వెహికల్‌పై ఆ స్టిక్కర్లు లేకుంటే రూ.5000 జరిమానా | Vehicles In Delhi That Dont Display Colour Coded Fuel Stickers To Be Penalised | Sakshi
Sakshi News home page

వెహికల్‌పై ఆ స్టిక్కర్లు లేకుంటే రూ.5000 జరిమానా

Apr 21 2025 12:42 PM | Updated on Apr 21 2025 1:01 PM

Vehicles In Delhi That Dont Display Colour Coded Fuel Stickers To Be Penalised

ఢిల్లీ మోటార్ వాహన చట్టంలోని నిబంధనల ప్రకారం.. ఇంధన రకాన్ని సూచించే కలర్ కోడెడ్ స్టిక్కర్లను తప్పకుండా అంటించాలి. ఈ నియమాన్ని అతిక్రమించిన వాహనాలపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ వెల్లడించింది.

నిబంధనలు పాటించకపోతే మోటారు వాహన చట్టం కింద రూ. 5000 జరిమానా విధిస్తారు. ఈ స్టిక్కర్లు 2012-13లో ప్రవేశపెట్టబడిన హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్స్ (HSRP)లో భాగంగా తీసుకొచ్చారు. ఆ తరువాత 2019 నాటికి అన్ని వాహనాలను ఈ స్టిక్కర్లు తప్పనిసరి అంటూ ఢిల్లీ రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసింది.

వాహనాలకు కలర్ కోడెడ్ స్టిక్కర్లను అతికించని వాహనదారులు జరిమానా చెల్లించడం మాత్రమే కాకుండా.. పొల్యూషన్ సర్టిఫికెట్ (PUCC) కూడా పొందలేరు. నిబంధనల ప్రకారం, డీజిల్ వాహనాలకు నారింజ రంగు స్టిక్కర్లు, పెట్రోల్ & సీఎన్‌జీ వాహనాలకు లేత నీలం రంగు స్టిక్కర్లు.. మిగిలిన అన్ని వాహనాలకు బూడిద రంగు స్టిక్కర్లు తప్పనిసరిగా అతికించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement