ శవపేటికలను రైలులోకి ఎక్కించారని అక్కడి వారు చెప్పారు. మరోవైపు ఉదయం ప్రార్థనల వేళ కొందరు ప్రయాణికులు చాకచక్యంగా తప్పించుకున్నారు. ‘‘రంజాన్ మాసం కావడంతో బుధవారం ఉదయం పూట వేర్పాటువాదులు ప్రార్థనలకు సిద్ధమయ్యారు. ఫజర్ కోసం వేర్పాటువాదులు బిజీగా ఉండటంతో ఇదే అదునుగా భావించి పాకిస్తాన్ రెస్క్యూ బృందాలు దాడి చేశాయి. దీంతో పోలీసులను ఎదుర్కోవడంపైనే వేర్పాటువాదులు దృష్టిసారించారు. అదే సమయంలో కొందరు పారిపోయారు. ‘‘తప్పించుకునే క్రమంలో మాలో కొందరికి బుల్లెట్ గాయాలయ్యాయి. అయినాసరే ఏమాత్రం భయపడక క్షతగాత్రులను భుజాలపై మోస్తూ పరుగెత్తాం. ఎట్టకేలకు కొండకు సుదూరంగా చేరుకోవడంతో వేర్పాటువాదుల తుపాకీ గురి నుంచి తప్పించుకోగలిగాం’’అని అల్లాహ్దితా చెప్పారు. -
మళ్లీ రష్యా వశమైన సుడ్జా టౌన్
మాస్కో: ఉక్రెయిన్పై యుద్ధంలో రష్యా క్రమంగా పైచేయి సాధిస్తోంది. ఒకవైపు శాంతి ప్రయత్నాలు జరుగుతుండగానే, మరోవైపు ఉక్రెయిన్ ఆధీనంలో ఉన్న తమ భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకుంటోంది. రష్యా సరిహద్దు అయిన కర్క్స్ ప్రాంతంలోని అతిపెద్ద పట్టణం సుడ్జా మళ్లీ రష్యా సేనల చేతుల్లోకి వచ్చింది. అక్కడి నుంచి ఉక్రెయిన్ సైన్యాన్ని తమ బలగాలు తరిమికొట్టినట్లు రష్యా ప్రభుత్వం గురువారం ప్రకటించింది. కర్క్స్లోని తమ సైనిక కమాండర్లను రష్యా అధినేత పుతిన్ బుధవారం కలిశారు. ఆ తర్వాత గంటల వ్యవధిలో సుడ్జా టౌన్ రష్యా వశం కావడం గమనార్హం. సుడ్జా పట్టణం ఉక్రెయిన్–రష్యా సరిహద్దుకు అత్యంత సమీపంలో ఉంది. రష్యా పరిధిలోకి వచ్చే ఈ పట్టణాన్ని గతంలో ఉక్రెయిన్ సేనలు ఆక్రమించాయి. ఇక్కడ 5,000 మంది నివసించేవారు. యుద్ధం మొదలైన తర్వాత చాలామంది ఇతర ప్రాంతాలకు వలసవెళ్లారు. యుద్ధంలో తాము కోల్పోయిన భూభాగాన్ని మళ్లీ స్వాధీనం చేసుకోవడం అతిపెద్ద విజయంగా రష్యా సైనిక వర్గాలు భావిస్తున్నాయి. అయితే, దీనిపై ఉక్రెయిన్ అధికార వర్గాలు ఇంకా స్పందించలేదు. -
Pak: సైన్యం విజయం ఉత్తదే
ఇస్లామాబాద్: జాఫర్ ఎక్స్ప్రెస్ను హైజాక్ చేసిన మిలిటెంట్లందరినీ మట్టుబెట్టామంటూ పాకిస్తాన్ సైన్యం చేసిన ప్రకటనను బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) గురువారం ఖండించింది. ఆపరేషన్ ఇంకా ముగియలేదని, సైన్యంపై కాల్పులు కొనసాగుతున్నాయని వెల్లడించింది. యుద్ధక్షేత్రంలో విజయం సాధించినట్లు సైన్యం చెప్పుకుంటోందని, అందులో ఎంతమాత్రం నిజంలేదని వివరించింది. తమ దాడిలో పాక్ భద్రతా బలగాలకు భారీగా నష్టం వాటిల్లినట్లు స్పష్టంచేసింది. ఇప్పటికే పాక్ సైనికులు చాలామంది మరణించారని పేర్కొంది. శత్రువుపై యుద్ధం ఆపే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. ఈ మేరకు బీఎల్ఏ ఒక ప్రకటన జారీ చేసింది. చాలామంది ప్రయాణికులు తమ అధీనంలోనే ఉన్నారని ప్రకటించింది. మంగళవారం 440 మంది ప్రయాణిలకులతో క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ను బలూచిస్తాన్ మిలిటెంట్లు హైజాక్ చేసిన సంగతి తెలిసిందే. 33 మంది మిలిటెంట్లను అంతం చేశామని, 21 మంది ప్రయాణికులు, నలుగురు భద్రతా సిబ్బంది మరణించారని, మిగిలిన ప్రయాణికులను క్షేమంగా విడిపించామని పాక్ సైన్యం బుధవారం వెల్లడించింది. అయితే, పాక్ సైన్యం తప్పుడు ప్రచారంతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోందని బీఎల్ఏ ఆరోపించింది. యుద్ధ నియమాలు, అంతర్జాతీయ నిబంధనలు దృష్టిలో పెట్టుకొని.. రైలులో ఉన్న కొందరు సైనికులను తామే వదిలేశామని వెల్లడించింది. సైన్యం తమపై పోరాటం చేయలేక సామాన్య బలూచ్ పౌరులను వేధిస్తోందని విమర్శించింది. జైళ్లలో ఉన్న తమ మిలిటెంట్లను వదిలిపెడితే రైలులో మిగిలి∙ఉన్న సైనికులు, ప్రయాణికుల విడుదల చేస్తామని బీఎల్ఏ ప్రతిపాదించింది. తమ మాట వినకపోతే జరగబోయే పరిణామాలకు పాక్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని తేల్చిచెప్పింది. బలూచిస్తాన్లో యుద్ధవాతావరణం నెలకొన్న ప్రాంతాలను సందర్శించేందుకు జర్నలిస్టులకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించింది. ఇక్కడి పరిస్థితులు ఏమిటో బాహ్య ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉందని బీఎల్ఏ స్పష్టం చేసింది. -
కాల్పుల విరమణకు ఓకే కానీ..
మాస్కో: నెలల తరబడి రక్తమోడుతున్న ఉక్రెయిన్ రణక్షేత్రాల్లో శాంతి పవనాలు వీయొచ్చనే ఆశలు రేకెత్తుతున్నాయి. అమెరికా ప్రతిపాదించిన ‘30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం’ సుసాధ్యమయ్యేలా ఉందని రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యాఖ్యానించారు. మాస్కో నగరంలో గురువారం పత్రికా సమావేశంలో పుతిన్ మాట్లాడారు. ‘‘ తొలుత 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం జరగాలంటూ అమెరికా చేస్తున్న ప్రతిపాదన అద్భుతంగా ఉంది. సబబైంది కూడా. ఈ ప్రతిపాదనకు మేం సూత్రప్రాయంగా, సైద్ధాంతికంగా అంగీకారం తెలుపుతున్నాం. అయితే యుద్ధంలో ఇంకా పరిష్కరించుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. వాటిని చర్చించాలి’’ అని పుతిన్ అన్నారు. అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కోఫ్ మాస్కో నగరానికి గురువారం విచ్చేసిన వేళ కాల్పుల విరమణ ప్రతిపాదనకు పుతిన్ సానుకూలంగా స్పందించడం గమనార్హం. ‘‘అమెరికా మిత్రులు, సంబంధిత భాగస్వాములతో రష్యా ఈ విషయమై విస్తృతస్థాయిలో సమాలోచనలు చేయాల్సి ఉంది. ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పడకుండా, ఉల్లంఘనలు జరక్కుండా చూసుకునే ఒక వ్యవస్థను తొలుత సిద్ధంచేయాలి. దీంతోపాటు ఈ 30 రోజుల కాల్పుల విరమణ సమయాన్ని ఉక్రెయిన్ దుర్వినియోగం చేయకుండా చూడాలి. అంటే ఈ 30 రోజుల్లో సరిహద్దులకు అదనపు బలగాలను మొహరించడం, మరింతగా ఆయుధాలను సమకూర్చుకోవడం వంటివి చేయకుండా నిరోధించాలి. యుద్ధాన్ని తాత్కాలికంగా ఆపాలనే ప్రతిపాదనలను మేం అంగీకరిస్తాం. అయితే ఈ తాత్కాలిక కాల్పుల విరమణ అనేది శాశ్వత శాంతికి బాటలు వేయాలి. ఈ సంక్షోభానికి మూలాలను తొలగించగలగాలి. యుద్ధానికి శాశ్వతంగా తెరపడాలి’’ అని పుతిన్ అన్నారు. సంక్షోభానికి మూలకారణాలను రూపుమాపాలని పుతిన్ గతంలోనూ వ్యాఖ్యానించారు. జెలెన్స్కీ సారథ్యంలో కొలువుతీరిన ప్రభుత్వం సైతం సంక్షోభానికి కారణమని పుతిన్ గతంలో పరోక్షంగా అన్నారు. నాటో విస్తరణతోపాటు ఉక్రెయిన్కు నాటో సభ్యత్వం ఇచ్చే ప్రతిపాదననూ పుతిన్ వ్యతిరేకిస్తున్నారు.థాంక్యూ ట్రంప్‘‘ఉక్రెయిన్ సమస్యకు పరిష్కారం వెతికేందుకు శతథా కృషిచేస్తూ, ఈ అంశంపై ప్రత్యేకంగా దృష్టిసారించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు నా కృతజ్ఞతలు. ఎంతో మంది ప్రాణాలు పోవడానికి కారణమైన ఈ యుద్ధానికి ముగింపు పలికేందుకు తమ వంతు కృషిచేస్తున్న చైనా, భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా అగ్రనేతలకూ నా కృతజ్ఞతలు’’ అని పుతిన్ అన్నారు. -
మద్యంపై టారిఫ్ల యుద్ధం
వాషింగ్టన్: అమెరికా, యూరప్ మధ్య టారిఫ్ల యుద్ధం మరింత ముదురుతోంది. ఇరుపక్షాలు సై అంటే సై అంటున్నాయి. తగ్గేదేలే అన్నట్లుగా దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. అమెరికా నుంచి దిగుమతి అయ్యే విస్కీపై యూరప్ దేశాలు బుధవారం ఏకంగా 50 శాతం టారిఫ్ విధించడం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఈ నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయకపోతే ఫ్రాన్స్ సహా యూరప్ దేశాల నుంచి దిగుమతి అయ్యే అన్ని రకాల వైన్స్, షాంపేన్స్, ఇతర ఆల్కహాలిక్ ఉత్పత్తులపై 200 శాతం సుంకం విధిస్తామని హెచ్చరించారు. దీనివల్ల యూరప్ మద్యం అత్యంత ఖరీదుగా మారిపోతుందని, అంతిమంగా అమెరికాలో స్వదేశీ వైన్, షాంపేన్ వ్యాపారం లాభపడుతుందని తేల్చిచెప్పారు. ఈ మేరకు గురువారం సోషల్ మీడియాలో ట్రంప్ పోస్టు చేశారు. యూరప్ నుంచి వచ్చే స్టీల్, అల్యూమినియంపై 25 శాతం టారిఫ్ విధిస్తూ అమెరికా ప్రభుత్వం తొలుత నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ టారిఫ్ రద్దు చేయాలని యూరప్ దేశాలు కోరినా ట్రంప్ యంత్రాంగం లెక్కచేయలేదు. దాంతో ప్రతీకార సుంకాలకు తెరతీసిన యూరప్ దేశాలు అమెరికా ఉత్పత్తులను లక్ష్యంగా చేసుకున్నాయి. 28 బిలియన్ డాలర్ల విలువైన అమెరికా పడవలు, మోటార్బైక్లపై వచ్చేనెల నుంచి సుంకాలు విధించబోతున్నట్లు ప్రకటించాయి. అమెరికా విస్కీని సైతం వదిలిపెట్టలేదు. 50 శాతం టారిఫ్ విధిస్తున్నట్లు తాజాగా ప్రకటించాయి. అందుకు పోటీగా యూరప్ మద్యంపై 200 శాతం టారిఫ్ను విధించడం ఖాయమని ట్రంప్ ప్రకటించడం చూస్తే పరిస్థితి చెయ్యి దాటిపోతున్నట్లు తెలుస్తోంది. టారిఫ్ల వ్యవహారం చివరకు భీకరమైన వాణిజ్య యుద్ధానికి దారితీసినా ఆశ్చర్యం లేదని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అమెరికా మద్యం కంపెనీలకు ఇక్కట్లు: డొనాల్డ్ ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడల్లా అమెరికా మద్యం కంపెనీలు ఇబ్బందులకు గురవుతున్నాయి. ఎందుకంటే ఇతర దేశాలు అమెరికా మద్యంపై టారిఫ్లు వసూలు చేస్తున్నాయి. అమెరికాలోని కెంటకీ, టెన్నెస్సీ రాష్ట్రాల్లో విస్కీ కంపెనీలు అధికంగా ఉన్నాయి. గతేడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఈ రెండు రాష్ట్రాలు ట్రంప్నకే మద్దతు పలికాయి. అయినా ట్రంప్ ఆ దిశగా ఆలోచించకపోవడం గమనార్హం. అమెరికా మద్యంపై పొరుగుదేశం కెనడా ఇప్పటికే సుంకాలు విధించింది. ఇతర దేశాల ఉత్పత్తులపై ట్రంప్ విధిస్తున్న టారిఫ్లపై అమెరికాలోని జాక్ డేనియల్స్ కంపెనీ సీఈఓ బ్రౌన్ ఫార్మన్ ఇటీవల ఆగ్రహం వ్యక్తంచేశారు. తాము ఉత్పత్తి చేసిన విస్కీని ఇతర దేశాల్లో విక్రయించకుండా చేస్తున్నారని ఆక్షేపించారు.విస్కీపై సుంకం అసహ్యంగా ఉంది: ట్రంప్ తమ విస్కీపై యూరప్ దేశాలు 50 శాతం టారిఫ్ను ప్రకటించడం పట్ల అమెరికా మద్యం పరిశ్రమ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. యూరప్కు విస్కీ ఎగుమతులు మళ్లీ పెంచాలని ఇటీవలే నిర్ణయించామని, ఈ టారిఫ్ల వల్ల అది నెరవేరే అవకాశం లేదని అమెరికా డిస్టిల్డ్ స్పిరిట్స్ కౌన్సిల్ సీఈఓ క్రిస్ స్వాగ్నర్ చెప్పారు. బుధవారం యూరప్ నుంచి ప్రకటన వెలువడిన వెంటనే ట్రంప్ స్పందించారు. వైట్హౌస్ ఓవల్ ఆఫీసులో మాట్లాడారు. యూరప్ సుంకాలపై తగిన విధంగా బదులిస్తానని చెప్పారు. అన్నట్లుగానే గురువారం బాంబు పేల్చారు. 200 శాతం సుంకాలు అంటూ గట్టిగా బదులిచ్చారు. ప్రపంచంలోనే అత్యంత దారుణమైన పన్నులు, సుంకాలు యూరప్ దేశాల్లో ఉన్నాయని ఆరోపించారు. అమెరికా నుంచి దోచుకోవాలన్న యావ తప్ప మరొకటి లేదని యూరప్ దేశాల ప్రభుత్వాలపై ధ్వజమెత్తారు. ఆఖరికి విస్కీపై కూడా టారిఫ్ విధించడం అత్యంత అసహ్యంగా ఉందన్నారు.టారిఫ్ ప్లాన్లు ఆగవు టారిఫ్లలో ఉన్న సమస్య ఏమిటంటే అవి మరిన్ని టారిఫ్లకు దారితీస్తాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అమెరికా, యూరప్ మధ్య ఈ టారిఫ్ల రగడ ఇప్పట్లో ఆగే సూచనలు కనిపించడం లేదు. ఒక్కసారి అందులో కూరుకుపోతే బయటపడడం అంత సులభం కాదు. తమ టారిఫ్ ప్రణాళి కలను సమీప భవిష్యత్తులో ముగించే అవకాశం లేదని ట్రంప్ ఇప్పటికే సంకేతాలిచ్చారు. అంతర్జాతీయ ఒత్తిళ్లకు సైతం ఆయన తలొగ్గడం లేదు. పైగా అదనపు టారిఫ్లు ఉంటాయని చెబుతున్నారు. ఇండియా, చైనా సహా పలు దేశాల ఉత్పత్తులపై విధించిన సుంకాలు ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. -
కెనడా పౌరులపై ట్రంప్ ఆంక్షలు.. ఉల్లంఘిస్తే భారీ ఫైన్, జైలు జీవితం ఖాయం
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాపై ఆంక్షలు విధించారు. బోర్డర్ దాటి అమెరికాలోకి వచ్చే కెనడా పౌరులు తమ దేశంలో 30 రోజులు మించి ఉండకూడదు. దాటితే తమ నిబంధనలకు లోబడి ఉండాలి. లేదంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డొనాల్డ్ ట్రంప్ కెనడాపై 25 శాతం టారిఫ్ విధించారు. దీంతో అమెరికాలోని మూడు రాష్ట్రాలకు సరఫరా చేస్తున్న విద్యుత్పై ఎగుమతి సుంకాలను 25శాతం పెంచుతున్నట్లు కెనడాలోని ఒంటారియో (Ontario) ప్రకటించింది. ఆ ప్రకటన ఇలా వచ్చిందో లేదో.. ఆ దేశంపై మరిన్ని ఆంక్షలు విధించారు. సాధారణంగా కెనడా పౌరులు బోర్డర్ దాటి అమెరికాలో చొరబడుతుంటారు. 30 రోజుల కంటే ఎక్కువ ఉన్నా.. ఇందుకోసం ఎలాంటి అనుమతులు తీసుకోవాల్సి ఉండేది కాదు. కానీ తాజాగా ట్రంప్ నిర్ణయంతో 30రోజులు దాటిన అమెరికాలోని కెనడా పౌరులు తప్పని సరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.లేదంటే 5వేల డాలర్ల ఫైన్, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫైన్తో పాటు, ఆరు నెలల జైలు శిక్షను విధించాల్సి ఉంటుంది. తాజాగా, ట్రంప్ విధించిన నిబంధనలు ఏప్రిల్ 11 నుంచి అమల్లోకి రానున్నాయి. -
దానివల్ల ఏమీ ఉపయోగం లేదు: అమెరికాకు తేల్చి చెప్పిన రష్యా
మాస్కో: రష్యా, ఉక్రెయిన్ ల మధ్య అమెరికా జరుపుతున్న శాంతి చర్చలు ఇప్పట్లో సఫలీకృతం అయ్యేటల్లు కనిపించడం లేదు. ‘ మేము వెనక్కి తగ్గం అంటే.. మేము కూడా వెనక్కి తగ్గేదే లేదు’ అన్నట్లుగా ఉంది ఇరు దేశాల పరిస్థితి. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు జరుపుతున్నప్పటికీ అది కాస్తా విఫలయత్నంగానే మిగిలి ఉంది. ఒకవైపు వైట్ హౌస్ వేదికగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో జరిపిన చర్చలు వాగ్వాదానికి దారి తీశాయే తప్ప వాటిలో ఎటువంటి ముందడుగు పడలేదు. అదే సమయంలో రష్యాను కూడా కాస్త తగ్గే ఉండమని ట్రంప్ చేస్తున్న విజ్ఞప్తిని కూడా ఆ దేశం పెద్దగా పట్టించుకోవడం లేదు. కనీసం 30 రోజుల శాంతి ఒప్పందంతో ఇరు దేశాల యుద్ధం ఓ కొలిక్కి వస్తుందని ఆశించిన అమెరికాకు ఇరు దేశాల వైఖరి ఏమాత్రం మింగుడు పడటం లేదు.అది ఉక్రెయిన్ ఆర్మీ ఊపిరి తీసుకునేందుకే..తాజాగా అమెరికా నేషనల్ సెక్యూరిటీ ఆడ్వైజర్ మికీ వాల్ట్ కు ఇదే విషయాన్ని రష్యా స్పష్టం చేసింది. 30 రోజుల మీ శాంతి ఒప్పందం వల్ల ఎటువంటి ఉపయోగం లేదని రష్యా అధ్యక్షుడు పుతిన్ కు అత్యంత కీలక విషయాలు చూసే యురీ ఉషాకోవ్ స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ఫోన్ లో అమెరికాకు తేల్చిచెప్పారు.‘మీరు కోరుకునే మా ఇరుదేశాల 30 రోజుల శాంతి ఒప్పందం(కాల్పుల విరమణ ఒప్పందం)తో ఎటువంటి ఉపయోగం లేదు. అది కేవలం ఉక్రెయిన్ ఆర్మీ కి కాస్త రిలాక్స్ కావడానికి మాత్రమే పనికొస్తుంది. మేము కోరుకునేది శాశ్వత శాంతి ఒప్పందం. రష్యా చట్టబద్ధమైన ప్రయోజనాలను" కాపాడే దీర్ఘకాలిక శాంతియుత పరిష్కారం కోసం రష్యా లక్ష్యంగా పెట్టుకుంది. మా తాపత్రయం అంతా దానిపైనే ఉంది. అంతే కానీ 30 రోజుల శాంతి ఒప్పందం వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు’ అని అమెరికాకు తేల్చిచెప్పారు. ఫలితంగా ఇరు దేశాల శాంతి ఒప్పందం మళ్లీ మొదటికొచ్చినట్లయ్యింది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో జెలెన్ స్కీ భేటీ తర్వాత.. రష్యా మళ్లీ ఉక్రెయిన్ పై దాడులకు దిగింది. అదే సమయంలో ఆ దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టిన ఉక్రెయిన్ సైతం తాము కూడా తాడో పేడో తేల్చుకుంటామనే రీతిలో యుద్ధ రంగంలోకి దూకింది. ఆ క్రమంలోనే రష్యాపై మెరుపు దాడి చేసింది. సుమారు 300 పైగా డ్రోన్ల సాయంతో రష్యాపై విరుచుకుపడింది. ఈ దాడితో ప్రాణనష్టం, ఆస్తినష్టం కూడా అధికంగా వాటిల్లినట్లు తెలుస్తున్నప్పటికీ, దానిపై రష్యా అధికారిక ప్రకటన ఏమీ చేయలేదు.అమెరికాకు పుతిన్ డిమాండ్స్.. రష్యాకు ట్రంప్ సీరియస్ వార్నింగ్ -
ఎవరూ సురక్షితంగా లేరు.. జీ7 దేశాలకు కెనడా హెచ్చరిక..
వాణిజ్య యుద్ధ భయాలు జి-7 దేశాలను వెంటాడుతున్నాయి. ఈ క్రమంలో జరిగిన జి-7 విదేశాంగ మంత్రుల సమావేశంలో వాణిజ్య యుద్ధం ప్రధాన చర్చగా మారింది. డొనాల్డ్ ట్రంప్ విధానాలతో ఎవరూ సురక్షితంగా లేరంటూ జీ7 దేశాలను కెనడా హెచ్చరించింది. కెనడా విదేశాంగ మంత్రి మెలానియో జోలీ.. అమెరికాతో తీవ్రమవుతున్న వాణిజ్య పోరాటంపై ఆందోళన వ్యక్తం చేశారు. అగ్రరాజ్య చర్యలతో ఎదురయ్యే పరిణామాలపై మిగిలిన దేశాలను ఆమె హెచ్చరించారు.అత్యంత మిత్రదేశమైన మాతోనే అమెరికా ఇలా ఉంటే.. ఇక ఇతర దేశాలు సురక్షితంగా ఉండలేవంటూ ఆమె వ్యాఖ్యానించారు. రాబోయే విపత్తును ముందుగా అంచనా వేసి, మిత్రదేశాల మద్దతును కూడగట్టేందుకు కెనడా ఈ చర్యలు తీసుకుంటోందని విశ్లేషకులు అభిప్రాయవ్యక్తం చేస్తున్నారు. కాగా, ఇక ట్రంప్ తరచూ కెనడా సార్వభౌమత్వాన్ని ప్రశ్నిస్తూ చేస్తున్నవ్యాఖ్యలపై కూడా జోలీ స్పందిస్తూ.. అలాంటి బెదిరింపులకు తమ దేశం వెనుకంజ వేయదంటూ తేల్చి చెప్పారు. యుద్ధ విన్యాసాలు, ఆయుధ తయారీ వంటి చర్యలు తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు కీలకమైనవిగా ఆమె స్పష్టం చేశారు.మరోవైపు, ఆర్థిక కోణంలో మాత్రమే తమ అధ్యక్షుడు కెనడాను 51వ రాష్ట్రం కావాలని ఆకాంక్షించారంటూ అమెరికా మంత్రి మార్కో రూబియో వివరణ ఇచ్చారు. ఒక వేళ కెనడా 51 రాష్ట్రం అయితే అప్పుడు సరిహద్దుల గురించి, ఫెంటెనిల్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నది ట్రంప్ భావన’’ అని రూబియో వ్యాఖ్యానించారు.అధికారంలోకి వచ్చిన వెంటనే.. ట్రంప్ పలు దేశాలపై భారీ స్థాయిలో సుంకాలు విధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పొరుగు దేశాలతో ట్రేడ్వార్కు బీజం వేశారు. అమెరికా-కెనడా మధ్య సంబంధాలు కూడా ఎన్నడూ లేని స్థాయిలో దెబ్బతిన్నాయి. కాగా, ట్రంప్.. టారిఫ్ వార్లో కాస్త వెనక్కి తగ్గారు. మెక్సికోతో పాటు కెనడాపై విధించిన దిగుమతి సుంకాలను ఏప్రిల్ 2వ తేదీ దాకా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే కొన్ని ఉత్పత్తులపై మాత్రం ఈ నిర్ణయం యథావిధిగా కొనసాగుతుందని, ప్రతీకార సుంకాలు విధించే ప్రణాళికలో ఎటువంటి మార్పు లేదని అన్నారాయన. -
Holi 2025: ఈ దేశాల్లోనూ అంబరాన్నంటే హోలీ వేడుకలు
రంగుల పండుగ హోలీని దేశవ్యాప్తంగా మార్చి 14న జరుపుకోనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ప్రతీ ఇంటిలోనూ సన్నాహాలు మొదలయ్యాయి. రంగులను కొనుగోలు చేసి, వాటితో ఆటలాండేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు సహజసిద్ధమైన రంగులనే వాడాలంటూ పర్యావరణ ప్రేమికులు సూచిస్తున్నారు. ఈ రంగుల కేళి హోలీని కేవలం మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు.హోలీ పండుగ అందరూ కలసి చేసుకునే వేడుక. ఇది ఐక్యతను, సోదరభావాన్ని పెంపొందిస్తుంది. మనుషుల మధ్య ఉండే శతృత్వాలను కూడా హోలీ తరిమికొడుతుందని చెబుతుంటారు. పలు దేశాలలో స్థిరపడిన భారతీయులు హోలీ వేడుకలను ఘనంగా చేసుకుంటారు.నేపాల్హోలీ పండుగను మన పొరుగుదేశమైన నేపాల్లోనూ అత్యంత వేడుకగా జరుపుకుంటారు. దీనిని నేపాల్లో ఫాల్గుణ పూర్ణిమ అని అంటారు. కాఠ్మాండు తదితర నగరాల్లో హోలీ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. జనం ఈ వేడుకల్లో పాల్గొని ఒకరిపై మరొకరు రంగులు జల్లుకుని, ఇష్టమైన ఆహార పదార్థాలను ఆరగిస్తారు.యునైటెడ్ కింగ్డమ్హోలీ పండుగ బ్రిటన్లోని భారతీయులు అంత్యంత వేడుకగా చేసుకునే ఉత్సవం. హోలీ వేడుకలు లండన్తో పాటు బర్మింగ్హామ్లో అంత్యంత ఉత్సాహంగా జరుపుకుంటారు. ఇక్కడి భారతీయులు హోలీ వేళ బాలీవుడ్ సంగీతానికి అనుగుణంగా నృత్యం చేస్తూ, ఒకరిపై మరొకరు రంగులు జల్లుకుంటారు.అమెరికాఅగ్రరాజ్యం అమెరికాలో హోలీ వేడుకలు ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. న్యూయార్క్, కాలిఫోర్నియా, టెక్సాస్లలో అత్యంత ఉత్సాహ భరిత వాతావరణంలో రంగుల ఉత్సవం జరుగుతుంది. భారతీయులతో పాటు విదేశీయులు కూడా ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు.మారిషస్మారిషస్లో భారతీయ మూలాలు కలిగినవారు అధిక సంఖ్యలో ఉన్నారు. అందుకే ఇక్కడ హోలీ వేడుకలు అంబరాన్ని అంటుతుంటాయి. మారిషస్లో హోలీ వేళ ఒకరిపై మరొకరు రంగులు జల్లుకోవడమే కాకుండా, ఆలయాలలో పూజలు నిర్వహిస్తుంటారు. అలాగే సాంప్రదాయ వంటకాలను చేసుకుని ఆరగిస్తుంటారు.బంగ్లాదేశ్బంగ్లాదేశ్లోని హిందువులు హోలీ వేడుకలను అంత్యంత వైభవంగా చేసుకుంటారు. ఆలయాలకు వెళ్లి, భక్తిప్రపత్తులతో పూజలు చేస్తారు. సాయంత్రం వేళ ఆలయాలలో భజనలు, కీర్తనలు ఆలపిస్తారు. ఒకరిపై మరొకరు రంగులు జల్లుకుని ఆనందిస్తారు.ఇది కూడా చదవండి: Brazil: పర్యావరణ సదస్సు కోసం చెట్ల నరికివేత!! -
Brazil: పర్యావరణ సదస్సు కోసం చెట్ల నరికివేత!!
బ్రెజిల్లో ఈ ఏడాది నవంబర్లో జరగబోయే ప్రపంచ వాతావరణ సదస్సు(2025 United Nations Climate Change Conference)(కాప్-30) కోసం జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఈ ఏర్పాట్లలో భాగంగా రోడ్డును నిర్మించేందుకు బ్రెజిల్ అమెజాన్ అడవులలోని వేలాది చెట్లను నరికివేసిందనే ఆరోపణలు ఎదుర్కొంటోంది. 50 వేలమంది హాజరయ్యే ఈ సదస్సు కోసం రోడ్డుమార్గాన్ని నిర్మించే పేరుతో పర్యావరణ పరిరక్షణ నిబద్ధతను బ్రెజిల్ ఉల్లంఘించిందంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.ది టెలిగ్రాఫ్ కథనం ప్రకారం అమెజాన్(Amazon) వర్షారణ్యం.. అధిక మొత్తంలో కార్బన్ను గ్రహించడంతో పాటు, అసాధారణ జీవవైవిధ్యాన్ని కలిగివుందనే ఘనతను దక్కించుకుంది. కాప్ సదస్సు కోసం నిర్మిస్తున్న నూతన రహదారి తమ జీవనోపాధిని దూరం చేస్తుందని స్థానికులు పేర్కొంటున్నారు. అలాగే వన్యప్రాణులకు ఇది ప్రమాదకరమని జంతు ప్రేమికులు అంటున్నారు. కాగా ఈ నాలుగు లేన్ల రహదారి 50 వేల మందికి పైగా ప్రతినిధులకు ఆతిథ్యం ఇచ్చే ‘బెలెమ్’కు చేరేందుకు ట్రాఫిక్ను సులభతరం చేస్తుందని బ్రెజిల్ పేర్కొంది. అయితే వాతావరణ శిఖరాగ్ర సమావేశం నిర్వహణ ఉద్దేశ్యానికి విరుద్ధంగా బ్రెజిల్ నిర్ణయం ఉందని పలువురు విమర్శిస్తున్నారు. కాగా ఈ సదస్సు అమెజాన్ అడవుల గురించి ప్రపంచానికి మరింతగా తెలియజేస్తుందని బ్రెజిల్ పేర్కొంది. ఈ ఆడవులను కాపాడేందుకు తమ ప్రభుత్వం ఏమి చేస్తున్నదీ అందరికీ తెలుస్తుందని, కాప్-30 సదస్సు చారిత్రాత్మక శిఖరాగ్ర సమావేశం అవుతుందని బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: Balochistan: జిన్నా చేసిన ద్రోహమే.. పాక్కు ముప్పుగా మారిందా? -
Balochistan: జిన్నా చేసిన ద్రోహమే.. పాక్కు ముప్పుగా మారిందా?
