breaking news
West Godavari
-
సర్ప సంరక్షణలో క్రాంతి కిరణం
●స్నేక్ సేవియర్ సొసైటీ ద్వారా సేవలు ●పాములపై ప్రజలకు అవగాహన ఫిబ్రవరి 17.. జంగారెడ్డిగూడెంలోని కిడ్స్ కాన్వెంట్లోకి ఏడడుగుల గోధుమ తాచు ప్రవేశించింది. పాఠశాల ఆవరణలోని చెట్టు మొదళ్లలో పాము కనిపించడంతో పాఠశాల సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే స్నేక్ సేవియల్ సొసైటీ వ్యవస్థాపకుడు చదలవాడ క్రాంతికి సమాచారం ఇచ్చారు. ఆయన హుటాహుటిన ఇక్కడకు చేరుకుని చాకచక్యంగా గోధుమ తాచును పట్టుకున్నారు. అనంతరం సురక్షిత ప్రాంతానికి తరలించారు. దీంతో పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. జూలై 1.. జంగారెడ్డిగూడెం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలోకి కోడెనాగు ప్రవేశించింది. సంతోష్ అనే కానిస్టేబుల్ కాళ్ల మధ్యలో నుంచి పాము కార్యాలయంలోనికి రావడంతో అందరూ భయభ్రాంతులకు గురయ్యారు. విషయాన్ని స్నేక్ సేవియర్స్ సొసైటీ వ్యవస్థాపకుడు చదలవాడ క్రాంతికి సమాచారం అందించారు. వెంటనే క్రాంతి అక్కడికి వచ్చి ఎవరికీ ఎటువంటి హాని కలగకుండా పామును సురక్షితంగా పట్టుకున్నారు. అనంతరం దానిని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. దీంతో పోలీసు సిబ్బంది అందరూ ఊపిరిపీల్చుకున్నారు. జంగారెడ్డిగూడెం : పాము కనపడగానే ఎవరికై నా వెన్నులో వణుకు పడుతుంది. దానిని చంపే యాలని చూస్తాం. అయితే ఆ యువకుడు చాక చక్యంగా దానిని పట్టుకుని సురక్షిత ప్రాంతంలో వదిలి వేస్తున్నాడు. పాము నుంచి మనిషికి, మనిషి నుంచి పాముకు రక్షణ కల్పించాలనే ఆలోచనతో స్నేక్ సేవియర్గా మారి సేవలందిస్తున్నాడు జంగారెడ్డిగూడెం మండలం పేరంపేటకు చెందిన చదలవాడ క్రాంతి. 15 ఏళ్లుగా పాముల సంరక్షుడిగా ఉన్నాడు. 2016లో స్నేక్ సేవియర్ సొసైటీని స్థాపించి సర్పాల సంరక్షణతో పాటు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాడు. పేరంపేటకు చెందిన వ్యవసాయ కూలీలైన చదలవాడ రాజారావు, వెంకాయమ్మ కుమారుడు క్రాంతికి చిన్నతనం నుంచి ప్రకృతి, వన్యప్రాణులంటే ఇష్టం. చిన్నతనంలో పొలం పనులకు వెళ్లే సమయంలో పాము పిల్లలతో ఆడుకునేవాడు. తర్వాత కాలంలో పాములపై ఆసక్తి పెంచుకున్నా డు. పాములు పట్టడంలో కేరళలో శిక్షణ ఇస్తారని మిత్రుల ద్వారా తెలుసుకున్నాడు. 2009లో కేరళలోని కొట్టాయంలో పాములు పట్టడం, సంరక్షించడంలో వావా సురేష్ వద్ద 8 నెలల కఠోర శిక్షణ పొందాడు. తర్వాత విశాఖకు చెందిన రొక్కం కిరణ్కుమార్ వద్ద మరికొన్ని మెళకువలు నేర్చుకున్నాడు. 2010 నుంచి 2016 వరకు విశాఖలో ప్రజలకు సేవలు అందించాడు. అనంతరం పశ్చిమగోదావరి జిల్లాకు తిరిగి వచ్చి 2016 డిసెంబర్ 31న స్నేక్ సేవియర్స్ సొసైటీ సంస్థను స్థాపించాడు. అప్పటినుంచి ఉమ్మడి పశ్చిమగోదావరి, ఉమ్మడి తూర్పుగోదావరి, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో పాముల సంరక్షణకు కృషి చేస్తున్నాడు. 15 ఏళ్లు.. 19 వేలకు పైగా పాములు క్రాంతి పాములు, వన్య ప్రాణుల సంరక్షణలో 15 ఏళ్లుగా తన వంతు బాధ్యత పోషిస్తున్నాడు. ఇప్పటివరకు సుమారు 19 వేలకుపైగా పాములను పట్టుకుని సురక్షితంగా అటవీ ప్రాంతాల్లో విడిచిపెట్టాడు. అలాగే స్నేక్ సేవియర్ సంస్థ ద్వారా పా ముల సంరక్షణ, జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో సుమారు 50కి పైగా పాఠశాలలను సందర్శించి విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహించాడు. పాములు, వన్య ప్రాణులను రక్షించడం, వాటిపై ప్రజలకు అవగాహన కల్పించడమే స్నేక్ సేవియర్ సొసైటీ ముఖ్య ఉద్దేశమని క్రాంతి అంటున్నాడు. పాములకు హాని కలగకుండా చూడటమే తన లక్ష్యమని చెబుతున్నాడు. స్నేక్ కంట్రోల్ పౌడర్ విక్రయిస్తూ.. కౌలుకు భూమి తీసుకుని వ్యవసాయం చేసిన క్రాంతి లాభదాయకంగా లేక కౌలు సేద్యం మానివేశాడు. ప్రస్తుతం పొలం పనులకు వెళుతూ పార్ట్ టైమ్గా కారు డ్రైవింగ్ చేస్తున్నాడు. పాములు పట్టుకున్నప్పుడు అభిమానంతో వారిచ్చే సొమ్ము కొంత ఇంటి నిర్వహణకు ఉపయోగపడుతుంది. అలాగే స్నేక్ కంట్రోల్ పౌడర్ను కిలో రూ.500కు విక్రయిస్తున్నాడు. ఇలా నెలకు 20 ప్యాకెట్ల వరకు అమ్ముతున్నాడు. ఈ పౌడర్ చల్లితే ఆ ప్రాంతంలోకి పా ములు రావని చెబుతున్నాడు. క్రాంతి తండ్రి రాజారావు ఇటీవల మృతిచెందారు. గోధుమ తాచు పాముతో.. -
కష్టాలు ఆవరించేను
సాక్షి, భీమవరం: జల వనరులశాఖ మంత్రి సొంత జిల్లాలో రైతులను సాగునీటి కష్టాలు వేధిస్తున్నాయి. కాలువలకు నీరు విడుదల చేసి నెల రోజులైనా పూర్తిస్థాయిలో శివారు ప్రాంతాలకు చేరక తొలకరి పను లు ఆలస్యమవుతున్నాయి. జిల్లాలో 2.08 లక్షల ఎక రాల ఖరీఫ్ ఆయకట్టుకు ఇప్పటివరకు 38 వేల ఎకరాల్లో మాత్రమే నాట్లు పూర్తయ్యాయి. పలుచోట్ల నీరందక నారుమడులు ఎండిపోతున్నాయి. శివారు.. అందని నీరు జిల్లాలో 11 ప్రధాన పంట కాలువల ద్వారా సాగునీటి సరఫరా జరుగుతోంది. తాడేపల్లిగూడెం, తణు కు, ఉండి, భీమవరం నియోజకవర్గాలతో పోలిస్తే ఆచంట, పాలకొల్లు, నరసాపురం కాలువలకు శివారులుగా ఉన్నాయి. గతంలో జూన్ మొదటి వారంలోనే కాలువలకు నీరు విడుదల చేస్తే నవంబర్ చివరిలో వచ్చే తుపానుల బారిన పడకుండా జూలై మూడో వారం నాటికి నాట్లు పూర్తి చేసుకునేవారు. క్లోజర్ పనుల పేరిట ఈ ఏడాది జూన్ 15న నీటిని విడుదల చేశారు. అప్పటికీ క్లోజర్, ఓఅండ్ఎం పనులు పూర్తవ్వక పూర్తిస్థాయిలో కాలువలకు నీరందలేదు. జూన్ నెలాఖరు నాటికి నారుమడులు వేయడం పూర్తి కావాల్సి ఉండగా శివార్లలో జూలై రెండో వారం వరకు సాగాయి. పెనుమంట్ర, అత్తిలి, పాలకోడేరు తదితర మండలాల్లో కొన్నిచోట్ల జూన్లో కురిసిన వర్షాలపైనే నారుమడులు సిద్ధం చేసుకున్నారు. ఎగువ ప్రాంతాల్లోనూ.. కాలువల ఎగువ ప్రాంతమైన తాడేపల్లిగూడెంలో ఇప్పటికే నాట్లు దాదాపు పూర్తికావాలి. ఈ నియోజకవర్గంలో 47,340 ఎకరాలకు 23,797 ఎకరాల్లో నాట్లు వేశారు. తణుకు నియోజకవర్గంలో 39,695 ఎకరాలకు 11,167 ఎకరాల్లోను, భీమవరంలో 19,740 ఎకరాలకు 200 ఎకరాలు, ఉండిలో 33,700 ఎకరాలకు 920 ఎకరాల్లో నాట్లు పడ్డాయి. పొలాలు.. బీడులు వరద నీటితో గోదావరి పొంగి ప్రవహిస్తుంటే చెంతనే ఉన్న పొలాలకు చుక్కనీరు రాని