ఖనిజ సంపద అధికంగా ఉన్న బలూచిస్తాన్(Balochistan) రాష్ట్రం పాకిస్తాన్ నుంచి స్వాతంత్ర్యం కోరుతూ దశాబ్దాలుగా సాయుధ పోరాటం చేస్తోంది. ఇది పాక్కు భద్రతా ముప్పుగా పరిణమించింది. ఈ క్రమంలోనే ఇరాన్- ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో రైలు హైజాక్ చేసింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ). ఇంతకీ బలూచిస్తాన్ ఎందుకు పాక్ నుంచి విడిపోవాలనుకుంటోంది? దీని వెనుక ఏముంది?పాకిస్తాన్(Pakistan) స్వాతంత్ర్యం పొందినప్పటి నుంచి చెలరేగుతున్న బలూచ్ ఉద్యమంలో తాజాగా చోటుచేసుకున్న రైలు హైజాక్ అతి పెద్ద ఘటనగా చెప్పుకోవచ్చు. బలూచ్ తిరుగుబాటుకు మూలం పాకిస్తాన్ జాతిపి ముహమ్మద్ అలీ జిన్నా చేసిన ద్రోహం అని చెబుతుంటారు. నాడు పాక్తో విలీనం కావడానికి బలూచిస్తాన్ ఏమాత్రం ఇష్టపడలేదు. పాకిస్తాన్లో విస్తీర్ణంలో అతిపెద్ద రాష్ట్రమైన బలూచిస్తాన్ ఎల్లప్పుడూ స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటూ వచ్చింది. నాడు రష్యా నుండి తన వలస ప్రయోజనాలను రక్షించుకునేందుకు బ్రిటిష్ పాలకులు ఈ ప్రాంతాన్ని ఒక స్థావరంగా ఉపయోగించుకున్నారు. అయితే భారతదేశ విభజన తర్వాత పలు పరిణామాల నేపధ్యంలో పాకిస్తాన్లో బలూచ్ విలీనమయ్యింది. ఇది స్థానికులకు నచ్చలేదు. దీంతో స్వతంత్ర బలూచిస్తాన్ కోసం ఉద్యమం ప్రారంభమయ్యింది.చదవండి: బెలూచిస్థాన్ ఎందుకు భగ్గుమంటోంది?బలూచిస్తాన్ అధికంగా బీడువారినట్లు కనిపించినప్పటికీ, ఖనిజాలు, వనరులతో సమృద్ధిగా ఉంది. చాఘి జిల్లాలోని రెకో దిక్, సైందక్ ప్రాంతాల్లో అపారంగా బంగారం, రాగి నిక్షేపాలు ఉన్నాయి. అలాగే బలూచిస్తాన్లోని పలు ప్రాంతాల్లో సీసం, జింక్, బొగ్గు నిక్షేపాలు కూడా ఉన్నాయి. బెలూచ్కు సొంతమైన ఈ వనరులను పాక్ ప్రభుత్వం దోపిడీ చేస్తోందని బలూచ్ ఎప్పటి నుంచో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తిరుగుబాటు సంస్థలైన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ),బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ (బీఎల్ఎప్)లు బలూచ్ స్వాంతంత్య్రం కోసం ఉద్యమిస్తున్నాయి.ఈ సంస్థలు పాకిస్తాన్ భద్రతా దళాలు(Pakistan security forces), సంస్థలు, మౌలిక సదుపాయాలపై దాడులకు తెగబడ్డాయి. గత కొన్నేళ్లుగా మానవ హక్కుల ఉల్లంఘనల ఆరోపణలతో బలూచ్ ఉద్యమం మరింత తీవ్రమైంది. తమ ఉద్యమాన్ని అణచివేసేందుకు తమ దళాలకు చెందిన వందలాది మంది కార్యకర్తలు, పౌరులను పాక్ సైన్యం అదృశ్యం చేసిందని తిరుగుబాటు సంస్థలు ఆరోపిస్తున్నాయి.విభజన సమయంలో బలూచిస్తాన్ను భారతదేశం, పాకిస్తాన్లతో పాటు స్వతంత్ర దేశంగా ప్రకటించారు. నాడు ఈ ప్రాంతంలో నాలుగు రాచరిక రాష్ట్రాలు ఉండేవి. అవి ఖరన్, మకరన్, లాస్ బేలా, కలాత్. విభజనకు ముందు ఈ రాచరిక రాష్ట్రాలకు మూడు ఎంపికలు ఇచ్చారు. అవి భారతదేశం లేదా పాకిస్తాన్లో చేరడం లేదా స్వతంత్రంగా ఉండటం. ఈ నేపధ్యంలో మూడు ప్రాంతాలు పాకిస్తాన్లో విలీనమ్యాయి. దీంతో కలాత్కు 1947, ఆగస్టు 15న స్వాతంత్ర్యం ప్రకటించారు. అయితే విస్తరణవాద పాలన భయంతో కలాత్ స్వతంత్రంగా ఉండటానికి బ్రిటిష్ ఒప్పుకోలేదు. కలాత్ను స్వాధీనం చేసుకోవాలంటూ పాక్పై ఒత్తిడి తెచ్చారు. 1947 అక్టోబరులో పాక్ వ్యవస్థాపకుడు జిన్నా.. కలాత్ విలీనాన్ని వేగవంతం చేయాలని సలహా ఇచ్చాడు. అయితే కలాత్ పాలకుడు దీనిని నిరాకరించాడు.నాటి నుండి పాకిస్తాన్ అధికారులు కలాత్ పాలకుడు ఖాన్ను పాకిస్తాన్లో చేరాలంటూ మరింతగా ఒత్తిడి తీసుకువచ్చారు. 1954లో పాకిస్తాన్ తన ప్రావిన్సులను పునర్వ్యవస్థీకరిస్తూ వన్-యూనిట్ ప్రణాళికను ప్రారంభించినప్పుడు బలూచ్లో తిరుగుబాటు వచ్చింది. ఖాన్ ఆఫ్ కలాత్ నవాబ్ నౌరోజ్ ఖాన్ 1959లో పాక్కు లొంగిపోయాడు. ఏడాది తరువాత పశ్చిమ పాకిస్తాన్లో వన్ యూనిట్ ప్లాన్ రద్దు చేశారు. దీంతో బలూచిస్తాన్ను పంజాబ్, సింధ్, ఫ్రాంటియర్తో పాటు మరో రాష్ట్రంగా ప్రకటించారు.1970లలో పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం పొందిన దరిమిలా బలూచ్లలో ధైర్యం పెరిగింది. స్వయంప్రతిపత్తి కోసం డిమాండ్లను లేవనెత్తారు. అయితే నాటి ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో దీనిని నిరాకరించారు. ఇది భారీ నిరసనలకు దారితీసింది. ఇది నాటి నుంచి ఏదో ఒక రూపేణా ఉద్యమం కొనసాగుతూనే వస్తోంది. గత కొన్నేళ్లుగా పాక్ భద్రతా సిబ్బంది, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను లక్ష్యంగా చేసుకుని బలూచ్ దాడులు కొనసాగుతున్నాయి. అయితే ఇప్పట్లో బలూచ్ డిమాండ్లకు పాకిస్తాన్ ప్రభుత్వం అంగీకరించే సూచనలు కనిపించడం లేదని విశ్లేషకులు అంటున్నారు.ఇది కూడా చదవండి: మహాకుంభ్తో నిండిన రైల్వే ఖజానా.. ఎంత ఆదాయమంటే.. -
అమెరికాకు పుతిన్ డిమాండ్స్.. రష్యాకు ట్రంప్ సీరియస్ వార్నింగ్
వాష్టింగన్/మాస్కో: ఉక్రెయిన్-రష్యా కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ కుదుర్చేందుకు అమెరికా ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్తో డీల్ చేసుకునేందుకు రష్యా పలు డిమాండ్లను అమెరికా ముందుకు తీసుకొచ్చినట్టు యూఎస్కు చెందిన ఇద్దరు అధికారులు వెల్లడించారు. ఇదే సమయంలో అమెరికా ప్రతినిధులు రష్యాకు బయలుదేరడం విశేషం.ఉక్రెయిన్తో యుద్ధం ముగింపు, అమెరికాతో సంబంధాల మెరుగు కోసం రష్యా పలు డిమాండ్లను తెరపైకి తీసుకొచ్చింది. ఈ మేరకు ఓ జాబితాను సిద్దం చేసి రష్యాకు చెందిన అధికారులు అమెరికాకు అందజేశారు. అయితే, జాబితాలో రష్యా ఏం కోరిందనే విషయం మాత్రం వెల్లడి కాలేదు. ఇక,గత మూడు వారాలుగా పలు నిబంధనలపై అమెరికా, రష్యా అధికారులు చర్చించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యా డిమాండ్లు ఏంటి? అనేది చర్చనీయాంశంగా మారింది.మరోవైపు.. యుద్ధంలో 30 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనపై చర్చించేందుకు అమెరికా ప్రతినిధులు రష్యా బయల్దేరారు. ఈ విషయాన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వైట్హౌస్ వద్ద మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్బంగా ట్రంప్ మాట్లాడుతూ..‘మా ప్రతినిధులు రష్యాకు బయల్దేరారు. కాల్పుల విరమణకు పుతిన్ అంగీకరిస్తారనే ఆశిస్తున్నాం. లేదంటే యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది. అదే జరిగితే మాస్కో ఆర్థికంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అది రష్యాకే వినాశకరంగా మారుతుంది. అలాంటి ఫలితాన్ని నేను కోరుకోవట్లేదు. శాంతిని సాధించడమే నా లక్ష్యం. రష్యా అంగీకరిస్తే అది గొప్ప నిర్ణయం అవుతుంది. లేదంటే ప్రజలు మరణిస్తూనే ఉంటారు’ అని స్పష్టం చేశారు.Trump threatens Putin with 'devastating' punishment if he doesn't agree to 30-day ceasefire with Ukraine. pic.twitter.com/vU6rLTX479— Daily Mail Online (@MailOnline) March 12, 2025ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్ మాత్రం కీవ్కు నాటో సభ్యత్వం ఇవ్వాలని ముందు నుంచి డిమాండ్ చేస్తోంది. ఉక్రెయిన్లో విదేశీ దళాలను మోహరించకూడదని చెబుతోంది. ఈ మేరకు అమెరికాతో కూడా చర్చలు జరిపింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ డిమాండ్లపైనే రష్యా కూడా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఉక్రెయిన్ను నాటోలో చేర్చకూడదనే వాదనలు వినిపిస్తోంది. మాస్కో కాల్పుల విరమణకు సంతకం చేయకపోతే ఆంక్షల వలయంలో చిక్కుకోవాల్సి ఉంటుంది. -
గాజా ప్లాన్పై ట్రంప్ రివర్స్ గేర్
వాషింగ్టన్: ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంతో శిథిలమైన గాజాను స్వాధీనం చేసుకుని పునర్ నిర్మిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన వ్యవహార శైలి తీవ్ర వివాదాస్పదంగా మారింది కూడా. గాజాలో ఉన్న లక్షల మంది పాలస్తీనా ప్రజలు పశ్చిమాసియాలోని వేరే ఏదైనా తరలి వెళ్లాల్సిందేనని అన్నారాయన. అయితే.. హఠాత్తుగా ఆయన యూటర్న్ తీసుకుని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శిథిలమైన గాజాను పునర్ నిర్మించే ప్రణాళికలో భాగంగా ఎవరినీ బహిష్కరించమని ట్రంప్ ఇప్పుడు అంటున్నారు. బుధవారం ఐరిష్ ప్రధాని మైకేల్ మార్టిన్(Micheál Martin)తో ఆయన వైట్హౌజ్లో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గాజా నుంచి బహిష్కరణలు ఉండబోవని అన్నారు. ఈ సందర్భంగా.. యూఎస్ సెనెట్ మైనారిటీ నాయకుడు చక్ షూమర్ అంశాన్ని మరోసారి ప్రస్తావించారాయన. గతంలో ఆయన(చక్ షూమర్) యూదుడైనప్పటికీ.. ఇప్పుడు మాత్రం పాలస్తీనియన్ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. కిందటి నెలలో ఇదే అంశంపై ఆయన తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసి చర్చకు దారి తీశారు కూడా. అయితే.. గాజాలో మానవతా సాయాన్ని పెంచాల్సిన అవసరం ఉందని ఐరిష్ ప్రధాని మైకేల్ మార్టిన్ అభిప్రాయపడ్డారు. కాల్పుల విరమణతో పాటు హమాస్ చెరలోని బందీలను విడుదల చేయాలని పిలుపునిచ్చారు. అయితే ట్రంప్ గాజా ప్లాన్ను ఇస్లామిక్ దేశాల సహకార సంస్థ (ఓఐసీ) తిరస్కరించింది. ప్రతిగా.. ఈజిప్ట్ ప్రతిపాదిస్తున్న ప్రణాళికకు మద్దతు ఇచ్చింది.గాజా యుద్ధం.. మధ్యలో ఐర్లాండ్గాజాలో యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్కు ఐర్లాండ్కు మధ్య సంబంధాలు దెబ్బ తిన్నాయి. గతంలో.. గాజాలో ఇజ్రాయెల్ ఊచకోతకు పాల్పడుతోందని అంతర్జాతీయ న్యాయస్థానంలో దక్షిణాఫ్రికా ఓ కేసు వేయగా.. అందులో జోక్యం చేసుకోవాలని ఐర్లాండ్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనికి ప్రతిగాకిందటి ఏడాది డిసెంబరులో ఐర్లాండ్లోని తమ రాయబార కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు టెల్అవీవ్(ISRAEL) ప్రకటించింది కూడా. ఈ నేపథ్యంలో ట్రంప్-మార్టిన్ల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక.. భవిష్యత్తు గాజా పేరిట ట్రంప్ పోస్ట్ చేసిన ఓ ఏఐ వీడియోనూ సైతం ట్రంప్ విడుదల చేయగా అది తీవ్ర విమర్శలకు తావు ఇచ్చింది. హమాస్ సంస్థ సైతం ట్రంప్ ఆలోచనలను తీవ్రంగా తప్పుపట్టింది. గాజా పాలస్తీనాలో విడదీయలేని భాగమని.. కొనుగోలు చేసి.. అమ్మడానికి అదేం స్థిరాస్తి కాదని ప్రకటించింది. అదే సమయంలో ఆ వీడియోను సృష్టించిన డిజైనర్.. అది కేవలం పొలిటికల్ సెటైర్ మాత్రమేనని ప్రకటన చేశాడు. -
Sunita Williams: మళ్లీ నిరాశే.. చివరి నిమిషంలో ప్రయోగం వాయిదా
నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ రాక విషయంలో మళ్లీ నిరాశే ఎదురైంది. వీరిద్దరి రాక ఇంకాస్త ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి వీళ్లను భూమిపైకి తీసుకొచ్చేందుకు నాసా-స్పేస్ఎక్స్ సంయుక్తంగా ‘క్రూ 10 మిషన్’ చేపట్టింది. అయితే ఇవాళ జరగాల్సిన ఈ ప్రయోగం.. చివరి నిమిషంలో నిలిచిపోయింది. కిందటి ఏడాది క్రూ9 మిషన్లో భాగంగా ఐఎస్ఎస్కి వెళ్లిన సునీత, విల్మోర్లు అక్కడే చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. అయితే క్రూ-10 మిషన్ ద్వారా మరో నలుగురు వ్యోమగాముల్ని అక్కడికి పంపి.. ఆ ఇద్దరినీ వెనక్కి రప్పించాలని అనుకున్నారు. ఈ ఉదయం ఫ్లోరిడాలోని కెనడీ అంతరిక్ష ప్రయోగ కేంద్రం 39ఏ కాంప్లెక్స్ నుంచి రాకెట్ ప్రయోగం కౌంట్ డౌన్ సైతం దగ్గర పడింది. అయితే చివరి నిమిషంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రయోగం నిలిచిపోయింది. రాకెట్ హైడ్రాలిక్ సిస్టమ్లో సమస్య ఉత్పన్నం కావడంతో ప్రయోగం నిలిపివేసినట్లు నాసా ప్రకటించింది. దీంతో నలుగురు వ్యోమగాములు బయటకు వచ్చేశారు. రేపు, లేదంటే ఎల్లుండి.. ఈ ప్రయోగాన్ని తిరిగి నిర్వహించే అవకాశం ఉన్నట్లు ఇటు నాసా, అటు స్పేస్ఎక్స్ ప్రకటించుకున్నాయి. ఈ ప్రయోగం జరిగిన వారం తర్వాత.. సునీత, విల్మోర్లు భూమ్మీదకు వచ్చే అవకాశం కనిపిస్తున్నాయి.ప్రీపోన్ అయినప్పటికీ.. తొలుత మార్చి 25వ తేదీన ఈ ప్రయోగాన్ని షెడ్యూల్ చేసి.. ఆ తర్వాత ముందుకు జరిపింది నాసా. అయితే ఇవాళ జరగాల్సి ఉండగా.. చివరి నిమిషంలో సమస్య తలెత్తి వాయిదా పడింది. క్రూ-10 ద్వారా కొత్త టీం అక్కడికి చేరుకోగానే.. స్పేస్ఎక్స్కు చెందిన డ్రాగన్ క్యాప్సూల్ ‘ఎండేవర్’ ద్వారా సునీత, విల్మోర్లు భూమ్మీదకు తిరిగి వస్తారు. అదే సమయంలో ఐఎస్ఎస్ నిర్వహణ కూడా నిలిచిపోకుండా ఉండగలుగుతుందన్నమాట. ఇక క్రూ10లో వెళ్లే నలుగురు వోమగాములు 150 రోజులపాటు ఐఎస్ఎస్లోనే ఉంటారు. ఆ తర్వాత స్పేస్ ఎక్స్కే చెందిన ఎండూరెన్స్ క్యాప్సూల్ ద్వారా భూమ్మీదకు వస్తారు.9 నెలల నిరీక్షణ.. కిందటి ఏడాది జూన్లో బోయింగ్ స్టార్లైనర్ ద్వారా క్రూ9 మిషన్లో భాగంగా సునీత సహా నలుగురు వ్యోమగాములు ఐఎస్ఎస్కు చేరుకున్నారు. అయితే.. స్పేస్క్రాఫ్ట్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఇద్దరు వోమగాములు నిక్ హేగ్, అలెగ్జాండర్ గోర్బునోవ్లు మాత్రమే తిరిగి భూమ్మీదకు వచ్చారు. దీంతో అప్పటి నుంచి సునీత, విల్మోర్లు స్పేస్ స్టేషన్లోనే ఉండిపోయారు. వీరి రాక కోసం యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. -
పాక్ రైలు హైజాక్: 50 నిమిషాలు నరకమే.. ప్రయాణీకుడి ఆవేదన
ఇస్లామాబాద్: సంచలనం సృష్టించిన రైలు హైజాక్ ఉదంతానికి తెర దించినట్టు పాకిస్తాన్ బుధవారం ప్రకటించింది. క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ను మంగళవారం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) చెరబట్టడం, పలువురు ప్రయాణికులను కాల్చి చంపి 215 మందిని బందీలను చేసుకోవడం తెలిసిందే. జైళ్లలో ఉన్న తమ నేతలను 48 గంటల్లోగా వదిలేయకపోతే బందీలందరినీ చంపేస్తామని అల్టిమేటం కూడా జారీ చేసింది. ప్రయాణికులందరినీ సైనిక ఆపరేషన్ ద్వారా బుధవారం సాయంత్రానికల్లా బీఎల్ఏ చెర నుంచి విడిపించినట్టు ఆర్మీ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ ప్రకటించారు.ఈ సందర్బంగా ‘ఘటనా స్థలిలో ఉన్న 33 మంది మిలిటెంట్లను ఆర్మీ స్నైపర్లు హతమార్చారు. ఆ క్రమంలో నలుగురు సైనికులను కోల్పోయాం. మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో మిలిటెంట్లు రైలును హైజాక్ చేశారు. ఆ క్రమంలో 27 మంది ప్రయాణికులను పొట్టన పెట్టుకున్నారు’ అని చెప్పారు. ట్రైన్తో పాటు ఘటనా స్థలిని బాంబ్ డిస్పోజల్ బృందాలు జాగ్రత్తగా జల్లెడ పడుతున్నాయన్నారు. దాడికి కారకులను, వారిని పెంచి పోషిస్తున్న వారిని వెంటాడి వేటాడతామని ప్రకటించారు.భిన్న వాదనలు ఆపరేషన్ విజయవంతమైందన్న ప్రకటనపై భిన్న వాదనలు విన్పిస్తున్నాయి. వేర్పాటువాదులు ఆత్మాహుతి బాంబులుగా ఇప్పటికీ ప్రయాణికుల మధ్య నక్కారని చెబుతున్నారు. మహిళలు, చిన్నారులను మానవ కవచాలుగా వాడుకున్నట్టు మీడియా పేర్కొంది. 50 మంది వేర్పాటువాదులను హతమార్చి 190 మంది ప్రయాణికులను కాపాడినట్టు పాక్ సర్కారు కూడా బుధవారం సాయంత్రం పేర్కొంది. ఇందుకు ప్రతీకారంగా 50 మందికి పైగా బందీలను చంపేసినట్టు బీఎల్ఏ ప్రకటించింది. ‘ఇప్పటిదాకా 100 మందికి పైగా బందీలను కాల్చేశాం. ఇంకో 150 మంది బందీలుగానే ఉన్నారు. డెడ్లైన్లో కొన్ని గంటల్లో ముగియనుంది. ఆలోపు మా నేతలందరినీ వదిలేయకుంటే గంటకు కొందరు చొప్పున బందీలను చంపేస్తాం’ అని ఒక ప్రకటనలో హెచ్చరించింది.ప్రత్యక్ష నరకమే..హైజాక్ నుంచి క్షేమంగా బయటపడ్డ ప్రయాణికులు తాము అనుభవించిన నరకాన్ని తలచుకుంటూ ఇప్పటికీ వణికిపోతున్నారు. వేర్పాటువాదుల చెరనుంచి బయటపడ్డాక వారంతా రాత్రిపూట వణికించే చలిలో 4 గంటల పాటు నడిచి సమీపంలోని రైల్వేస్టేషన్కు చేరుకున్నారు. వృద్ధులు, పిల్లలు, రోగులను మిగతావారు భుజాలపై మోసుకెళ్లారు. సెలవుపై ఇళ్లకు వెళ్తున్న సైనికులను తమ కళ్లముందే కాల్చి పొట్టన పెట్టుకున్నారని హమీద్ అనే ప్రయాణికుడు బీబీసీకి వెల్లడించాడు. ‘బోగీల్లోకి చొరబడటంతోనే ప్రయాణికుల గుర్తింపు కార్డులను చెక్ చేశారు. పిల్లలు, మహిళలు, పౌరులను వేరు చేశారు. సైనికులందరినీ మరోవైపు తరలించారు. ఆ క్రమంలో ముగ్గురు సైనికులను మేం చూస్తుండగానే కాల్చేసి బిగ్గరగా నినాదాలు చేశారు. నేను హృద్రోగినని వేడుకోవడంతో వదిలేశారు’ అని చెప్పాడు. ‘భారీ బాంబు పేలుళ్లు, కాల్పుల మోతలను జీవితంలో మర్చిపోలేను. ఏం జరుగుతుందోనని 50 నిమిషాలకు పైగా ఊపిరి బిగబట్టుకుని గడిపాం’ ఇషాక్ నూర్ చెప్పుకొచ్చాడు. -
ఉక్రెయిన్కు మళ్లీ అమెరికా ఆయుధాలు
కీవ్: ఉక్రెయిన్కు సైనిక సాయంపై సస్పెన్షన్ను డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఎత్తివేయడంతో ఆయుధాల సరఫరా బుధవారం నుంచి మళ్లీ ప్రారంభమైంది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధికార వర్గాలు ధ్రువీకరించాయి. పోలాండ్ లాజిస్టిక్ సెంటర్ నుంచి ఈ ఆయుధాలు వచ్చినట్లు వెల్లడించాయి. మరోవైపు రష్యాతో 30 రోజులపాటు కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నట్లు ఉక్రెయిన్ అధికారులు సంకేతాలిచ్చారు. కాల్పుల విరమణపై అమెరికా నుంచి సమాచారం కోసం ఎదురు చూస్తున్నామని రష్యా అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ చెప్పారు. ఒకవైపు శాంతి కోసం ప్రయ త్నాలు జరుగుతుండగా, మరోవైపు ఉక్రెయిన్పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. బుధ వారం ఉక్రెయిన్పై రష్యా సైన్యం బాలిస్టిక్ క్షిప ణులు ప్రయోగించింది. ఈ దాడిలో ఐదుగురు మర ణించినట్లు ఉక్రెయిన్ అధికారులు ప్రకటించారు. -
గాయాన్ని గంటల్లో మాన్పే మాయా చర్మం
అది చర్మం కాని చర్మం. అయితే అలాంటిలాంటి చర్మం కాదు. గాయాలను శరవేగంగా నయం చేసే చర్మం! ఎంతటి గాయాన్నయినా నాలుగే గంటల్లో 90 శాతం దాకా మాన్పుతుంది. 24 గంటల్లో పూర్తిగా నయం చేసేస్తుంది. వినడానికి ఏదో సైంటిఫిక్ థ్రిల్లర్ సినిమా కథలా అన్పిస్తున్నా అక్షరాలా నిజమిది. ఈ మాయా చర్మం అందుబాటులోకి వస్తే వైద్యచికిత్స కొత్తపుంతలు తొక్కడం ఖాయమని చెబుతున్నారు. అచ్చం చర్మాన్ని తలపించే కొత్త రకం హైడ్రోజెల్ను రూపొందించడంలో సైంటిస్టులు విజయవంతమయ్యారు. చర్మానికి ఉండే స్వీయచికిత్స సామర్థ్యాన్ని ఇది ఎన్నో రెట్లు పెంచుతుందట. ఫిన్లండ్లోని ఆల్టో యూనివర్సిటీ, జర్మనీలోని బైరైట్ వర్సిటీలకు చెందిన పరిశోధకులు దీన్ని రూపొందించారు. నిజానికి ఇటువంటి విప్లవాత్మక ఆవిష్కరణ కోసం ప్రపంచవ్యాప్తంగా చాలా ఏళ్లుగా తీవ్రస్థాయిలో ప్రయత్నాలు జరుగుతూనే వస్తున్నాయి. కానీ అవేవీ ఇప్పటిదాకా అంతగా విజయవంతం కాలేదు. చర్మం తాలూకు విలక్షణతే అందుకు కారణం. సాగే లక్షణం, దీర్ఘకాలిక మన్నిక, తీవ్ర ప్రతికూల పరిస్థితులను తట్టుకోగల సామర్థ్యం వంటి ఎన్నో ప్రత్యేకతలు చర్మం సొంతం. వీటన్నింటినీ మించి గాయాలను తనకు తాను నయం చేసుకునే సాటిలేని సామర్థ్యం చర్మానికి ఉంది. ఇన్ని లక్షణాలతో కూడిన కృత్రిమ చర్మం రూపకల్పన ఇన్నేళ్లుగా సైంటిస్టులకు సవాలుగానే నిలిచింది. తాజాగా రూపొందించిన హైడ్రోజెల్ మాత్రం పూర్తిగా చర్మం లక్షణాలను కలిగి ఉంటుంది. కాలిన, తెగిన గాయాలపై ఈ జెల్ను అమరిస్తే వాటిని చిటికెలో నయం చేస్తుంది. తర్వాత దాన్ని తొలగించవచ్చు. లేదంటే క్రమంగా అదే కరిగిపోతుంది. ఇలా సాధించారు... అతి పలుచనైన నానోషీట్తో రూపొందించిన పాలిమర్ సాయంతో కృత్రిమ చర్మం రూపకల్పన సాధ్యపడింది. మోనోమర్ పొడిని నీటితో కూడిన నానోషీట్లతో చాకచక్యంగా కలపడం ద్వారా అధ్యయన బృందంలోని శాస్త్రవేత్త చెన్ లియాంగ్ దీన్ని సాధించారు. తర్వాత ఈ మిశ్రమాన్ని యూవీ రేడియేషన్కు గురిచేయడంతో అందులోని అణువుల మధ్య ఆశించిన స్థాయిలో బంధం సాధ్యపడింది. ఫలితంగా చక్కని సాగే గుణమున్న చర్మంలాంటి హైడ్రోజెల్ రూపొందించింది. ‘‘అత్యంత హెచ్చు సామర్థ్యంతో కూడిన వ్యవస్థీకృత నిర్మాణం దీని సొంతం. హైడ్రోజెల్కు ఇది గట్టిదనం ఇవ్వడమే గాక గాయాల వంటివాటిని తనంత తానుగా నయం చేసుకోగల సామర్థ్యాన్ని కూడా కట్టబెట్టింది’’ అని అధ్యయన బృందం పేర్కొంది. ‘‘జీవకణాలు చూసేందుకు గట్టిగా ఉన్నా స్వీయచికిత్స సామర్థ్యంతో కూడి ఉంటాయి. సింథటిక్ హైడ్రోజెల్లో ఈ లక్షణాలను చొప్పించడం ఇప్పటిదాకా సవాలుగానే నిలిచింది. దాన్నిప్పుడు అధిగమించాం’’ అని వివరించింది. కృత్రిమ చర్మ పరిజ్ఞానంలో ఇది మైలురాయిగా నిలుస్తుందని పేర్కొంది. ‘‘కాలిన, దీర్ఘకాలిక గాయాలను సత్వరం నయం చేయడం ఇకపై మరింత సులువు కానుంది. అంతేగాక వైద్య చికిత్సలోనే గాక ప్రోస్తటిక్స్, సాఫ్ట్ రోబోటిక్స్ తదితర రంగాల్లో కూడా ఇది ఉపయుక్తం కానుంది’’ అని వివరించింది. మిల్లీమీటర్ మందంలోని జెల్లో దాదాపు 10 వేల నానోïÙట్లుంటాయి. ఫలితంగా దానికి గట్టిదనంతో పాటు సాగే గుణం కూడా ఉంటుంది. ఈ మిరాకిల్ జెల్ ప్రస్తుతానికి ప్రయోగ దశలోనే ఉంది. వైద్యపరంగా పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చేందుకు మరో ఐదేళ్లకు పైగా పట్టవచ్చు. అధ్యయన వివరాలు ప్రతిష్టాత్మక జర్నల్ నేచర్ మెటీరియల్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. ఏమిటీ హైడ్రోజెల్ సింపుల్గా చెప్పాలంటే ఇది జెల్ వంటి మృదువుగా ఉండే పదార్థం. దీన్ని పాలిమర్ తదితర మెటీరియల్స్తో తయారు చేస్తారు. వెంట్రుకల చికిత్స మొదలుకుని ఆహారోత్పత్తుల దాకా దాదాపు అన్నింట్లోనూ వీటిని విస్తృతంగా వాడుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అమెరికా ఉత్పత్తులపై ఈయూ ప్రతీకార సుంకాలు
బ్రస్సెల్స్: అమెరికా, యూరోపియన్ యూనియన్(ఈయూ) మధ్య టారిఫ్ల యుద్ధం జరుగుతోంది. ఈయూకు సంబంధించిన స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం పెంచిన 25 శాతం టారిఫ్లు బుధవారం నుంచే అమల్లోకి వచ్చాయి. అందుకు ప్రతీకారంగా ఈయూ సైతం గంటల వ్యవధిలోనే అమెరికా ఉత్పత్తులపై టారిఫ్లు ప్రకటించింది. అమెరికా నుంచి వచ్చే పారిశ్రామిక, పాడి ఉత్పత్తులపై కొత్త సుంకాలు వసూలు చేయనున్నట్లు బుధవారం ఈయూ తేల్చిచెప్పింది. 28 బిలియన్ డాలర్ల విలువైన అమెరికా ఉత్పత్తులపై సుంకాలు అతిత్వరలో అందుబాటులోకి రాబోతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై ఒత్తిడి పెంచడంలో భాగంగానే ఈయూ సైతం టారిఫ్లు విధిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ట్రంప్ వెనక్కి తగ్గితే ఈయూ దేశాలు సైతం వెనక్కి తగ్గే అవకాశం ఉంది. టారిఫ్ల విషయంలో అమెరికాతో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని ఈయూ అధ్యక్షురాలు ఉర్సులా వాన్డెర్ లెవెన్ చెప్పారు. ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఆర్థికవ్యవస్థలపై టారిఫ్ల పేరిట పెనుభారం మోపడం తమకు ఇష్టం లేదన్నారు. అయితే, అమెరికా చర్యలకు ప్రతిచర్యగా తాము సైతం టారిఫ్లు విధించాలని నిర్ణయించినట్లు తేల్చిచెప్పారు. -
ఫిలడెల్ఫియాలో తానా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
తానా మిడ్-అట్లాంటిక్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఫిలడెల్ఫియాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. పెన్సిల్వేనియా రాష్ట్రంలోని వెస్ట్ చెస్టర్ నగరంలో పియర్స్ మిడిల్ స్కూల్ లో నిర్వహించిన ఈ వేడుకలకు వెయ్యికి మందికి పైగా హాజరై సాంస్కృతిక కార్యక్రమాలు, స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు, డైనమిక్ ఫ్యాషన్ షో, స్టాల్ల్స్, రుచికరమైన విందుతో ఆరు గంటల నాన్ స్టాప్ వినోదాన్ని ఆస్వాదించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గత ఐదున్నర దశాబ్దాల నుండి డెలావేర్ రాష్ట్రంలోని డోవర్ నగరంలో విశేషసేవలు అందిస్తున్న ప్రముఖ చిన్న పిల్లల వైద్యురాలు డాక్టర్ జానకి కాజా గారిని తానా బోర్డు ఆఫ్ డైరెక్టర్ రవి పొట్లూరి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ జానకి కాజా అమెరికా వచ్చినప్పటి నుంచి అనుభవాలను వివరిస్తూ స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేసారు. మన జన్మభూమి భారతదేశం లాగానే కర్మభూమి అమెరికా చాలా గొప్ప దేశమని 1971 లో అమెరికా లో అడుగుపెట్టినప్పటి నుండి ఈరోజు వరకు ఆసుపత్రికి వెళ్లినా, 86 దేశాలు పర్యటించినా మన భారతీయ సంప్రదాయం మరచిపోకుండా తాను ఇప్పటికీ చీర మాత్రమే ధరిస్తానని చీర మన సాంస్కృతిక గర్వానికి చిహ్నంగా ఉంటుందని పేర్కొంటూ మహిళల జీవితం సవాళ్లతో కూడినదని పట్టుదలతో, దృఢసంకల్పంతో అవకాశాలు అందిపుచ్చుకుని జీవితంలో ఎదగాలని ఆకాంక్షించారు. తానా మిడ్ అట్లాంటిక్ మహిళల బృందం ఈ కార్యక్రమం విజయవంతం కోసం అవిశ్రాంతంగా పనిచేసింది. మిడ్-అట్లాంటిక్ మహిళా కమిటీ ఛైర్ సరోజా పావులూరి నేతృత్వంలోని బృందం ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. వ్యాఖ్యాత లక్ష్మి మంద ఎనర్జిటిక్ హోస్టింగ్తో అలరించారు. రాజేశ్వరి కొడాలి, భవాని క్రొత్తపల్లి, సౌజన్య కోగంటి, రవీనా తుమ్మల, భవానీ మామిడి, మైత్రి రెడ్డి నూకల, నీలిమ వోలేటి , రమ్య మాలెంపాటి, బిందు లంక, దీప్తి కోకా తదితరుల కృషిని హాజరైన వారందరూ అభినందించారు.తానా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రవి పొట్లూరి తన ప్రసంగంలో మహిళలకు అభినందనలు తెలిపారు. తానా ఫౌండేషన్ మరియు ఇతర సేవా సంస్థల ద్వారా అమెరికాలోనే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా మిలియన్ల డాలర్లు వెచ్చించి ఎనలేని సేవలందిస్తున్న బాబు రావు, డాక్టర్ జానకి కాజా దంపతులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. డెలావేర్ మిడిల్ టౌన్ నమస్తే ఇండియా రెస్టారంట్ సహా వాలంటీర్లు మరియు క్రాస్ రోడ్స్ రెస్టారంట్, జో కేధార్, రాజన్ అబ్రహం ఇతర దాతలకు అభినందనలు తెలిపారు.2025 జూలై 3 నుంచి 5 వరకు డెట్రాయిట్లో 24వ తానా మహాసభలు జరగబోతున్నాయని తెలిపారు. అందమైన అలంకరణలకు ఫణి కంతేటి మరియు సంగీతాన్ని అందించినందుకు మూర్తి నూతనపాటి, రమణ రాకోతు, ఫోటోగ్రఫీ విశ్వనాధ్ కోగంటిలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తానా మిడ్ అట్లాంటిక్ ప్రాంతీయ ప్రతినిధి వెంకట్ సింగు, సతీష్ తుమ్మల, సునీల్ కోగంటి, టీం స్క్వేర్ చైర్మన్ కిరణ్ కొత్తపల్లి, కృష్ణ నందమూరి, రంజిత్ మామిడి, గోపి వాగ్వాల, సురేష్ యలమంచి, చలం పావులూరి, ప్రసాద్ క్రొత్తపల్లి, కోటి యాగంటి, రవి ముత్తు, రాజు గుండాల, శ్రీనివాస్ అబ్బూరి, సుబ్బా ముప్పా, లీలాకృష్ణ దావులూరి, జాన్ ఆల్ఫ్రెడ్, హేమంత్ ఎర్నేని, సనత్ వేమూరి, హరీష్ అన్నాబత్తిన, రంజిత్ కోమటి, సంతోష్ రౌతు, ఉత్తమ్, హేమరాజ్, రాజా గందె, నాగ రమేష్, కృషిత నందమూరి, ప్రసాద్ కస్తూరి తదితరులు ఈ వేడుకలను విజయవంతం చేయడంలో కృషి చేశారు. -
ఇండియాకు వెళ్తా: అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్
వాషింగ్టన్: అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ చీఫ్ తులసీ గబ్బార్డ్ (Tulsi Gabbard) త్వరలో భారత్లో పర్యటించనున్నారు. ఇండో–పసిఫిక్ దేశాల సందర్శనలో భాగంగా తనకు బాగా పరిచయమున్న భారత్కు వెళ్లనున్నట్లు ఆమె సోమవారం వెల్లడించారు. ఆయా దేశాలతో సంబంధాల బలోపేతానికి, అధ్యక్షుడు ట్రంప్ లక్ష్యాలైన శాంతి, స్వేచ్ఛల సాధనే ఈ పర్యటన ఉద్దేశమని చెప్పారు. జపాన్, థాయ్లాండ్, భారత్లలో పర్యటించడంతోపాటు తిరుగు ప్రయాణంలో ఫ్రాన్స్లో ఆగుతానని చెప్పారు.విమానంలో అడుగుపెడుతున్న ఫొటోను ఆమె ‘ఎక్స్’లో షేర్ చేశారు. మొదటగా ఆమె హనొలులులో ఆగుతారు. అక్కడున్న యూఎస్ ఇండో పసిఫిక్ కమాండ్ ప్రధాన కార్యాలయానికి వెళతారు. కాగా, ప్రధాని మోదీ (PM Modi) ఆహ్వానంపై భారత్కు వస్తున్న తులసీ 18న ఢిల్లీలో ‘రైజినా డైలాగ్’ కార్యక్రమంలో ప్రసంగిస్తారని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. చావెజ్ నియామకానికి సెనేట్ ఆమోదం అమెరికా కార్మిక మంత్రిగా ట్రంప్ నామినీ లోరీ ఛావెజ్ డీరెమర్ నియామకానికి సెనేట్ ఆమోదం తెలిపింది. ఉద్యోగులకు మంచి వేతనాలు, సురక్షిత పని పరిస్థితులు, రిటైర్మెంట్ ప్రయోజనాలకోసం పాటుపడతానని అనంతరం చావెజ్ ప్రకటించారు. అమెరికా కార్మికులను ప్రనపంచంలోనే తొలి స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానన్నారు. వేలాదిమంది ప్రభుత్వోద్యోగులు తమ తొలగింపును కోర్టుల్లో సవాలు చేసిన వేళ ఆమె ఈ ప్రకటన చేయడం విశేషం.చదవండి: భారత విద్యార్థుల చూపు.. ఆ దేశాలవైపు!ఆమె నియామకాన్ని ఇంటర్నేషనల్ బ్రదర్హుడ్ ఆఫ్ టీమ్స్టర్స్తో సహా ప్రముఖ కార్మిక సంఘాలు స్వాగతించాయి. అమెరికా కార్మిక శాఖలో దాదాపు 16 వేల మంది ఫుల్టైమ్ ఉద్యోగులున్నారు. ఉద్యోగుల తొలగింపుకు ట్రంప్ ప్రభుత్వమే ప్రయత్నిస్తున్న నేపథ్యంలో కార్మిక మంత్రిగా చావెజ్ ఏ మేరకు స్వేచ్ఛగా పని చేయగలరన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. -
పీఐఏను మరోసారి అమ్మకానికి పెట్టిన పాకిస్తాన్
ఇస్లామాబాద్: ప్రభుత్వం ఆధీనంలోని పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ (పీఐఏ)ను పాక్ ప్రభుత్వం మరోసారి విక్రయానికి పెట్టింది. గతేడాది అక్టోబర్లో చేసిన ప్రయత్నం విఫలం కావడంతో అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ఒత్తిడి మేరకు జూలై నెలకల్లా ఎలాగోలా పీఐఏను అమ్మేస్తామని తాజాగా హామీ ఇచ్చింది. ఆర్థిక సంస్కరణల్లో భాగంగా తీవ్ర నష్టాల్లో నడుస్తున్న సంస్థల్లో ఒకటైన పీఐఏలోని 51 శాతం నుంచి 100 శాతం వరకు వాటాను విక్రయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.గతేడాది పాక్కే చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీ ఒకటి వెయ్యి కోట్ల రూపాయలకు కొనేందుకు ముందుకు వచ్చింది. మరెవరూ పీఐఏపై ఆసక్తి చూపడం లేదు. అయితే, దీన్ని విక్రయిస్తేనే 7 బిలియన్ డాలర్ల రుణం ఇస్తామంటూ ఐఎంఎఫ్ (IMF) మెలికపెట్టడంతో పాకిస్తాన్ (Pakistan) ప్రభుత్వం మరోసారి ప్రయత్నాలు ప్రారంభించింది.పాకిస్తాన్ ప్రభుత్వానికి షాకిచ్చిన అమెరికా ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రభుత్వానికి అమెరికా (America) షాకిచ్చింది. తుర్క్మెనిస్తాన్లో పాక్ రాయబారి కేకే అహ్సాన్ వాగన్ను తమ దేశంలోకి అనుమతించలేదు. సెలవుల రీత్యా లాస్ఏంజెలెస్ వెళ్లిన వాగన్ను ఇమ్మిగ్రేషన్ అధికారులు విమానాశ్రయంలోనే అడ్డుకున్నారు. చెల్లుబాటయ్యే వీసా, ప్రయాణ పత్రాలున్నా అమెరికాలోకి ప్రవేశించనివ్వకుండా తిప్పి పంపారు. ఇమిగ్రేషన్ అభ్యంతరాలే ఇందుకు కారణమని పాక్ విదేశాంగ శాఖ చెప్పుకొచ్చింది. దీనిపై విచారణకు లాస్ ఏంజెలెస్లోని తమ కాన్సులేట్ను ఆదేశించింది.చదవండి: రైలు హైజాక్.. రెస్క్యూలో పాకిస్తాన్ ఆర్మీ ప్లాన్ సక్సెస్! -
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఎదురుదెబ్బ
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఎదురుదెబ్బ తగిలింది. షేక్ హసీనా ఆస్తుల సీజ్కు ఢాకా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఆమె భారత్లో ఆశ్రయం పొందుతున్న సంగతి తెలిసిందే. షేక్ హసీనాతో పాటు, ఆమె కుటుంబ సభ్యుల ఆస్తులను కూడా సీజ్ చేయాలని ఢాకా కోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో బ్యాంక్ అకౌంట్లను అధికారులు సీజ్ చేయనున్నారు.గత ఏడాది ఆగస్ట్లో బంగ్లాదేశ్లో అల్లర్లు చెలరేగగా, భారీ హింస చోటుచేసుకుంది. దీంతో ప్రధాని పదవికి రాజీనామా చేసిన ఆమె.. భారత్లో తలదాచుకుంటున్నారు. ఈ క్రమంలో హసీనాను బంగ్లాదేశ్కు రప్పించేందుకు ఆ దేశం చాలా ప్రయత్నాలు చేసింది. ఆమె పాస్ పోర్టును కూడా రద్దు చేసింది. హసీనాను తమ దేశానికి పంపించాలని భారత ప్రభుత్వానికి బంగ్లాదేశ్ కూడా లేఖ రాసింది. అయితే, తాజాగా ఢాకా కోర్టు హసీనా, ఆమె బంధువుల ఆస్తులు, బ్యాంక్ ఖాతాలను సీజ్ చేయాలని ఆదేశించింది.కాగా, భారత్లో తలదాచుకుంటున్న షేక్ హసీనాను బంగ్లాదేశ్కు రప్పించడమే తమ తొలి ప్రాధాన్యత అని ఆ దేశ ప్రభుత్వం ఇటీవల ఉద్ఘాటించింది. హసీనాను విచారించేందుకు ప్రయత్నాలను కొనసాగిస్తామని దేశ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్ ప్రెస్ కార్యదర్శి షఫీకుల్ ఆలం తెలిపిన సంగతి తెలిసిందే. ‘‘హసీనా పార్టీ అవామీ లీగ్ భవితవ్యంపై నీడలు కమ్ముకున్నాయి...ఆ పార్టీ దేశ రాజకీయ ముఖచిత్రంలో ఉండాలా, వద్దా అనేది ప్రజలతో పాటు ఇతర పార్టీలు నిర్ణయిస్తాయి. హత్యలు, అదృశ్యాలు, నేరాలకు పాల్పడిన వారికి శిక్ష పడాల్సిందే’’ అంటూ ఆయన నొక్కి చెప్పారు. హసీనా ప్రభుత్వం మానవాళిపై నేరాలకు పాల్పడుతోందంటూ ఐరాస మానవ హక్కుల హైకమిషనర్ కార్యాలయం ఇచ్చిన నివేదికను ఉదాహరించారు. ఈ నేపథ్యంలో హసీనాను అప్పగించే విషయమై భారత్పై ఒత్తిడి పెరిగిందన్నారు. -
పాక్ రైలు హైజాక్.. కొనసాగుతున్న రెస్య్కూ ఆపరేషన్
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్థాన్లో వేర్పాటువాద బలోచ్ మిలిటెంట్లు చెలరేగిపోయారు. ప్రయాణికుల రైలు జాఫర్ ఎక్స్ప్రెస్(Jaffar Express)పై దాడికి దిగి, హైజాక్ చేశారు. ఈ క్రమంలో భద్రతా సిబ్బందిని హతమార్చారు. అయితే రంగంలోకి దిగిన పాక్ భద్రతా బలగాలు.. కౌంటర్ ఆపరేషన్లో మిలిటెంట్లను మట్టు పెట్టాయి. తాజా సమాచారం ప్రకారం.. సైన్యం జరిపిన కాల్పుల్లో 16 మంది రెబల్స్ మరణించారు. ప్రయాణికుల్లో 104 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. సైనిక హెలికాప్టర్లు, డ్రోన్ల ద్వారా బాంబు దాడులతో పాక్ సైన్యం ఈ ఆపరేషన్ నిర్వహిస్తోంది. మిగిలిన ప్రయాణీకులను కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అక్కడి అధికారులు తెలిపారు.ఇదిలా ఉండగా.. పాకిస్తాన్లో బలూచీ వేర్పాటువాదులు మంగళవారం ఏకంగా ఒక ప్రయాణికుల రైలునే హైజాక్ చేసేశారు. ఇది తమ పనేనని నిషేధిత బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) ప్రకటించుకుంది. ‘500 మంది ప్రయాణికుల్లో కనీసం 30 మందిని కాల్చి చంపేశామని, 215 మందిని బందీలుగా పట్టుకున్నాం. మృతులతో పాటు బందీల్లో దాదాపుగా అంతా సైనికులే’ అని పేర్కొంది. దీంతో, బందీలను విడిపించేందుకు సైన్యం హుటాహుటిన రంగంలోకి దిగింది.🚨 TRAIN HIJACK IN PAKISTAN.Jaffar Express from Quetta to Peshawar HIJACKED after IED blast by Baloch rebels pic.twitter.com/d9HWcmP2PO— akhilesh kumar (@akumar92) March 12, 2025ఘటనా స్థలిని సైనిక హెలికాప్టర్లు పెద్ద సంఖ్యలో చుట్టుముట్టి బాంబు దాడులకు దిగాయి. దాంతో బీఎల్ఏ మండిపడింది. సైనిక చర్యను తక్షణం నిలిపేయకపోతే బందీలందరినీ చంపేస్తామంటూ పాక్ సర్కారును తీవ్రంగా హెచ్చరించింది. రాజకీయ ఖైదీలుగా నిర్బంధించిన బలూచీ నేతలు, కార్యకర్తలందరినీ 48 గంటల్లోపు బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేసింది. లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవని స్పష్టం చేసింది. దాంతో సైనిక చర్యకు షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం తాత్కాలికంగా విరామం ప్రకటించింది.బలూచిస్తాన్తో పాటు పరిసర ప్రావిన్సుల్లో ఎమర్జెన్సీ విధించారు. ఘటనను కవర్ చేయకుండా మీడియాపై ప్రభుత్వం ఆంక్షలు విధించినట్టు చెబుతున్నారు. ముష్కరులతో ఎలాంటి సంప్రదింపులూ ఉండబోవని అంతర్గత శాఖ మంత్రి మొహసిన్ నక్వీ ప్రకటించారు. బందీల్లో దాదాపు 80 మందిని విడిపించినట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. మృతుల సంఖ్య 35 దాటిందన్నారు.#TrainHijack Jaffer Express hijack in Pakistan 🇵🇰 The Train 🚂 was on its way from Quetta to Peshawar when it was attached by the Beloch rebels about 150 passengers & 6 military 🎖️ personnel were made hostages #TrainHijack #TRAIN #Balochistan #PakistanTrainHijack #TrainHijack pic.twitter.com/h4rbGREMQT— X highlight*️⃣ (@Abu_officl) March 12, 2025గ్రేటర్ బలోచిస్థాన్ ఏర్పాటే లక్ష్యంపాకిస్థాన్లోని దాదాపు 44 శాతం భూభాగం తన సొంతమైన బలోచిస్థాన్ ప్రావిన్సులో చమురు, బొగ్గు, బంగారం, రాగి, సహజ వాయువు తదితర వనరులు పుష్కలంగా ఉన్నాయి. వీటి ఆదాయం పాక్ ఖజానా నింపుతోంది. కోటిన్నర జనాభా గల ఈ పర్వత రాష్ట్రంలో మాత్రం అత్యధిక పేదరికం ఉంది. 1947 నాటికి ఈ ప్రాంతం పలువురు స్థానిక పాలకుల అధీనంలో ఉండేది. వీరిలో శక్తిమంతుడైన అహ్మద్ యార్ ఖాన్ స్వతంత్ర బలోచ్ రాష్ట్రం కావాలని పట్టుబట్టారు. అలా చేస్తే బలోచిస్థాన్లో సోవియట్ యూనియన్ (రష్యా) తిష్ఠ వేస్తుందని బ్రిటిషర్లు ఆందోళన చెందారు. పాకిస్థాన్ సైన్యం బలోచ్ భూభాగంలోకి ప్రవేశించి ఒత్తిడి తీసుకురావడంతో 1948 మార్చి 27న అహ్మద్ యార్ ఖాన్ విలీనపత్రంపై బలవంతంగా సంతకం చేయాల్సి వచ్చింది. నాటి నుంచీ ఈ ప్రాంతంలో రగులుతున్న అసంతృప్తి నేటికీ చల్లారలేదు. ఈ నేపథ్యంలో 2000 సంవత్సరంలో పుట్టిందే ‘బలోచ్ లిబరేషన్ ఆర్మీ’ (బీఎల్ఏ). సహజ వనరులను కాపాడుకొని, గ్రేటర్ బలోచిస్థాన్ ఏర్పాటు చేసుకోవడమన్నదే వీరి లక్ష్యం. గత అయిదేళ్లుగా ఈ పోరాటం తన పంథా మార్చుకొని మిలిటెన్సీ బాట పట్టింది. సాయుధ పోరాటాలు చేస్తున్న వివిధ దళాలు ఏకమై ‘బలోచ్ నేషనల్ ఆర్మీ’ ఏర్పాటు చేశాయి. పాక్తోపాటు అమెరికా, బ్రిటన్ బీఎల్ఏను ఉగ్రసంస్థగా ప్రకటించాయి.ఇలా జరిగింది..దాదాపు 500 మంది ప్రయాణికులతో కూడిన జాఫర్ ఎక్స్ప్రెస్ మంగళవారం ఉదయం 9 గంటలకు బలూచిస్తాన్లోని క్వెట్టా నుంచి పెషావర్కు బయల్దేరింది. బొలాన్ జిల్లాలో కొండ ప్రాంతంలో కనుమ సమీపంలో గుదలార్, పెరో కున్రీ ప్రాంతాల మధ్య 8వ నంబర్ టన్నెల్ సమీపంలో బీఎల్ఏ సాయుధులు అప్పటికే రైలు పట్టాలను పేల్చేసి మాటు వేశారు. అక్కడికి చేరుకుని అతి నెమ్మదిగా వెళ్తున్న రైలు ఒక్కసారిగా పట్టాలు తప్పింది. వెంటనే బలూచీ సాయుధులు భారీ సంఖ్యలో రైలును చుట్టుముట్టారు. నేరుగా ఇంజన్పైకి కాల్పులు జరపడంతో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు.రైలు ఆగిపోగానే మొత్తం 9 బోగీల్లోకీ చొరబడ్డారు. వారికి, రైల్లోని భద్రతా సిబ్బందికి మధ్య కాసేపు కాల్పులు జరిగాయి. అనంతరం రైలును బీఎల్ఏ సాయుధులు తమ అధీనంలోకి తీసుకుని సమీపంలోని టన్నెల్లోకి తరలించారు. ప్రయాణికుల్లో సాధారణ పౌరులు, మహిళలు, చిన్నారులను ఒకవైపు, సైనికులను మరోవైపు విడదీశారు. అనంతరం సైనికుల్లో 20 నుంచి 30 మందిని కాల్చి చంపారు. సాధారణ పౌరులను వదిలేశారు. 215 మందిని బందీలుగా చేసుకున్నారు. వారిలో అత్యధికులు పోలీసు, యాంటీ టెర్రరిజం ఫోర్స్, ఐఎస్ఐకు, సైన్యానికి చెందినవారే ఉన్నారు. వారంతా సెలవులపై స్వస్థలాలకు వెళ్తున్నారు అని స్థానిక మీడియా పేర్కొంది. ఘటనా స్థలిలో మొబైల్ నెట్వర్క్ వంటివేమీ లేకపోవడంతో రైల్లోని సిబ్బందితో ఎలాంటి కాంటాక్టూ వీలవడం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దాడికి పాల్పడింది బీఎల్ఏలోని మజీద్ బ్రిగేడ్గా భావిస్తున్నారు. వారితో పాటు స్పెషల్ టాక్టికల్ ఆపరేషన్స్ స్క్వాడ్, ఫతే స్క్వాడ్ ప్రత్యేక విభాగాలు కూడా దాడిలో పాల్గొన్నట్టు బీఎల్ఏ ప్రకటించింది. -
జెలెస్కీ గ్రీన్సిగ్నల్.. పుతిన్ ప్లానేంటి?
జెద్దా: మూడేళ్లుగా కొనసాగుతున్న రష్యా–ఉక్రెయిన్ యుద్దానికి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా ప్రతిపాదించిన 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందానికి ఉక్రెయిన్ అంగీకరించింది. ఈ నేపథ్యంలో ఇరు పక్షాలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి.అమెరికా, ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణ విషయమై సౌదీ అరేబియాలోని జెద్దా వేదికగా ఉన్నతాధికారుల స్థాయిలో చర్చలు జరిగాయి. ఉక్రెయిన్లో శాంతి నెలకొల్పడమే లక్ష్యంగా చర్చించారు. ఈ క్రమంలో అమెరికా (USA) ప్రతిపాదించిన 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందానికి ఉక్రెయిన్ అంగీకరించింది. ఈ నేపథ్యంలో, సైనిక సాయం, నిఘా భాగస్వామ్యానికి సంబంధించి తక్షణమే ఉక్రెయిన్పై విధించిన ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు అమెరికా తెలిపింది. ఇక ఖనిజాల తవ్వకానికి సంబంధించి సాధ్యమైనంత త్వరగా ఒప్పందానికి వచ్చేందుకు రెండు దేశాలు నిర్ణయానికి వచ్చాయి.ఈ సందర్బంగా అమెరికా తరఫున విదేశాంగ మంత్రి మార్కో రుబియో మాట్లాడుతూ.. ఉక్రెయిన్ కాల్పుల విరమణకు ఓకే చెప్పింది. ఇది యుద్దం ముగింపునకు కీలక పరిణామం. ఈ చర్చల సారాంశాన్ని రష్యాకు కూడా తెలియజేస్తాం. ఇప్పుడు బంతి పుతిన్ చేతిలో ఉంది. రష్యా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి’ అని చెప్పుకొచ్చారు. ఇక, ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందానికి సంబంధించి రష్యాతో అమెరికా మాట్లాడనుంది.🚨 BREAKING: Ukraine has agreed to a US proposal for a 30-day ceasefire, contingent on Russia’s acceptance.The US will also resume military aid to Ukraine and lift the pause on intelligence-sharing as part of the agreement.#VMNews pic.twitter.com/FN8QlYlE7C— Virgin Media News (@VirginMediaNews) March 11, 2025రష్యాపైకి ఉక్రెయిన్ డ్రోన్లు..మరోవైపు.. ఉక్రెయిన్ మంగళవారం రష్యాపైకి అతిపెద్ద డ్రోన్ల దాడికి దిగింది. రష్యాలోని 10 ప్రాంతాలపైకి దూసుకొచ్చిన 337 డ్రోన్లను కూల్చివేసినట్టు రష్యా మిలటరీ తెలిపింది. డ్రోన్ల దాడిలో ఒకరు చనిపోగా పదుల సంఖ్యల జనం గాయపడినట్లు రష్యా తెలిపింది. యుద్ధానికి ముగింపు పలికే లక్ష్యంతో ఉక్రెయిన్–అమెరికా మధ్య సౌదీ అరేబియాలోని జెడ్డాలో మంగళవారం చర్చలు మొదలవడానికి కొద్ది గంటల ముందు ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. తాజా దాడిపై ఉక్రెయిన్ స్పందించలేదు. అత్యధికంగా సరిహద్దుల్లోని కస్క్ ప్రాంతంలోకి వచ్చిన 126 డ్రోన్లను కూల్చినట్లు రష్యా మిలటరీ తెలిపింది. రాజధాని మాస్కో దిశగా వచ్చిన మరో 91 డ్రోన్లను ధ్వంసం చేశామంది. ఇంకా, సరిహద్దులకు సమీపంలోని బెల్గొరోడ్, బ్రయాన్స్్క, వొరొనెజ్తోపాటు సుదూర ప్రాంతాలైన కలుగ, లిప్ట్స్్క, నిజ్నీ నొవ్గొరోడ్, ఒరియోల్, రైజాన్లపైకి కూడా ఇవి వచ్చాయని వివరించింది. -
మనిషిని కుక్క షూట్ చేసింది!!
మెంఫిస్ సిటీ: కుక్క మనిషిని కరవడం వార్తకాదు.. మనిషే కుక్కను కరవడం వార్త అని గతంలో ఒక ఫేమస్ వాక్యం ఉండేది. ఇప్పుడు దానిని ‘‘మనిషి కుక్కను షూట్ చేయడంకాదు.. కుక్క మనిషిని షూట్ చేయడం వార్త’’ అని మార్చి రాసుకోవాలేమో. ఇలాంటి ఉదంతం సోమవారం తెల్లవారుజామున అమెరికాలో జరిగింది. టెన్నిస్సీ రాష్ట్రంలోని మెంఫిస్ సిటీ సమీప ఫ్రేసర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. జెరాల్డ్ కిర్క్వుడ్ అనే వ్యక్తి తన గర్ల్ఫ్రెండ్తో కలిసి బెడ్పై నిద్రిస్తుండగా తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఏడాది వయస్సున్న పిట్బుల్ జాతి పెంపుడు శునకం ఆ గదికి వచ్చింది. వీళ్లిద్దరూ నిద్రిస్తూ బెడ్ మీద ఒక గన్ను అలాగే వదిలేశారు. దాంట్లో బుల్లెట్లు లోడ్చేసి ఉన్నాయి. శునకం ఒక్క ఉదుటున బెడ్ మీదకు దూకింది. అది సరిగ్గా గన్ ట్రిగ్గర్పై దూకడంతో ట్రిగ్గర్ నొక్కుకుని గన్ పేలింది. దీంతో దూసుకొచి్చన బుల్లెట్ ఆ వ్యక్తి ఎడమ తొడను పైపైన చీలిస్తూ బయటకు దూసుకెళ్లింది. బుల్లెట్ గాయంతో జెరాల్డ్, అతని గర్ల్ఫ్రెండ్ల నిద్ర మొత్తం ఒక్క దెబ్బతో పోయింది. రక్తమోడుతున్న జెరాల్డ్ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆయనకు ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పారు. శునకం కారణంగా గన్ పేలిన ఘటనపై బాధితుడిని మీడియా ప్రశ్నించింది. కుక్క దూకడంతో నిద్రలేచారా? బుల్లెట్ గాయంతో లేచారా? అని ప్రశ్నించగా రెండూ ఒకేసారి జరిగాయని ఆయన నవ్వుతూ చెప్పడం విశేషం. ఆ ఆయుధాన్ని అతని గర్ల్ఫ్రెండ్ తర్వాత తీసుకెళ్లింది. ఓరియో పేరున్న ఆ కుక్కపై పోలీసులు ఎలాంటి కేసు నమోదుచేయలేదు. -
నా ఐస్క్రీమ్ తినేసింది అమ్మను అరెస్ట్ చేయండి
జీవితంలో కొన్ని పనులు చేయకూడదంటారు. అందులో కొత్తది ఒకటి వచ్చి చేరింది. అదేంటంటే చిన్నారుల చేతుల్లోని ఐస్క్రీమ్ను పొరపాటున కూడా దొంగలించకూడదు. దొంగలిస్తే పోలీసులు ఖచ్చితంగా వస్తారు. భారత్లో వస్తారో లేదో తెలీదుగానీ అమెరికాలో మాత్రం ఖచ్చితంగా వస్తారు. అరెస్ట్చేస్తారో లేదో తెలీదుగానీ వారు అవాక్కవడం మాత్రం ఖాయం. ఇటు చిన్నారి తల్లి, అటు పోలీసులు సైతం కొద్దిసేపు నవ్వుకున్న సరదా ఉదంతం అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రంలోని మౌంట్ ప్లీసాంట్ పట్టణంలో గత మంగళవారం జరిగింది. అటు దొంగతనం.. ఇటు 911కు ఫోన్ ఇష్టంగా తింటున్న ఐస్క్రీమ్ను కన్న తల్లి గభాలున లాక్కుని తినేసే సరికి నాలుగేళ్ల బుడతడికి పట్టరాని కోపం వచ్చింది. ఏడ్వడం మానేసి తల్లికి ఎలాగైనా గుణపాఠం నేర్పాలని నిశ్చయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా, న్యాయం కోసం ఫోన్లైన్లో పోలీసుల తలుపు తట్టాడు. 911 నంబర్కు ఫోన్చేసి తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పాడు.నాలుగేళ్ల పిల్లాడు చెబుతున్న దాంట్లో నిజానిజాలను నిగ్గుతేల్చేందుకు ఇద్దరు మహిళా పోలీసులు రంగంలోకి దిగారు. అంతకుముందు పిల్లాడు, పోలీసుల మధ్య కొద్దిసేపు ఫోన్ సంభాషణ జరిగింది. ఇప్పుడా ఆడియో సంభాషణ రికార్డ్ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. చిన్నారి వాదన విన్న వారంతా తెగ నవ్వుకున్నారు.అమ్మను తీసుకెళ్లండి911 డిస్పాచ్ విభాగంలో ఉన్న పోలీసు ఒకరు ఈ పిల్లాడి ఫోన్కాల్కు స్పందించారు. సమస్య ఏంటని ప్రశ్నించారు. ‘‘మా అమ్మ చెడ్డదైపోయింది’’అని చెప్పాడు. సరేగానీ అసలేమైందని అధికారి అడగ్గా.. ‘‘వెంటనే వచ్చి మా అమ్మను బంధించండి’’అని సమాధానమిచ్చాడు. లాక్కుని ఐస్క్రీమ్ తింటున్న తల్లి.. పిల్లాడు పోలీసులకు ఫోన్చేయడం చూసి అవాక్కైంది. వెంటనే తేరుకుని పిల్లాడి నుంచి ఫోన్ లాక్కుని ‘‘ఫోన్ చేయాల్సిన పెద్ద విషయం ఏమీ లేదండి. మా అబ్బాయి వయసు కేవలం నాలుగేళ్లు మాత్రమే. వీడి ఐస్క్రీమ్ తిన్నాను. అందుకే మీకు ఫోన్చేసి ఉంటాడు’’అని చెప్పింది. వీళ్లు ఓవైపు మాట్లాడుతుంటే పిల్లాడు మాత్రం తన వాదనను కొనసాగించాడు.ఐస్క్రీమ్ లాక్కుని అమ్మ పెద్ద తప్పు చేసిందని పిల్లాడు అరవడం ఆ ఫోన్కాల్లో రికార్డయింది. విషయం అర్థమై నవ్వుకున్న పోలీసులు 911 నిబంధనల ప్రకారం పిల్లాడి ఇంటికెళ్లారు. పోలీసుల రాక గమనించి పిల్లాడు మళ్లీ వాళ్లకు నేరుగా ఫిర్యాదుచేశాడు. అమ్మను అరెస్ట్చేసి జైలుకు తీసుకెళ్లాలని డిమాండ్చేశాడు. ‘‘సరే. మీ అమ్మను నిజంగానే జైళ్లో వేస్తాం. నీకు సంతోషమేగా?’’అని పోలీసులు అడగ్గా.. ‘‘వద్దు వద్దు. నాకు కొత్త ఐస్క్రీమ్ ఇస్తే సరిపోతుంది’’అని అసలు విషయం చివరకు చెప్పాడు. దీంతో పిల్లాడి ఐస్ గోల అక్కడితో ఆగింది. అయితే రెండు రోజుల తర్వాత పోలీసులు మళ్లీ ఆ పిల్లాడి ఇంటికొచ్చారు. మళ్లీ ఎందుకొచ్చారబ్బా అని సందేహంగా చూస్తున్న పిల్లాడి చేతిలో పోలీసులు పెద్ద ఐస్క్రీమ్ను పెట్టారు. దాంతో చిన్నారి సంతోషానికి అవధుల్లేకుండా పోయింది. ఈ ఐస్క్రీమ్ వృత్తాంతాన్ని పోలీసులు మీడియాకు వెల్లడించడంతో ఈ విషయం అందరికీ తెల్సింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు దుతర్తే అరెస్ట్
మనీలా: ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రొడ్రిగో దుతర్తే మంగళవారం అరెస్ట య్యారు. హాంకాంగ్ నుంచి వచ్చిన ఆయన్ను మనీలా లోని అంతర్జాతీయ విమా నాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అధ్యక్షుడిగా ఉన్న సమయంలో డ్రగ్స్ అక్రమ రవాణాదారులను చంపేయాలంటూ దుతర్తే ఇచ్చిన పిలుపుతో వేలాది మంది దారుణ హత్యకు గురవడం తీవ్ర వివా దాస్పదమైంది. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ)ఆయనపై విచారణకు చర్యలు ప్రారంభించింది.అయితే, ఆ విచారణ నుంచి తప్పించుకునేందుకు ఐసీసీ నుంచి వైదొలగుతున్నట్లు అధ్యక్షుడిగా ఉన్న దుతర్తే ప్రకటించారు. 2022 ఎన్నికల్లో ఫెర్డినాండ్ మార్కోస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అనంతర పరిణామాల్లో దుతర్తేపై వచ్చిన ఆరోప ణలపై విచారణను తిరిగి ప్రారంభించనున్నట్లు 2023 జూలైలో ఐసీసీ ప్రకటించింది.జన హననా నికి పాల్పడ్డారంటూ వచ్చిన ఆరోపణలపై దుతర్తే కు వారెంట్లు జారీ చేసింది. ఈ వారెంట్లకు స్పందనగానే దుతర్తేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ తెలి పారు. దుతర్తేపై విచారణకు ఐసీసీకి సహక రిస్తామని అధ్యక్షుడు మార్కోస్ ప్రకటించారు. -
మినీ ఇండియా.. మారిషస్
పోర్ట్ లూయిస్: భారత్కు, గ్లోబల్ సౌత్కు మధ్య మారిషస్ ఒక వంతెన అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మారిషస్ కేవలం భాగస్వామ్య దేశం మాత్రమే కాదని, భారతదేశ కుటుంబంలో ఒక అంతర్భాగమని చెప్పారు. మారిషస్ అంటే ‘మినీ ఇండియా’ అని అభివర్ణించారు. ఆయన మంగళవారం మారిషస్ రాజధాని పోర్ట్ లూయిస్లో ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో మారిషస్ ప్రధాని డాక్టర్ నవీన్చంద్ర రామ్గూలమ్, వీణా దంపతులు, మంత్రివర్గ సభ్యులు సైతం పాల్గొన్నారు.భారత్, మారిషస్ మధ్య బలమైన చారిత్రక సంబంధాలు ఉన్నాయని మోదీ గుర్తుచేశారు.ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా(ఓసీఐ) కార్డులను రామ్గూలమ్ దంపతులకు మోదీ అందజేశారు. మారిషస్లోని ఏడో తరం భారతీయులకు కూడా ఈ కార్డులు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. అంతకుముందు రెండు రోజుల పర్యటన నిమిత్తం మారిషస్కు చేరుకున్న ప్రధాని మోదీకి చిరస్మరణీయమైన స్వాగతం లభించింది.రాజధాని పోర్ట్ లూయిస్లోని సర్ సీవూసాగర్ రామ్గూలమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో మారిషస్ ప్రధాని నవీన్చంద్ర రామ్గూలమ్తోపాటు ఉప ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, నేషనల్ అసెంబ్లీ స్పీకర్, ప్రతిపక్ష నేత, విదేశాంగ మంత్రి, కేబినెట్ సెక్రెటరీ తదితరులు ఘన స్వాగతం పలికారు. మోదీని స్వాగతించడానికి మొత్తం మంత్రివర్గం తరలిరావడం గమనార్హం. మంత్రులు, అధికారులు సహా 200 మందికి ఆయన కోసం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. బిహారీ సంప్రదాయ స్వాగతం మారిషస్లో నివసిస్తున్న భారతీయులు ప్రధాని మోదీకి సాదర స్వాగతం పలికారు. మోదీ బస చేసిన హోటల్ వద్ద భారతీయ మహిళలు సంప్రదాయ బిహారీ సాంస్కృతిక సంగీతభరిత నృత్యం ‘గీత్ గవాయ్’తో ఆయనను స్వాగతించారు. అలాగే భోజ్పురి సంప్రదాయ గీతం ఆలపించారు. భారత త్రివర్ణ పతాకం చేతబూని ‘భారత్ మాతాకీ జై’ అని బిగ్గరగా నినదించారు. తనకు లభించిన అపూర్వమైన గౌరవ మర్యాదల పట్ల ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. మారిషస్ అధ్యక్షుడికి గంగాజలం బహూకరణ మారిషస్ అధ్యక్షుడు ధరమ్ గోకుల్కు ప్రధాని మోదీ అరుదైన కానుక అందజేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్లో త్రివేణి సంగమం వద్ద జరిగిన మహా కుంభమేళా సమయంలో ఇత్తడి, రాగి పాత్రలో సేకరించిన పవిత్ర గంగజలాన్ని బహూకరించారు. బిహార్లో సాగు చేసిన సూపర్ఫుడ్ మఖానాతోపాటు మరికొన్ని బహుమతులు సైతం అందించారు. అలాగే ధరమ్ గోకుల్ భార్య బృందా గోకుల్కు బనారసీ చీరను కానుకగా ఇచ్చారు. గుజరాత్ కళాకారులు తయారు చేసిన సందేలి చెక్కపెట్టెలో ఈ చీరను అందజేశారు. అలాగే ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా(ఓసీఐ) కార్డును ధరమ్ గోకుల్ దంపతులకు అందించారు.దివంగత నేతలకు నివాళులు భారత్, మారిషస్ ప్రధానమంత్రులు మోదీ, నవీన్చంద్ర రామ్గూలమ్ సర్ సీవూసాగర్ రామ్గూలమ్ బొటానికల్ గార్డెన్ను సందర్శించారు. ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. మారిషస్ దివంగత నేత సీర్ సీవూసాగర్ రామ్గూలమ్ సమాధి వద్ద మోదీ పుష్పగుచ్ఛం ఉంచి ఘనంగా నివాళులల్పించారు. అలాగే మాజీ అధ్యక్షుడు, మాజీ ప్రధాని అనిరుధ్ జగన్నాథ్ సమాధి వద్ద నివాళులల్పించారు. వారిని స్మరించుకున్నారు.మోదీకి మారిషస్ అత్యున్నత పురస్కారం భారత ప్రధానమంత్రి మోదీని తమ దేశ అత్యున్నత పురస్కారంతో సత్కరించనున్నట్లు మారిషస్ ప్రధాని రామ్గూలమ్ ప్రకటించారు. మోదీకి ప్రతిష్టాత్మక ‘ద గ్రాండ్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ అండ్ కీ ఆఫ్ ద ఇండియన్ ఓషియన్’ అవార్డు అందజేస్తామని వెల్లడించారు. ఈ పురస్కారం అందుకోనున్న మొట్టమొదటి భారత ప్రధానిగా మోదీ రికార్డుకెక్కబోతున్నారు. -
పాక్లో బలూచ్ భగభగలు
పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లో ఏకంగా రైలునే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎ ల్ఏ) తమ అధీనంలోకి తెచ్చుకోవడంతో బలూ చిస్తాన్ స్వయంప్రతిపత్తి అంశం మరోసారి తెరమీదకొచ్చింది. పాతికేళ్లుగా సాయుధ ఉద్య మపంథాను అనుసరిస్తున్న బీఎల్ఏ మూలాలు ఆ ప్రాంత ప్రజల అసంతృప్తి, ఆగ్ర హంలో ఉన్నాయి. బలవంతంగా తమను స్వతంత్ర పాక్లో కలిపేసి తమ అభివృద్ధిని కాల రాశారని బలూచ్ ప్రజలు భావిస్తుండటమే ఈ ఉద్యమం ఇంకా కొనసాగడానికి అసలు కారణం.ఎవరీ బలూచ్లు?పాకిస్తాన్లోని నైరుతి ప్రాంతాన్ని బలూచిస్తాన్గా పిలుస్తారు. ఇది పాక్లోని ఒక ప్రావిన్స్గా కొనసాగుతోంది. ఇక్కడ స్థానిక బలూచ్ తెగ ప్రజల పూర్వీకులు సమీప ఇరాన్, అఫ్గానిస్తాన్లోనూ స్థిరపడ్డారు. ఇరాన్కు ఆగ్నేయంగా, అఫ్గానిస్తాన్కు దక్షిణంగా ఈ సువిశాల ప్రాంతం విస్తరించి ఉంది. దాదాపు 3,50,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణమున్న బలూచ్ ప్రాంతం దేశంలోనే అతిపెద్ద ప్రావిన్స్ అయినప్పటికీ అభివృద్ధి విషయంలో ఆమడదూరంలో నిలిచిపోయింది. ఇక్కడ జనాభా కూడా అత్యల్పం. మొత్తం పాక్ విస్తీర్ణంలో బలూచ్ 44 శాతం ఉంటుంది. దశాబ్దాలక్రితం స్వతంత్ర ప్రాంతంగా కొనసాగిన బలూచిస్తాన్ను ఆ తర్వాత బ్రిటిషర్లు ఆక్రమించి స్థానిక కలాట్ సంస్థానం(ఖానేట్) పాలకుడు ఖాన్కు పరిపాలనా బాధ్యతలు అప్పగించారు.1948 మార్చి 27వ తేదీన బలూచిస్తాన్ను పాకిస్తాన్లో అధికారికంగా విలీనం చేశారు. ఈ విలీన ప్రక్రియను నాటి బలూచిస్తాన్ పాలకుల్లోని ఒక వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. ఆ వ్యతిరేకతే తదనంతరకాలంలో తీవ్ర నిరసనగా, వేర్పాటువాదంగా చివరకు బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ)గా అవతరించింది. 1948, 1958–59, 1962–63, 1973–77 కాలాల్లో బలూచ్ స్వతంత్య్ర ఉద్యమాలు కొనసాగిన నాటి పాకిస్తాన్ ప్రభుత్వాలు ఆ ఆందోళనలను ఉక్కుపాదంతో అణిచివేశాయి. ఈ కాలంలో వేలాది మంది బలూచ్ ప్రజలు అదృశ్యమయ్యారు.అక్కడి కీలక బలూచ్ నేతలు కొందరు దేశం వీడారు. కొందరు ముఖ్యనేతలు హత్యకు గురయ్యారు. 2003 ఏడాది నుంచి మళ్లీ బీఎల్ఏ ఆవిర్భావంతో స్వతంత్ర బలూచ్ కోసం పోరాటం ఉధృతమైంది. సాయుధ బాటలో పయనిస్తూ తరచూ పాకిస్తాన్ సైన్యం, ప్రభుత్వ ఆస్తులు, పౌరులపై దాడులకు తెగబడుతోంది. బలూచ్ ప్రజల స్వయంనిర్ణయాధికారం, పాకిస్తాన్ నుంచి విడివడి ప్రత్యేక ప్రాంతంగా ఏర్పడాలన్న లక్ష్యాలతో బీఎల్ఏ పోరాడుతోంది. ఉద్యమా న్ని అణచివేసే క్రమంలో తీవ్రస్థాయిల మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని పాకిస్తాన్పై అంతర్జాతీయంగా ఆరోపణలు వెల్లువెత్తాయి. అపార సంపదపర్వతమయ బలూచిస్తాన్లో అపార సహజసంపద సందప దాగి ఉంది. ఇక్కడ సహజవాయు నిక్షేపాలు ఎక్కువ. దక్షిణ పాకిస్తాన్లో అరేబియా సముద్రతీరం వెంట ఉన్న ఏకైక అతిపెద్ద గ్వాదర్ పోర్ట్ బలూచిస్తాన్లోనే ఉంది. సరకు రవాణాకు అనువైన ప్రాంతం. దీంతో చైనా ఈ ప్రాంతంపై కన్నేసింది. చైనా, పాకిస్తాన్ ఆర్థిక కారిడార్(సీపెక్)ను నిర్మించాలని చైనా తలపోయడం తెల్సిందే. ఈ సీపెక్ బలూచిస్తాన్ గుండా వెళ్తుంది.సీపెక్ ఈ ప్రాంత అభివృద్ధిని పెంచుతుందని పాకిస్తాన్ ప్రభుత్వం చెబుతుండగా తమ ప్రాంత సంపదను కొల్లగొట్టడమే ప్రభుత్వ లక్ష్యమని స్థానిక బలూచ్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అందుకే ఇక్కడ సీపెక్ సంబంధ ప్రాజెక్టులపై తరచూ దాడులుచేస్తున్నారు. ముఖ్యంగా చైనా సిబ్బందిని బీఎల్ఏ లక్ష్యంగా చేసుకుంది. దశాబ్దాలుగా పేదరికంలో మగ్గిపోవడానికి పాకిస్తాన్ ప్రభుత్వ అలసత్వం, నిర్లక్ష్యమే కారణమని బలూచ్ ప్రాంతవాసుల్లో ఒక అభిప్రాయం గూడుకట్టుకుపోయింది.ఇది బీఎల్ఏ సాయుధపోరుకు నైతిక, ఆర్థిక స్థైర్యాన్ని ఇస్తోంది. బీఎల్ఏకు పాక్ సైన్యానికి మధ్య జరుగుతున్న ఘర్షణల్లో ఇప్పటికే వందలాది మంది అమాయక ప్రజలు ప్రాణాలుకోల్పోయారు. దీంతో వేర్పాటువాదం బాటలో పయనిస్తున్న బీఎల్ఏను ఇప్పటికే అమెరికా, బ్రిటన్లు ఉగ్రసంస్థగా ప్రకటించాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పాక్లో రైలు హైజాక్
కరాచీ/ఇస్లామాబాద్: పాకిస్తాన్లో బలూచీ వేర్పాటువాదులు ఘోరానికి తెగబడ్డారు. మంగళవారం బలూచిస్తాన్ ప్రావిన్సులో ఏకంగా ఒక ప్రయాణికుల రైలునే హైజాక్ చేసేశారు. ఇది తమ పనేనని నిషేధిత బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) ప్రకటించుకుంది. ‘‘500 మంది ప్రయాణికుల్లో కనీసం 30 మందిని కాల్చి చంపేశామని, 215 మందిని బందీలుగా పట్టుకున్నాం. మృతులతో పాటు బందీల్లో దాదాపుగా అంతా సైనికులే’’ అని పేర్కొంది. దీనిపై పాక్ ప్రభుత్వం ఇప్పటిదాకా అధికారికంగా స్పందించలేదు. బందీలను విడిపించేందుకు సైన్యం హుటాహుటిన రంగంలోకి దిగింది.ఘటనా స్థలిని సైనిక హెలికాప్టర్లు పెద్ద సంఖ్యలో చుట్టుముట్టి బాంబు దాడులకు దిగాయి. దాంతో బీఎల్ఏ మండిపడింది. సైనిక చర్యను తక్షణం నిలిపేయకపోతే బందీలందరినీ చంపేస్తామంటూ పాక్ సర్కారును తీవ్రంగా హెచ్చరించింది. రాజకీయ ఖైదీలుగా నిర్బంధించిన బలూచీ నేతలు, కార్యకర్తలందరినీ 48 గంటల్లోపు బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేసింది. లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవని స్పష్టం చేసింది. దాంతో సైనిక చర్యకు షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం తాత్కాలికంగా విరామం ప్రకటించింది. తీసుకోవాల్సిన చర్యలపై మల్లగుల్లాలు పడుతోంది.బలూచిస్తాన్తో పాటు పరిసర ప్రావిన్సుల్లో ఎమర్జెన్సీ విధించారు. ఘటనను కవర్ చేయకుండా మీడియాపై ప్రభుత్వం ఆంక్షలు విధించినట్టు చెబుతున్నారు. ముష్కరులతో ఎలాంటి సంప్రదింపులూ ఉండబోవని అంతర్గత శాఖ మంత్రి మొహసిన్ నక్వీ ప్రకటించారు. కడపటి వార్తలు అందే సమయానికి బీఎల్ఏ సాయుధులపై పాక్ సైనిక హెలికాప్టర్లు, డ్రోన్ల ద్వారా బాంబు దాడులకు దిగినట్టు సమాచారం.బందీల్లో దాదాపు 80 మందిని విడిపించినట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. మృతుల సంఖ్య 35 దాటిందన్నాయి. బలూచిస్తాన్ ప్రావిన్సు అఫ్గానిస్తాన్, ఇరాన్ సరిహద్దుల్లో ఉంటుంది. పాక్ నుంచి స్వాతంత్య్రం కోసం పలు స్థానిక తెగలతో కూడిన వేర్పాటువాద సంస్థలు దశాబ్దాలుగా పోరాడుతున్నాయి. వాటిలో బీఎల్ఏ అతి పెద్దది. దానిపై పాక్తో పాటు అమెరికా, బ్రిటన్లలో కూడా నిషేధముంది.ఇలా జరిగిందిదాదాపు 500 మంది ప్రయాణికులతో కూడిన జాఫర్ ఎక్స్ప్రెస్ మంగళవారం ఉదయం 9 గంటలకు బలూచిస్తాన్లోని క్వెట్టా నుంచి పెషావర్కు బయల్దేరింది. బొలాన్ జిల్లాలో కొండ ప్రాంతంలో కనుమ సమీపంలో గుదలార్, పెరో కున్రీ ప్రాంతాల మధ్య 8వ నంబర్ టన్నెల్ సమీపంలో బీఎల్ఏ సాయుధులు అప్పటికే రైలు పట్టాలను పేల్చేసి మాటు వేశారు. అక్కడికి చేరుకుని అతి నెమ్మదిగా వెళ్తున్న రైలు ఒక్కసారిగా పట్టాలు తప్పింది. వెంటనే బలూచీ సాయుధులు భారీ సంఖ్యలో రైలును చుట్టుముట్టారు. నేరుగా ఇంజన్పైకి కాల్పులు జరపడంతో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు.రైలు ఆగిపోగానే మొత్తం 9 బోగీల్లోకీ చొరబడ్డారు. వారికి, రైల్లోని భద్రతా సిబ్బందికి మధ్య కాసేపు కాల్పులు జరిగాయి. అనంతరం రైలును బీఎల్ఏ సాయుధులు తమ అదీనంలోకి తీసుకుని సమీపంలోని టన్నెల్లోకి తరలించినట్టు సమాచారం. ‘‘ప్రయాణికుల్లో సాధారణ పౌరులు, మహిళలు, చిన్నారులను ఒకవైపు, సైనికులను మరోవైపు విడదీశారు. అనంతరం సైనికుల్లో 20 నుంచి 30 మందిని కాల్చి చంపారు. సాధారణ పౌరులను వదిలేశారు. 215 మందిని బందీలుగా చేసుకున్నారు. వారిలో అత్యధికులు పోలీసు, యాంటీ టెర్రరిజం ఫోర్స్, ఐఎస్ఐకు, సైన్యానికి చెందినవారే.వారంతా సెలవులపై స్వస్థలాలకు వెళ్తున్నారు’’అని స్థానిక మీడియా పేర్కొంది. ఘటనా స్థలిలో మొబైల్ నెట్వర్క్ వంటివేమీ లేకపోవడంతో రైల్లోని సిబ్బందితో ఎలాంటి కాంటాక్టూ వీలవడం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దాడికి పాల్పడింది బీఎల్ఏలోని మజీద్ బ్రిగేడ్గా భావిస్తున్నారు. వారితో పాటు స్పెషల్ టాక్టికల్ ఆపరేషన్స్ స్క్వాడ్, ఫతే స్క్వాడ్ ప్రత్యేక విభాగాలు కూడా దాడిలో పాల్గొన్నట్టు బీఎల్ఏ ప్రకటించింది.ప్రయాణికుల్లో మహిళలు, పిల్లలు, పౌరులను వదిలేసినట్టు ప్రకటించింది. బీఎల్ఏ దాడుల నేపథ్యంలో క్వెట్టా, పెషావర్ మధ్య రైలు సేవలను కొంతకాలం నిలిపేశారు. గత అక్టోబర్లోనే పునరుద్ధరించారు. తర్వాత నెల రోజులకే క్వెట్టా రైల్వేస్టేషన్లో జరిగిన ఆత్మాహుతి దాడిలో కనీసం 26 మంది మరణించారు. బలూచీల దాడి ముప్పు నేపథ్యంలో ఈ ప్రాంతం గుండా వెళ్లే రైళ్లన్నీ పటిష్టమైన సాయుధ భద్రత నడుమ ప్రయాణిస్తుంటాయి. భారీ దాడికి బీఎల్ఏ పథక రచన చేస్తోందని కౌంటర్ టెర్రరిజం విభాగం గత మంగళవారమే ప్రభుత్వాన్ని హెచ్చరించినట్టు చెబుతున్నారు. -
రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద డ్రోన్ అటాక్
మాస్కో: ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడికి దిగిన కొన్ని గంటల వ్యవధిలోనే దానికి ఉక్రెయిన్ ప్రతీకారం తీర్చుకుంది. రష్యాపై అతిపెద్ద డ్రోన్ దాడి చేసింది. ఉక్రెయిన్. 337 డ్రోన్లతో ఉక్రెయిన్ మెరుపు దాడులకు దిగింది. ఈ ఘటనలో రష్యాకు చెందిన ముగ్గురు మృతిచెందగా 18 మంది తీవ్రంగా గాయపడినట్లు రష్యా వర్గాలు వెల్లడించాయి. ఉక్రెయిన్ దాడితో రష్యా అప్రమత్తమైంది. 337 డ్రోన్లలో 91 డ్రోన్లను కూల్చేసింది. ఒకవైపు శాంతి చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామంటూనే రష్యా, ఉక్రెయిన్ దేశాలు పరస్పరం మెరుపు దాడులు చేసుకుంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ శాంతి చర్చలు జరిపారు. ఆ చర్చలు విఫలం కావడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చినట్లయ్యింది. రష్యా సైన్యం భీకర దాడులతో ఉక్రెయిన్పై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. రాజధాని కీవ్ నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లో పై వైమానిక దాడులకు తెగ బడింది. అయితే.. ఆ దాడుల్ని తమ దేశ వైమానిక దళం సమర్థవంతంగా అడ్డుకుంటోందని కీవ్ మేయర్ విటాలి కీచ్కోస్ తెలిపారు. తమకు పేలుడు శబ్దాలు ఎక్కువగా వినిపిస్తున్నాయని కీవ్(Kyiv)లోని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు తెలియరావాల్సి ఉంది. మరోవైపు.. సౌదీ అరేబియాలో ఉక్రెయిన్, అమెరికా అధికారులుశాంతి చర్చలు(జరపనున్నారు. ఈ నేపథ్యాన్ని పట్టించుకోకుండా రష్యా దాడుల ఉధృతిని పెంచింది. రెండు రోజుల కిందట ఖర్కీవ్ రీజియన్లోని డోబ్రోపిలియా నగంపై రష్యా జరిపిన క్షిపణుల దాడిలో విధ్వంసం చోటు చేసుకుంది. దాడుల్లో 14 మంది మరణించగా.. 37 మంది గాయపడ్డారు. ఈ దాడులతో రష్యా ఉద్దేశాల్లో ఎలాంటి మార్పు కనిపించడం లేదన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ.. తమ పౌరుల ప్రాణాలను రక్షించుకునేందుకు ఎంతకైనా తెగిస్తామన్నారు. -
పాక్లో ట్రైన్ హైజాక్.. బందీలుగా 182 మంది..!