పరిస్థితి ఉంది. ఆచంట, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాల్లోని ఆయకట్టుకు బ్యాంకు కెనాల్, నరసాపురం చానల్ ద్వారా సాగునీటి సరఫరా అవుతుంది. కాకరపర్రు రెగ్యులేటర్ గేట్ల వద్ద తూడు తొలగింపు, ఓఅండ్ఎం పనులు సకాలంలో పూర్తి చేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్యంతో తీవ్ర నీటి ఎద్దడి ఎదురైంది. సాగునీరందక పోడూరు, ఆచంట, యలమంచిలి తదితర మండలాల్లో నారుమడులు ఎండిపోయి పొలాలు బీటలు తీసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మంత్రి ఇలాకా.. సాగు సాగక.. జల వనరులశాఖ మంత్రి జిల్లాలో సాగునీటి ఇక్కట్లు జూన్ 15న కాలువలకు నీరు విడుదల నెల రోజులు దాటినా శివారు ప్రాంతాలకు చేరని సాగునీరు జిల్లాలో ఖరీఫ్ సాగు విస్తీర్ణం 2.08 లక్షల ఎకరాలు ఇప్పటివరకు 38 వేల ఎకరాల్లో మాత్రమే నాట్లు ఆచంట, పాలకొల్లు, నరసాపురంలో నత్తనడకన తొలకరి పనులు మంత్రి ఇలాకాలో నత్తనడకన.. వేలాది రూపాయలు వెచ్చించి వేసిన నారుమడులు సాగునీరందక ఎండిపోతున్నాయని పలుచోట్ల రైతులు నిరసన వ్యక్తం చేశారు. జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకొల్లులో దాదాపు 23 వేల ఎకరాలకు ఇప్పటివరకు కేవలం 290 ఎకరాల్లో మాత్రమే నాట్లు వేయగా పలుచోట్ల నారుమడులు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆచంటలో 38 వేల ఎకరాలకు 1,480 ఎకరాల్లో నాట్లు పడగా, నరసాపురంలో 7,615 ఎకరాలకు గాను ఇంకా నాట్లు పడకపోవడం గమనార్హం. శివారు ప్రాంతాల్లో చాలాచోట్ల ఇప్పటికీ సాగు పనులు మొదలవ్వక భూముల్లో గడ్డి పెరిగిపోయి ఉన్నాయి. పూర్తిస్థాయిలో కాలువలకు నీరంది, దమ్ములు చేసి, నాట్లు వేసేందుకు మరో నెలరోజులు సమయం పడుతుందని, గతంలో ఎప్పుడూ ఇటువంటి పరిస్థితి లేదని రైతులు అంటున్నారు. సాగు జాప్యంతో నవంబర్లో తుపాన్లతో పంటకు నష్టం కలిగించే అవకాశంతో పాటు దాళ్వా జాప్యమవుతుందంటున్నారు. సాగునీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. -
మట్టి కొట్టుకుపోయిన రూ.3 కోట్లు
ఉండి: 2024–25కు సంబంధించి ఎన్ఆర్ఈజీఎస్ పనుల ఖర్చుల్లో రూ.3.50 కోట్లు అధిక చెల్లింపు చేసినట్లు సామాజిక తనిఖీ బృందాలు గుర్తించాయి. శనివారం ఉదయం నుంచి ఉండి ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో జరిగిన ప్రజావేదిక సభలో తనిఖీ బృందాల నివేదికలపై మాత్రం తప్పుదారి పట్టించేలా అధికారులు సమాధానమిచ్చారు. 2024–25 ఏడాదికి 19 గ్రామాల్లో సుమారు రూ.5.44 కోట్లకు పైగా విలువైన 1059 పనులు నిర్వహించారు. పంచాయతీరాజ్ విభాగంలో 22 పనులు రూ.67 లక్షలతో చేపట్టారు. చేపట్టిన పని ఒకటైతే నమోదు చేసిన పని మరొకటి కావడంతో సామాజిక తనిఖీ బృందాలు మండల వ్యాప్తంగా రూ.3.50 కోట్లు అధిక చెల్లింపులు చేసినట్లు నివేదికను రూపొందించాయి. కాలువలు, పంట బోదెల్లో చేపట్టిన పనులు వివాదానికి కేంద్ర బిందువుగా మారాయి. వాటిల్లో కేవలం తూడు, గుర్రపుడెక్క తొలగించారని తనిఖీ బృందాలు నివేదిక ఇస్తే.. మట్టి తీశామని ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది అధికారులు వాదించారు. మట్టి పనిచేస్తే ఎందుకు ఫోటోలు ఆన్లైన్ చేయలేదన్నారు. అంతే అంటూ ఎన్ఆర్ఈజీఎస్ పీడీ డాక్టర్ కేసీహెచ్ అప్పారావు సమర్ధించుకున్నారు. పంట కాలువలు, బోదెల్లో వేసవిలో నీరు వుంటుందని మట్టి తీసినా కనిపించదంటూ విచిత్రంగా సమాధానాలు చెప్పారు. పనిచేసే సమయంలో ఫొటోల్లో ఎందుకు తీసిన మట్టి కనిపించలేదని పలువురు వాదించినా చెప్పిందే చెప్పి సమస్యను కప్పిపుచ్చేందుకు పీడీ పయత్నించారు. సమావేశం అనంతరం పీడీ మాట్లాడుతూ పనుల్లో జరిగిన అవతవకలు రూ.1.61 లక్షలు రికవరీ రాశామని తెలిపారు. పలు గ్రామాల్లో వచ్చిన ఆరోపణలపై అధికారుల ఆధ్వర్యంలో రూ.5.67 లక్షల విలువైన పనులపై ఎంక్వయిరీ వేసినట్లు తెలిపారు. తనిఖీ బృందాల నివేదికల ప్రకారం.. వారు గుర్తించిన రూ.3.50 కోట్ల అధిక చెల్లింపుల్లో భాగంగా రూ.3.07 కోట్ల పనులకు సంబంధించి పని సమయంలో తీసిన ఫోటోలు అప్లోడ్ చేయాలని.. అలా చేయని పక్షంలో మొత్తం రూ.3.07 కోట్లు తిరిగి చెల్లించాలని మండల ఎన్ఆర్ఈజీఎస్ అధికారులను, సిబ్బందిని ఆదేశించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎన్ఆర్ఈజీఎస్ ఏపీడీ సుజాత, విజిలెన్స్ జిల్లా అధికారి పురుషోత్తం, క్వాలిటీ కంట్రోల్ జేఈ శ్రీకాంత్, ఎంపీడీవో ఎంవీవీఎస్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
పేదల ఇళ్లు కూల్చివేత
ఆకివీడు: పేదల ఇళ్లను కూల్చివేశారు. ఆకివీడు నగర పంచాయతీ పరిధిలోని ధర్మాపుర అగ్రహారంలోని మంచినీటి చెరువు చుట్టూ ఉన్న ఆక్రమణల తొలగింపునకు హైకోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో శనివారం నగర పంచాయతీ కమిషనర్ ఆదేశాలతో పోలీసుల సమక్షంలో ఆక్రమణల తొలగింపు చేపట్టారు. కాయకష్టంతో ఏళ్ల తరబడి శ్రమించి కట్టుకున్న తమ ఇళ్లు కూల్చివేయవద్దని బాధితులు మొ రపెట్టుకున్నా ఎవ్వరూ పట్టించుకోలేదు. కూల్చివేస్తున్న ఇళ్ల వద్దకు వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. బాధితులను లాగి పడేశారు. ఆకివీడు రూరల్ సీఐ జగదీశ్వరరావు ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలోని 50 మంది సిబ్బంది, 10 మంది ఎస్సైల బందోబస్తులో ఆక్రమణల తొలగింపు పనులు సాగుతున్నాయి. బాధితుల్ని తొ లగింపు వద్దకు రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. చెరువు గట్టుపై ఉన్న సుమారు 26 ఇళ్లను తొలగించాల్సి ఉండగా కొన్నింటిని తొలగించారు. చీకటి ప డటంతో పనులను ఆపారు. కమిషనర్ కృష్ణమోహన్, తహసీల్దార్ ఎన్.వెంకటేశ్వరరావు, ఎస్సై హనుమంతురావు పనులను పర్యవేక్షిస్తున్నారు. -
మంచినీటి చెరువును పరిశీలించిన అధికారులు