ఇస్లామాబాద్: పాకిస్థాన్కు చెందిన ట్రైన్ హైజాక్ కలకలం రేపుతోంది. బలూచిస్థాన్ వేర్పాటు వాదులు పాక్ జాఫర్ ఎక్స్ప్రెస్ను (Jaffar Express) తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 182 మంది ప్రయాణికుల్ని బంధించారు. అదే సమయంలో 20 మంది పాక్ సైనికుల్నిచంపేశారు. తొలుత ఆరుగుర్ని పొ ట్టనపెట్టుకున్న వేర్పాటు వాదులు.. ఆపై మరో 14 మంది సైనికుల్ని చంపేశారు.పాకిస్థాన్లోని నైరుతి బలూచిస్తాన్ ప్రావిన్స్లోని క్వెట్టా నుండి పెషావర్లోని ఖైబర్ పఖ్తుంఖ్వాకు తొమ్మిది బోగీలలో 450 మందికి పైగా ప్రయాణికులతో వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్పై వేర్పాటు వాదులు కాల్పులు జరిపారు. అనంతరం హైజాక్ చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.ట్రైన్ హైజాక్పై బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (Baloch Liberation Army) అధికారికంగా ప్రకటించింది. ఆ ప్రకటన మేరకు.. జాఫర్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో ప్రయాణికుల్ని హైజాక్ చేశాం. వారిలో పాక్ సైన్యం, పోలీసులు, యాంటీ-టెర్రరిజం ఫోర్స్ (ఏటీఎఫ్), ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ)యాక్టివ్ డ్యూటీ సిబ్బంది ఉన్నారు. వీరందరూ సెలవుపై పంజాబ్కు ప్రయాణిస్తున్నారు. ఈ విషయంలో పాకిస్థాన్ సైనిక జోక్యానికి ప్రయత్నిస్తే బందీలందరిని ఉరితీస్తామని హెచ్చరించింది. -
బెలూచిస్తాన్ ఎందుకు భగ్గుమంటోంది?
బెలూచిస్తాన్ (#balochistan) ఖైబర్ పక్తున్ఖ్వాల మీద పాకిస్తాన్ ప్రభుత్వం పట్టు కోల్పోయిందని ఫిబ్రవరి 18న అక్కడి మత, రాజకీయ నాయకుడు మౌలానా ఫజలుర్ రెహ్మాన్ ధ్వజ మెత్తారు. సాక్షాత్తు నేషనల్ అసెంబ్లీ సాక్షిగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అక్కడి పరిస్థితికి ప్రభుత్వం,సైన్యంతో పాటు ఐఎస్ఐ కూడా కారణమేనని ఆయన అన్నారు. ఈ మాటలు వినిపించినరెండో రోజునే, ఫిబ్రవరి 20న బెలూచిస్తాన్ మరొకసారి భగ్గుమంది. కామిల్ షరీఫ్, ఇషాన్ సర్వార్ బలోచ్ అనే ఇద్దరు తర్బత్ న్యాయ కళాశాల విద్యార్థుల నిర్బంధాన్ని నిరసిస్తూ ఈ ప్రదర్శనలు జరిగాయి. ఆ రెండు రాష్ట్రాలలోనూ ఆందోళనలు కొత్త కాదు. కానీ జాతీయ అసెంబ్లీలో ఒక ప్రముఖ సభ్యుడు ఈ స్థాయిలో హెచ్చరించడం కొత్త అంశమే.‘పాకిస్తాన్ ఒక విఫల రాజ్యం’ఇటీవలి కాలంలో బెలూచిస్తాన్ ఉద్యమం గొంతు పెరిగింది. కొద్దికాలం క్రితమే ఐక్యరాజ్య సమితి కార్యాలయం ఎదుట బెలూచ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ప్రదర్శన నిర్వహించిన సందర్భంగా దాని నాయకుడు రజాక్ బలోచ్ చెప్పిన మాటలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. పాకిస్తాన్ ఒక విఫల రాజ్యమనీ, అది బెలూచిస్తాన్సింధ్, ఆక్రమిత కశ్మీర్ల సంపదను అడ్డంగా దోపిడీ చేస్తూ బతుకీడుస్తున్నదనీ ఆరోపించారు. దీనికి చైనా తోడై పాక్ సైన్యానికి శిక్షణ ఇచ్చి, తన కనుసన్నలలో ఉంచుకున్నదని పెద్ద ఆరోపణే చేశారు. పాక్, చైనాలను బెలూచిస్తాన్ నుంచి తరిమేయడమే తమ లక్ష్యమని అన్నారు. స్వాతంత్య్రం కోసం పాకిస్తాన్ మీద పోరాడుతున్న బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) ‘పకడ్బందీ’ దాడులు ఉధృతం చేసింది. 75 ఏళ్లుగా సాగుతున్న ప్రత్యేక దేశ పోరాటం మలుపు తిరిగిందని భావించే స్థాయిలో ఈ దాడులు ఉన్నాయి. బీఎల్ఏను పాకిస్తాన్ తో పాటు అమెరికా కూడా ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. పాకిస్తాన్ లోని బెలూచిస్తాన్ ప్రాంతంతో పాటు ఇరాన్, అఫ్గాన్లలోని కొన్ని ప్రాంతాలు కలిపి బెలూచిస్తాన్అనే స్వతంత్ర రాజ్యం ఏర్పాటు చేయాలని బీఎల్ఏ కోరుతున్నది. ఇవాళ్టి బెలూచిస్తాన్ అంటే దేశ విభజనకు ముందు ఉన్న కలాత్ సంస్థానమే. దీనికి కూడా పాకిస్తా¯Œ లో లేదా భారత్లో కలవడానికి, లేదంటే స్వతంత్రంగా మనుగడ సాగించే వెసు లుబాటు ఇచ్చారు. కానీ జిన్నా ఎత్తు లతో ఇది అంతిమంగా పాక్లో విలీనం కావలసివచ్చింది. ఇదంతా ఎందుకు చెప్పడమంటే, భారత్, పాక్ రెండూ కూడా వలస పాలన ఇచ్చిన సమస్యలను నేటికీ ఎదుర్కొంటు న్నాయి. కశ్మీర్ సమస్యను పాక్ అనుకూలంగా మలుచుకోవాలను కుంటున్నది. కానీ బెలూచిస్తాన్ వ్యవహారాలకు భారత్ దూరంగా ఉంది. 1947 నుంచే వేర్పాటు బీజంనిజానికి 1947 నుంచే బెలూచిస్తాన్లో వేర్పాటువాదానికి బీజం పడింది. దీని రాజధాని క్వెట్టా. కోటీ యాభయ్ లక్షల జనాభా ఉన్న బెలూచిస్తాన్ ప్రకృతి సంపదల దృష్ట్యా కీలకమైనది. 1947 నుంచి పాకిస్తాన్ ఫెడరల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలోచ్ గిరిజన తెగ ఐదు తిరుగుబాట్లు చేసింది. వీటిలో చివరిది 2000 సంవత్సరంలో మొదలయింది. తమ ప్రాంత వనరులలో స్థానికులకు సింహభాగం ఉండాలన్న డిమాండ్తో ఈ తిరుగుబాటు తలెత్తింది. కశ్మీర్ వేర్పాటువాద పోరాటానికి మద్దతు ఇస్తామని బాహాటంగానే ప్రకటించే పాక్ పాలకులు బెలూచీలను దారుణంగా అణచివేస్తున్నారు.బెలూచీల అశాంతి తీవ్రరూపం దాల్చేటట్టు చేసినది పాక్–చైనా ఆర్థిక నడవా. 62 బిలియన్ డాలర్లతో దీనిని నిర్మిస్తున్నట్టు దశాబ్దం క్రితం చైనాప్రకటించింది. బెలూచిస్తాన్కు బంగారు బాతు వంటి గ్వదర్ డీప్ సీ పోర్టు నిర్మాణం చైనా చేతిలో పెట్టడం కూడా వారి తిరుగుబాటును తీవ్రం చేసింది. హత్యలే కాకుండా కొన్ని పోలీస్ స్టేషన్లను కూడా బెలూచ్ ఉగ్రవాద సంస్థలు లక్ష్యంగా చేసుకున్నాయి. జాతీయ రహదారులను దిగ్బంధనం చేశాయి. రైల్వే లైన్లను పేల్చి వేశాయి. ‘బీఎల్ఏకు దాడులు చేసే సామర్థ్యం బాగా పెరిగిందని ఈ ఘటనలు నిరూపిస్తున్నాయి. సున్నిత ప్రదేశాలతో పాటు, గహనమైన లక్ష్యాల మీద కూడా దాడి చేసే శక్తి అది సముపార్జించుకున్నది. వీటితో బీఎల్ఏకు విదేశీ సాయం ఉన్నదన్న అనుమానం పాకిస్తాన్ లో మరింత పెరిగింది’ అని పాకిస్తాన్ రాజకీయ, సైనిక వ్యవహారాల వ్యాఖ్యాత ఆయేషా సిద్దిఖీ వ్యాఖ్యానించారు. సాధారణంగా బెలూచిస్తాన్ ఉగ్ర వాదుల దాడులను పాకిస్తాన్ ఫెడరల్ ప్రభుత్వం ‘శత్రువుల’ పనిగా అభివర్ణిస్తూ ఉంటుంది. అయితే భారత వైమానిక దళ మాజీ అధికారి కుల్భూషణ్ జాదవ్ ఉదంతం తరువాత, అంటే 2016 నుంచి బెలూచిస్తాన్ హింసలో భారత్ హస్తం ఉన్నదని కొత్త పల్లవి అందుకుంది. ఇప్పటికీ జాదవ్ పాకిస్తాన్ నిర్బంధంలోనే ఉన్నారు. ఇందుకే బెలూచిస్తాన్ లో హింసకు సంబంధించి భారత్ మీద పాక్ చేసే ఆరోపణలకు చైనా మీడియా విపరీతమైన ప్రాధాన్యం ఇస్తూ ఉంటుంది.పశ్చిమ ప్రాంతంలోనే ‘తెహ్రీక్ ఎ తాలిబన్ పాకిస్తాన్ సంస్థ కూడా పాక్ సైన్యాన్ని ముప్పుతిప్పలు పెడుతున్నది. చిరకాలంగా బెలూచిస్తాన్ ప్రజల పట్ల పాకిస్తాన్ ప్రభుత్వం అణచివేత వైఖరినే అవలంబిస్తున్నది. అక్కడి పౌరులను అపహరించి మళ్లీ వారి జాడ లేకుండా చేయడం స్థానిక ప్రభుత్వ నిఘా సంస్థలు చేస్తున్న పనేనని 2023 నాటి ఒక నివే దిక పేర్కొన్నది. కనిపించకుండా పోయినవారి కోసం, రాజ్యాంగేతర హత్యలకు వ్యతిరేకంగా గళం ఎత్తుతున్న ‘వాయిస్ ఆఫ్ బెలూచ్ మిసింగ్ పర్సన్స్’, ‘బెలూచ్ యాక్ జెహెతి కమిటీ’ సభ్యులను కూడా భద్రతా బలగాలు తీవ్రంగా హింసిస్తున్నాయి. బెలూచిస్తాన్లో ఎన్నికలు ప్రహసనంగానే జరుగుతాయి. పౌర ప్రభుత్వాలు, వ్యవస్థలు, సైన్యం ఆ ఎన్నికలను తమకు అనుకూలంగా జరుపుకొంటూ ఉంటాయి. లేదంటే బెలూచిస్తాన్ ఏర్పాటును వ్యతిరేకించే స్థానిక జాతీయ పార్టీ లను గెలిపిస్తూ ఉంటారు. బెలూచిస్తాన్లో ఉండే బెలూచీలు, పష్తూన్ ప్రజల మధ్య సదా విభేదాలు రాజేయడానికి సైన్యం తన వంతు పాత్రను పోషిస్తూ ఉంటుంది.బుగ్తీని చంపిన తప్పిదంబెలూచిస్తాన్ లిబరేషన్ఆర్మీ మొన్నటి ఆగస్ట్లో చేసిన దాడులకు మరొక ప్రాధాన్యం ఉంది. అది బుగ్తీ తెగ ప్రము ఖుడు అక్బర్ ఖాన్ బుగ్తీ 18వ వర్ధంతి. పర్వేజ్ ముషార్రఫ్ ఆదేశాల మేరకు ప్రయోగించిన క్షిపణి దాడిలో రహస్య స్థావరంలోనే బుగ్తీ మరణించాడు. నిజానికి ఆయన మొదట పాకిస్తాన్ ఫెడరల్ ప్రభుత్వంలో మంత్రి. బెలూచిస్తాన్ ప్రావిన్స్కు గవర్నర్గా కూడా పని చేశాడు. తరువాత బెలూచీల సాయుధ తిరుగుబాటులో భాగస్వామి అయ్యాడు. జుల్ఫీకర్ అలీ భుట్టో ఉరితీత ఎంత తప్పిదమో, బుగ్తీని హతమార్చడం కూడా అంతే తప్పిదమని విశ్లేషకులు భావిస్తూ ఉంటారు. బుగ్తీని చంపడం బెలూచిస్తాన్ ఉద్యమానికి అమ రత్వాన్ని ఆపాదించింది. 1970లో బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఆవిర్భవించినప్పటికీ, దూకుడు పెంచినది మాత్రం ఆయన మరణం తరువాతే.ఈ నేపథ్యంలో బెలూచిస్తాన్ ఉద్యమకారులు భారత్ వైపు ఆశగా చూడటం ఒక పరిణామం. వారి ప్రదర్శనలలో భారత్ అనుకూల ప్లకార్డులు ప్రదర్శించడం సాధారణమైంది. పాక్ ప్రస్తుత పరిస్థితులను బట్టి ఆ తుంటరి పిల్లాడికి బుద్ధి చెప్పవలసిన బాధ్యత, హక్కు భారత్కు ఉన్నాయని లండన్ కేంద్రంగా పనిచేసే బెలూచిస్తాన్ విముక్తి పోరాట సంస్థ కార్యకర్త ఒకరు అభిప్రాయపడటం విశేషం. డా.గోపరాజు నారాయణరావు సీనియర్ జర్నలిస్ట్ -
రాజా.. ఐ లవ్ యూ రాజా!
బూజు పట్టిన రాజరికాన్ని నేపాల్ ప్రజలు 19 ఏళ్ల క్రితమే వదిలించుకున్నారు. నాటి నాటకీయ పరిణామాలతో రాజు జ్ఞానేంద్ర షా (77) చేసేది లేక గద్దె దిగాడు. కిరీటం పక్కన పెట్టి, సింహాసం దిగి, రాజదండం వదిలేసి మాజీ అయ్యాడు. రాజభవనం ‘నారాయణ్ హితి ప్యాలెస్’ను ఖాళీ చేశాడు. సాధారణ పౌరుడిగా జీవనం ఆరంభించాడు. ఇదంతా పాత ముచ్చట. కొందరు నే’పాలితులు’ మళ్లీ ఇప్పుడు ‘రాజరికమే ముద్దు’ అంటున్నారు. రాజు పరిపాలనే కావాలని కోరుకుంటున్నారు. మాజీ రాజు జ్ఞానేంద్ర షా(Gyanendra Shah) ఇటీవలి కాలంలో దేశంలో పర్యటిస్తున్నారు. పశ్చిమ నేపాల్ తీర్థయాత్రలు ముగించుకుని రెండు నెలల అనంతరం ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు ఆదివారం పది వేల మంది మద్దతుదారులు ఘన స్వాగతం పలికారు. ‘దేశాన్ని మీరే కాపాడాలి’ అంటూ ఆయనను ఉద్దేశించి నినాదాలతో హోరెత్తించారు. ‘రాజు కోసం రాజభవనాన్ని ఖాళీ చేయాలి. రాజు మళ్లీ రావాలి. మాకు రాజరికమే(Monarchy) కావాలి. మా రాజు చిరకాలం జీవించాలి’ అని వారంతా గళమెత్తారు. హిందూ మతాన్ని మళ్లీ దేశ అధికారిక అభి‘మతం’గా మార్చాలని డిమాండ్ చేశారు. జ్ఞానేంద్ర ఎలాంటి వ్యాఖ్యలూ లేకుండానే వారికి అభివాదం చేస్తూ ముందుకు సాగిపోయారు.జ్ఞానేంద్ర మామూలోడు కాదురాజభవనంలో తమ కుటుంబ సభ్యుల ఊచకోత దుర్ఘటన దరిమిలా.. 2002లో జ్ఞానేంద్ర షా నేపాల్ రాజు అయ్యారు. అప్పటినుంచి దేశ రాజ్యాంగాధినేతగా నామమాత్ర అధికారాలతో నెట్టుకొచ్చిన ఆయన.. 2005లో రాజకీయ, కార్యనిర్వహణాధికారాలను కూడా సొంతం చేసుకుని సంపూర్ణాధికారం చేజిక్కించుకున్నారు. ప్రభుత్వాన్ని, పార్లమెంటును రద్దు చేయడమే కాకుండా రాజకీయ నాయకులు, జర్నలిస్టులను జైళ్లలో పెట్టించారు. సమాచార వ్యవస్థలను స్తంభింపజేసి, అత్యయిక పరిస్థితి ప్రకటించారు. తన ఏలుబడికి వీలుగా సైన్యాన్ని రంగంలోకి దింపారు. ఈ ఘటనలు ప్రజల్లో ఆయన పట్ల తీవ్ర వ్యతిరేకతను ఎగదోశాయి. 2006లో దేశవ్యాప్తంగా ప్రజా నిరసనలు మిన్నుముట్టడంతో జ్ఞానేంద్ర సింహాసనం దిగారు. దేశంలో 240 ఏళ్లుగా కొనసాగుతున్న హిందూ రాజరికాన్ని రద్దు చేయాలని నేపాల్ పార్లమెంటు 2008లో నిర్ణయించడంతో ఆయన రాయల్ ప్యాలెస్ విడిచిపెట్టారు. అలా నేపాల్ 2008లో లౌకిక, గణతంత్ర రాజ్యమైంది. అయితే.. తమ గణతంత్ర రాజ్యం అనుకున్నంత ‘ఘన’తంత్రంగా లేదంటూ నేపాల్ ప్రజల్లో తాజాగా అసమ్మతి పెచ్చరిల్లుతోంది. దేశంలో రాజకీయ అస్థిరత వేళ్లూనుకుందని, అవినీతి అర్రులు చాచి విచ్చలవిడిగా పెరిగిందని, ఆర్థిక రంగం కుదేలైందని నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రాజరికం రద్దయిన 2008వ సంవత్సరం నుంచి ఇప్పటివరకు దేశంలో 13 ప్రభుత్వాలు మారడమే రాజకీయ అస్థిరతకు తార్కాణమని అసంతృప్తవాదులు మండిపడుతున్నారు. దేశం మరింత పతనావస్థకు దిగజారకుండా ఉండాలంటే రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలని వారు అభిలషిస్తున్నారు. అయితే ప్రస్తుతం దేశంలో రాజరిక వ్యవస్థకు మళ్లీ అవకాశం లేదని నేపాల్ ప్రధానమంత్రి కె.పి.శర్మ ఓలి సహా పలువురు రాజకీయ నేతలు అభిప్రాయపడుతున్నారు.మావోయిస్టు ప్రధానిగా ప్రచండ!ఇప్పుడు మనం చూస్తున్న హిమ రాజ్యం నేపాల్(Nepal) ఒకప్పుడు చిన్న చిన్న రాజ్యాలుగా ఉండేది. ఆ చిన్న ముక్కలన్నిటిని రాజు పృథ్వీనారాయణ్ షా 1768లో ఏకీకృతం చేసి ‘నేపాల్ సామ్రాజ్యం’గా మార్చారు. 1800 సంవత్సరం నుంచి రాజప్రతినిధులు, ప్రధానమంత్రులు నియమితులై షా వంశ రాజుల పేరిట అధికారం చెలాయిస్తూ వచ్చారు. అప్పట్లో రాజు పదవి లాంఛనప్రాయం. తన పూర్వీకుల మాదిరిగా ఈ సంప్రదాయాన్ని పాటిస్తూనే రాజు త్రిభువన్ షా 1950లో ‘రాజకీయ పాత్ర’ను కూడా కొత్తగా తలకెత్తుకున్నారు. ఇక నాటి నుంచి 2006లో ‘రాజు పదవీచ్యుతి ఉద్యమం’ కొనసాగే వరకు షా వంశ రాజులు రాజకీయాధికారం కూడా చెలాయించారు. త్రిభువన్ షా కుమారుడు మహేంద్ర షా ఆధునిక నేపాల్ రూపశిల్పి. ‘హిందూ రాజరికం’ భావనకు కూడా ఆయనే మార్గదర్శి. తదనంతర కాలంలో ప్రజల నుంచి ఎదురైన నిరసనలను దృష్టిలో ఉంచుకున్న రాజు బీరేంద్ర షా 1990లో ‘సంపూర్ణ రాజరికం నుంచి రాజ్యాంగ రాజరికానికి’ నేపాల్ పరివర్తన చెందేందుకు అంగీకరించి, ప్రజలు ఎన్నుకున్న పార్లమెంటుతో అధికారం పంచుకోవడానికి సంసిద్ధుడయ్యాడు. ఇలా రాజీ కుదిరినా ప్రజల్లో అసమ్మతి సెగ మాత్రం చల్లారలేదు. 1990వ దశకం మధ్యలో దేశంలో మావోయిస్టుల తీవ్రవాదం విస్తరించింది. ‘ప్రచండ’గా సుప్రసిద్ధుడైన మావోయిస్టు ఉద్యమ నేత పుష్పకమల్ దహాల్ ఆ తర్వాత దేశ ప్రధానమంత్రి అయ్యాడు.రాజకుటుంబంలో రక్తపాతం!2001లో నేపాల్ రాజభవనంలో చోటుచేసుకున్న మారణకాండలో రాజు బీరేంద్ర, రాణి ఐశ్వర్య, మరో ఎనిమిది మంది రాజ కుటుంబీకులు హత్యకు గురయ్యారు. తాను ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకోవడానికి ఇంటి పెద్దలు అంగీకరించకపోవటంతో యువరాజు దీపేంద్ర ఆగ్రహించి మద్యం మత్తులో తన కుటుంబ సభ్యులను చంపడమే కాకుండా తానూ తుపాకితో కాల్చుకుని మరణించాడు. ఈ పరిణామం తర్వాత జ్ఞానేంద్ర షా రాజు అయినప్పటికీ ఆయన పదవీకాలం స్వల్పమే. జ్ఞానేంద్రకు తాజాగా ఖాట్మండు విమానాశ్రయం వద్ద స్వాగతం పలకాలని బాలీవుడ్ నటి మనీషా కొయిరాలా సామాజిక మాధ్యమాల వేదికగా నేపాలీలకు పిలుపునివ్వడం కొసమెరుపు! దేశంలో ఎన్నికైన తొలి ప్రధానమంత్రి బి.పి.కొయిరాలాకు మనీషా స్వయానా మనవరాలు. ::జమ్ముల శ్రీకాంత్(Courtesy: CNN, The Times of India, WION, India Today, Al Zazeera) -
స్వర్గం భూమ్మీదకు వచ్చిందా?.. అందాల లోకం.. వారెవ్వా వనాటు
స్వర్గం ఎలా ఉంటుందో ఎవడికి తెలుసు?. ఎవరో వర్ణిస్తే కానీ ఊహించుకోవడం తప్పించి!. ఒకవేళ అది భూమ్మీద గనుక ఉంటే.. అది అచ్చం ‘వనాటు’(Vanuatu)లాగే ఉంటుందని లలిత్ మోదీ అంటున్నారు. ఐపీఎల్ సృష్టికర్త కారణంగా ఇప్పుడు ఈ దేశం పేరు తెగ వినిపించేస్తుండగా.. దాని గురించి వెతికే వాళ్ల సంఖ్యా ఒక్కసారిగా పెరిగిపోయింది.ఆర్థిక నేరగాడికి అభియోగాలు ఎదుర్కొంటున్న లలిత్ మోదీ 2010లో దేశం విడిచి లండన్ పారిపోయారు. అయితే ఆయన్ని వెనక్కి రప్పించే ప్రయత్నాలు భారత్ ముమ్మరంగా చేయగా.. ఆయన తెలివిగా వనాటు పౌరసత్వం పొందారు. అయితే ఈ విషయం తెలియడంతో ఆ దేశం ఆయన పౌరసత్వాన్ని రద్దు చేసింది. ఇది ఇక్కడితోనే ఆగలేదు. లలిత్ మోదీ పౌరసత్వాన్ని రద్దు చేసినట్లు వనాటు ప్రధాని జోథం నపాట్ స్వయంగా ప్రకటించారు. ఆ ప్రకటన వెలువడిన కాసేపటికే.. ఎక్స్ వేదికగా లలిత్ ఓ పోస్ట్ చేశారు.‘‘వనాటు ఒక అందమైన దేశం, స్వర్గంలా ఉంది. మీ పర్యటనల జాబితాలో దీన్ని చేర్చాల్సిందే’’ అని సందేశం ఉంచారు. దీంతో నెటిజన్స్ ఆయన కామెంట్ సెక్షన్లో సరదా కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వనాటు అందాల గురించి ఆరా తీస్తున్నారు.వనాటు.. ఎక్కడుంది?ఉత్తర ఆస్ట్రేలియాకు 1,750 కిలోమీటర్ల దూరంలో దక్షిణ పసిఫిక్ మహా సముద్రంలో ఉంది ఈ ద్వీప దేశం. మొత్తం 83 చిన్న చిన్న ద్వీపాల సముదాయంగా వై(Y) ఆకారంలో ఉంటుందీ దేశం. ఇందులో 65 ద్వీపాల్లో మాత్రమే ప్రజలు జీవిస్తున్నారు. ఎఫేట్ ఐల్యాండ్లో ఉండే పోర్టువిల్లా నగరం ఆ దేశ రాజధాని. పశ్చిమంగా ఫిజీ దేశం, ఇతర దిక్కుల్లో సాలామాన్ ద్వీపాలు, న్యూ కాలేడోనియా ఉన్నాయి. ఒకప్పుడు బ్రిటిష్ఫ్రెంచ్ సంయుక్త పాలనలో ఇది బానిస దేశంగా ఉండేది. 1980 జులై 30న వనాటు స్వాతంత్రం పొందింది. కరెన్సీ వనాటు వాటు. ప్రస్తుత జనాభా దాదాపు మూడున్నర లక్షలు. ‘‘దేవుడితో మేం నిలబడతాం’’ అనేది ఆ దేశపు నినాదం.అగ్నిపర్వతాలు.. భూకంపాల నేలఈ ద్వీప దేశంలో అగ్నిపర్వతాలు ఉన్నాయి. వీటిల్లో కొన్ని క్రియాశీలకంగా కూడా ఉన్నాయి. సంవత్సరంలో సుదీర్ఘంగా వేసవి వాతావరణంతో పొడిగా ఉంటుంది అక్కడ. అయితే నవంబర్-ఏప్రిల్ మధ్య వర్షాలు, తుపాన్లు సంభవిస్తుంటాయి. ఫసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో ఉండడం మూలంగా భూ కంపాలు షరామాములుగా మారాయి. అయితే కిందటి ఏడాది డిసెంబర్లో 7.3 తీవ్రతతో వచ్చిన భూకంపం ఆ దేశానికి తీవ్ర నష్టం కలిగించింది. ఈ భూకంపంలో 14 మంది చనిపోగా.. 265 మంది తీవ్రంగా గాయపడ్డారు. అందాల లోకం.. వనాటులో ఉన్న వృక్ష, జంతు సంపద అత్యంత అరుదైంది. ఈ భూమ్మీద ఎక్కడా కనిపించని జీవ జాతులు ఉన్నాయక్కడ. ఎటు చూసినా.. దట్టమైన అడవులు, జలపాతాలు, అందమైన సముద్రం.. నిర్మానుష్యమైన తీరాలు, కొన్ని ద్వీపాల్లో లాగున్లూ.. ఓ ప్రత్యేక అనుభూతిని పంచుతాయి. సహజ సౌందర్యం, జీవ వైవిధ్యం.. వనాటును ప్రపంచ పర్యాటక జాబితాలో ‘ప్యారడైజ్ ఆఫ్ ది ఎర్త్’గా నిలబెట్టాయి.టూరిజం కోసమే..టూరిజం, వ్యవసాయం ఇక్కడి ప్రజల ప్రధాన ఆదాయ వనరులు. అలాగే జనాభాలో గ్రామీణ జనాభా ఎక్కువ. 80 శాతం వ్యవసాయమే చేస్తుంటారు. కావా పంట ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతుంది. పర్యాటకం ద్వారా వచ్చే ఆదాయం ఆ దేశ జీడీపీలో 65 శాతంగా ఉంది. పర్యాటకం మీద ఆధారపడిన ప్రజలు కావడంతో.. పర్యాటకులను మర్యాదలతో ముంచెత్తారు. అలాగే.. సంప్రదాయాలకు అక్కడి ప్రజలు పెద్ద పీట వేస్తుంటారు. పెంటెకాస్ట్ ఐల్యాండ్లో స్థానికులు ల్యాండ్ డైవింగ్ క్రీడ నిర్వస్తుంటారు. బొంగులలాంటి నిర్మాణలను ఎత్తుగా పేర్చి.. చెట్ల తీగలతో సాయంతో బంగీ జంప్లా కిందకు దూకుతారు. ఎవరి తల భూమికి మొదట తాకితే వాళ్లు విజేతలు. పర్యాటకులను ఆకట్టుకునేందుకు చేసే ఈ ప్రయత్నాల్లో.. పాపం ఒక్కోసారి ప్రాణాలు పొగొట్టుకుంటారు కూడా. పన్నులు లేవు, కానీ..వనాటులో ఎలాంటి పన్నులు విధించరు. ఈ కారణంగా అంతర్జాతీయ నియంత్రణ సంస్థలు ఈ దేశంపై ప్రత్యేక దృష్టి సారించాయి. అదే టైంలో.. వనాటు ఆర్థిక నేరాలకు అడ్డా కూడా. మనీలాండరింగ్కు సంబంధించిన చట్టాలు కూడా అక్కడ బలహీనంగా ఉండడమే ప్రధాన కారణం. ఆర్థిక నేరాలతో పాటు డ్రగ్స్.. ఆయుధాల అక్రమ రవాణాలకు ఇది అడ్డాగా మారింది. ఈ కారణంగానే పైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఈ దేశాన్ని గ్రే లిస్ట్లో చేర్చింది. అలాగే.. 2017లో వెలుగు చూసిన ప్యారడైజ్ పేపర్స్ లీక్.. అక్కడి అక్రమ సంపద వ్యవహారాలను బయటపెట్టింది. ఇక.. 2001 ఏప్రిల్లో అప్పటి ప్రధాని బరాక్ సోప్ ఫోర్జరీ కేసులో చిక్కుకున్నారు. భారత్కు చెందిన వ్యాపారవేత్త అమరేంద్ర నాథ్ ఘోష్కు వందల కోట్ల విలువ చేసే పైనాన్షియల్ గ్యారెంటీలను అనధికారికంగా కట్టబెట్టారని బరాక్పై అభియోగాలు వచ్చాయి. ఈ కారణంతో ఆయన అదే ఏడాది తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే.. ప్రపంచం దృష్టిలో ఏర్పడిన ఈ మచ్చని.. కఠిన చట్టాల ద్వారా తొలగించుకునే పనిలో ఉంది ఈ సుందర ద్వీప దేశం. -
శాంతి చర్చల వేళ.. ఎయిర్స్ట్రైక్స్తో భీకర దాడులు
కీవ్: శాంతి చర్చల వేళ రష్యా సైన్యం(Russia Military) భీకర దాడులతో ఉక్రెయిన్పై విరుచుకుపడుతోంది. తాజాగా.. రాజధాని కీవ్ నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లో పై వైమానిక దాడులకు తెగ బడింది. అయితే.. ఆ దాడుల్ని తమ దేశ వైమానిక దళం సమర్థవంతంగా అడ్డుకుంటోందని కీవ్ మేయర్ విటాలి కీచ్కోస్ తెలిపారు. అయినప్పటికీ.. తమకు పేలుడు శబ్దాలు ఎక్కువగా వినిపిస్తున్నాయని కీవ్(Kyiv)లోని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు తెలియరావాల్సి ఉంది. మరోవైపు.. సౌదీ అరేబియాలో ఉక్రెయిన్, అమెరికా అధికారులు శాంతి చర్చలు(Ukraine Peace Talks) జరపనున్నారు. ఈ నేపథ్యాన్ని పట్టించుకోకుండా రష్యా దాడుల ఉధృతిని పెంచడం గమనార్హం. రెండు రోజుల కిందట ఖర్కీవ్ రీజియన్లోని డోబ్రోపిలియా నగంపై రష్యా జరిపిన క్షిపణుల దాడిలో విధ్వంసం చోటు చేసుకుంది. దాడుల్లో 14 మంది మరణించగా.. 37 మంది గాయపడ్డారు. ఈ దాడులతో రష్యా ఉద్దేశాల్లో ఎలాంటి మార్పు కనిపించడం లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ అన్నారు. తమ పౌరుల ప్రాణాలను రక్షించుకునేందుకు ఎంతకైనా తెగిస్తామని ప్రకటించారాయన. ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్కు అమెరికా నిఘా సమాచార సహాయం నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఆ మరుసటి రోజు నుంచే రష్యా తన దాడుల ఉధృతిని పెంచడం గమనార్హం. -
అమెరికా ఉత్పత్తులపై 15% టారిఫ్లు ప్రకటించిన చైనా
వాషింగ్టన్: చైనా ఉత్పత్తులపై 20 శాతం టారిఫ్లు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 4న చేసిన ప్రకటనకు చైనా బదులు తీర్చుకుంది. అమెరికా వ్యవసాయోత్పత్తులు ముఖ్యంగా సోయా, బీఫ్, పోర్క్, చికెన్ ఉత్పత్తులపై అదనంగా 15 శాతం టారిఫ్లు విధిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ఇప్పటికే మార్గమధ్యంలో ఉన్న ఉత్పత్తులపై ఈ నెల 12వ తేదీ వరకు టారిఫ్లను మినహాయించనున్నట్లు చైనా వాణిజ్య శాఖ తెలిపింది. ఈ ప్రకటనతో అమెరి కా పెట్టుబడిదారుల్లో భయాలు మొదలయ్యాయి. గతవారం మెక్సికో, కెనడాల దిగుమతులపై ట్రంప్ టారిఫ్లను విధించడం ఆయా దేశాలు అమెరికా ఉత్పత్తులపై తిరిగి టారిఫ్లను విధించాయి. -
కెనడా తదుపరి ప్రధానిగా మార్క్ కార్నీ
టొరంటో: కెనడా సెంట్రల్ బ్యాంక్ గవర్నర్గా గతంలో సేవలందించిన బ్యాంకింగ్ రంగ ప్రముఖుడు మార్క్ కార్నీను కెనడా ప్రధానమంత్రి పీఠం వరించింది. ప్రస్తుత ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో రాజీనామా చేస్తానని జనవరిలో ప్రకటించిన నేపథ్యంలో పాలక లిబిరల్ పార్టీ నూతన సారథి కోసం ఎన్నికలు నిర్వహించగా కార్నీ ఘన విజయం సాధించారు. దాంతో తదుపరి ప్రధానమంత్రిగా 59 ఏళ్ల కార్నీ త్వరలో బాధ్యతల స్వీకరించనున్నారు. ట్రంప్ సారథ్యంలోని అమెరికాతో కెనడా వాణిజ్యయుద్ధానికి దిగిన వేళ కెనడా ప్రధాని పగ్గాలు కార్నీ చేపడుతుండటం గమనార్హం. ఆదివారం లిబరల్ పార్టీ సారథ్యం కోసం జరిగిన ఓటింగ్లో కార్నీ 1,31,674 ఓట్లు సాధించారు. మొత్తం ఓట్లలో ఏకంగా 85.9 శాతం ఓట్లు కార్నీ కొల్లగొట్టడం విశేషం. గతంలో మహిళా ఉపప్రధానిగా సేవలందించిన క్రిస్టినా ఫ్రీలాండ్ రెండోస్థానంలో సరిపెట్టుకున్నారు. ఈమెకు కేవలం 11,134 ఓట్లు పడ్డాయి. అంటే మొత్తం ఓట్లలో కేవలం 8 శాతం ఓట్లు ఈమెకు దక్కాయి. గవర్నమెంట్ హౌస్ లీడర్ కరీనా గౌల్డ్(4,785 ఓట్లు) మూడో స్థానంతో, వ్యాపా ర అనుభవం ఉన్న నేత ఫ్రాంక్ బేలిస్(4,038) నాలుగో స్థానంతో సరిపెట్టు కున్నారు. మొత్తం 1,51,000 మందికిపైగా పార్టీ సభ్యులు ఓటింగ్లో పాల్గొన్నారు.పదవీ స్వీకారం ఎప్పుడు ?పార్టీ ఎన్నికల్లో గెలిచినా వెంటనే కార్నీ ప్రధాని పీఠంపై కూర్చోవడం కుదరదు. ట్రూడో ప్రధానిగా రాజీనామా చేసి గవర్నర్ జనరల్కు సమర్పించాలి. కెనడా ఒకప్పుడు బ్రిటన్ వలసరాజ్యం కావడంతో ప్రస్తుత బ్రిటన్ రాజు కింగ్ ఛార్లెస్–3 సమ్మతితో గవర్నర్ జనరల్.. కార్నీతో నూతన ప్రధానిగా ప్రమాణంచేయిస్తారు. అయితే అక్టోబర్ 20వ తేదీలోపు కెనడాలో సాధారణ ఎన్నికలు చేపట్టాల్సిఉంది. అందుకే కార్నీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించగానే ఎన్నికలకు పిలుపిచ్చే వీలుంది.ట్రంప్ను నిలువరిద్దాంపార్టీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించాక వందలాది మంది మద్దతుదారులనుద్దేశించి కార్నీ ప్రసంగించారు. అమెరికా దిగు మతి టారిఫ్ల పెంపు అంశాన్ని ప్రస్తావించారు. ‘‘ ఇకపై ఏమాత్రం నమ్మలేని దేశం(అమెరికా) మనకు గడ్డు పరిస్థితు లను తీసుకొచ్చింది. అయినాసరే మనం ఈ పరిస్థితిని దీటుగా ఎదుర్కోగలం. అమెరికా దిగుమతి టారిఫ్లకు దీటుగా మనం కూడా టారిఫ్లు విధిస్తాం. మమ్మల్ని అమెరికా గౌరవించేదాకా ఇవి కొనసాగుతాయి. అమెరికన్లు మా సహ జవనరులు, భూములు, నీళ్లు, ఏకంగా మా దేశాన్నే కోరుకుంటున్నారు. ఏ రూపంలోనూ కెనడా ఎప్పటికీ అమెరికాలో భాగం కాబోదు. ట్రంప్ గెలవకుండా నిలువరిద్దాం’’ అని వందలాది మంది మద్దతుదారులను ద్దేశించి కార్నీ ప్రసంగించారు.బ్యాంకర్ పొలిటీషియన్కెనడా, బ్రిటన్లోని సెంట్రల్ బ్యాంక్లకు సారథ్యం వహించి అపార బ్యాంకింగ్ అనుభవం గడించిన మార్క్ కార్నీ ఇప్పుడు కెనడా ప్రధానిగా కొత్త పాత్ర పోషించనున్నారు. బ్యాంక్ ఆఫ్ కెనడా గవర్నర్ హోదాలో 2008లో ఆర్థిక సంక్షోభం నుంచి కెనడాను గట్టెక్కేలాచేసి శెభాష్ అనిపించుకున్నారు. వలసలు, అధికమైన ఆహార, ఇళ్ల ధరలతో ప్రస్తుతం కెనడా సతమవుతున్న వేళ ట్రంప్ టారిఫ్ యుద్ధానికి తెరలేప డంతో కార్నీ తన బ్యాంకింగ్ అనుభవాన్ని పరిపాలనా దక్షతగా మార్చాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.హార్వర్డ్లో ఉన్నత విద్య: 1965 మార్చి 16వ తేదీన వాయవ్య కెనడాలోని ఫోర్ట్స్మిత్ పట్టణంలో కార్నీ జన్మించారు. తర్వాత ఆల్బెర్టా రాష్ట్రంలోని ఎడ్మోంటెన్లో పెరిగారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో 1988లో ఉన్నతవిద్య పూర్తిచేశారు. ఈయనకు ఐస్ హాకీ అంటే చాలా ఇష్టం. కాలేజీ రోజుల్లో ఐస్హాకీ బాగా ఆడేవారు. తర్వాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఆర్థికశాస్త్రంలో పీహెచ్డీ సాధించారు. బ్రిటన్కు చెందిన ఆర్థికవేత్త డయానా ఫాక్స్ను పెళ్లాడారు. వీళ్లకు నలుగురు కుమార్తెలు. కెనడా పౌరసత్వంతోపాటు ఈయనకు ఐరిష్, బ్రిటిష్ పౌరసత్వం కూడా ఉంది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్కు గవర్నర్గా పనిచేసినకాలంలో తొలిసారిగా బ్రిటన్ పాస్పోర్ట్ సంపాదించారు. గోల్డ్మ్యాన్ శాక్స్లో దశాబ్దానికిపైగా పనిచేశారు. లండన్, టోక్యో, న్యూయార్క్, టొరంటోలో పనిచేశారు. తర్వాత 2003లో బ్యాంక్ ఆఫ్ కెనడాలో డిప్యూటీ గవర్నర్గా పనిచేశారు.3 శతాబ్దాల్లో తొలిసారిగా: 2013 నుంచి ఏడేళ్లపాటు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ గవర్నర్గా సేవలందించారు. 1694లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ను స్థాపించగా గత 300 సంవత్సరాల్లో ఆ బ్యాంక్కు గవర్నర్గా ఎన్నికైన తొలి బ్రిటీషేతర వ్యక్తిగా 2013లో కార్నీ చరిత్ర సృష్టించారు. బ్రెగ్జిట్ వేళ బ్రిటన్ ఆర్థికసంక్షోభంలో కూరుకుపోకుండా బ్యాంకర్గా కార్నీ సమర్థవంత పాత్ర పోషించారు. 2020లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ను వీడాక ఐక్యరాజ్యసమితిలో వాతావరణ మార్పులు, ఆర్థిక అంశాలపై ప్రత్యేక దౌత్యవేత్తగా సేవలందించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
లలిత్ మోదీ పాస్పోర్ట్ రద్దు
పోర్ట్ విలా: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) మాజీ వ్యవస్థాపకుడు లలిత్ మోదీకి ఇటీవల జారీ చేసిన పాస్పోర్ట్ను రద్దు చేయాలని పసిఫిక్ ద్వీప దేశం వనౌతు ప్రధానమంత్రి జొథమ్ నపట్ తమ అధికారులను ఆదేశించారు. పరారీలో ఉన్న ఈ నిందితుడు భారత్కు అప్పగింత నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆయన పేర్కొన్నారు. ఐపీఎల్ సారథిగా ఉన్న సమయంలో కోట్లాది రూపాయలను లంచంగా తీసుకున్నాడన్న ఆరోపణలపై దర్యాప్తు విభాగాలు విచారణ చేపట్టాయి. వీటి నుంచి తప్పించుకునేందుకు 2010లో దేశం వీడిన లలిత్ లండన్లో ఉంటున్నాడు. అయితే, ఇటీవల వనౌతు పాస్పోర్టు పొందిన లలిత్ మోదీ తన భారత పాస్పోర్టును లండన్లోని భారత హైకమిషన్ కార్యాలయానికి అప్పగిస్తూ దరఖాస్తు చేసుకున్నాడు. ఒకవేళ, ఈ దరఖాస్తును భారత ప్రభుత్వం ఆమోదిస్తే మోదీ లండన్లో చట్ట విరుద్ధంగా ఉంటున్న వ్యక్తి అవుతాడు. ఈ పరిణామాల నేపథ్యంలో వనౌతు ప్రధాని కార్యాలయం నుంచి సోమవారం తాజా ప్రకటన వెలువడటం గమనార్హం. లలిత్ పాస్పోర్టు దరఖాస్తు పరిశీలన సమయంలో ఇంటర్పోల్ వంటి అంతర్జాతీయ వ్యవస్థల నుంచి అతడిపై జారీ చేసిన ఎటువంటి నోటీసులు లేని విషయాన్ని అధికారులు గమనించారని చెప్పారు. అయితే, ఇటీవల అంతర్జాతీయ మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా లలిత్ పాస్పోర్ట్ రద్దు చేయాలని సిటిజన్షిప్ కమిషన్ను ఆదేశించినట్లు చెప్పారు. లలిత్ మోదీపై అలెర్ట్ నోటీసు ఇవ్వాలంటూ భారత్ ప్రభుత్వం చేసిన వినతులను సరైన ఆధారాల్లేవంటూ ఇంటర్పోల్ 24 గంటల్లో రెండుసార్లు తోసిపుచ్చిందని చెప్పారు. అయితే, అతడు భారత్కు అప్పగించకుండా తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్న విషయం స్పష్టమైనందునే పాస్పోర్టు రద్దుకు ఆదేశాలిచ్చినట్లు వనౌతు ప్రధాని వివరించారు. -
ఇంగ్లండ్ తీరంలో రెండు నౌకలు ఢీ
లండన్: ఇంగ్లండ్ తూర్పు తీరంలో ఆయిల్ ట్యాంకర్, సరుకు నౌక ఢీకొన్న ఘటనలో రెండు ఓడలకు మంటలు అంటుకున్నాయి. హల్ తీరానికి సమీపంలో సోమవారం ఉదయం 9.48 గంటల సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. రెండు నౌకల్లోని మొత్తం 37 మందిని రక్షించి ఒడ్డుకు తీసుకువచ్చినట్లు రవాణా శాఖ మంత్రి తెలిపారని స్థానిక ప్రజా ప్రతినిధి గ్రాహం స్టువార్ట్ చెప్పారు. వీరిలో తీవ్రగాయాలతో ఉన్న ఒకరిని ఆస్పత్రిలో చేర్పించారన్నారు. గ్రీస్ నుంచి వచ్చిన అమెరికాకు చెందిన ఎంవీ స్టెనా ఇమాక్యులేట్ పేరున్న ఆయిల్ ట్యాంకర్ గ్రీమ్స్బీ పోర్టులో లంగరేసి ఉంది. అదే సమయంలో, స్కాట్లాండ్ నుంచి నెదర్లాండ్స్లోని పోటర్డ్యామ్ వైపు వెళ్తున్న పోర్చుగల్ సరుకు నౌక సొలొంగ్ దానిని ఢీకొట్టింది. దీంతో, రెండు ఓడల్లో మంటలు చెలరేగాయి. సరుకు ఓడలో సోడియం సైనైడ్ అనే విషపూరిత రసాయన కంటెయినర్లు ఉన్నట్టు సమాచారం. బ్రిటన్ మారిటైం కోస్ట్గార్డ్ ఏజెన్సీ ఆ ప్రాంతానికి లైఫ్బోట్లను, రెస్క్యూ హెలి కాప్టర్ను పంపించింది. నౌకల్లో నుంచి బయటకు దూకిన వారిని లైఫ్బోట్లలో రక్షించి ఒడ్డుకు చేర్చారు. కాగా, స్టెనా ఇమాక్యులేట్ ఓడలో జెట్–ఏ1 ఇంధనం రవాణా అవుతోందని అమెరికాకు చెందిన మారిటైం మేనేజ్మెంట్ సంస్థ క్రౌలీ తెలిపింది. సరుకు నౌక ఢీకొట్టడంతో ట్యాంకర్ దెబ్బతిని ఇంధనం లీకైంది. దీంతో మంటలు వ్యాపించడంతోపాటు పలుమార్లు పేలుళ్లు సంభవించినట్లు వెల్లడించింది. ట్యాంకర్ నౌకలో ఉన్న మొత్తం 23 మంది సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు క్రౌలీ వివరించింది. అమెరికా సైన్యానికి అవసరమైన ఇంధనాన్ని ఈ సంస్థ సరఫరా చేస్తుంది. -
USA: భారత సంతతి సుదీక్ష అదృశ్యం.. బీచ్లో ఏం జరిగింది?
వర్జీనియా: అమెరికాలో చదువుతున్న భారత సంతతి విద్యార్థిని సుదీక్ష కోణంకి(20) మిస్సింగ్ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. కరేబియన్ దేశానికి విహారయాత్రకు వెళ్లిన సుదీక్ష ఓ బీచ్ వద్ద అదృశ్యమయ్యారు. దీంతో ఆమె కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. ఆమె ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.వివరాల ప్రకారం.. భారత సంతతి విద్యార్థిని సుదీక్ష కోణంకి అమెరికాలోని వర్జీనియాలో నివాసం ఉంటోంది. అక్కడే పిట్స్బర్గ్ యూనివర్సిటీలో ఆమె చదువుకుంటున్నారు. అయితే, గత వారం ఆమె తన స్నేహితులతో కలిసి కరేబియన్ దేశానికి విహారయాత్రకు వెళ్లారు. ఐదుగురు అమ్మాయిలతో కలిసి డొమినికన్ రిపబ్లిక్లోని ప్రముఖ పర్యటక పట్టణమైన ప్యూంటా కానా ప్రాంతానికి చేరుకున్నారు. ఈ క్రమంలో మార్చి ఆరో తేదీన స్థానికంగా ఉన్న రియూ రిపబ్లికా రిసార్ట్ వద్ద బీచ్ వెంట నడుచుకుంటూ కనిపించారు. ఆ తర్వాత ఆమె తిరిగి రాకపోవడంతో స్నేహితులు ఆందోళనకు గురై పోలీసులను సంప్రదించారు.ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన స్థానిక పోలీసులు.. ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సముద్ర తీరం వద్ద, సముద్రం లోపల డ్రోన్లు, హెలికాప్టర్లతో గత నాలుగు రోజులుగా ఆమె కోసం వెతుకుతున్నారు. ఇప్పటివరకు ఏ ఆచూకీ లభించకపోవడంతో బహుశా ఆమె బీచ్లో కొట్టుకుపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. మరోవైపు.. సుదీక్ష ఆచూకీ తెలియకపోవడంతో ఆమె పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు.Urgent missing college student on Spring Break in the Dominican Republic - Sudiksha Konanki - last seen in brown bikini in picture below 👇 pic.twitter.com/AMdYPngwVK— Glenda (@Glendaragnarson) March 10, 2025ఈ సందర్బంగా ఆమె తండ్రి కోణంకి సుబ్బరాయుడు తాజాగా మాట్లాడుతూ..‘తప్పిపోయిన సుదీక్ష కోసం పోలీసులు గాలిస్తున్నారు. రిసార్ట్ పరిసరాలు, సముద్రం వద్ద గాలింపు చర్యలు చేపట్టారు. అంతేకాకుండా కిడ్నాప్, మానవ అక్రమ రవాణా వంటి అవకాశాలను కూడా పరిశీలించాలని పోలీసులను కోరాం’ అని చెప్పుకొచ్చారు. La Defensa Civil y otras instituciones, continúan en la búsqueda de Sudiksha Konanki, la joven de nacionalidad india, quien desapareció la madrugada del jueves 6 de marzo mientras caminaba en una playa de Punta Cana, provincia de La Altagracia.Informan que también fueron… pic.twitter.com/ntQQxC738S— Noticias Telemicro (@NTelemicro5) March 9, 2025 -
Mark Carney: అమెరికాలో కెనడా విలీనం.. ఏనాటికీ కాబోదు
ఆర్థిక మేధావి, కెనడాకు కాబోయే ప్రధాని మార్క్ కార్నీ.. బాధ్యతలు చేపట్టకముందే అమెరికాతో కవ్వింపు చర్యలకు దిగుతున్నారా?!. రాబోయే రోజుల్లోనూ డొనాల్డ్ ట్రంప్తో ఢీ అంటే ఢీ అనేందుకు ఆయన సిద్ధమవుతున్నారా?. తాజా విక్టరీ స్పీచ్లో ఆయన చేసిన వ్యాఖ్యలే ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి. కెనడాను అమెరికాలో కలిపేసుకుంటామంటున్న అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump)నకు.. మార్క్ కార్నీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.అధికార లిబరల్ పార్టీ ఆదివారం మార్క్ కార్నీ(Mark Carney)ని తమ నూతన అధ్యక్షుడిగా ఎన్నుకుంది. సుమారు 86 శాతం సభ్యుల ఓట్లతో.. భారీ మెజార్టీతో ఆయనకు విజయం కట్టబెట్టింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. విక్టరీ స్పీచ్లో కార్నీ ఏమన్నారంటే.. అమెరికా కెనడా కాదు. కెనడా ఏనాటికీ.. ఏ రూపంలోనూ అమెరికాలో భాగం కాబోదు. ఇతర దేశాలతో మేం(కెనడా) ఏ రకమైనా పోరాటం కోరుకోవడం లేదు. కానీ, .. అవతలివాళ్లు స్నేహ హస్తం వదులుకోవాలనుకుంటే మాత్రం.. మేమూ అందుకు సిద్ధంగానే ఉన్నాం. కాబట్టి.. అమెరికన్లు ఎలాంటి తప్పు చేయకూడదనే నేను కోరుకుంటున్నా. అది వాణిజ్యంలో అయినా.. హకీలో అయినా.. కెనడాదే పైచేయి అనే విషయం మరిచిపోకూడదు’’ అని అన్నారాయన.ఇదీ చదవండి: కెనడా కొత్త ప్రధాని.. మామూలోడు కాదండోయ్!ఈ క్రమంలో అమెరికాపై కెనడా ప్రతీకార సుంకాల(US Canada Tariff Hikes) విధింపు కొనసాగుతుందని ప్రకటించారాయన. ‘‘అమెరికన్లు మమ్మల్ని కాస్త గౌరవించాలి. వాణిజ్య ఒప్పందాలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా అమలు చేయాలి’’ అని కోరారు. అలాగే.. తన విజయ ప్రసంగంలో దేశ ఆర్థిక స్థితిగతుల గురించి మాట్లాడిన ఆయన.. కెనడాను ఎనర్జీ సూపర్ పవర్గా తీర్చిదిద్దుతానని, అందుకోసం ఎలాంటి కఠిన నిర్ణయాలకైనా సిద్ధమని ప్రతిజ్ఞ చేశారు.ఇదిలా ఉంటే కార్నీ తాజా వ్యాఖ్యలపై రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాతో కయ్యానికి కాలు దువ్వడం ఏమాత్రం మంచిది కాదని సూచిస్తున్నారు. ఏమాత్రం రాజకీయ, పాలనానుభవం లేని మార్క్ కార్నీ దూకుడుగా కాకుండా ఆచితూచీ అడుగులేయాలని సూచిస్తున్నారు. లేకుంటే.. పరిస్థితులు చేజారిపోయే అవకాశం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. -
కెనడా కొత్త ప్రధానిగా మార్క్ కార్నీ
ఒట్టావా: కెనడాలో తొమ్మిదేళ్ల జస్టిన్ ట్రూడో(Justin Trudeau) పాలనకు తెరపడింది. ఆ దేశ నూతన ప్రధానిగా మార్క్ కార్నీ(Mark Carney) ఖరారు అయ్యారు. తాజాగా జరిగిన సమావేశంలో తమ కొత్త సారథిగా అధికార లిబరల్ పార్టీ కార్నీని ఎన్నుకుంది. ఏనాడూ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయని, కేబినెట్లో పనిచేయని ఆయన.. కెనడా 24వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. తీవ్ర ప్రజా వ్యతిరేకతతో జస్టిన్ ట్రూడో ఈ జనవరిలో ప్రధాని పదవి నుంచి వైదొలగనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లిబరల్ పార్టీకి కొత్త అధ్యక్షుడి ఎన్నిక అనివార్యమైంది. అయితే కొత్త నేత ఎన్నిక దాకా జస్టిన్ ఆ పదవిలో కొనసాగారు. ఇక కొత్త ప్రధానిగా బ్యాంక్ ఆఫ్ కెనడా మాజీ గవర్నర్ మార్క్ కార్నీ ఎన్నికయ్యారు . తాజాగా జరిగిన ఓటింగ్లో లిబరల్ పార్టీ సభ్యులు మొత్తం 1,50,000 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. కార్నేకు 131,674 ఓట్లు పొలవ్వగా.. క్రిస్టియా ఫ్రీలాండ్ 11,134, కరినా గౌల్డ్కు 4,785, ఫ్రాంక్ బేలిస్కు 4,038 ఓట్లు వచ్చాయి. అంటే కార్నేకు వచ్చిన ఓట్లు 86 శాతమన్నమాట.ఆర్థిక మేధావిగా పేరున్న మార్క్ కార్నీ సరిగ్గా డొనాల్డ్ ట్రంప్ సుంకాల ముప్పు వంటి సవాళ్లను ఎదుర్కొంటున్న వేళలో ప్రధానిగా బాధ్యతలు స్వీకరిస్తుండడం గమనార్హం.ఎవరీ కార్నీ.. బ్యాక్గ్రౌండ్ ఇదే👉మార్క్ కార్నీ 1965లో ఫోర్ట్ స్మిత్లో జన్మించారు. హార్వర్డ్లో ఉన్నత విద్య అభ్యసించారు. గోల్డ్మన్ శాక్స్లో 13 ఏళ్లు పనిచేసిన ఆయన.. 2003లో బ్యాంక్ ఆఫ్ కెనడా డిప్యూటీ గవర్నర్గా ఎన్నికయ్యారు. 2004లో ఆ బాధ్యతల నుంచి వైదొలగి.. కెనడా ఆర్థిక మంత్రి పదవిని చేపట్టారు. 👉2008 ఫిబ్రవరి 1న సెంట్రల్ బ్యాంక్ గవర్నర్గా నియమితులయ్యారు. సరిగ్గా అదే సమయంలో కెనడా ఆర్థిక సంక్షోభంలో కొట్టు మిట్టాడుతోంది. ఆ టైంలో ఆయన అనూహ్యంగా.. వడ్డీ రేట్లను సున్నాకు తగ్గించారు. 👉మూడు శతాబ్దాల చరిత్ర కలిగిన బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్కు గవర్నర్గా 2013లో కార్నీ ఎన్నికయ్యారు. తద్వారా ఆ సెంట్రల్ బ్యాంక్కు మొట్టమొదటి నాన్-బ్రిటిష్ గవర్నర్గా నిలిచారు. అంతేకాదు, జీ7లోని రెండు సెంట్రల్ బ్యాంకులకు నాయకత్వం వహించిన వ్యక్తిగానూ రికార్డుకెక్కారు. 2020లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ను వీడిన ఆయన.. ఐరాస ఆర్థిక, వాతావరణ మార్పుల విభాగం రాయబారిగా సేవలందించారు. తాజా లిబరల్ పార్టీ నూతన అధ్యక్షుడి ఎన్నికల రేసులో నిలిచిన నలుగురిలో అత్యధికారంగా విరాళాలు సేకరించిన అభ్యర్థి కూడా ఈయనే కావడం గమనార్హం. -
నీవల్లే కరోనా!.. చైనాకు అమెరికా కోర్టు జరిమానా
వాషింగ్టన్: డ్రాగన్ కంట్రీ చైనాకు అమెరికా భారీ షాకిచ్చింది. కోవిడ్ మహమ్మారిని కప్పిపుచ్చడంతోపాటు, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్(పీపీఈ)పై గుత్తాధిపత్యం చెలాయించిందనే ఆరోపణలపై అమెరికా కోర్టు చైనాకు 24 బిలియన్ డాలర్ల జరిమానా విధించింది. కాగా, కోవిడ్ వ్యాప్తికి చైనా ప్రభుత్వమే కారణమంటూ 2020లో మిస్సోరిలో కేసు నమోదైంది. మహమ్మారికి కేంద్రంగా భావిస్తున్న వూహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, తదితర సంస్థలను బాధ్యులుగా ఇందులో పేర్కొన్నారు. అమెరికాకు సరఫరా కావాల్సిన పీపీఈ కిట్ల ఉత్పత్తి, కొనుగోలు, ఎగుమతి, దిగుమతులను చైనా ప్రభుత్వం అడ్డుకుందని అందులో ఆరోపించారు. విచారణ ముగించిన జడ్జి స్టీఫెన్ కోవిడ్ మహమ్మారికి కారణమై నష్టం కలిగించినందుకు చైనా ప్రభుత్వానికి 24 మిలియన్ డాలర్లు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. ఇదే సమయంలో చైనా చర్యల ఫలితంగా మిస్సోరికి పన్నుల రూపంలో 8 బిలియన్ డాలర్ల నష్టం కలిగిందని, పీపీఈ కిట్ల సరఫరా నిలిచినందుకు గాను మరో 122 మిలియన్ డాలర్ల మేర అదనంగా ఖర్చు చేయాల్సి వచి్చందని ఆయన తీర్పులో పేర్కొన్నారు. కోవిడ్కు చైనాను బాధ్యునిగా చేయడంలో ఇది చారిత్రక తీర్పు అని మిస్సోరి అటార్నీ జనరల్ ఆండ్రూ బెయిలీ పేర్కొన్నారు. మిసోరిలోని చైనా ఆస్తులను స్వా«దీనం చేసుకుని, నష్టాన్ని భర్తీ చేస్తామన్నారు. మిసోరి కోర్టు తీర్పుపై వాషింగ్టన్లో చైనా ఎంబసీ ప్రతినిధి తీవ్రంగా స్పందించారు. ‘ఈ తీర్పును మేం పట్టించుకోం. ఎలాంటి ప్రాతిపదిక లేని కేసు. అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా ఉన్న తీర్పు’అని పేర్కొన్నారు. -
స్వామి నారాయణ్ ఆలయంపై...విద్వేష దాడి
న్యూయార్క్/న్యూఢిల్లీ: అమెరికాలో హిందూ ఆలయాలను లక్ష్యంగా చేసుకొని దుండగులు రెచ్చిపోతున్నారు. కాలిఫోర్నియా రాష్ట్రంలో శాన్ బెర్నార్డినో కౌంటీలో ఉన్న చినో హిల్స్లోని ప్రఖ్యాత స్వామి నారాయణ్ మందిరంపై శనివారం గుర్తు తెలియని వ్యక్తులు దాడికి తెగబడ్డారు. ఆలయ గోడలపై భారత వ్యతిరేక రాతలు రాశారు. గ్రాఫిటీ రాతలతో అందవిహీనంగా మార్చే ప్రయత్నం చేశారు. ఇది ఖలిస్తానీల పనేనని భావిస్తున్నారు. చినో హిల్స్ లాస్ ఏంజెలెస్ కౌంటీకి సరిహద్దులోనే ఉంది. ఆలయాన్ని అపవిత్రం చేశారని బోచాసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ (బీఏపీఎస్) ఆవేదన వెలిబుచ్చింది. ‘‘ఆలయాలపై విద్వేషాన్ని హిందూ సమాజం గట్టిగా వ్యతిరేకిస్తోంది. ఈ విద్వేషాల వ్యాప్తిని చినో హిల్స్, దక్షిణ కాలిఫోర్నియాలోని హిందువులు కలసికట్టుగా అడ్డుకుంటారు’’ అని ‘ఎక్స్’లో పోస్టు చేసింది. ఈ ఘటనపై హిందూ అమెరికన్ ఫౌండేషన్ దిగ్భ్రాంతి వ్యక్తంచేసింది. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపి దుండగులను కఠినంగా శిక్షించాలని ఎఫ్బీఐని, దాని డైరెక్టర్ కాశ్ పటేల్ను కోరింది. ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని అమెరికా ప్రభుత్వానికి కోవలిషన్ ఆఫ్ హిందూస్ ఆఫ్ నార్త్ అమెరికా (కోహ్న) విజ్ఞప్తి చేసింది. ‘‘అమెరికాలో హిందువులపై ద్వేషభావం లేదని మీడియా, మేధావులు చెబుతున్నా వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. లాస్ ఏంజెలెస్లో ఖలిస్తాన్ రెఫరెండం పేరిట కొందరు డ్రామాలుడుతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో స్వామి నారాయణ్పై ఆలయంపై దాడి ఆశ్చర్యం కలిగించలేదు’’ అని పేర్కొంది. కొన్నేళ్లలో అమెరికాలో 10 హిందూ ఆలయాలపై దాడులు జరిగాయని ఆవేదన వెలిబుచ్చింది. గతేడాది కాలిఫోర్నియాలోని శాక్రమెంటోలో, న్యూయార్క్లోని మెల్వీల్లేలో ఆలయాలపై దాడులు జరిగాయి. ‘హిందూస్ గో బ్యాక్’ అంటూ ఆలయాల గోడలపై రాతలు రాశారు.భారత్ ఖండన స్వామి నారాయణ్ ఆలయంపై దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ«దీర్ జైశ్వాల్ ఆదివారం డిమాండ్ చేశారు. అమెరికాలోని హిందూ దేవాలయాలకు తగిన రక్షణ కల్పించాలని కోరారు. స్వామి నారాయణ్ ఆలయాన్ని అపవిత్రం చేయడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. ఆలయాలపై అసహనం, విద్వేష చర్యలు అంగీకారయోగ్యం కాదని పేర్కొంది. దుండగులపై అమెరికా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. దాడిని యోగా గురు రాందేవ్ ఖండించారు. -
చైనా నుంచి మనూస్ ఏఐ
బీజింగ్: కొన్ని రోజుల క్రితం ‘డీప్సీక్’కృత్రిమ మేధ(ఏఐ) మోడల్ను తీసుకొచ్చి ప్రపంచ టెక్నాలజీ రంగంలో సంచలనం సృష్టించిన డ్రాగన్ దేశం చైనా మరో సంచలనానికి తెరతీసింది. ‘మనూస్’పేరిట మరో కృత్రిమ మేధ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే వాడుకలో ఉన్న అగ్రశ్రేణి ఏఐ వేదికలకు దీటుగా మనూస్ను రూపొందించారు. చైనాకు చెందిన స్టార్టప్ కంపెనీ ‘మొనికా’ఈ మనూస్ను అభివృద్ధి చేసింది. ‘ఆలోచనలు, చర్యలకు మధ్య వారధిగా పని చేస్తుంది. ఇది కేవలం ఆలోచించడమే కాదు, ఫలితాలు సాధించి చూపుతుంది’’అని మొనికా కంపెనీ వెల్లడించింది. ఈ నూతన ఏఐ ఏజెంట్ వినియోగదారులకు చక్కటి అనుభూతి ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని తెలియజేసింది. కొత్త వెబ్సైట్లను రూపొందించడం నుంచి విహార యాత్రలకు ప్లానింగ్ చేయడం దాకా ఎన్నో రకాల పనులను మనూస్ చక్కబెడుతుంది. స్టాక్ మార్కెట్ను విశ్లేషించడంలో బహు నేర్పరి. కేవలం ఒక ఆదేశం ఇచ్చేస్తే చాలు మనకు కావాల్సిన పనులు పూర్తిచేస్తుంది. మనూస్ తనంతట తాను ఆలోచించుకోగలదు. ప్లాన్ చేసుకొని దాన్ని అమలు చేయగలదు. స్వయం చాలితం అని చెప్పొచ్చు. మనూస్ను ఈ నెల 6వ తేదీన ఆవిష్కరించారు. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. ఏమిటీ మనూస్? ఇదొక జనరల్ ఏఐ ఏజెంట్. వేర్వేరు రంగాలకు సంబంధించి సంక్లిష్టమైన, రియల్–వరల్డ్ పనులు పూర్తిచేయగలదు. సాధారణ ఏఐ చాట్బాట్స్ తరహాలో కాకుండా విభిన్నంగా పనిచేస్తుంది. ఇది పూర్తిస్థాయి అటనామిస్ సిస్టమ్. ప్రణాళిక, కార్యాచరణ, ఫలితాలు... అనే శ్రేణిలో పనిచేయగల సామర్థ్యం దీని సొంతం. ఉదాహరణకు గ్లోబల్ వార్మింగ్పై ఒక నివేదిక తయారు చేసి ఇవ్వాలని సూచించామనుకోండి. ఆ అంశంపై మనూస్ తనంతట తానే పరిశోధన సాగిస్తుంది. పేపర్పై నివేదికను సిద్ధం చేసి మనకు అందజేస్తుంది. -
గర్భిణులు పారాసిటమాల్ వాడితే... పిల్లల్లో ఏడీహెచ్డీ!
కొందరు పిల్లలు చదువుతో పాటు ఆటపాటలు, అల్లరిలోనూ చురుగ్గా ఉంటారు. మరికొందరు మరీ అతి చురుకుదనం చూపిస్తారు. ఏదైనా ఇట్టే చేయగలమనే ధీమా వాళ్లలలో తొణికిసలాడుతుంది. అలా శక్తికి మించిన పనులు చేసి సమస్యలు కొని తెచ్చుకుంటుంటారు. అలాంటి ఈ పిల్లలు దేనిపైనా ఎక్కువ సేపు దృష్టి పెట్టలేరు. ఆలోచన కంటే ఆవేశంతోనే పనులు చేస్తుంటారు. పర్యావసానాలను కూడా పట్టించుకోరు. ఇలాంటి వాళ్లు అటెన్షన్ డిఫిసిట్ హైపరాక్టివిటీ డిజార్టర్ (ఏడీహెచ్డీ)తో బాధపడుతున్నట్టు! పారాసిటమాల్గా పిలిచే అసిటమినోఫిన్ను గర్భిణులు అతిగా వాడితే పిల్లల్లో ముప్పు మూడింతలు పెరుగుతుందని తాజా అధ్యయనంలో తేలింది. తలనొప్పికి, జ్వరానికి పారాసిటమాల్ వాడటం మన దగ్గర పరిపాటి. ఇది జ్వరంతో పాటు ఓ మాదిరి ఒంటి నొప్పులను కూడా తగ్గిస్తుంది. కానీ నొప్పి గర్భంతో ఉన్నప్పుడు ఈ మాత్రను అతిగా వాడితే పుట్టబోయే పిల్లల మెదడు ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం పడుతున్నట్టు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ పరిశోధకుల తాజా అధ్యయనంలో వెల్లడైంది. గర్భంతో ఉన్న 307 మంది నల్లజాతి మహిళల్లో పారాసిటమాల్ వాడినప్పుడు ఒంట్లో రక్తప్రవాహ రేట్లు, రక్తంలో ఈ ఔషధ పాళ్లను గమనించారు. వాటిని అతిగా వాడిన వారికి పుట్టిన చిన్నారుల్లో మిగతా పిల్లలతో పోలిస్తే ఏడీహెచ్డీ ముప్పు మూడు రెట్లు అధికమని తేలింది. అమ్మాయిలైతే పదేళ్ల లోపు ఏడీహెచ్డీ బారిన పడే ముప్పు ఏకంగా ఆరు రెట్లు ఎక్కువని అధ్యయనకారులు తెలిపారు. కనుక తప్పని పరిస్థితుల్లో మాత్రమే పారాసిటమాల్ వాడాలని సూచించారు. అధ్యయన వివరాలు ‘నేచర్ మెంటల్ హెల్త్’ జర్నల్లో ప్రచురితమయ్యాయి. దశాబ్దాలుగా వాడకం ‘‘అసిటమినోఫిన్ను దశాబ్దాలుగా వాడుతున్నారు. గర్భిణుల్లో పిండం తాలూకు మెదడు, నాడీవ్యవస్థ ఎదుగుదలపై అసిటమినోఫిన్ ప్రభావంపై ఇంతవరకు ఎలాంటి పరిశోధనలూ జరగలేదు. తాజా పరిశోధన నేపథ్యంలో గర్భిణుల పారాసిటమాల్ వాడకంపై అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మిని్రస్టేషన్ (ఎఫ్డీఏ) విభాగం పునఃసమీక్ష జరపాల్సిన అవసరం ఏర్పడింది. దీనిపై అమెరికా ప్రభుత్వం ఆలోచించాలి’’ అని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్లో పిల్లల వైద్య నిపుణురాలు షీలా సత్యనారాయణ చెప్పారు. అయితే, ‘‘ప్రస్తుత పరిశోధన ఫలితాలతో బెంబేలెత్తాల్సిన పని కూడా లేదు. దీనిపై మరింత విస్తృత అధ్యయనం జరగాల్సి ఉంది’’ అని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం గర్భిణులకు పారాసిటమల్ను తప్పనిసరైతేనే, అదీ తక్కువ డోసులోనే వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. తాజా అధ్యయనం నేపథ్యంలో ఎఫ్డీఏతో పాటు యూరోపియన్ మెడికల్ ఏజెన్సీ, అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఒబ్్రస్టిటీíÙయన్స్, గైనకాలజిస్ట్స్, ది సొసైటీ ఆఫ్ ఓబ్స్ట్రిటీíÙయన్స్ అండ్ గైనకాలజిస్ట్స్ ఆఫ్ కెనడా, ది సొసైటీ ఆఫ్ మెటర్నల్ –ఫీటల్ తదితరాలు పునరాలోచనలో పడే వీలుంది. అయితే గర్భిణులు అసిటమినోఫిన్ వాడితే పిల్లలకు ఏడీహెచ్డీ వస్తుందని నిరూపణ కాలేదని ఎఫ్డీఏ అధికారులు 2015లో తేల్చడం గమనార్హం. – వాషింగ్టన్ -
గాజా అమ్మకానికి లేదు
ఎడిన్బర్గ్: గాజా స్ట్రిప్ను ఖాళీ చేయించి అందమైన పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దుతానన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై పాలస్తీనియన్లు ప్రతీకార చర్యలకు దిగారు. స్కాట్లాండ్లో ట్రంప్కు చెందిన టర్న్బెర్రీ గోల్ఫ్ రిసార్ట్ను ధ్వంసం చేశారు. శనివారం తెల్లవారుజామున నిరసనకారులు రిసార్ట్లోకి చొరబడ్డారు. గోల్ఫ్ హోల్స్ను నాశనం చేశారు. ఓపెన్ చాంపియ్íÙప్స్లో ఉపయోగించే వస్తువులు, ప్రదేశాలను పాడు చేశారు. అక్కడి పచ్చికబయళ్లపై ‘గాజా అమ్మకానికి లేదు’ అని తెల్లని పెయింట్తో రాశారు. రిసార్ట్ క్లబ్హౌస్ భవన గోడలపై ఎరుపు రంగు చల్లారు. ఇది తమ పనేనని ‘పాలస్తీనా యాక్షన్’ అనే సంస్థ ప్రకటించుకుంది. ‘‘గాజాపై ట్రంప్ వ్యాఖ్యలకు ప్రతీకారంగానే ఈ పని చేశాం. గాజాను తన సొంత ఆస్తిలా పరిగణిస్తామంటే ఒప్పుకోం. ఇది తెలియజేప్పేందుకు, ట్రంప్ ఆస్తికి భద్రత లేదని నిరూపించేందుకు రిసార్ట్పై దాడి చేశాం. గాజా స్ట్రిప్ను ఇజ్రాయెల్కు, అమెరికాకు వలసరాజ్యంగా మార్చే యత్నాలను అడ్డుకుంటాం’’ అని ప్రకటించింది. దాడిని పిల్లచేష్టగా రిసార్ట్ వర్గాలు కొట్టిపారేశాయి. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక గోల్ఫ్కోర్సుల్లో టర్న్బెర్రీ ఒకటి. ఇక్కడ నాలుగుసార్లు ఓపెన్ ఛాంపియన్íÙప్ జరిగింది. 2014లో ట్రంప్ కొనుగోలు చేసినప్పటి నుంచీ ఇక్కడ ఓపెన్ రొటేషన్ను అమలు చేయడం లేదు. -
ఐస్క్రీమ్లో పాము పిల్ల!