కాళ్ల: కాళ్ల మండలం కోలనపల్లి రక్షిత మంచినీటి సరఫరా చెరువును అధికారులు శనివారం పరిశీలించారు. గ్రామంలో మంచినీటి చెరువులో చేపలు చనిపోవడంపై గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారంటూ శ్రీమంచినీటి చెరువులో చేపల మృతిశ్రీ అనే సాక్షి కథనానికి అధికారులు స్పందించారు. శనివారం ఉదయం డిప్యూటీ ఎంపీడీవో భాస్కరరావు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, పంచాయతీ అధికారులతో కలిసి చెరువును పరిశీలించారు. మంచినీటి చెరువులో చనిపోయి తేలుతున్న చేపలను తీసివేసి, చెరువు గట్ల చుట్టూ పెరిగిపోయిన చెత్త మొక్కలను మనుషులతో తొలగించినట్లు అధికారులు తెలిపారు. చెరువును బ్లీచింగ్తో సూపర్ శానిటేషన్ చేయించామని. ప్రజలంతా కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని శ్రీటాంటాంశ్రీ వేయించామన్నారు. చెరువుకు కాళ్ళ లంక చానల్ నుంచి పూర్తిస్థాయిలో పంట నీరు నింపాలని అధికారులకు ఆదేశించారు. పారిజాతగిరిలో పూజలు జంగారెడ్డిగూడెం: గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన రోజు కావడంతో శనివారం వేకువజాము నుంచే సుప్రభాత సేవ, తోమాల సేవ, ఆరాధన, తీర్థప్రసాద గోష్టి, బాల భోగ నివేదన తదితర పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి భక్తులకు దర్శనం ఇచ్చారు. భక్తులు జిల్లా నలుమూలల నుంచి కొండ పైకివచ్చి స్వామివారి ప్రత్యేక అష్టోత్తర పూజలు జరిపించుకున్నారు. ఆలయానికి విరాళం ద్వారా రూ.17,107, పూజా టిక్కెట్ల ద్వారా రూ.15,695, ప్రసాదాల ద్వారా 23,060 మొత్తం రూ.55,862 ఆదాయం వచ్చినట్టు ఆలయ కార్యనిర్వహణ అధికారి కలగర శ్రీనివాస్ తెలియజేశారు. కుమార్తెలతో మహిళ అదృశ్యం ఉండి: ఓ తల్లి ఇద్దరు బిడ్డలతో అదృశ్యం కావ డంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం పెదపుల్లేరు గ్రామానికి చెందిన ఓ మహిళ భర్తతో విభేదాల కారణంగా తల్లి వద్ద ఉంటుంది. ఆమెకు 12, 8 ఏళ్ల వయసున్న కుమార్తెలు వున్నారు. ఈ నెల 18న ఇద్దరు కుమార్తెలతో నిద్రపోయిన ఆమె 19న ఉదయం 5 గంటల సమయంలో తల్లి చూసేసరికి కనిపించలేదు. దీంతో ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
● రహదారి.. చెరువుగా మారి
చెరువులో నుంచి ఏంటి యువకులు నడిచి వెళుతున్నారు అనుకుంటున్నారా.. అయితే మీరు పొరబడినట్టే.. ఇది చింతలపూడి మండలంలోని ముక్కంపాడు గ్రామానికి వెళ్లే రహదారి. శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి చెరువులా మారింది. దీంతో శనివారం ఉదయం నుంచి నడుములోతు నీటిలో గ్రామస్తులు రాకపోకలు సాగిస్తున్నారు. ముక్కంపాడుకు రోడ్డు నిర్మాణం కోసం అధికారులు, ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని, వర్షం కురిస్తే రోడ్డు పూర్తిగా జలమయమవుతోందని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు. – చింతలపూడి -
చీటింగ్ కేసులో నగదు రికవరీ
చింతలపూడి: చీటింగ్ కేసులో నగదు రికవరీ చేసి బాధితుడికి అందజేశారు. చింతలపూడి డీఎస్పీ యు.రవిచంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లో ఒక ప్రైవేట్ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్న షేక్ ఖాసింకు చింతలపూడికి చెందిన రాజ్కుమార్, ప్రవీణ్ అనే వ్యక్తులు వ్యాపార అవసరాల నిమిత్తం తక్కువ వడ్డీకి డబ్బులు ఇప్పిస్తామని తెలిపారు. దీంతో ఖాసిం వారి మాటలు నమ్మడంతో తొలుత ష్యూరిటీ కింద రూ.50 లక్షలు, కంపెనీ డాక్యుమెంట్స్ తీసుకురావాలని తెలపడంతో ఈ నెల 18న ఖాసిం చింతలపూడి వచ్చారు. అలా వచ్చిన మేనేజర్ను రాజ్కుమార్, ప్రవీణ్లు చింతలపూడిలోని ఎరుకలపేటలోని ఒక ఇంటికి తీసుకువెళ్లారు. అక్కడ డబ్బులు లెక్కపెట్టే నెపంతో ఇంటిలోకి వెళ్లి తలుపులు వేసుకుని, వేరే మార్గంలో బయటకు వెళ్లారు. ఎంతకు రాకపోవడంతో లోపలికి వెళ్లి చూడగా వారు కనిపించలేదు. తనను మోసం చేశారని గ్రహించిన మేనేజర్ చింతలపూడి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. డీఎస్పీ పర్యవేక్షణలో సీఐ టి.క్రాంతి కుమార్, ఎస్సై కె.సతీష్కుమార్లు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిందితులను పట్టుకుని వారి నుంచి రూ. 50 లక్షలు రికవరీ చేశారు. పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిపేటప్పుడు సదరు వ్యక్తుల గురించి పూర్తిగా సమాచారం తెలుసుకోవాలని డీఎస్పీ అన్నారు. సరైన ధ్రువీకరణ లేకుండా లావాదేవీలు చేయరాదన్నారు. -
మద్దిలో అభిషేక సేవ
జంగారెడ్డిగూడెం: గురవాయిగూడెంలో శ్రీ మద్ది ఆంజనేయస్వామి ఆలయం వద్ద ప్రతి శనివారం నిర్వహించే అభిషేక సేవ సందర్భంగా ఆలయ ముఖ మండపంపై స్వామివారి ఉత్సవమూర్తికి అర్చక స్వాములు శాస్త్రోక్తంగా పంచామృత అభిషేకం నిర్వహించారు. ఏలూరు జిల్లా పావులూరివారి గూడెంకు చెందిన శ్రీనివాస భజన మండలి హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. వివిధ సేవలు, విరాళాల ద్వారా రూ.1,10,790 సమకూరినట్లు ఈవో ఆర్వీ చందన తెలిపారు. స్వామివారి నిత్యాన్నదాన సత్రంలో భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు. -
టిడ్కో గృహాలకు మోక్షమెప్పుడో?
● సంక్రాంతికే ఇస్తామన్న మంత్రి పార్థసారథి ● ఆరు నెలలు గడిచినా వాటి ఊసే లేదు నూజివీడు: పట్టణ పరిధిలోని టిడ్కో గృహాలు లబ్ధిదారులకు ఎప్పటికి అందుతాయోనని ఎదురుచూస్తున్నారు. బ్యాంకుల్లో రుణాలు తీసుకొని టిడ్కోకు చెల్లించి రెండేళ్లు గడిచినా ఇంతవరకు తమకు గృహాలు అప్పగించకపోగా, ఇచ్చిన రుణాలపై రెండేళ్ల మారటోరియం పూర్తికావడంతో రుణాలు ఇచ్చిన బ్యాంకర్లు ఈఎంఐలు చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నాయి. 2014–19 కాలంలో పాలించిన టీడీపీ ప్రభుత్వం టిడ్కో గృహాల పథకాన్ని తీసుకువచ్చింది. దీనిలో భాగంగా ప్రధానమంత్రి ఆవాస యోజన పథకకానికి జతగా రాష్ట్ర ప్రభుత్వం కొంత నిధులను ఇచ్చి టిడ్కో గృహాల నిర్మాణాన్ని చేపట్టింది. దీనిలో భాగంగా నూజివీడు పట్టణంలో అప్పట్లో 3070 గృహాలను మంజూరు చేశారు. నిర్మాణం పూర్తయిన ప్లాట్లు 2640 ఉన్నాయి. వీటిల్లో 300 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ప్లాట్లు 864, 365 చదరపు అడుగుల(సింగిల్ బెడ్రూమ్) విస్తీర్ణం కలిగిన ప్లాట్లు 864, 430 చదరపు అడుగుల (డబుల్ బెడ్ రూమ్) ప్లాట్లు 912 చొప్పున ఉన్నాయి. సంక్రాంతిలోగా ఇస్తామన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గృహ నిర్మాణ మంత్రి కొలుసు పార్థసారథి గతేడాది జులైలో నూజివీడులో పర్యటించిన సమయంలో పట్టణంలోని టిడ్కో గృహాల ప్లాట్లను సంక్రాంతి కల్లా అందిస్తానని ప్రకటించారు. దీంతో లబ్ధిదారులందరూ తమ ప్లాట్లు చేతికొస్తాయని సంతోషించారు. సంక్రాంతి వచ్చింది..