ఐస్క్రీమ్ అంటే కొందరికి చాలా ఇష్టం. బడలిక తర్వాత నచి్చన ఐస్క్రీమ్ తింటే ప్రాణం లేచొచినట్లు అనిపిస్తుంది. కానీ పొరపాటున ఈ ఐస్క్రీమ్ గనుక తింటే ప్రాణాలు పోవడం ఖాయం. ఇది స్నేక్ ఐస్క్రీం మరి! థాయిలాండ్లో మియాంగ్ రాచ్బురీ రాష్ట్రంలోని పార్క్ థో జిల్లాలో రేబాన్ నక్లెంగ్బూన్ అనే వ్యక్తి స్థానికంగా తన ఫేవరెట్ ‘బ్లాక్బీన్’ పాప్సికిల్ ఐస్క్రీం కొన్నాడు. ఆత్రంగా రేపర్ తీయగానే చచ్చిన పాము పిల్ల కనిపించడంతో ఠారెత్తిపోయాడు. దాన్ని ఫొటో తీసి ‘ఫేస్బుక్’లో పెట్టాడు. నలుపు, పలుసు రంగుల్లో ఉన్న పాము పిల్ల ఐస్క్రీమ్లో గడ్డకట్టుకుపోని కనిపిస్తోంది. ‘‘దాని కళ్లు తెరిచే ఉన్నాయి! ఇంకా బతికే ఉందా?’’ అంటూ పోస్టు పెట్టాడు. దాంతో ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అది ఓ మాదిరి విషముండే గోల్డెన్ ట్రీ రకం పాము పిల్ల అని కొందరు నిర్ధారించారు. ఆ ఐస్క్రీంను ఏ అర్ధరాత్రో చిమ్మచీకట్లో రోడ్సైడ్ బండిపై కొని చప్పరిస్తే ఈపాటికి టపా కట్టేవాడంటూ కొందరు జోకులు పేల్చారు. ‘‘ఏ కోటిలో ఏ ఒక్కరినో ఇలాంటి అదృష్టం వరిస్తుంది. ఓసారి టేస్ట్ చేసి చూడు’’ అని ఇంకొదరు పోస్టులు పెట్టారు. – బ్యాంకాక్ -
గ్యాస్ పైప్లైన్లో నడిచొచ్చి.. వెనక నుంచి దాడి
కీవ్: యుద్ధంలో ఉక్రెయిన్ సేనలపై ఊహించని రీతిలో దాడిచేసేందుకు రష్యా బలగాలు ఒక గ్యాస్ పైప్లైన్ లోపలి నుంచి నడుచుకుంటూ వెళ్లిందని కథనాలు వెలువడ్డాయి. రష్యాలోని కరŠస్క్ రీజియన్లో ఈ యుద్ధ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. గత ఏడాది ఆగస్ట్లో ఉక్రెయిన్ సేనలు తొలిసారిగా రష్యా భూభాగాన్ని ఆక్రమించుకున్నాయి. రెండో ప్రపంచయుద్ధం తర్వాత రష్యా భూభాగంపై జరిగిన అతిపెద్ద దాడి ఘటన ఇదే. వ్యూహాత్మక సరిహద్దు పట్టణమైన సుడ్జా సహా 1,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఉక్రెయిన్ బలగాలు కైవసం చేసుకున్నాయి. వందలాది మంది రష్యా సైనికులను యుద్ధ ఖైదీలుగా బంధించాయి. దీంతో అమేయ సైనికశక్తిగా ఉన్న రష్యా దీనిని అవమానంగా భావించి ఏకంగా 50,000 మంది సైనికులతో భారీ ఎదురుదాడికి దిగింది. దీంతో వేలాది మంది ఉక్రెయిన్ సైనికులు వెనుతిరగాల్సిన పరిస్థితి తలెత్తింది. ఎలాగోలా సుడ్జా సిటీలో పోరాడుతున్న ఉక్రెయిన్ సైనికులను అన్నివైపులా నుంచి చుట్టుముట్టేందుకు ఆవలివైపుదాకా ఉన్న గ్యాస్పైప్లైన్ గుండా రష్యా సైనికులు వెళ్లారని యూరీ పోడోల్యాకా వెల్లడించారు. ఈయన ఉక్రెయిన్లో పుట్టి రష్యాకు అనుకూలంగా మాట్లాడే బ్లాగర్. సుడ్జా నగరంలో ఉక్రెయిన్ సేనలను వెనక వైపు నుంచి దాడిచేసేందుకు, అదును చూసి దెబ్బకొట్టేందుకు పైప్లైన్ లోపలే రష్యా సైనికులు రోజుల తరబడి గడిపారని ఈయన పేర్కొన్నారు. ఈ పైప్లైన్ పొడవు దాదాపు 15 కిలోమీటర్లు. యూరప్తో సత్సంబంధాలు తెగిపోకముందువరకు ఈ పైప్లైన్ గుండా గ్యాస్ను రష్యా సరఫరా చేసేది. ఇప్పుడు గ్యాస్ లేకపోవడంతో సైనికుల రాకపోకలు సాధ్యమయ్యాయని యూరీ చెప్పారు. మాస్క్లు ధరించిన సైనికులు పైప్లైన్ ద్వారా సుడ్జా నగరంలోకి ప్రవశించారని ‘టూ మేజర్స్’ అనే మరో యుద్ధ బ్లాగర్ చెప్పారు. రష్యా స్పెషల్ ఫోర్సెస్ బలగాలు పైప్లో నడిచివెళ్తున్న ఫొటోలను రష్యా టెలిగ్రామ్ చానెల్స్ అందరితో పంచుకున్నాయి. ‘‘శత్రుసేనల రాకను మేం కనిపెట్టాం. రాకెట్లు, శతఘ్నులతో దీటైన బదులిచ్చాం. రష్యాకు భారీ నష్టం జరిగింది’’ అని ఉక్రెయిన్ జనరల్ స్టాఫ్ తెలిపింది. అయితే ప్రాణనష్టం, ఎంత మంది రష్యా సైనికులు చనిపోయారనే విషయం వెల్లడికాలేదు. -
ఈ ఏడాది హెచ్1బీ వీసాలు కష్టమే
సాక్షి, అమరావతి: అమెరికా వీసాల్లో అత్యధిక డిమాండ్ ఉన్న హెచ్1బీ వీసాలు (H1B visas) ఈ ఏడాది పొందడం చాలా కష్టంగా తయారయ్యింది. అధిక నైపుణ్యంతో దీర్ఘకాలం పనిచేయడానికి ఉపయోగపడే హెచ్1బీ వీసాలు పొందడంలో మల్టీ నేషనల్ కంపెనీలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత హెచ్1బీ వీసాల జారీపై కఠిన ఆంక్షలు విధించింది. దీనితో నైపుణ్యం కలిగిన మానవ వనరులను బహుళజాతి కంపెనీలు ఇతర దేశాల నుంచి తెచ్చుకోలేక అష్ట కష్టాలు పడుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా అమెరికా ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 85,000 మందికి మించి హెచ్1బీ వీసాలు జారీ చేయకూడదన్న పరిమితిని విధించింది. మార్చి7న ప్రారంభమైన వీసాల జారీ ప్రక్రియ మార్చి 24తో ముగియనుంది. ఈ వీసాల కోసం ఇప్పటికే 4,23,028 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇందులో మూడు లక్షలకు పైగా దరఖాస్తులు తిరస్కరణకు గురి అవుతాయన్న అంచనాలను నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికా పాలసీ తాజాగా విడుదల చేసిన నివేదిక వెలువరించింది.కంపెనీలపై తీవ్ర ప్రభావంప్రస్తుత నిబంధనల ప్రకారం చూస్తే దరఖాస్తు చేసుకున్నవారిలో 20 శాతంకు మించి హెచ్1బీ వీసాలు వచ్చే అవకాశం కనిపించడం లేదు. విదేశాల్లో జన్మించిన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, ఇతర అధిక నైపుణ్యం కలిగిన నిపుణులను దీర్ఘకాలం పనిచేసే విధంగా ఈ వీసా ద్వారా కంపెనీలు నియమించుకుంటాయి. తాజా కఠిన నిబంధనల వల్ల 3 లక్షలకు పైగా నైపుణ్యం కలిగిన మానవ వనరులను అమెరికా కోల్పోతోందని, ఈ నిర్భంధ నిబంధనలు కంపెనీ యాజమాన్యాలకు తీవ్ర సమస్యలను తీసుకు వస్తున్నాయని ఫోర్బ్స్ తన నివేదికలో వ్యాఖ్యానించింది.ఇతర వీసాల జారీ సులభంహెచ్1బీ వీసాకంటే ఇతర వీసాలు మంజూరు సులభంగా ఉంటోందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. 2024లో దరఖాస్తు చేసుకున్న వారిలో సందర్శకులు కోటాలో జారీ చేసే బీ1/బీ2 వీసాలు 72 శాతం మందికి జారీ అయ్యాయి. వేసవి కార్మికులు, పరిశోధకుల కోటాలో జారీ అయ్యే జే1 వీసాలు 89 శాతానికి ఇమిగ్రేషన్ అధికారుల ఆమోదముద్ర పడింది. అమెరికాలో హెచ్1బీ వీసాలు కింద పనిచేసే ఉద్యోగులకు సగటున నెలకు భారతీయ కరెన్సీల్లో రూ.9 లక్షల నుంచి రూ.10 లక్షలపైనే వేతనం లభిస్తుంది. అందుకే ప్రతీ భారతీయుడు హెచ్1బీ వీసా కింద అమెరికాకు వెళ్లి పనిచేయాలనుకుంటాడు. అయితే మారిన పరిస్థితులు స్థానిక యువత ఆశలకు గండికొట్టిందని ఎంఎన్సీ కంపెనీలు వ్యాఖ్యానిస్తున్నాయి. -
White House: గన్ తో సంచరిస్తున్న వ్యక్తి కాల్చివేత
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు నివాసముండే వైట్ హౌస్ కు కూతవేటు దూరంలో మారణాయుధాలతో సంచరిస్తున్న ఓ వ్యక్తిని బలగాలు కాల్చి చంపాయి. వైట్ హౌస్ ఎబ్లాక్ కు కూతవేటు దూరంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతున్నాడు. అతని వద్ద గన్ తో పాటు పలు మారణాయుధాలు ఉన్నట్లు గుర్తించిన అమెరికన్ సీక్రెట్ సర్వీస్ సిబ్బంది అతన్ని షూట్ చేసి చంపారు. భారత కాలమాన ప్రకారం ఈరోజు(ఆదివారం) ఉదయం అతను అనుమనాస్పద రీతిలో వైట్ హౌస్ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నాడు. దీన్ని గుర్తించిన యూఎస్ సీక్రెట్ సర్వీస్ సిబ్బంది.. అతనిపై ఒక్కసారిగా కాల్పులకు దిగి మట్టుబట్టాయి. అతను ఆత్మాహుతి దాడికి పాల్పడటానికి వచ్చినట్లు అనుమానిస్తున్నారు.తొలుత ఆతన్ని నివారించే క్రమంలో ఎదురుకాల్పులకు దిగేందుకు సిద్ధమయ్యారు. అంతే ఒక్కసారిగా అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ అతనిపై కాల్పులు జరిపారు. అతనికి తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన అతను మరణించినట్లు డాక్టర్లు ధృవీకరించారు. ఈ ఘటనలో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఎవరూ గాయపడలేదని వైట్ హౌస్ వర్గాలు స్పష్టం చేశాయి. ఆ సమయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ లో లేరని, ఫ్లోరిడాలో ఉన్నట్లు పేర్కొన్నాయి. అయితే అతనే ఏ ఉద్దేశంతో మారణాయుధాలతో అక్కడకు వచ్చాడనేది తెలియలేదన్నాయి, -
ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ వింత కోరిక.. ట్రంప్ అందుకు ఒప్పుకుంటారా?
వాషింగ్టన్: అమెరికాలోని అత్యున్నత దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐకు సారథ్యం వహిస్తున్న భారత సంతతికి చెందిన కాష్ పటేల్ తన నీడను తానే నమ్మడం లేదు. అందుకే తనకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు మధ్య ఫోన్ కాల్స్ కనెక్ట్ చేసేందుకు ఎఫ్బీఐలో ఓ వ్యవస్థ ఉంది. దానికి బదులుగా నేరుగా ట్రంప్తో మాట్లాడే సదుపాన్ని కల్పించాలని ఆదేశించారు. అందుకు ట్రంప్ ఒప్పుకుంటారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎఫ్బీఐ డైరెక్టర్గా కాష్ పటేల్ తన పనిమీద రాజకీయ ప్రమేయం ఉండకూడదని భావిస్తున్నారు. అందుకే జోబైడెన్ ప్రభుత్వ హయాం నుంచి ఎఫ్బీఐ కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులు,ఏజెంట్ల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.తాను ఎఫ్బీఐ ఆఫీస్లో ఉన్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు ట్రంప్తో నేరుగా మాట్లాడే అవకాశం ఉందా? ఉంటే సాధ్యసాధ్యాలను చూడాలని సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. ఎఫ్బీఐ డైరెక్టర్గా వచ్చీ రాగానే ఎఫ్బీఐ కార్యాలయం ఏడవ ఫ్లోర్లోని అధికారులను తొలగించారు. ఆ ఫ్లోర్లో డైరెక్టర్గా ఏదైనా నిర్ణయం తీసుకున్నా, దాన్ని అమలు చేయాలన్నా ఎఫ్బీఐ డైరెక్టర్ హోదాలో డిప్యూటీ అటార్నీ జనరల్తో మాట్లాడుతారు.డిప్యూటీ అటార్నీ జనరల్ ఇతర సీనియర్ అధికారులతో మంతనాలు జరిపి కార్యకలాపాలు నిర్వహిస్తారు. వారినే తొలగించి మరో ఫ్లోర్లో విధులు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు.సెక్యూరిటీ రిత్యా సీనియర్ ఎఫ్బీఐ అధికారులు తమ కార్యాలయాల్లోకి సెల్ఫోన్లను నిషేధించారు. తాజాగా,వైట్ హౌస్ స్విచ్బోర్డ్, సీఐఏ, ఇతర జాతీయ భద్రతా సంస్థలతో మాట్లాడేందుకు వీలుగా ట్రంప్తో మాట్లాడేలా సురక్షితమైన ల్యాండ్లైన్ వ్యవస్థ ఇప్పటికే చాలా మంది ఎఫ్బీఐ అధికారుల డెస్క్లపై ఉంది. బదులుగా కాష్ పటేల్ ట్రంప్తో నేరుగా మాట్లాడేలా చూడాలని కోరినట్లు వెలుగులోకి వచ్చిన మీడియా కథనాలు హైలెట్ చేస్తున్నాయి. అదనంగా, పటేల్ తన రక్షణ కోసం ఇప్పటికే ఎఫ్బీఐ ఏజెంట్లను నియమించినప్పటికీ, తన సొంత ప్రైవేట్ భద్రతా సిబ్బందిని నియమించుకోవాలని పరిశీలించినట్లు సమాచారం. పటేల్ ఎఫ్బీఐ ఏజెంట్లను పూర్తిగా విశ్వసించడం లేదని, కాబట్టే ప్రైవేట్ భద్రతా సిబ్బందిని నియమించుకోనున్నారు.కాగా,చరిత్రలో తొలిసారి ఎఫ్బీఐ తొలిడైరెక్టర్ జే. ఎడ్గార్ హూవర్ తన ఇంటి నుండి అధ్యక్షుడికి నేరుగా ఫోన్లో మాట్లాడేవారు. ఆ తర్వాత నుంచి ఎఫ్బీఐ, వైట్ హౌస్ల మధ్య ఓ ఫోన్ కాల్ వ్యవస్థ ఏర్పాటైంది. మళ్లీ ఇప్పుడు కాష్ పటేల్ ఆ సంప్రదాయానికి స్వస్తి పలకాలని భావిస్తున్నట్లు ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. -
ఐఎస్ఎస్ కమాండ్ బాధ్యతలు.. రష్యా వ్యోమగామికి అప్పగించిన సునీత
వాషింగ్టన్: కేవలం పది రోజుల మిషన్ కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)కి వెళ్లి అనుకోని పరిస్థితుల్లో 9 నెలలపాటు అక్కడే ఉండిపోయిన భారత సంతతి అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams) ఈ నెల 19న తిరుగు పయనం కానున్నారు. ఇందుకు సన్నాహకంగా ఆమె అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్) కమాండ్ బాధ్యతలను శనివారం రష్యా వ్యోమగామి అలెక్సీ ఒవ్చినిన్కు అధికారికంగా అప్పగించారు. ఈ నెల 12 లేదా 13వ తేదీన ప్రయోగించే స్పేస్ ఎక్స్ క్రూ–10 మిషన్లో నాసా (NASA) వ్యోమగాములు అన్నె మెక్ క్లయిన్, నికోల్ అయెర్స్తోపాటు జపాన్కు చెందిన టకుయా ఒనిషి, రష్యా వ్యోమగామి కిరిల్ పెస్కోవ్ ఉంటారు.ఐఎస్ఎస్లో కొత్త వారికి బాధ్యతలను అప్పగించే కార్యక్రమం మరో వారంపాటు కొనసాగనుంది. మార్చి 19వ తేదీన సునీతతోపాటు నాసాకే చెందిన బుచ్ విల్మోర్, నిక్ హేగ్, రష్యా వ్యోమగామి అలెగ్జాండర్ గొర్బునోవ్లు స్పేస్ ఎక్స్ క్రూ–10 మిషన్లో భూమికి తిరిగి రానున్నారు. నూతనంగా ఐఎస్ఎస్ కమాండ్ బాధ్యతలు చేపట్టిన ఒవ్చినిన్ ఏప్రిల్ వరకు అక్కడే ఉంటారు. గతేడాది జూన్లో బుచ్ విల్మోర్తో కలిసి సునీతా విలియమ్స్ బోయింగ్ స్టార్ లైనర్లో ఐఎస్ఎస్కు చేరుకోవడం, స్టార్ లైనర్లో సాంకేతిక సమస్యల కారణంగా అక్కడే ఇన్నాళ్లూ చిక్కుకుపోవడం తెలిసిందే.కొలంబియా వర్సిటీపై ట్రంప్ ఆగ్రహంవాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్ షాకుల పరంపర తన, పర అనే తేడా లేకుండా కొనసాగుతోంది. క్యాంపస్లో యూదు వివక్షను, యూదు విద్యార్థులపై వేధింపులు, దాడులను అడ్డుకోవడంలో విఫలమైందంటూ న్యూయార్క్లోని ప్రఖ్యాత కొలంబియా యూనివర్సిటీపై అధ్యక్షుడు తాజాగా కన్నెర్రజేశారు. అందుకు శిక్షగా వర్సిటీకి అందుతున్న ప్రభుత్వ నిధుల్లో ఏకంగా 40 కోట్ల డాలర్ల మేరకు కోత పెడుతున్నట్టు ప్రకటించారు! గాజాపై యుద్ధంలో ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు నేపథ్యంలో గతేడాది పాలస్తీనా అనుకూల నిరసనలు, ఆందోళనలతో వర్సిటీ అట్టుడికిపోవడం తెలిసిందే. చదవండి: స్మగ్లింగ్.. కోడి గుడ్డేం కాదు!ఇలాంటి చట్టవిరుద్ధ నిరసనలకు వేదికలుగా మారే విద్యా సంస్థలు, వర్సిటీలకు నిధులు నిలిపేస్తానని గత వారమే ట్రంప్ హెచ్చరించారు. క్యాంపస్లో యూదు విద్యార్థులు నిరంతర వేధింపులు, వివక్ష, హింస ఎదుర్కొంటున్నా వర్సిటీ పాలక వర్గం చేష్టలుడిగిందని అమెరికా విద్యా శాఖ మంత్రి లిండా మెక్మోహన్ ఆరోపించారు. ‘‘దీన్ని సహించేది లేదు. కొలంబియాతో పాటు ఇతర వర్సిటీలకూ ఇదో హెచ్చరిక’’అని ఆమె చెప్పారు. పరిశోధనలు తదితరాలను ఈ నిధుల కోత తీవ్రంగా ప్రభావితం చేస్తుందని వర్సిటీ తాత్కాలిక ప్రెసిడెంట్ కత్రీనా ఆర్మ్స్ట్రాంగ్ ఆందోళన వెలిబుచ్చారు. -
వీడియో: న్యూయార్క్లో కార్చిర్చు మంటలు.. ఎమర్జెన్సీ విధింపు
న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ నగరంలో కార్చిర్చు అంటుకుంది. ఎత్తుపడుతున్న మంటల కారణంగా నగరంపై దట్టమైన పొగ అలుముకుంది. తీవ్రమైన గాలుల కారణంగా దట్టమైన పొగ ఆకాశమంతటా వ్యాపిస్తోంది. ఫలితంగా ప్రధాన రహదారులపై వాహనాదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.న్యూయార్క్ నగరాన్ని కార్చిచ్చు పొగ కమ్మేస్తోంది. శనివారం లాంగ్ ఐలాండ్లోని హోంప్టన్స్లో ఈ మంటలు చెలరేగాయి. హోంప్టన్స్లో నాలుగు చోట్ల ఈ మంటలు పుట్టుకొచ్చాయి. మోరిచెస్, ఈస్ట్పోర్టు, వెస్ట్ హోంప్టన్స్తో సహా పలు ప్రాంతాలకు ఇవి వ్యాపించాయి. దీంతో, ఆ ప్రదేశాలు దట్టమైన పొగతో నిండిపోయాయి. ఈ క్రమంలో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది దీనిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మూడు చోట్ల మంటలు అదుపులోకి తీసుకురాగా.. హోంప్టన్స్లో 50 శాతం అగ్నికీలలను అదుపులోకి తెచ్చారు.BREAKING: New York Governor Kathy Hochul has declared a state of emergency as wildfires continue to spread across New York. pic.twitter.com/gQJsHAS3tU— The General (@GeneralMCNews) March 8, 2025కార్చిర్చు కారణంగా మంటలు ఎగిసిపడుతున్నాయి. మరోవైపు.. పెద్ద ఎత్తున గాలులు వీయడంతో దట్టమైన పొగ నగరమంతా వ్యాపించింది. అయితే, ఈ కార్చిచ్చు కారణంగా రెండు వాణిజ్య భవనాలు కాలిపోయాయి. ఈ నేపథ్యంలో న్యూయార్క్ గవర్నర్ హోచుల్ అక్కడ ఎమర్జెన్సీ ప్రకటించారు. స్థానికులను ఆ ప్రాంతం నుంచి తరలిస్తున్నట్లు తెలిపారు. మంటలను అదుపుచేసేందుకు హెలికాప్టర్లతో నీటిని చల్లుతున్నట్లు వెల్లడించారు. 🚨Evacuations ordered as multiple wildfires erupt near Long Island, New York pic.twitter.com/51rH3AbjNE— H. Gökhan Güleç (@gokhangulec) March 9, 2025 -
భారత్ వ్యతిరేక రాతలు.. అమెరికా టెంపుల్ ధ్వంసం
కాలిఫోర్నియా: అమెరికాలో హిందూ దేవాలయంపై దాడి జరిగింది. కొందరు దుండగులు భారతీయులకు వ్యతిరేకంగా రాతలు రాసి ఆలయంపై దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో ఆలయంపై దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.కాలిఫోర్నియాలోని చినోహిల్స్ ప్రాంతంలో ఉన్న BAPS హిందూ దేవాలయాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో BAPS పబ్లిక్ అఫైర్స్ సభ్యుడు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్బంగా.. దక్షిణ కాలిఫోర్నియాలోని ఆలయం ప్రహరీ గోడలపై భారతీయులకు వ్యతిరేకంగా, హిందువులకు వ్యతిరేకంగా రాతలు రాశారు. అనంతరం గట్టిగా నినాదాలు చేస్తూ ఆలయాన్ని ధ్వంసం చేశారని తెలిపారు. భారత సమాజం ఎల్లప్పుడూ శాంతి కోరుకుంటోందని, ద్వేషానికి వ్యతిరేకంగా నిలుస్తుందన్నారు. మానవత్వానికి విలువ ఇచ్చి, ఎవరిపై తాము దాడులు చేసే ఉద్దేశం లేదని వెల్లడించారు.Our response to media queries regarding vandalism at a Hindu Temple in California: 🔗 https://t.co/8H25kCdwhY pic.twitter.com/H59bYxq7qZ— Randhir Jaiswal (@MEAIndia) March 9, 2025ఈ నేపథ్యంలో భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందించారు. రణధీర్ ట్విట్టర్ వేదికగా..‘కాలిఫోర్నియాలో ఒక హిందూ ఆలయంలో జరిగిన విధ్వంసానికి సంబంధించిన నివేదికలను మేము చూశాము. ఇటువంటి నీచమైన చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ చర్యలకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. దేవాలయాలకు తగిన భద్రత కల్పించాలని కోరుతున్నాం’ అని చెప్పుకొచ్చారు. In the face of another Mandir desecration, this time in Chino Hills, CA, the Hindu community stand steadfast against hate. Together with the community in Chino Hills and Southern California, we will never let hate take root. Our common humanity and faith will ensure that peace…— BAPS Public Affairs (@BAPS_PubAffairs) March 8, 2025 -
పాకిస్థాన్, భారత్ సరిహద్దులకు వెళ్లకండి.. అమెరికా పౌరులకు హెచ్చరిక
వాషింగ్టన్: పాకిస్థాన్ విషయంలో అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా పౌరులు ఎవరూ పాకిస్థాన్కు వెళ్లొద్దు అంటూ తాజాగా ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. ఈ క్రమంలో పాకిస్థాన్లో ఉగ్రదాడులు జరిగే ప్రమాదం ఎక్కువ.. టెర్రరిస్టులు దాడులు జరిపే ప్రమాదం ఉందని హెచ్చరించింది.అమెరికా తమ దేశ పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. పాకిస్థాన్లో దాడులు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో వీలైనంత వరకూ ఆ దేశానికి వెళ్లకుండా ఉండడమే మంచిదంటూ పౌరులకు తాజాగా ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. ఇదే సమయంలో.. పాకిస్థాన్ వెళ్లేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంటే భారత సరిహద్దు ప్రాంతాలకు, బలూచిస్థాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్లకు మాత్రం అస్సలు వెళ్లొద్దని హెచ్చరించింది. ఆయా ప్రావిన్స్లలో టెర్రరిస్టులు దాడులు చేసే అవకాశం ఉందని తెలిపింది. పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరగవచ్చని పేర్కొంది. ఇదే సమయంలో పాకిస్థాన్కు వెళ్లేవారూ ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది.అలాగే.. మార్కెట్లు, రవాణా కేంద్రాలు తదితర ఏరియాలలో పౌరులను, పోలీసులను, సైనికులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని చెప్పింది. మరోవైపు.. పాక్ నుంచి భారత్లో అడుగుపెట్టేందుకు ఉన్న ఏకైక అధికారిక మార్గం వాఘా బార్డర్ మాత్రమేనని, సరిహద్దులు దాటి భారత్ లో అడుగుపెట్టాలంటే వీసా తప్పనిసరి అని పేర్కొంది. ముందు వీసా తీసుకున్నాకే బార్డర్ వద్దకు వెళ్లాలని, వాఘా బార్డర్ వద్ద వీసా పొందే అవకాశం లేదని వివరించింది.ఇదిలా ఉండగా.. పాకిస్థాన్ పౌరుల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(trump) సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పాకిస్థాన్ నుంచి అమెరికాకు వచ్చే వారిపై నిషేధం విధించేందుకు ట్రంప్ సిద్ధమయ్యారు. భద్రతా కారణాల రీత్యా.. పాక్ పౌరులపై ట్రావెల్ బ్యాన్ విధించనున్నట్టు సమాచారం. ఇక, డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడైన సమయంలోనూ కొన్ని ముస్లిం దేశాల పౌరులను అమెరికాలోకి అనుమతించడంపై నిషేధం విధించిన విషయం తెలిసిందే.🇺🇸 The US warns against travel to Pakistan, citing terrorism risks. A "Do Not Travel" advisory applies to areas near the India-Pakistan border, the LoC, Balochistan, and Khyber Pakhtunkhwa due to threats of violence and armed conflict. pic.twitter.com/q2dLj1pkDa— Eye On News (@EyeOnNews24) March 9, 2025 -
కుల్భూషణ్ జాదవ్ కిడ్నాప్ వెనకున్న పాక్ మతపెద్ద హతం
ఇస్లామాబాద్: ఇరాన్లో భారత నౌకాదళ మాజీ అధికారి కుల్భూషణ్ జాదవ్ కిడ్నాప్లో పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐకు సహకరించాడనే ఆరోపణలు ఉన్న పాక్ మతపెద్ద ముఫ్తీ షా మిర్ హత్యకు గురయ్యారు. బలూచిస్థాన్లో గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపాడు. బలూచి ప్రాంతంలో మతపెద్ద అయిన ముఫ్తీ గతంలో రెండుసార్లు హత్యాయత్నం నుంచి తప్పించుకున్నారు.తుర్బాట్లోని స్థానిక మసీదులో ముఫ్తీ మిర్ రాత్రి ప్రార్థనలు ముగించుకుని వెళ్తుండగా.. బైక్పై వచ్చిన ముష్కరులు దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ముఫ్తీ షా మిర్పై అనేకసార్లు కాల్పులు జరిపారని, తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన ఆయన.. శుక్రవారం మరణించినట్లు పేర్కొన్నారు.మత సంస్థ జమియత్ ఉలేమా-ఇ-ఇస్లాం (జేయూఐ)లో సభ్యుడైన ముఫ్తీ షా మీర్.. అక్కడి ప్రముఖ వ్యక్తుల్లో ఒకడిగా చలామణి అయ్యేవాడని.. ఆయుధాలు, మానవ అక్రమ రవాణా వంటి కార్యకలాపాలకు పాల్పడేవాడని జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. పాకిస్థాన్లోని పలు ఉగ్రవాద సంస్థలతో అతడిని సన్నిహిత సంబంధాలు ఉన్నాయని.. భారత భూభాగంలోకి అక్రమంగా చొరబడడానికి సాయం చేసే వాడని తెలిపాయి.కుల్భూషణ్ జాదవ్ కేసు.. అసలేం జరిగిందంటే..నావికాదళంలో బాధ్యతలు నిర్వర్తించి.. పదవీ విరమణ చేసిన కుల్భూషణ్ జాదవ్ ఇరాన్లోని చాబహార్ ప్రాంతంలో బిజినెస్ చేసేవారు. 2016లో ఆయన్ను ఇరాన్లో పాక్ ఐఎస్ఐ ఏజెంట్లు కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత బలూచిస్థాన్లోకి ఆయన ప్రవేశిస్తే అరెస్ట్ చేసినట్లు చూపారు. 2017 గూఢచర్యం ఆరోపణలపై పాకిస్థాన్ మిలిటరీ కోర్టు ఆయనకు మరణశిక్ష కూడా విధించింది. ఈ అంశంపై భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. ఆ మరణశిక్షను సవాల్ చేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. నాటి నుంచి ఈ విచారణ కొనసాగుతూనే ఉంది. -
ఆస్ట్రేలియాలో మహిళలపై లైంగిక దాడి.. భారతీయ ప్రముఖుడికి 40 ఏళ్ల జైలు శిక్ష
సిడ్నీ: ఆస్ట్రేలియాలో ఐదుగురు మహిళలపై లైంగిక దాడికి పాల్పడిన నేరానికి గాను భారతీయ ప్రముఖుడు ఒకరికి న్యాయస్థానం 40 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 30 ఏళ్ల వరకు ఎలాంటి పెరోల్కు అవకాశం లేదని శుక్రవారం స్పష్టం చేసింది. దీంతో, ఘటన చర్చనీయాంశంగా మారింది.వివరాల ప్రకారం.. బాలేశ్ ధన్ఖడ్(43) మోసపూరిత ఉద్యోగ ప్రకటనలతో ఐదుగురు కొరియా మహిళలను ఆకర్షించి ప్రణాళిక ప్రకారం వారిని సిడ్నీలోని తన నివాసానికి రప్పించాడు. అక్కడ వారికి డ్రగ్స్ కలిపిన డ్రింక్స్ ఇచ్చి మత్తులో ఉండగా లైంగిక దాడికి పాల్పడినట్లు రుజువైందని డౌనింగ్ సెంటర్ డిస్ట్రిక్ట్ కోర్టు పేర్కొంది. తీర్పు వెలువడిన సమయంలో ధన్ఖడ్ కోర్టులోనే ఉన్నాడు. భవిష్యత్ లైంగిక సంతృప్తి కోసం అతను తన నేరాలను రికార్డు చేసి, వీడియోల రూపంలో భద్రపర్చు కోవడాన్ని జడ్జి మైకేల్ కింగ్ ప్రస్తావించారు.ఇక, బాధితులంతా 21–27 ఏళ్ల మధ్య వయ స్కులైన కొరియా మహిళలు. ఒక్కొక్కరికి వారి తెలివితేటలు, అందాన్ని బట్టి వేరుగా మార్కులు కూడా వేసేవాడని పోలీసులు తెలిపారు. బాధిత మహిళలతో జరిపిన చర్చలను సైతం రికార్డు చేశాడు. వారికి ఉద్యోగం అవసరం ఎంతుందనే దాన్ని బట్టి కుట్రను అమలు చేసేవాడు. చివరికి ఐదో బాధితురాలు 2018 అక్టోబర్లో ఫిర్యాదు చేయడంతో ఇతడి నేరాలకు పుల్స్టాప్ పడింది.పోలీసులు సిడ్నీ సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్లోని ఇతడి కార్యాలయంపై దాడి చేసి డ్రగ్స్తోపాటు టేబుల్ క్లాక్ మాదిరిగా ఉన్న వీడియో రికార్డర్ను స్వాధీనం చేసు కున్నారు. అందులోనే అత్యాచారాల క్రమ మంతా నిక్షిప్తమై ఉండటం గమనార్హం. విచారణ జరిపిన కోర్టు ధన్ఖడ్ 39 నేరాలకు పాల్పడినట్లు గుర్తించింది. ఇందులో లైంగిక దాడికి సంబంధించిన నేరాలు 13 వరకు ఉన్నాయి. కోర్టు విధించిన జైలు శిక్షలో పెరోల్కు వీలులేని 30 ఏళ్ల కాలం 2053తో ముగియనుంది. మొత్తం 40 ఏళ్ల జైలు శిక్ష పూర్తయ్యే సరికి ధన్ఖడ్కు 83 ఏళ్లొస్తాయి.విద్యార్థిగా వెళ్లి...2006లో చదువుకునేందుకు ఆస్ట్రేలియా వెళ్లిన ధన్ఖడ్ భారతీయ ఆస్ట్రేలియన్లలో పేరున్న నాయకుడి స్థాయికి ఎదిగారు. భారతీయ జనతా పార్టీ అనే గ్రూపును నెలకొల్పారు. హిందూ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా అధికార ప్రతినిధిగా 2018లో అరెస్టయ్యే వరకు వ్యవహరించారు. ఏబీసీ, బ్రిటిష్ అమెరికన్ టొబాకో, టొయోటా, సిడ్నీ ట్రెయిన్స్ కంపెనీలకు డేటా విజువలైజేషన్ కన్సల్టెంట్గా సేవలందించారు. పలు సామాజిక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ ప్రముఖుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.Indian community leader Balesh Dhankhar sentenced to 40 years in Australia for sexually assaulting five Korean women. Dhankhar lured victims with fake job ads, drugged and raped them and kept kept horrific spreadsheet detailing his crimes. Non-parole period set at 30 years.… pic.twitter.com/NcA4TUU3cq— Benefit News (@BenefitNews24) March 8, 2025 -
సిరియాలో మళ్లీ మారణహోమం.. 1000 మంది మృతి
బీరుట్: సిరియా అట్టుడుకుతోంది. మాజీ అధ్యక్షుడు అసద్ మద్దతుదారులు, ప్రభుత్వ భద్రతా దళాల మధ్య జరిగిన ఘర్షణల కారణంగా దాదాపు 1000 మంది మరణించారు. వీరిలో 750 మంది పౌరులు ఉన్నట్టు స్థానిక మీడియా సంస్థలు చెబుతున్నాయి.గత రెండు రోజులుగా సిరియాలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ అధ్యక్షుడు బషర్ అల్-అసద్ మద్దతుదారులు, ప్రభుత్వ భద్రతా దళాల మధ్య జరిగిన ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు వర్గాల మధ్య ప్రతీకార దాడుల్లో భారీగా ప్రాణ నష్టం జరిగింది. అసద్ మద్దతుదారులు జాబ్లే నగరంలో భద్రతా సిబ్బందిని హత్య చేయడం కారణంగా ఈ ఘర్షణలు మొదలయ్యాయి. శుక్రవారం నుంచి ప్రభుత్వ దళాలు భారీ స్థాయిలో అసద్ తెగకు చెందిన అలావైట్లు అధికంగా ఉండే ప్రాంతాల్లో ప్రతీకార దాడులకు దిగాయి. అలవైట్లను ఊచకోత కోశారని స్థానికులు తెలిపారు.దీంతో, సిరియా మరోసారి అతలాకుతలమైంది. దాడుల నేపథ్యంలో మృతదేహాలు వీధుల్లో చెల్లాచెదురుగా పడి ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. బ్రిటన్కు చెందిన సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ ప్రకారం ప్రభుత్వ భద్రతా బలగాలకు చెందిన 125 మందితో పాటు అసద్కు మద్దతుగా పోరాడిన 148 మంది ప్రాణాలు కోల్పోయారు. తీరప్రాంత నగరం లటాకియా చుట్టుపక్కల ప్రాంతాలలో విద్యుత్ , తాగునీటిని నిలిపివేశారని, బేకరీలను మూసివేశారని అబ్జర్వేటరీ పేర్కొంది.ఇదిలాఉండగా.. 14 ఏళ్ల సిరియా సంక్షోభంలో ఇది భయంకరమైన మారణకాండ అని యుద్ధ నియంత్రణ సంస్థ ఒకటి తెలిపింది. అసద్ను పదవి నుంచి దించేసి తిరుగుబాటుదారులు అధికారాన్ని చేజిక్కించుకున్న మూడు నెలల తర్వాత డమాస్కస్లో ఏర్పడిన ఘర్షణలు నూతన ప్రభుత్వానికి సవాల్గా మారాయి. 🚨🇸🇾 THIS IS HAPPENING IN SYRIA!THE WEST CAUSED THIS! pic.twitter.com/oWbU2oOhVl— Jackson Hinkle 🇺🇸 (@jacksonhinklle) March 8, 2025 -
ఇజ్రాయెలీ సహా ఇద్దరిపై గ్యాంగ్ రేప్
సాక్షి, బళ్లారి: కర్ణాటకలోని చారిత్రక హంపి పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్కు చెందిన మహిళతోపాటు వారికి ఆతిథ్యమిస్తున్న స్థానిక మహిళపై దుండగులు దాడి చేసి తీవ్రంగా గాయపర్చడంతోపాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అడ్డుకున్న ముగ్గురు పురుష పర్యాటకులపై దుండగులు దాడి చేసి, తీవ్రంగా కొట్టారు. తుంగభద్ర కాలువలోకి నెట్టివేయగా వీరిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు నలుగురు నిందితులను పట్టుకున్నారు. పరారీలో ఉన్న మరొకరి కోసం గాలింపు చేపట్టారు.గురువారం రాత్రి 11 గంటల సమయంలో గంగావతి సమీపంలోని సన్నాపుర వద్ద ఉన్న తుంగభద్ర కాలువ ఒడ్డున ఈ దారుణం చోటుచేసుకుంది. ఒడిశాకు చెందిన బిదాష్, మహారాష్ట్ర వాసి పంకజ్, అమెరికా పౌరుడు డానియెల్తోపాటు, ఇజ్రాయెల్ పర్యాటకురాలు, వీరికి ఆతిథ్యమిచ్చిన 29 ఏళ్ల స్థానిక మహిళ.. వీరంతా కలిసి తుంగభద్ర కాలువ ఒడ్డున గిటారు వాయిస్తూ సరదాగా కాలక్షేపం చేస్తున్నారు. అదే సమయంలో, కొందరు దుండగులు వీరి వద్దకు వచ్చి, పెట్రోల్ బంక్ ఎక్కడుందంటూ ప్రశ్నించారు. సనపూర్కు వెళ్లాలని బదులివ్వడంతో రూ.100 ఇవ్వాలంటూ బెదిరింపులకు దిగారు. తెలుగు, కన్నడలో వారిని దూషించడం మొదలుపెట్టారు. దుండగుల్లో ఇద్దరు ఇజ్రాయెల్ మహిళతోపాటు ఆతిథ్యమిచ్చిన స్థానిక మహిళపైనా అత్యాచారానికి పాల్పడ్డారు మూడో వ్యక్తి ముగ్గురు పురుషులను తుంగభద్ర కాలువలోకి నెట్టివేశాడు. దీంతో, వీరిలో డానియెల్, పంకజ్లు ప్రాణాలతో బయటపడగా గల్లంతైన బిదాష్ మృతదేహం శనివారం ఉదయం కాలువలో దొరికింది. దుండగులు అంతటితో ఆగక స్థానిక మహిళను తీవ్రంగా కొట్టారు. ఆమె బ్యాగులో ఉన్న రెండు సెల్ఫోన్లు, రూ.9,500 నగదును దోచుకున్నారు. అనంతరం దుండగులు బైక్పై అక్కడి నుంచి పరారయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం బాధితుల ఫిర్యాదు మేరకు గంగావతి రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బాధిత మహిళలిద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని కొప్పాల్ ఎస్పీ రామ్ ఎల్ సిద్ధి చెప్పారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు నిందితులను గంగావతి పట్టణానికి చెందిన మల్లేశ్, చేతన్ సాయి, మోహన్, చన్నదాసర అనే వారిని పట్టుకున్నామన్నారు. ఐదో వ్యక్తిని పట్టుకునేందుకు ప్రత్యేకంగా ఆరు పోలీస్ బృందాలను రంగంలోకి దించామని చెప్పారు. -
స్మగ్లింగ్.. కోడి గుడ్డేం కాదు!
కెనడా, మెక్సికో నుంచి అమెరికాలోకి అక్రమంగా తరలిస్తూ సరిహద్దుల్లో భారీగా పట్టుబడుతున్న ఉత్పత్తుల సంఖ్య కొద్ది నెలలుగా భారీగా పెరిగిపోయింది. అయితే అవేమిటో తెలుసా? ఎప్పట్లా ఫెంటానిలో, ఇతరేతర డ్రగ్సో కాదు. పౌల్ట్రీ ఉత్పత్తులు! ఆశ్చర్యంగా ఉన్నా నిజమిది. పైగా వాటిలోనూ సింహ భాగం గుడ్లే కావడం విశేషం!! నానాకష్టాలూ పడి డ్రగ్స్ను దేశం దాటించేకంటే స్మగ్లింగ్ నెట్వర్కులకు ఇదే మాంచి లాభసాటి బేరంగా కన్పిస్తోందట. అమెరికాను అతలాకుతలం చేస్తున్న గుడ్ల కొరత తీవ్రతకు ఈ ఉదంతం అద్దం పడుతోంది. కెనడా, మెక్సికోల నుంచి అమెరికాలోకి ఫెంటానిల్ తదితర డ్రగ్స్ విచ్చలవిడిగా స్మగ్లింగ్ అవుతుండటం పరిపాటి. అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ఇది డొనాల్డ్ ట్రంప్కు పెద్ద ప్రచారాస్త్రంగా మారింది కూడా. కెనడాపై టారిఫ్ల యుద్ధానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా కూడా ఫెంటానిల్ నిలిచింది. కానీ కొద్ది నెలలుగా కెనడా నుంచి గుడ్లు తదితర పౌల్ట్రీ ఉత్పత్తుల స్మగ్లింగ్ డ్రగ్స్ను కూడా మించిపోయిందంటూ అమెరికా అధికారులే ముక్కున వేలేసుకుంటున్నారు. గుడ్లే అమెరికన్లకు ప్రధానమైన బ్రేక్ఫాస్ట్. ఉదయాన్నే ఆమ్లెట్లుగానో, మరో రూపంలో గుడ్లు తిన్నాకే వారికి రోజు మొదలవుతుంది. వారి బ్రేక్ఫాస్ట్ అవసరాలు కాస్తా బ్లాక్మార్కెటర్లకు కాసుల పంటగా మారుతుండటం విశేషం!డ్రగ్స్ కంటే 10 రెట్లు! 2024 అక్టోబర్తో పోలిస్తే ప్రస్తుతం కెనడా నుంచి డెట్రాయిట్ గుండా అమెరికాలోకి అక్రమంగా గుడ్లు తరలిస్తున్న వారి సంఖ్య 36 శాతం పెరిగినట్టు అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ గణాంకాలు చెబుతున్నాయి. ఇక మెక్సికో సరిహద్దులకు అతి సమీపంలో ఉండే శాన్డీగో వద్ద ఈ ఉదంతాలు ఏకంగా 158 శాతం పెరిగిపోవడం విశేషం. 2024 అక్టోబర్ నుంచి అమెరికా సరిహద్దులను దాటించే ప్రయత్నంలో పౌల్ట్రీ ఉత్పత్తులు పట్టుబడ్డ ఉదంతాలు 3,768కి పైగా నమోదయ్యాయి. ఇదే సమయంలో ఫెంటానిల్ పట్టుబడ్డ ఉదంతాలు కేవలం 352 మాత్రమే కావడం విశేషం. పెరుగుతున్న ఫ్లూ రిస్క్! బర్డ్ ఫ్లూ దెబ్బకు కొన్నేళ్లుగా ఉత్తర అమెరికా ఖండమంతా అతలాకుతలమవుతోంది. కెనడాలో దీని తీవ్రత తక్కువగా ఉన్నా అమెరికా బాగా ప్రభావితమైంది. అక్కడ రెండు మూడేళ్లుగా కోట్లాది కోళ్లను హతమార్చాల్సి వచ్చింది. ఇది క్రమంగా దేశవ్యాప్తంగా తీవ్ర గుడ్ల కొరతకు దారితీసింది. దాంతో గుడ్ల ధరలు చుక్కలనంటుతున్నాయి. డజనుకు 5 డాలర్ల మార్కును దాటేసి ఆల్టైం రికార్డు సృష్టించాయి. షికాగో, శాన్ఫ్రాన్సిస్కో వంటి పలు ప్రధాన నగరాల్లోనైతే డజను గుడ్లు ఏకంగా 9 నుంచి 10 డాలర్ల దాకా పలుకుతున్న పరిస్థితి! గుడ్ల సంక్షోభం చేయి దాటిపోయిందని స్వయానా అధ్యక్షుడు ట్రంపే అంగీకరించారు! ఈ ఏడాది చివరకల్లా గుడ్ల ధరలు కనీసం మరో 50 శాతం దాకా పెరగవచ్చని అంచనా. దాంతో కొద్ది నెలలుగా స్మగ్లర్ల కన్ను గుడ్లపై పడింది. కెనడా నుంచి అమెరికాలోకి వాటి అక్రమ రవాణా ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతోంది. అయితే దీనివల్ల బర్డ్ ఫ్లూతో పాటు ఇతరత్రా రోగాల రిస్కు పెరిగిపోతోందని అమెరికా ఆందోళన చెందుతోంది. కోళ్లు, గుడ్ల స్మగ్లింగ్పై ఉక్కుపాదం మోపేందుకు కెనడా, మెక్సికో సరిహద్దుల వద్ద నిఘాను మరింత కఠినతరం చేయాలంటూ ట్రంప్ సర్కారు తాజాగా ఆదేశాలు జారీచేసింది!అమెరికాలో అద్దెకు కోళ్లు గుడ్ల సంక్షోభం పుణ్యమా అని అమెరికాలో ఇప్పుడు కోడి పెట్టలను అద్దెకిచ్చే సరికొత్త వ్యాపారం పుట్టుకొచి్చంది. అది ఇప్పుడక్కడ యమా జోరుగా సాగుతుండటం విశేషం. డజను గుడ్లకు 5 నుంచి 10 డాలర్ల దాకా పెట్టాల్సి రావడం అమెరికన్లను కలవరపరుస్తోంది. దీనికి బదులు ఇంటి పెరళ్లలో కోడిపెట్టలను సాకేందుకు వాళ్లు మొగ్గుచూపుతున్నారు. దాంతో దేశవ్యాప్తంగా కోడిపెట్టలకు చెప్పలేనంత డిమాండ్ ఏర్పడింది. దీన్ని సొమ్ము చేసుకునేందుకు రెంట్ ద చికెన్ వంటి పేర్లతో ఏకంగా కంపెనీలే పుట్టుకొచ్చాయి. ఆర్నెల్ల ప్రాతిపదికన కోడిపెట్టలను అద్దెకిస్తున్నాయి. కనీస అద్దె ప్యాకేజీలు 300 డాలర్ల నుంచి మొదలవుతున్నాయి. ఇందులో భాగంగా రెండు పెట్టలతో పాటు వాటికి ఆర్నెల్ల పాటు కావాల్సిన దాణాను కూడా కంపెనీలే ఇస్తాయి. కోళ్ల గూడు కూడా సమకూరుస్తాయి. ఆరోగ్యకరమైన పెట్ట వారానికి ఐదారు దాకా గుడ్లు పెడుతుంది. ఆ లెక్కన రెండు కోళ్లు ఆర్నెల్లకు కనీసం 250 గుడ్లు పెడతాయన్నమాట. వాటిని మార్కెట్లో కొనాలంటే ప్రస్తుత రేట్లను బట్టి కనీసం 80 నుంచి 160 డాలర్లకు పైనే పెట్టాల్సి ఉంటుంది. కోళ్లను సాకడం ద్వారా ఏ రోజుకు ఆ రోజు తాజా గుడ్లు దొరుకుతుండటం అమెరికన్లను బాగా ఆకర్షిస్తోంది. అంతేగాక గుడ్లను పొదిగించి కోళ్ల సంఖ్యను ఇబ్బడిముబ్బడిగా పెంచుకుంటున్నారు. కాంట్రాక్టు ముగిశాక అవి వారికే సొంతమవుతున్నాయి. వాటిని అద్దెకిస్తూ సైడ్ వ్యాపారం చేస్తున్న వారికి కూడా కొదవ లేదు. దొరికితే జరిమానాలుఅమెరికాలోకి గుడ్లు, ఇతర ప్రాసెస్ చేయని పౌల్ట్రీ ఉత్పత్తుల రవాణా చట్టవిరుద్ధం. ఫ్లూ తదితర ఆందోళనలే ఇందుకు కారణం. వీటిని దేశంలోకి తరలించే ప్రయత్నంలో పట్టుబడితే 300 డాలర్ల దాకా జరిమానా విధిస్తారు. ‘‘ఇరు దేశాలకూ కొన్నేళ్లుగా నిద్ర లేకుండా చేస్తున్న ఫెంటానిల్ వంటి డ్రగ్స్ కంటే కూడా కెనడా నుంచి అమెరికాలోకి గుడ్ల అక్రమ రవాణాయే పెరిగిపోతోందంటే ఆశ్చర్యంగానే ఉంది. కానీ కళ్లెదుట కన్పిస్తున్న వాస్తవమిది’’ అన్నారు కెనడా చాంబర్ ఆఫ్ కామర్స్ పాలసీ చీఫ్ మాథ్యూ హోమ్స్. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మందగమనంలోకి అమెరికా!
వాషింగ్టన్: తీవ్ర అనిశ్చితి పరిస్థితుల నేపథ్యంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి అడుగుపెట్టొచ్చని ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ అభిప్రాయపడ్డారు. వినియోగదారుల వ్యయంలో మందగమనం సంభవించే అవకాశముందని, ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులపై తీవ్ర అనిశ్చితి కొన సాగుతోందని వ్యాపార వర్గాల్లో అంచనాలు నెలకొన్నాయి. ఈ వార్తల నేపథ్యంలో ఫెడ్ చైర్మన్ వ్యా ఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో జరిగిన ఆర్థిక ఫోరంలో ఆయన చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు. → కొత్త ట్రంప్ ప్రభుత్వ విధానాలు ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతాయో అన్న అంశంపై స్పష్టత వచ్చే వరకు ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించడంలో ఏ మాత్రం తొందరపడబోదు. → కొత్త ప్రభుత్వం 4 ప్రధాన రంగాల్లో గణనీయమైన విధాన మార్పులను అమలు చేసే ప్రక్రియలో ఉంది. వాణిజ్యం, వలస, ద్రవ్య, నియంత్రణ విధానాల్లో మార్పులు చోటుచేసుకునే వీలుంది. ఈ మార్పులు, వాటి ప్రభావాలపై అనిశ్చితి తీవ్రంగా ఉంది. → పరిస్థితులు ఎలా మారుతున్నాయో అర్థం చేసుకోవడంపై మేము దృష్టి సారిస్తాము. మేము తొందరపడాల్సిన అవసరం లేదు. స్పష్టత కోసం ఎదురుచూడడానికే మేము మొగ్గు చూపిస్తాము. → ఆర్థిక వ్యవస్థ పటిష్ట స్థితిలో ఉంది. అయితే చోటుచేసుకుంటున్న పరిణామాలు భవిష్యత్తులో వ్యయాలు, అలాగే పెట్టుబడులపై ఎలా ప్రభావం చూపుతాయో వేచి చూడాలి. → కీలక సూచీలు స్థిరంగానే ఉన్నాయని. అయితే ద్రవ్యోల్బణం విషయంలో ఇంకా అస్పష్టత కొనసాగుతోంది. ఉపాధి కల్పనలో మాత్రం వృద్ధి ధోరణి కొనసాగుతోంది. → ద్రవ్యోల్బణం అంచనాలను మించిన వేగంతో తగ్గినా లేదా ఆర్థిక వ్యవస్థ బలహీనపడినా ద్రవ్య విధానంలో అవసరమైన మార్పులు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. → ఫిబ్రవరి నెలలో అమెరికా ప్రభుత్వం 1,51,000 ఉద్యోగాల వృద్ధిని నమోదుచేసింది. అయితే సెపె్టంబర్ నుంచి చూస్తే నెలకు సగ టున 1,91,000 ఉద్యోగ కల్పన జరుగుతోంది. మార్కెట్లపై ప్రతికూలతలు.. ట్రంప్ ప్రభుత్వం మెక్సికో, కెనడా వంటి ప్రధాన వ్యాపార భాగస్వాములపై భారీ దిగుమతి సుంకాలను ప్రకటించడం, అలాగే చైనా నుండి దిగుమతులపై సుంకాలను రెట్టింపు చేయడం వంటి పరిణామాలు మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో ఫెడరల్ రిజర్వ్ మార్చి 18–19 తేదీల్లో జరిపే తన పాలసీ సమావేశంలో 4.25%–4.50% శ్రేణిలో వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచే అవకాశం ఉంది. పాలసీ నిర్ణేతలు ఆవిష్కరించే కొత్త ఆర్థిక అంచనాలు.. ట్రంప్ ప్రభుత్వ తొలి రెండు నెలల విధానాలు, ఇవి ద్రవ్యోల్బణం, ఉపాధి, ఆర్థిక వృద్ధి, వడ్డీ రేట్ల మార్గాన్ని ఎలా ప్రభావితం చేశాయనే అంశంపై స్పష్టత నిచ్చే అవకాశం ఉంది. కాగా, మార్కెట్లో పెట్టుబడిదారులు ప్రస్తుతం అమెరికా ఆర్థిక వ్యవస్థలో మాంద్యం సంభవించే అవకాశం ఎక్కువగా ఉందని భావిస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి ఫెడ్ మూడు దఫాలుగా పావు శాతం (మొత్తం 0.75%) చొప్పున రేటు కోతలు ఉండే అవకాశం ఉందని భావిస్తుండడం గమనార్హం. -
ఉక్రెయిన్పై రష్యా మరోసారి భీకర దాడి.. 14 మంది మృతి
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దిశగా ప్రయత్నాలు జరుగుతోన్న క్రమంలో కూడా రష్యా భీకర దాడులు కొనసాగుతూనే ఉంది. తాజాగా, ఉక్రెయిన్పై మరోసారి క్షిపణులతో విరుచుకుపడింది. డోబ్రాపిలియా ప్రాంతంపై జరిగిన మిస్సైల్ దాడిలో 14 మంది మృతి చెందారు. ఉక్రెయిన్ తూర్పు నగరం డోబ్రాపిలియా, ఖార్కివ్ ప్రాంతంలోని ఒక స్థావరంపై రాత్రిపూట రష్యా క్షిపణి, డ్రోన్ దాడులు జరిపింది. ఈ దాడుల్లో ఐదుగురు పిల్లలు సహా 37 మంది గాయపడ్డారని ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది.కాగా, రెండు రోజుల క్రితం జెలెన్స్కీ సొంత పట్టణంలోని కూడా క్షిపణి దాడి జరిగిన సంగతి తెలిసిందే. రాత్రి సమయంలో క్రీవి రీహ్లోని ఓ హోటల్పై రష్యా క్షిపణిదాడిలో నలుగురు మృతి చెందారు. ఆ హోటల్లో తమ దేశ పౌరులతో పాటు అమెరికా, బ్రిటన్ జాతీయులు ఉన్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు తెలిపారు. ఈ ఘటనలో సుమారు 30 మంది గాయపడ్డారు. 112 షాహెడ్, డెకాయ్ డ్రోన్లను, రెండు బాలిస్టిక్ ఇస్కందర్ మిస్సైల్స్ను ప్రయోగించినట్టు ఉక్రెయిన్ వైమానికదళం ప్రకటించింది.యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఉక్రెయిన్కు అమెరికా మద్దతుగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ట్రంప్ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిన తర్వాత ఆ దేశం పట్ల ఆయన కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఉక్రెయిన్కు మిలిటరీ, ఇంటెలిజెన్స్ సాయాన్ని కూడా అమెరికా నిలిపేసింది. మరో వైపు, ఉక్రెయిన్ భద్రత కోసం రష్యాను బెదిరించేందుకు అవసరమైతే తన అణ్వాయుధాలను నిరోధంగా వాడేందుకు సిద్ధమంటూ ఫ్రాన్స్ వివాదాస్పద ప్రతిపాదన చేసిన సంగతి విదితీమే.గత గురువారం బెల్జియం రాజధాని బ్రసెల్స్లో యూరోపియన్ యూనియన్ దేశాల తాజా శిఖరాగ్ర సమావేశం ఇందుకు వేదికైంది. రష్యా బారినుంచి యూరప్కు రక్షణ కల్పించేందుకు ఫ్రాన్స్ అణుపాటవాన్ని ఆయుధంగా ఉపయోగించేందుకు సిద్ధమని అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఈ సందర్భంగా ప్రకటించారు. సభ్య దేశాల నుంచి ఇందుకు భారీ స్పందన లభించింది. -
దక్షిణ కొరియా: జైలు నుంచి యోల్ విడుదల
సియోల్: మార్షల్ లా విధించిన కేసులో అభిశంసనకు గురై పదవి కోల్పోయి, జైలుపాలైన దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ జైలు నుంచి విడుదలయ్యారు. దేశంలో స్వల్పకాలిక మార్షల్ లా విధించిన అంశంలో అభియోగాలు ఎదుర్కొంటున్న ఆయన జనవరి చివరిలో అరెస్టయిన సంగతి తెలిసిందే. తనను జైలు నుంచి విడుదల చేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్పై సియోల్ సెంట్రల్ జిల్లా కోర్టు సానుకూలంగా స్పందించింది. మాజీ అధ్యక్షుడికి జైలు జీవితం నుంచి విముక్తి కల్పించాలని నిన్న(శుక్రవారం) ఆదేశాలు జారీ చేసింది.కాగా, యూన్ను అరెస్టు చేయడం చట్టవిరుద్ధమని ఆయన తరఫు లాయర్లు న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. అధికారికంగా అరెస్టును చూపకముందే దర్యాప్తు సంస్థ యూన్ను నిర్బంధించిందని తెలిపారు. యూన్పై విచారణ చేపట్టడం చట్టబద్ధమేనా? అనే దానిపై పలు సందేహాలు తలెత్తుతున్నాయని, వీటికి సమాధానాలు కనిపెట్టాల్సి ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది. అధ్యక్షుడిగా హోదాలో యూన్ గత ఏడాది స్వల్పకాలం పాటు మార్షల్ లా విధించిన సంగతి తెలిసిందే.దేశంలో అత్యవసర పరిస్థితులు లేకపోయినా మార్షల్ లా విధించడం దేశంపై తిరుగుబాటు చేయడమేనని ఆరోపిస్తూ పార్లమెంట్ సభ్యులు ఆయనను అభిశంసించారు. అభిశంసనపై రాజ్యాంగ కోర్టు విచారణ చేపట్టింది. ఒకవేళ అభిశంసన చెల్లదని కోర్టు తీర్పు ఇస్తే యూన్ తన పదవిని మళ్లీ దక్కించుకొనే అవకాశాలున్నాయి.అభిశంసన చెల్లుబాటు అవుతుందని ప్రకటిస్తే యూన్ అధికారికంగా పదవిని కోల్పోయినట్లే. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి రెండు నెలల్లోగా జాతీయ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. దక్షిణ కొరియాలో పదవిలో ఉండగా అరెస్టయిన మొట్టమొదటి అధ్యక్షుడిగా యూన్ రికార్డుకెక్కారు. దేశ రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడికి పలు కేసుల నుంచి మినహాయింపు ఉంటుంది. కానీ, దేశ ద్రోహం, రాజ్యంపై తిరుగుబాటు వంటి కేసుల్లో ఎలాంటి మినహాయింపు ఉండదు. సాధారణ పౌరుల తరహాలోనే విచారణను ఎదుర్కోవాల్సిందే. నేరం నిరూపణ అయితే శిక్ష అనుభవించాల్సిందే. -
భారత్తో చాలా కష్టం.. వదిలిపెట్టే ప్రసక్తే లేదు: ట్రంప్ హెచ్చరిక
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్ను టార్గెట్ చేసి సంచలన ఆరోపణలు చేశారు. అమెరికాకు చెందిన వస్తువులపై భారత్ భారీ సుంకాలు విధిస్తోందని తెలిపారు. అందుకే తాము కూడా భారత్కు ప్రతీకార సుంకాలు విధిస్తామని ట్రంప్ వెల్లడించారు. వచ్చే నెల రెండో తేదీ నుంచి ప్రతీకార సుంకాల విధింపు ఉంటుందని స్పష్టం చేశారు.తాజాగా అధ్యక్షుడు ట్రంప్ వైట్హాస్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘పన్నులను తగ్గించడానికి భారత్ అంగీకరించింది. భారత్ అధిక సుంకాలు విధించే దేశం. అమెరికా వస్తువులపై భారత్ భారీగా సుంకాలు విధిస్తోంది. భారత్ వసూలు చేస్తోన్న టారిఫ్ ఇలాగే కొనసాగితే ఏ ఒక్క వస్తువును కూడా అక్కడ విక్రయించలేం. అధిక పన్నుల వల్ల భారత్కు ఏదైనా ఓ వస్తువును విక్రయించడం దాదాపు అసాధ్యంగా మారింది.#WATCH | Washington, DC: US President Donald Trump says, "...India charges us massive tariffs. Massive. You can't even sell anything in India...They have agreed, by the way; they want to cut their tariffs way down now because somebody is finally exposing them for what they have… pic.twitter.com/XwytKPli48— ANI (@ANI) March 7, 2025అమెరికా నుండి 100 శాతం కంటే ఎక్కువ ఆటో సుంకాలను వసూలు చేస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా ఇదే కొనసాగుతోంది. అందుకే మేము కూడా సుంకాలు విధించాలనే నిర్ణయానికి వచ్చాం. ఏప్రిల్ రెండో తేదీ నుంచి ప్రతీకార సుంకాలు ప్రారంభం అవుతాయి. ఫలితంగా తమ దేశంపై విధించిన టారిఫ్ను తగ్గించడానికి భారత్ అంగీకరించింది. నేను ఎవరికి నిందించడం లేదు. వ్యాపారం చేయడానికి ఇది వేరొక మార్గం మాత్రమే’ అని చెప్పుకొచ్చారు.అలాగే, యూరోపియన్ యూనియన్, చైనా, బ్రెజిల్, మెక్సికో, కెనడా వంటి దేశాలు కూడా అమెరికా వస్తువుల విషయంలో భారీగా సుంకాలు విధిస్తున్నాయి. ఇది చాలా అన్యాయం. మా దేశ ప్రయోజనాలను ఉపయోగించుకోవడాన్ని అమెరికా ఇకపై ఎంతమాత్రం కూడా సహించదు. ఇప్పుడు మా వంతు వచ్చింది. సుంకాల విధింపు విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం. ఏప్రిల్ 2న విధించే సుంకాలు.. అమెరికా దశను మార్చనున్నాయని వ్యాఖ్యానించారు.ఇదిలా ఉండగా.. అమెరికా ప్రతీకార సుంకాలపై భారత్ ఆచితూచి స్పందించింది. సుంకాలు, సుంకాలేతర అడ్డంకులను అధిగమించడానికి బహుళ రంగ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బీటీఏ) కింద అమెరికాతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటామని పేర్కొంది. ఇక, ట్రంప్ సుంకాల ప్రకటన స్టాక్ మార్కెట్లను కుదిపేసింది. -
ట్రంప్ కేబినెట్ మీటింగ్లో రచ్చ.. రచ్చ!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షతన జరిగిన తాజా కేబినెట్ సమావేశం రసాభాసా చోటు చేసుకుంది. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియో(Marco Rubio), వైట్హౌజ్ సలహాదారు ఇలాన్ మస్క్లు ట్రంప్ సమక్షంలోనే వాగ్వాదానికి దిగారు.స్టేట్ డిపార్ట్మెంట్లలో ఉద్యోగులను తొలగించకపోవడాన్ని ప్రస్తావించిన మస్క్.. రుబియోపై చిందులు తొక్కారు. ట్రంప్ ఏరికోరి నియమించుకున్న వ్యక్తి.. కేవలం టీవీల్లో కనిపించడంపైనే దృష్టిసారిస్తున్నారంటూ సెటైర్లు వేశారు. అయితే.. అబద్ధాలు చెబుతున్నారంటూ మస్క్ మొహం మీదే రుబియో కౌంటర్లు ఇచ్చారు.స్టేట్ డిపార్ట్మెంట్ నుంచి 1,500 మంది ఉద్యోగులను ఇప్పటికే తొలగించామని(Layoffs). ఒకవేళ వాళ్లందరినీ తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకుని మరి తొలగించాలని మస్క్ భావిస్తున్నారేమోనని వెటకారంగా సమాధానం ఇచ్చారు. దీంతో.. ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. ఒకానొక టైంలో.. ట్రంప్ రుబియోకి మద్ధతుగా నిలిచినట్లు సమాచారం. ఇక.. ఈ కేబినెట్ సమావేశంలో పాల్గొన్న అధికారులంతా మస్క్పై ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. మస్క్ చర్యలతో రిపబ్లికన్లలోనూ అసహనం పెరిగిపోతోందని.. ఈ క్రమంలోనే వైట్హౌజ్కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని చీఫ్ స్టాఫ్ సుసీ వైల్స్ మీటింగ్లో ప్రస్తావించారు. ఈ మేరకు గురువారం కేబినెట్ మీటింగ్లో జరిగిన అంశాలన్నింటిని ప్రస్తావిస్తూ న్యూయార్క్ టైమ్స్ ఓ కథనం ఇచ్చింది. అయితే..అలాంటిదేం లేదుకేబినెట్ మీటింగ్ హాట్ హాట్గా సాగిందన్న మీడియా కథనాన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఖండించారు. శుక్రవారం ఓవెల్ ఆఫీస్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ‘‘నేను అక్కడే ఉన్నా కదా. అక్కడ ఎలాంటి ఘర్షణ జరలేదు. మీరే(మీడియాను ఉద్దేశించి..) లేనిపోనివి సృష్టిస్తున్నారు. ఇలాన్, మార్కో ఇద్దరూ గొప్పవాళ్లే. వాళ్లు తమ విధులను అద్భుతంగా నిర్వర్తిస్తున్నారు’’ అని ట్రంప్ పొగడ్తలు గుప్పించారు.డోజ్ విమర్శలపై మస్క్అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్.. ప్రముఖ బిలియనీర్ ఇలాన్ మస్క్ను డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ(DOGE) సారథిగా నియమించారు. అమెరికా ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులే ‘డోజ్’ ప్రాజెక్టు లక్ష్యమని, తన ప్రభుత్వంలో సమర్థత పెంచేందుకు ఈ విభాగం కృషి చేస్తుందని ఆ టైంలో ట్రంప్ ప్రకటించారు. ప్రభుత్వ శాఖల్లో వృథా ఖర్చులకు కత్తెర, దుబారా ఖర్చులకు కోత, అవినీతి నిర్మూలన, ఫెడరల్ సంస్థలను పునర్మిర్మాణం.. ఇవన్నీ డోజ్ చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా.. ప్రభుత్వ శాఖల్లో భారీగా ఉద్యోగాల తొలగింపు చేపట్టారు. అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవం.. 2026 జులై 4వ తేదీలోపు మొత్తం ఫెడరల్ బ్రూరోక్రసీని ఇది ప్రక్షాళన చేయాల్సి ఉంది. ఆ తర్వాత డోజ్ దానికదే ఎక్స్పైరీ కానుంది.అయితే.. డోజ్ తీసుకునే తీవ్రమైన నిర్ణయాల వల్ల దేశ రక్షణ, మౌలిక సదుపాయాల కల్పన వంటి ప్రభుత్వం అందించే సేవలు నిర్వీర్యం అయ్యే అవకాశం ఉందని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలిక అభివృద్ధి కావాలంటే.. కొన్నింటిని వదులుకోవాలని మస్క్ తన చర్యలను సమర్థించుకుంటున్నారు. -
ఈ ఏడాదితో ఉత్తరాల బట్వాడా బంద్
కోపెన్హాగెన్: డెన్మార్క్లో ఉత్తరాల బట్వాడాను ఈ ఏడాది చివరికల్లా నిలిపివేయనున్నట్లు డెన్మార్క్, స్వీడన్ల ప్రభుత్వ తపాలా సేవల విభాగం ‘పోస్ట్నార్డ్’ప్రకటించింది. పార్సిల్ సేవలను మాత్రం యథా ప్రకారం కొనసాగిస్తామని తెలిపింది. ఈ ఏడాది రెండో అర్ధ భాగంలో డెన్మార్క్ వ్యాప్తంగా ఉన్న 1,500 తపాలా బాక్సులను తొలగిస్తామంది. తాజా పరిణామంతో పోస్ట్నార్డ్లోని 4,600 మంది ఉద్యోగులకు గాను 1,500 మంది తొలగింపునకు గురి కానున్నారు. స్వీడన్లో మాత్రం ఉత్తరాల బట్వాడాపై ఎటువంటి ప్రభావం ఉండదని పోస్ట్నార్డ్ వివరించింది. 2000వ సంవత్సరంతో పోలిస్తే ఉత్తరాల సంఖ్య 90 శాతం మేర పడిపోయిందని, ఇందులో 30 శాతం వరకు ఒక్క 2024లోనే ఉందని తెలిపింది. డెన్మార్క్తోపాటు ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా డిజిటల్ మాధ్యమాల వైపు మళ్లడమే ఇందుకు ప్రధాన కారణమని వివరించింది. 2024లో పోస్టల్ ఫీజులను భారీగా పెంచడం ఇందుకు తోడైంది. డెన్మార్క్ పోస్టల్ విభాగానికి 400 ఏళ్ల ఘన చరిత్ర ఉందని పోస్ట్నార్డ్ డెన్మార్క్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కిమ్ పెడెర్సన్ చెప్పారు. ప్రస్తుతం చాలా తక్కువ సంఖ్యలోనే ఉత్తరాలు వస్తున్నందున, ఏమంత లాభదాయంగా లేదన్నారు. తమకు ఇప్పుడు ప్రధాన వనరు పార్సిల్ డెలివరీయేనన్నారు. ప్రజలు తమ ఉత్తరాలను పార్సిల్ల ద్వారా కూడా పంపుకోవచ్చని చెప్పారు. 2026 నుంచి ప్యాకేజీ విభాగంపైనే ప్రధానంగా దృష్టిపెడతామని చెప్పారు. సుదూర ప్రాంతాల్లోని వారికి ఉత్తరాలే తప్ప వేరే సమాచార మార్గం లేనందున పోస్ట్నార్డ్ నిర్ణయం సరికాదని డెన్మార్క్ ఎంపీ డ్రాగ్స్టెడ్ చెప్పారు. అయితే, ప్రైవేటు కంపెనీలు ఉన్నందున ఉత్తరాలను పంపించుకోవడం కష్టం కాదని మీడియా అంటోంది. సుదూరంగా ఉండే దీవుల్లోని వారికి, మారుమూల ప్రాంతాల్లోకి ఉత్తరాల బట్వాడాకు అంతరాయం కలగకుండా డెన్మార్క్ ప్రభుత్వం సంబంధిత మౌలిక వసతులను కొనసాగించనుంది. కాగా, జర్మనీ ప్రభుత్వ డచ్పోస్ట్ సైతం తపాలా సరీ్వసులను కుదిస్తూ 8 వేల మంది ఉద్యోగులపై వేటు వేసేందుకు చర్యలు ప్రారంభించింది. -
యూన్ సుక్ యోల్ను జైలు నుంచి విడుదల చేయండి
సియోల్: మార్షల్ లా విధించిన కేసులో అభిశంసనకు గురై పదవి కోల్పోయి, జైలుపాలైన దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్కు భారీ ఊరట లభించింది. తనను జైలు నుంచి విడుదల చేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్పై సియోల్ సెంట్రల్ జిల్లా కోర్టు సానుకూలంగా స్పందించింది. మాజీ అధ్యక్షుడికి జైలు జీవితం నుంచి విముక్తి కల్పించాలని శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. యూన్ను అరెస్టు చేయడం చట్టవిరుద్ధమని ఆయన తరఫు లాయర్లు న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. అధికారికంగా అరెస్టును చూపకముందే దర్యాప్తు సంస్థ యూన్ను నిర్బంధించిందని తెలిపారు. యూన్పై విచారణ చేపట్టడం చట్టబద్ధమేనా? అనే దానిపై పలు సందేహాలు తలెత్తుతున్నాయని, వీటికి సమాధానాలు కనిపెట్టాల్సి ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది. అధ్యక్షుడిగా హోదాలో యూన్ గత ఏడాది స్వల్పకాలం పాటు మార్షల్ లా విధించిన సంగతి తెలిసిందే. దేశంలో అత్యవసర పరిస్థితులు లేకపోయినా మార్షల్ లా విధించడం దేశంపై తిరుగుబాటు చేయడమేనని ఆరోపిస్తూ పార్లమెంట్ సభ్యులు ఆయనను అభిశంసించారు. అభిశంసనపై రాజ్యాంగ కోర్టు విచారణ చేపట్టింది. ఒకవేళ అభిశంసన చెల్లదని కోర్టు తీర్పు ఇస్తే యూన్ తన పదవిని మళ్లీ దక్కించుకొనే అవకాశాలున్నాయి. అభిశంసన చెల్లుబాటు అవుతుందని ప్రకటిస్తే యూన్ అధికారికంగా పదవిని కోల్పోయినట్లే. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి రెండు నెలల్లోగా జాతీయ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. దక్షిణ కొరియాలో పదవిలో ఉండగా అరెస్టయిన మొట్టమొదటి అధ్యక్షుడిగా యూన్ రికార్డుకెక్కారు. దేశ రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడికి పలు కేసుల నుంచి మినహాయింపు ఉంటుంది. కానీ, దేశ ద్రోహం, రాజ్యంపై తిరుగుబాటు వంటి కేసుల్లో ఎలాంటి మినహాయింపు ఉండదు. సాధారణ పౌరుల తరహాలోనే విచారణను ఎదుర్కోవాల్సిందే. నేరం నిరూపణ అయితే శిక్ష అనుభవించాల్సిందే. -
అథెనా కథ ముగిసింది
కేప్ కనవెరాల్: ఇంట్యూటివ్ మెషీన్స్ రెండో మిషన్ కూడా ఫెయిలయ్యింది. చంద్రుడిపైకి పంపిన ల్యాండర్ అథెనా పనిచేయకుండా పోయింది. టెక్సాస్కు చెందిన ఇంట్యూటివ్ మెషీన్స్ సంస్థ స్పేస్ ఎక్స్ రాకెట్ ద్వారా ఫిబ్రవరి 26న అథెనాను పంపించింది. ఇందులో 11 పేలోడ్లు, సైంటిఫిక్ పరికరాలు ఉన్నాయి. చంద్రుని దక్షిణ ధ్రువానికి 160 కిలోమీటర్ల దూరంలోని నిర్ణీత ప్రదేశంలో ఇది ల్యాండవ్వాల్సి ఉంది. కానీ, 250 మీటర్ల దూరంలో అతికష్టమ్మీద, అదీ ఇరుకైన గుంతలో దిగింది. తను దిగిన ప్రదేశాన్ని, పొజిషన్ను తెలపడంతోపాటు కొన్ని ప్రయోగాలకు సంబంధించిన పరికరాలను సైతం యాక్టివేట్ చేసినట్లు ఫొటోలను పంపించింది. వీటిని బట్టి చూస్తే ఇది ఇరుకైన గుంతలో పక్కకు ఒరిగి ఉన్నట్లు నాసా శాస్త్రవేత్తలు శుక్రవారం తేల్చారు. ల్యాండర్కు ఉన్న సౌర ఫలకాలున్న తీరు, గుంతలోని అతి శీతల పరిస్థితులను బట్టి చూస్తే, అథెనా బ్యాటరీలను రీఛార్జి చేయడం అసంభవమని గుర్తించారు. దీంతో, అథెనా పనిచేసే అవకాశాలు లేవని ప్రకటించారు. మిషన్ పూర్తయినట్లు ప్రకటించిన అధికారులు అది పంపించిన చిత్రాలను విశ్లేషించి పనిలో పడ్డారని ఇంట్యూటివ్ మెషీన్స్ తెలిపింది. అథెనా ఇంట్యూటివ్ రెండో మిషన్ కాగా, ఈ సంస్థ ఏడాది క్రితం పంపిన ఒడిస్సియస్ కూడా విఫలమైంది. -
రష్యాకు ట్రంప్ షాక్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యాకు ఊహించని షాక్ ఇచ్చారు. ఉక్రెయిన్–రష్యా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం, శాంతి ఒప్పందం కుదిరేదాకా రష్యాపై భారీ స్థాయిలో ఆంక్షలు, టారిఫ్లు విధించాలని తీవ్రంగా యోచిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం సోషల్ మీడియాలో పోస్టు చేశారు. రష్యా, ఉక్రెయిన్ వెంటనే శాంతి చర్చలకు శ్రీకారం చుట్టాలని స్పష్టంచేశారు. ఆలస్యం కాకముందే ఆ పని ప్రారంభిస్తే బాగుంటుందని హితవు పలికారు. నిన్నటిదాకా రష్యా పట్ల సానుకూలంగా మాట్లాడిన ట్రంప్ హఠాత్తుగా స్వరం మార్చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే, రష్యాకు ట్రంప్ హెచ్చరికలు జారీ చేయడం కొత్తేమీ కాదు. ఈ ఏడాది జనవరిలో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రష్యాను ఉద్దేశించి కఠిన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్పై యుద్ధాన్ని నిలిపివేయకపోతే మరిన్ని ఆంక్షలు విధిస్తామని, రష్యా ఉత్పత్తులపై అధికంగా టారిఫ్లు వసూలు చేస్తామని తేల్చిచెప్పారు. ఆయన తన వైఖరికి కట్టుబడి ఉన్నట్లు తెలుస్తోంది. యుద్ధాన్ని ముగించే దిశగా రష్యాపై ఒత్తిడి పెంచడానికి ఆంక్షలు, టారిఫ్లను మరోసారి తెరపైకి తెచి్చనట్లు సమాచారం. ఉక్రెయిన్కు సైనిక సాయాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ ట్రంప్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. యూరప్ దేశాలు వ్యతిరేకిస్తున్నా ఆయన వెనక్కి తగ్గడం లేదు. ఒకవైపు ఉక్రెయిన్ను, మరోవైపు రష్యాను ఏకకాలంలో దారికి తీసుకురావాలన్నదే ట్రంప్ వ్యూహంగా కనిపిస్తోంది. రష్యాపై కొత్తగా ఎలాంటి ఆంక్షలు విధిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. పుతిన్ ప్రభుత్వం వాటికి తలొగ్గుతుందా? అనేది చూడాలి. -
మళ్లీ అదే మాట !
న్యూయార్క్: అమెరికా ఉత్పత్తులపై విదేశాలు వసూలు చేస్తున్న టారిఫ్ల విషయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అసహనం వెళ్లగక్కారు. భారతదేశంలో అధికంగా టారిఫ్లు విధిస్తున్నారని మళ్లీ అసంతృప్తి వ్యక్తంచేశారు. నిజంగా అధిక సుంకాలు విధిస్తున్న దేశం భారత్ అని పేర్కొన్నారు. ఇది న్యాయబద్ధం కాదని చెప్పారు. తమకు న్యాయం జరగాలంటే అదే రీతిలో ప్రతిస్పందించక తప్పదని స్పష్టంచేశారు. ప్రతీకార సుంకాలు విధించబోతున్నామని, వచ్చే నెల 2వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని తేలి్చచెప్పారు. తమ ఉత్పత్తులపై విచ్చలవిడిగా టారిఫ్లు వసూలు చేస్తున్న దేశాల ఉత్పత్తులపైనా అదే స్థాయిలో టారిఫ్లు విధించబోతున్నామని ఉద్ఘాటించారు. ఇండియా, చైనాతోపాటు ఏ దేశమైనా సరే తమ ఉత్పత్తులు వాడుకుంటే భారీగా సుంకాలు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఎవరినీ విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఇన్నాళ్లూ అమెరికాను దోచుకున్నారని, ఇకపై అది సాగనివ్వబోమని హెచ్చరించారు. ఆయన గతంలో కూడా ఇండియాను ‘టారిఫ్ కింగ్’, ‘బిగ్ అబ్యూసర్’ అని నిందించారు. ఇండియాతో అమెరికా వాణిజ్య లోటు 100 బిలియన్ డాలర్లుగా(రూ.8.70 లక్షల కోట్లు) ఉందని ట్రంప్ చెబుతున్నారు. దీన్ని తగ్గించాల్సిందేనని పట్టుబడుతున్నారు. అమెరికాకు గేమ్ ఛేంజర్ వైట్హౌస్ ఓవల్ ఆఫీసులో గురువారం కొన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై డొనాల్డ్ ట్రంప్ సంతకాలు చేశారు. అమెరికా పాల ఉత్పత్తులతోపాటు ఇతర వస్తువులపై కెనడాలో 250 శాతం టారిఫ్లు విధిస్తున్నారని ఆక్షేపించారు. కెనడా ఉత్పత్తులు ఇకపై తమకు అవసరం లేదని, ఒకవేళ దిగుమతి చేసుకున్నా భారీగా సుంకాలు విధిస్తామని స్పష్టంచేశారు. విదేశీ ఉత్పత్తులపై ఇప్పుడు విధిస్తున్న టారిఫ్లు తాత్కాలికమేనని, అసలైన మోత ఏప్రిల్ 2 నుంచి మోగబోతోందని, అందుకు సిద్ధంగా ఉండాలని వ్యాఖ్యానించారు. అమెరికాకు ఇదొక గేమ్ ఛేంజర్ కాబోతోందని వివరించారు. -
టారిఫ్ వార్.. ఎవరికి లాభం?
అన్నట్టుగానే భారత్పైనా సుంకాల మోతకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెర తీశారు. ఏప్రిల్ 2 నుంచి పరస్పర సుంకాలు తప్పవని పునరుద్ఘాటించారు. దీని ప్రభావం మనపై ఏ మేరకు ఉండనుందంటూ జోరుగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే అమెరికా మనకు అతి పెద్ద వాణిజ్య భాగస్వామి. అందుకే అగ్ర రాజ్యంతో టారిఫ్ల రగడకు తెర దించేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఇప్పటికే అమెరికాలో పర్యటిస్తున్నారు. ఇరు దేశాలకు ఆమోదయోగ్యమైన ద్వైపాక్షిక వర్తక ఒప్పందం (బీటీఏ)పై చర్చలు జరుపుతున్నారు. ఈలోగా పలు అమెరికా ఉత్పత్తులపై టారిఫ్లను వీలైనంతగా తగ్గిస్తూ భారత్ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ తదితర ఉత్పత్తులపైనా టారిఫ్ కోతలు ప్రకటించే అవకాశం కన్పిస్తోంది. ఏ మేరకు సుంకాలు? సుంకమంటే ఒక దేశం మరో దేశం నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై విధించే పన్ను. భారత ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న సుంకాలు సగటున 4 నుంచి 5 శాతం మించడం లేదు. భారత్ మాత్రం అమెరికా ఉత్పత్తులపై సగటున 18 శాతం పై చిలుకు దిగుమతి సుంకాలు విధిస్తోంది. లగ్జరీ కార్లు, కెమికల్స్, ఎల్రక్టానిక్స్పై 125 శాతం, మద్యం మీదైతే ఏకంగా 150 శాతం దాకా వసూలు చేస్తోంది! ఈ తేడాలను సరిచేయకుంటే ఏప్రిల్ 2 నుంచి తామూ అంతే మొత్తం బాదుతామని ట్రంప్ బెదిరిస్తున్నారు. అమెరికాపై ప్రధానంగా ఆధారపడ్డ భారత ఎగుమతిదారులపై ఇది గట్టి ప్రభావమే చూపనుంది. ముఖ్యంగా మన ఇనుము, ఉక్కు, జౌళి ఎగుమతులపై ప్రభావం తీవ్రంగా ఉండనుంది. దిద్దుబాటు చర్యలేవీ తీసుకోని పక్షంలో 25 బిలియన్ డాలర్ల విలువైన భారత ఎగుమతులపై ప్రభావం పడవచ్చని అంచనా. అయితే మన జీడీపీలో అమెరికా ఎగుమతుల వాటా కేవలం 2.2 శాతమే. కనుక భారత్ మరీ అంతగా బెంబేలెత్తిపోవాల్సిన పని లేదన్నది ఆర్థికవేత్తల మాట. ‘‘భారత్ వంటి అతిపెద్ద మార్కెట్ను అమెరికా విస్మరించలేదు. అక్కడి ఈ కామర్స్ కంపెనీలు, బ్యాంకులు, ఆర్థిక సేవలు, టెక్నాలజీ సంస్థలకు భారత మార్కెట్ అంటే భారీ ఆసక్తి. సోషల్ నెట్వర్కింగ్ కంపెనీలకూ భారత్ ప్రధానమే’’ అని వారంటున్నారు. అమెరికాతో భారత్ వాణిజ్యమెంత? అమెరికాకు అతి పెద్ద ఎగుమతిదారుల్లో భారత్ ఒకటి. 2024లో ఆ దేశానికి 87.4 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేసింది. అమెరికా నుంచి 41.8 బిలియన్ డాలర్ల దిగుమతులు మాత్రమే చేసుకుంది. ఈ వాణిజ్య లోటునూ ట్రంప్ ప్రశి్నస్తున్నారు. దీన్ని పూడ్చాల్సిందేనని పట్టుబడుతున్నారు. మనకు మేలే! ట్రంప్ తెర తీసిన టారిఫ్ వార్ అంతిమంగా భారత్కే లబ్ధి చేకూరుస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. చైనా, కెనడా, మెక్సికో తదితర దేశాలపై అమెరికా ఇప్పటికే సుంకాలను పెంచడం తెలిసిందే. బదులుగా అమెరికాపై ప్రతీకార సుంకాలు తప్పవని ఆ దేశాలు కూడా స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో ఆయా దేశాల నుంచి అమెరికాకు ఎగుమతులు బాగా తగ్గేలా కని్పస్తున్నాయి. ఇది భారత్కు సానుకూలంగా మారుతుందని, మనం మరిన్ని ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేసేందుకు వీలు కలుగుతుందని ఆర్థికవేత్తలు అంటున్నారు. ట్రంప్ తొలి హయాంలో కూడా చైనాపై సుంకాలు పెంచడంతో భారత్ బాగా లాభపడింది. ఈసారి కూడా అమెరికాకు మన మిర్చి, జౌళి తదితర ఉత్పత్తుల ఎగుమతులు బాగా పెరిగే అవకాశముంది. ఇప్పటికే చర్యలు అమెరికాపై విధిస్తున్న సుంకాల తగ్గింపుకు భారత్ ఇప్పటికే చర్యలు తీసుకుంటోంది... → ఇటీవలి బడ్జెట్లో స్మార్ట్ ఫోన్ దిగుమతులపై ప్రకటించిన 15–16 శాతం సుంకాల నుంచి అమెరికాను మినహాయించాలని కేంద్రం భావిస్తోంది.→ వైద్య పరికరాలు, లగ్జరీ మోటార్ సైకిళ్ల వంటి పలు అమెరికా ఉత్పత్తులపై టారిఫ్లను తగ్గించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.→ వాణిజ్య లోటును తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా అమెరికా నుంచి రక్షణ, చమురు తదితర ఉత్పత్తుల దిగుమతులను ఇతోధికంగా పెంచేందుకు ట్రంప్–మోదీ భేటీలో అంగీకారం కూడా కుదిరింది. → ఏఐజీ వంటి అమెరికా బీమా దిగ్గజాలకు లబ్ధి చేకూర్చేలా ఆ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 100 శాతానికి పెంచుతూ తాజా బడ్జెట్లో కేంద్రం నిర్ణయం తీసుకుంది.→ భారత ఔషధాలపై అమెరికా ఎలాంటి సుంకాలూ వసూలు చేయడం లేదు. కనుక అమెరికా ఔషధ దిగుమతులపై భారత్ విధిస్తున్న 10 శాతం సుంకాన్ని కూడా ఎత్తేయాలని ఫార్మా సంస్థలు సూచిస్తున్నాయి. → అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న పలు వ్యవసాయోత్పత్తులపై ఏకంగా 42 నుంచి 120 శాతం దాకా సుంకాలున్నాయి. వీటిని కూడా బాగా తగ్గించే అవకాశముంది. త్వరలో ఒప్పందం: భారత్ న్యూఢిల్లీ/వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుని తాజా ప్రకటనపై భారత్ ఆచితూచి స్పందించింది. అగ్ర రాజ్యంతో వాణిజ్య బంధాన్ని మరింత పటిష్టం చేసుకోవడమే తమ లక్ష్యమని పేర్కొంది. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బీటీఏ) ద్వారా టారిఫ్, టారిఫేతర అడ్డంకులను తగ్గించుకునేందుకు కృషి చేస్తున్నట్టు వివరించింది. దీన్ని ఇరు దేశాలకూ ఆమోదనీయ రీతిలో పరిష్కరించుకుంటామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్«దీర్ జైస్వాల్ శుక్రవారం ఒక ప్రకటనలో విశ్వాసం వెలిబుచ్చారు.సుంకాల తగ్గింపుకు భారత్ ఒప్పుకుంది: ట్రంప్ అమెరికాపై సుంకాలను భారీగా తగ్గించేందుకు భారత్ అంగీకరించినట్టు ట్రంప్ వెల్లడించారు. శుక్రవారం ఉదయం వైట్హౌస్ ఓవల్ కార్యాలయంలో ఈ మేరకు ప్రకటించారు. అమెరికాపై ఇన్నాళ్లుగా భారత్ విధిస్తున్న హెచ్చు సుంకాలను తాను బయట పెట్టడమే ఇందుకు కారణమని చెప్పుకొచ్చారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇరాన్కు డొనాల్డ్ ట్రంప్ లేఖ
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో అణు ఒప్పందంపై చర్చలు జరపాలనుకుంటున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఆయన ఇరాన్కు లేఖ రాశారు. ఆ లేఖలో మీరు మాతో చర్చలకు సన్నద్ధం అవుతారని ఆశిస్తున్నాను’అని పేర్కొన్నారు. శుక్రవారం ఫాక్స్ బిజినెస్ నెట్వర్క్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. ‘ఇరాన్తో అణుఒప్పందం చేసుకునేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. ఆ దిశగా ఇరాన్ చర్చలు జరపాలని కోరుకుంటున్నాను. ఈ ఒప్పందం సఫలమైతే ఆదేశానికే మంచిది. ఇక నేను రాస్తున్న లేఖకు ఇరాన్ సమాధానం ఇస్తుందనే అనుకుంటున్నాను. ప్రతిఫలంగా ఆదేశానికి అమెరికా ఏదో ఒకటి చేస్తోంది. ఎందుకంటే మరే ఇతర దేశంతో అణు ఒప్పందం కుదుర్చుకోవడం సాధ్యం కాకపోవచ్చనే అభిప్రాయాన్ని ట్రంప్ వ్యక్తం చేశారు. ఇక, ట్రంప్ రాసిన ఆ లేఖ ఇరాన్ సుప్రీం లీడర్ ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ ఇంటి అడ్రస్కు పంపినట్లు తెలుస్తోంది. అయితే ఆ లేఖపై వైట్ హౌస్ అధికారికంగా స్పందించాల్సి ఉంటుంది.మరోవైపు, అంతర్జాతీయ స్థాయిలో అణు ఆయుధాల ఒప్పందాలపై ప్రయత్నాలు జరుగుతున్నాయయని ఇదే విషయాన్ని ఇరాన్ రాయబారి కాజెం జాలాలితో చర్చించినట్లు శుక్రవారం రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. -
ట్రంప్ దెబ్బకు దిగొచ్చిన చైనా.. భారత్ వైపు చూపు
బీజింగ్: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత దిగుమతి సుంకాలను భారీగా పెంచిన సంగతి తెలిసిందే. ప్రధానంగా కెనడా, మెక్సికో ఉత్పత్తులపై 25 శాతం చొప్పున, చైనా ఉత్పత్తులపై అదనంగా 10 శాతం సుంకాలు విధించబోతున్నామని, మంగళవారం నుంచే ఇది అమల్లోకి వస్తుందని ట్రంప్ ప్రకటించారు. అమెరికాకు వస్తువులను ఎగుమతి చేసే దేశాలు సుంకాలు చెల్లించాల్సిందేనని తెలిపారు.దీనికి చైనా కూడా అంతే ఘాటుగా స్పందించింది. తమ దేశంలోకి దిగుమతి అయ్యే అమెరికా వస్తువులపై అదనంగా 15 శాతం టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించింది. చికెన్, గోధుమలు, మొక్కజొన్న, పత్తి తదితర దిగుమతులపై ఈ టారిఫ్ వసూలు చేస్తామని, అలాగే జొన్న, సోయాబిన్, పోర్క్, బీఫ్, సముద్ర ఉత్పత్తులు, పండ్లు, కూరగాయాలు, పాడి ఉత్పత్తులపై అదనంగా 10 శాతం సుంకాలు విధించనున్నట్లు వెల్లడించింది.అయితే చైనా ప్రస్తుత చూపులు భారత్ వైపు పడ్డాయి. భారత్ తో గతంలో ఉన్న విరోధాన్ని పూర్తిగా పక్కన పెట్టేందుకు సిద్ధమైంది చైనా. భారత్ తో శత్రుత్వం కంటే మిత్రత్వమే మేలనే భావనకు వచ్చింది చైనా.-భారత్ తో కలిసి పని చేయాలని చూస్తోంది., ఈ మేరకు ఇప్పటికి ఓ మెట్టు దిగి భారత్ సహకారం కావాలంటోంది డ్రాగన్.ఇద్దరం కలిసి పని చేద్దాం: చైనా విదేశాంగ మంత్రిభారత్ తో కలిసి పని చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి స్పష్టం చేశారు. ఒకరిని ఒకరు కించ పరుచుకోవడం కంటే కలిసి పని చేస్తే అద్భుతాలు స్పష్టించవచ్చాన్నారు వాంగ్ యి. ఆ దేశ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ మీట్ తర్వాత వాంగ్ యి మాట్లాడుతూ.. ‘ ఢిల్లీ, బీజింగ్ కలిసే పని చేసే సమయం ఆసన్నమైంది. డ్రాగన్, ఎలిఫెంట్ డ్యాన్స్ కలిసి చేస్తే బాగుంటుంది. ఇరుదేశాలు ఒకరికొకరు సహకరించుకోవాల్సిన అవసరం ఉంది. సహకారంతో పోయేదేమీ ఉండదు. సహకారం ఇచ్చి పుచ్చుకుంటే మరింత బలోపేతం అవుతాం. ఇది దేశ ప్రజలకు, దేశాలకు మంచిది’ అని పేర్కొన్నారు.ఇటీవల దక్షిణాఫ్రికాలో జరిగిన టీ20 విదేశాంగ మంత్రుల సమావేశంలో భారత్ విదేశాంగ మంత్రి జైశంకర్ తో వాంగ్ యి భేటీ అయ్యారు. అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 2020లో గల్వాన్ ఘటన తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అప్పట్నుంచి నిన్న మొన్నటి వరకూ ఇరు దేశాలు పెద్దగా సమావేశం అయ్యింది కూడా తక్కువే. ఆపై 2024లో ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ భేటీ తరువాత .ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కాస్త చల్లబడింది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఉన్న చోట నుంచి ఇరు దేశాలు తమ బలగాలను వెనక్కి పిలపించడంతో అప్పట్నుంచీ సామరస్య వాతావరణం కనిపిస్తోంది. -
ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ట్రూడో కంటతడి
ఒట్టావా: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో(Justin Trudeau) తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ప్రధాని హోదాలో చివరి ప్రసంగంలో తాను తెచ్చిన పాలసీతోపాటు అమెరికాతో నెలకొన్న ‘సుంకాల ఉద్రిక్తత’లపైన మాట్లాడారు. ఈ క్రమంలో ఒక్కసారిగా కంటతడి పెడుతూ ప్రసంగించారు. తొమ్మిదేళ్లపాటు.. ప్రత్యేకించి కష్టకాలంలోనూ దేశ ప్రయోజనాలే ప్రాధాన్యంగా తాను పని చేశానంటూ ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు.ప్రజా వ్యతిరేకత పెరిగిపోవడంతో ట్రూడో ఈ జనవరిలో కెనడా ప్రధాని పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే పార్టీ కొత్త నేతను ఎన్నుకునే దాకా ఆయన ఆ పదవిలో కొనసాగుతానని ప్రకటించారు. అయితే ఈ మధ్యలోనే డొనాల్డ్ ట్రంప్(Donald Trump) అమెరికా అధ్యక్షుడిగా పదవి చేపట్టారు. కెనడాతో పాటు పలు దేశాలపై సుంకాలు విధించి వాణిజ్య యుద్ధానికి తెర తీశారు.ట్రంప్ చర్యలకు ప్రతిగా.. కెనడా కూడా అమెరికా ఉత్పత్తులపై సుంకాలు విధించింది. ప్రతీకార సుంకాల పరిణామాలపై ఇద్దరు నేతలు సుమారు గంటపాటు ఫోన్లో చర్చించారు. అనంతరం ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మళ్లీ ప్రధాని పదవిలో కొనసాగేందుకే ట్రూడో వాణిజ్య యుద్ధానికి కాలు దువ్వుతున్నారని అన్నారు. టారిఫ్ సంక్షోభాన్ని తన రాజకీయం కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు.అక్కడితో ఆగకుండా.. 51వ అమెరికా రాష్ట్రానికి గవర్నర్గా కొనసాగేందుకు ట్రూడో తహతహలాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు (కెనడాను అమెరికాలో విలీనం చేసి 51 రాష్ట్రంగా చేస్తామంటూ చేసిన ప్రకటనకు కొనసాగింపుగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు..). అయితే ట్రంప్ ఆరోపణలను తన చివరి ప్రసంగంలో ట్రూడో తోసిపుచ్చారు. కెనడా ప్రయోజనాల కోసం.. దేశ ఆర్థిక వ్యవస్థను రక్షించేందుకే ప్రతీకార సుంకాలను విధించినట్లు తెలిపారాయన. ఇలాంటి ఆరోపణలు తనను కుంగదీయలేవని.. కడదాకా కెనడియన్ల కోసం కష్టపడతానని పేర్కొంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఇదిలా ఉంటే.. మార్చి 9వ తేదీన లిబరల్ పార్టీ కొత్త నేతను ఎన్నుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. "We got you, even in the very last days of this government": In a rare display, Canadian PM Justin Trudeau gets emotional in press conference while talking about his policies amid Trump tariff war #Canada #CanadaPM #JustinTrudeau #Trudeau #tariffs #tariffwar pic.twitter.com/XRneiCENNN— News18 (@CNNnews18) March 7, 2025 VIDEO CREDITS: News18 -
మరణశయ్యపై తల్లి.. కూతురి దుర్మార్గంపై కోర్టు కన్నెర్ర
కన్నతల్లి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే.. ఆ కూతురేమో దుర్మార్గంగా ఆలోచించింది. ఆస్తి కోసం బలవంతంగా ఆమెతో వీలునామాపై సంతకం చేయించుకుంది. అయితే సాక్ష్యంగా ఉంటుందని ఆ కూతురు తీయించుకున్న వీడియోనే.. ఈ బండారం మొత్తాన్ని బయట పెట్టింది. దీంతో కోర్టు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. చెంపపెట్టులాంటి తీర్పు ఇచ్చింది . యూకేలో ఓ వ్యక్తి మూడేళ్లపాటు చేసిన న్యాయ పోరాటం.. నాటకీయ పరిణామాల మధ్య ముగిసింది. సోదరుడిని మోసం చేసి ఆస్తి కొట్టేయాలని భావించిన ఓ మహిళకు పెద్ద షాకే తగిలింది. అతనికి 7 లక్షల పౌండ్ల విలువైన(మన కరెన్సీలో రూ.7 కోట్ల 86 లక్షల దాకా) విలువైన ఆస్తిపాస్తుల్లో సగం సోదరుడికి అప్పగించాలని కోర్టు ఆదేశించింది.కేసు ఇదే..మార్గరేట్ బేవర్స్టాక్(76) అనే మహిళ 2021 మార్చిలో కన్నుమూసింది. చనిపోయే టైంలో ఆమె తన ఆస్తి మొత్తం కూతురు లీసా పేరిట రాసింది. కొడుకు జాన్కు చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు. అయితే మతిమరుపు జబ్బుతో బాధపడుతున్న తన తల్లి.. సోదరికి మాత్రమే ఆస్తి ఎలా రాయగలిగిందని అతనికి అనుమానం వచ్చింది. ఆస్తిలో వాటా కోరుతూ.. సెంట్రల్ లండన్ కౌంటీ కోర్టులో పిటిషన్ వేశాడు.తన తల్లి 2014 నుంచే మతిమరుపు వ్యాధితో బాధపడుతోందని, ఆ వీలునామాపై అనుమానాలు ఉన్నాయని వాదించాడతను. అయితే తల్లి తన పేరిట రాసిన వీలుకు సంబంధించిన వీడియోను లీసా కోర్టులో ప్రవేశపెట్టింది. ఆ వీడియోను క్షుణ్ణంగా పరిశీలించిన న్యాయమూర్తి జేన్ ఇవాన్స్.. లీసాను గద్దించారు. అది బలవంతంగా చేయించుకున్నదేనని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఆ వీడియోలో ఆమె అతి కష్టంగా మాట్లాడుతోంది. పైగా పెన్నును ఆమెతో బలవంతంగా పెట్టించుకున్నట్లు కనిపిస్తోంది. వీలు కూడా ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసిన కాపీలా ఉంది అని జడ్జి అభ్యంతరాలు వ్యక్తం చేశారు.జడ్జి కన్నెర్ర చేయడంతో లీసా నిజం ఒప్పుకుంది. అది ఆమె చనిపోతున్న సమయంలో తీసిందని తెలిపింది. తల్లికి ఉన్న ఆ జబ్బును ఆసరా చేసుకుని ఆస్తి మొత్తం కాజేయాలని ప్రయత్నించినట్లు చెప్పింది. సాక్ష్యంగా ఉండాలని ఆ టైంలో వీడియో కూడా తీయించుకున్నట్లు తెలిపింది. దీంతో ఆస్తిలో సగం వాటా.. సోదరుడు జాన్కు అప్పగించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. అంతేకాదు.. జాన్కు అయిన కోర్టు ఖర్చులను కూడా లీసానే భరించాలని ఆదేశించింది. -
ట్రంప్ మార్క్ రాజకీయం.. పాకిస్థాన్కు భారీ షాక్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచి డొనాల్డ్ ట్రంప్(trump) సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచ దేశాలను టెన్షన్ పెడుతున్నారు. తాజాగా దాయాది దేశం పాకిస్థాన్, ఆఫ్గానిస్తాన్కు ఊహించని షాకిచ్చారు. రెండు దేశాల నుంచి అమెరికాకు వచ్చే వారిపై నిషేధం విధించేందుకు ట్రంప్ సిద్ధమయ్యారు.డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. టారిఫ్ల పేరుతో పలు దేశాలను హెచ్చరించారు. అమెరికాలో అక్రమ వలసదారులను తరలించిన విషయం తెలిసిందే. ఇక, ఇప్పుడు భద్రతా కారణాల దృష్ట్యా అమెరికాలోకి ప్రవేశించే పలు దేశాల వారిపైనా నిషేధం విధించేందుకు ట్రంప్ సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా పాకిస్థాన్ (Pakistan), అఫ్గానిస్థాన్(Afghanistan)లపై ట్రావెల్ బ్యాన్ విధించనున్నారు. వచ్చే వారం నుంచి ఇది అమలు కానున్నట్టు తెలుస్తోంది.డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడైన సమయంలోనూ కొన్ని ముస్లిం దేశాల పౌరులను అమెరికాలోకి అనుమతించడంపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. అనేక పరిశీలన అనంతరం 2018లో అక్కడి సుప్రీంకోర్టు కూడా ఆ నిర్ణయాన్ని సమర్థించింది. అయితే, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జో బైడెన్ ప్రభుత్వం.. ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసింది. దీంతో, ఆయా దేశాల పౌరులు.. అమెరికాలోకి వచ్చారు.🚨For those who were in celebration of #Trump statement ...!!US likely to impose travel ban on Pakistan,A new travel ban by US could ban people from #Afghanistan and #Pakistan from entering the #UnitedStates next week, pic.twitter.com/n21PxRh37z— Sardar Waleed Mukhtar (@waleedmukhtar_1) March 6, 2025ఇక, ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత పలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు. ఇందులో అమెరికాలోకి ప్రవేశించే విదేశీయులను నుంచి జాతీయ భద్రతా ముప్పు పొంచి వుందా అన్న విషయాన్ని ముందే గుర్తించే కార్యనిర్వాహక ఆదేశంపైనా సంతకం చేశారు. దీని ప్రకారమే ఇప్పుడు ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్టు అధికారులు చెబుతున్నారు.ఇదిలా ఉండగా, అంతకుముందు.. కాబూల్ విమానాశ్రయంపై 2021లో బాంబు పేలుళ్లు జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఆత్మాహుతి దాడిలో 170 మంది ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా అమెరికాకు చెందిన 13 మంది సైనికులు చనిపోయారు. అయితే, తాజాగా ఈ దాడులకు పాల్పడిన సూత్రధారిని పట్టుకున్నట్లు ట్రంప్ ప్రకటించారు. పాకిస్థాన్ సాయం వల్లే ఈ నిందితుడిని అరెస్ట్ చేయగలిగామని కూడా వివరించారు. అంతేకాకుండా పాకిస్థాన్కు కృతజ్ఞతలు కూడా తెలియజేశారు. కాగా, పాకిస్థాన్కు కృతజ్ఞతలు చెప్పిన వెంటనే ఆ దేశ పౌరులపై బ్యాన్ విధిస్తూ ట్రంప్ షాకివ్వడం గమనార్హం. -
తహవూర్ రాణాకు బిగ్ షాక్
వాషింగ్టన్: 26/11 ముంబై ఉగ్రవాద దాడుల కీలక సూత్రధారి తహవూర్ రాణా(Tahawwur Rana)కు బిగ్ షాక్ తగిలింది. తనను భారత్కు అప్పగించవద్దంటూ వేసిన పిటిషన్ను అమెరికా సుప్రీంకోర్టు తిరస్కరించింది.ముంబై దాడుల కేసులో తహవూర్ రాణాను భారత్కు అప్పగించేందుకు(Extradition) అమెరికా ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. అయితే చికిత్సపై హామీకి భారత ప్రభుత్వం నిరాకరించింది. దీంతో.. ఈ కారణాన్ని చూపిస్తూ భారత్కు తన అప్పగింతను నిలిపివేయాలంటూ అమెరికా సుప్రీం కోర్టు(US Supreme Court)లో తహవూర్ పిటిషన్ వేశాడు. ‘‘ప్రాణాంతక జబ్బులతో పోరాడుతున్న నన్ను భారత్కు అప్పగించడమంటే మరణశిక్ష విధించడమే. నా అప్పగింత అమెరికా చట్టాలతో పాటు ఐరాస తీర్పుల ఉల్లంఘనే. కనుక అప్పగింతపై స్టే విధించండి’’ అని తహవూర్ పిటిషన్ పేర్కొన్నాడు. పాక్ సంతతికి చెందిన ముస్లిం వ్యక్తిని కావడంతో తనను కచ్చితంగా హింసిస్తారని, భారత్కు అప్పగిస్తే తాను బతికే అవకాశమే లేదని వాదించాడతను. అయితే తహవూర్ రాణా వాదనలను కోర్టు తోసిపుచ్చింది. అతని పిటిషన్ను కొట్టేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో త్వరలోనే తహవూర్ను అమెరికా భారత్కు అప్పగించే ఛాన్స్ కనిపిస్తోంది. ఎవరీ తహవూర్ రాణా..?పాక్ సంతతికి చెందిన కెనడా జాతీయుడైన తహవూర్ రాణా.. ప్రస్తుతం లాస్ఏంజెలెస్లోని మెట్రోపాలిటన్ జైల్లో ఉన్నాడు. 2009లో FBI అతన్ని అరెస్టు చేసింది. పాక్–అమెరికా ఉగ్రవాది డేవిడ్ కోల్మన్ హెడ్లీతో అతనికి దగ్గరి సంబంధాలున్నాయి. రాణాను భారతదేశానికి అప్పగించడానికి అమెరికా సుప్రీంకోర్టు జనవరి 25, 2024న ఆమోదం తెలిపింది. ఈ కేసులో రాణా తనను తప్పుగా దోషిగా ప్రకటించారని చెప్పి రివ్యూ పిటిషన్ దాఖలు చేశాడు. కానీ కోర్టు ఆ పిటిషన్ను తిరస్కరించింది.భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి అమెరికా పర్యటనలో.. తహవూర్ రాణాను భారత్కు అప్పగించే అంశంపై అధ్యక్షుడు ట్రంప్ స్వయం ప్రకటన చేశారు. ఇందుకుగానూ ట్రంప్కి ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. దీంతో రాణా భారతదేశానికి వచ్చి న్యాయ విచారణ ఎదుర్కోవడం దాదాపు ఖాయమని భావించారంతా. -
పొద్దుపొద్దునే ఉల్కా పాతాన్ని తలపించేలా.. ముక్కలు చెక్కలైన రాకెట్
ప్రముఖ బిలీయనీర్ ఇలాన్ మస్క్కు చెందిన రాకెట్ సంస్థ స్పేస్ఎక్స్ ఎదురు దెబ్బ తగిలింది. స్టార్షిప్ రాకెట్ గగనతలంలో పేలిపోయి ముక్కలు చెక్కలు అయ్యింది. ఈ రాకెట్కు సంబంధించి ఇది ఎనిమిదో ప్రయోగం కాగా.. ఆ శకలాలు ఫ్లోరిడా, బహమాస్లలో పడడం విశేషం.చంద్రుడు, అంగారకుడిపైకి మానవ సహిత ప్రయోగాల కోసం.. స్టార్షిప్ సామర్థ్యాన్ని పరీక్షించడం, అలాగే డమ్మీ ఉపగ్రహాలను నిర్దిష్ట కక్ష్యలోకి వంటి అంశాలను పరీక్షించేందుకు ఈ ప్రయోగం నిర్వహించారు. ఈ ఉదయం టెక్సాస్ నుంచి స్పేస్ఎక్స్ స్టార్షిప్-8 స్పేస్క్రాఫ్ట్ ప్రయోగించారు. అయితే..స్పేస్లోకి ప్రవేశించిన వెంటనే అది పేలిపోయింది. ఆ శకలాలు దక్షిణ ఫ్లోరిడా.. అక్కడి నుంచి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న బహమాస్లోనూ పడ్డాయి. ఈ నేపథ్యంలో పలు విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది. ఉల్కా పాతాన్ని తలపించేలా ఉన్న ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.Is that space X rocket disintegration #spacex pic.twitter.com/apEagPIqDB— Talha Mirza (@tmirza777) March 6, 2025“Never give up” Elon Musk Starship 8 debris pic.twitter.com/NseQxyEZWP— Tesla Owners Silicon Valley (@teslaownersSV) March 7, 2025 ఇదిలా ఉంటే.. స్టార్షిప్ రాకెట్ ప్రయోగం విఫలం కావడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. జనవరిలో ప్రయోగం జరగ్గా.. కరేబియన్ దీవులపైన రాకెట్ పేలిపోయింది. ఆ శకలాలు ట్రక్స్ అండ్ కైకోస్ దీవుల్లో పడ్డాయి. మొత్తంగా ఇప్పటిదాకా స్టార్షిప్ రాకెట్తో ఎనిమిది ప్రయోగాలు చేయగా.. మే 2021లో నిర్వహించిన ఎస్ఎన్ 15 టెస్ట్ ఫ్టైట్ ఒక్కటి మాత్రమే పాక్షికంగా సక్సెస్ అయ్యింది.ప్రపంచంలోనే అతిపెద్ద రాకెట్గా స్టార్షిప్గా ప్రస్తుతానికి గుర్తింపు ఉంది. 123 మీటర్ల ఎత్తు(403 అడుగులు)తో నాసా శాటర్న్-V రికార్డును బద్ధలు కొట్టింది. రాకెట్ రూపకల్పనకు రూ.830 కోట్ల రూపాయలను స్పేస్ఎక్స్ ఏజెన్సీ ఖర్చు చేసింది. అంగారకుడు, చంద్రుడిపైకి మానవ సహిత రాకెట్ ప్రయోగాల కోసం దీనిని తయారు చేశారు.