పోయింది తప్ప లబ్ధిదారులకు ప్లాట్లు మాత్రం చేతికి రాలేదు. సంక్రాంతి పోయి ఆరు నెలలు గడిచినా టిడ్కో గృహాల ఊసే లేదు. దీంతో ఇంకెంత కాలం ఎదురుచూడాలోనని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉచితంగా ఇచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం నూజివీడులో ఉన్న 2640 పాట్లలో 300 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ప్లాట్లు 864 ఉన్నాయి. వీటికి ఒక్కొక్క దానికి లబ్ధిదారులు బ్యాంకర్ల నుంచి రూ.2.72 లక్షల రుణాన్ని తీసుకొని టిడ్కోకు చెల్లించాల్సి ఉంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 300 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ప్లాట్లు వచ్చిన లబ్దిదారులకు సంబంధించిన రుణాన్ని మాఫీ చేశారు. లబ్ధిదారుల నుంచి ఒక్క రూపాయి మాత్రమే కట్టించుకొని వారి పేరున ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసింది. వారికి కూడా ప్లాట్లను ఇంత వరకు అప్పగించలేదు. పనులే ప్రారంభం కాలేదు టిడ్కో గృహాల సముదాయ ప్రాంతంలో ఇంతవరకు రోడ్ల నిర్మాణ పనులు, డ్రైనేజీ నిర్మాణ పనులే ప్రారంభం కాలేదు. ప్లాట్లలో ఇంకా కొన్ని పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. విద్యుత్ వైరింగ్, రంగులు వేయడం, మరుగుదొడ్లు, బాత్రూమ్లు తయారు చేయడం, తలుపులు పెట్టడం తదితర పనులు చేయాల్సి ఉంది. ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదు. ఎన్నికల ముందు టిడ్కో గృహాలను అధికారంలోకి రాగానే అప్పగిస్తామని హామీ ఇచ్చి ఏడాది గడిచినా ఇంత వరకు వాటి గురించి పట్టించుకోకపోవడంపై లబ్దిదారులు అసంతృప్తి వ్యక్తమవుతోంది.టిడ్కో గృహాలు అందజేయాలి పట్టణంలోని టిడ్కో గృహాలను లబ్ధిదారులకు త్వరగా అందజేసేందుకు చర్యలు తీసుకోవాలి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ఏడాది గడిచినా ప్రభుత్వం అమలు చేయలేదు. లబ్ధిదారులపై రుణాలు చెల్లించాలని బ్యాంకర్లు ఒత్తిడి చేస్తున్నారు. లక్షలాది రూపాయలు రుణాలు తీసుకున్న లబ్ధిదారులకు వడ్డీ భారం పెరిగిపోయే అవకాశాలున్నాయి. జీ రాజు, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు, నూజివీడు -
ఎంపీ మిథున్రెడ్డి అరెస్ట్ దారుణం
మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు బుట్టాయగూడెం: ఎంపీ మిథున్రెడ్డి అరెస్ట్ను మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు తీ వ్రంగా ఖండించారు. శనివారం రాత్రి విలేకరులతో మా ట్లాడు తూ ఎంపీ మిథున్రెడ్డిని సీఎం చంద్రబాబు కేవలం కక్షపూరిత రాజకీయాలతోనే అరెస్ట్ చేయించారని విమర్శించారు. చంద్రబాబు రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ వైఎస్సార్సీపీ శ్రేణులను టార్గెట్ చేస్తూ జైలులో పెట్టాలని చూస్తున్నారన్నారు. ఎన్ని కేసులు పెట్టినా ఎంత మందిని అరెస్ట్ చేసినా వైఎస్సార్సీపీ జెండాను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామన్నారు. పీఎంశ్రీకి పెదతాడేపల్లి గురుకులం ఎంపిక తాడేపల్లిగూడెం రూరల్: పెదతాడేపల్లి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల జిల్లా ఉత్తమ పీఎంశ్రీ పాఠశాలగా ఎంపికై ందని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల జిల్లా ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ శ్యామ్కుమార్ తెలిపారు. శనివారం గురుకుల పాఠశాలను ఐదుగురు సభ్యులతో కూడిన బృందం పరిశీలించింది. బృందంలో ఎంఈఒలు వి.హనుమ, పీఎంకే.జ్యోతి, ఏఎంఓ సుబ్రహ్మణ్యం, పీఎంశ్రీ వీరాస్వామి ఉన్నారు. ఈ సందర్భంగా శ్యామ్కుమార్ మాట్లాడుతూ జిల్లాలోని 25 గురుకుల పాఠశాలలను పరిశీలించామన్నారు. కిచెన్ గార్డెన్, ఆటస్థలం, కంప్యూటరైజ్డ్ లైబ్రరీ, సైన్స్ ల్యాబ్, కెరీర్ గైడెన్స్ ల్యాబ్, ఫుడ్ ప్రాసెసింగ్, స్కిల్ ల్యాబ్ తదితర అంశాల ప్రాతిపదికగా తీసుకుని పెదతాడేపల్లి గురుకులాన్ని ఉత్త మ పాఠశాలగా ఎంపిక చేశారన్నారు. పాఠశా ల ప్లే ఫీల్డ్ అభివృద్ధికి రూ.5 లక్షలు, రసాయన శాస్త్ర ప్రయోగశాలకు రూ.13 లక్షలు మంజూరవుతాయని తెలిపారు. ప్రిన్సిపాల్ బి.రాజారావు, వైస్ ప్రిన్సిపల్ ప్రతాప్ ఉన్నారు. రెవెన్యూ ఉద్యోగులకు శిక్షణ భీమవరం(ప్రకాశంచౌక్): జిల్లాలో కుల ధ్రువీకరణ పత్రాల జారీ, ప్రభుత్వ భూమి ఆక్రమణల తొలగింపు తదితర అంశాలపై శనివారం స్థానిక ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో రెవెన్యూ ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జేసీ రాహుల్కుమార్రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులు చట్టాలు, నిబంధనలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. శిక్షణతో నైపుణ్యా లు పెంచుకోవాలన్నారు. ఏఐ టెక్నాలజీకి సంబంధించిన వివిధ టూల్స్ను ఎలా ఉపయోగించుకోవాలో వివరించారు. కేఆర్ఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.శివన్నారాయణరెడ్డి, పాలకొల్లు తహసీల్దార్ వై.దుర్గా కిషోర్ మాట్లాడారు. ఏసీబీ వలలో సబ్ ట్రెజరీ ఉద్యోగి కై కలూరు: రిటైర్డ్ అ టెండర్కు రావాల్సిన సొమ్ములకు లంచం డిమాండ్ చేసిన కై కలూరు సబ్ ట్రెజరీ సీనియర్ అసిస్టెంట్ కులుకులూరి హనుమంతరావు అలియాస్ ఆంజనేయులను శనివారం ఏలూ రు ఏసీబీ డీఎస్పీ సుబ్బరాజు ఆధ్వర్యంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. కై కలూరుకు చెందిన షేక్ సుభానీ 2016లో రెవెన్యూ అటెండర్గా రిటైరు కాగా శాలరీ ఫిక్స్ కాలేదు. ఇటీవల ఏలూరు ప్రధాన కార్యాలయం నుంచి కై కలూరు సబ్ ట్రెజరీకి ఆయన ఫైల్ను క్లియర్ చేసి పంపారు. ఏరియర్స్, గ్రాట్యూటీ కలిపి రూ.33 లక్షలు రావాల్సి ఉండగా.. కై కలూరు నుంచి ఫైల్ తిరిగి పంపడానికి సుభానీ మూ డు నెలలుగా హనుమంతురావు చుట్టూ తిరుగుతున్నారు. రూ.66 వేలు లంచం ఇవ్వాలని హనుమంతరావు డిమాండ్ చేయగా సుభానీ బతిమలాడితే రూ.55 వేలకు ఫైనల్ చేశాడు. జూన్ 26న రూ.10 వేలు ఇవ్వగా.. ఈనెల 2న సుభానీ ఖాతాలో పదవీ విరమణ లబ్ధి కొంత జమైంది. ఇంకా రూ.6 లక్షలు రావాల్సి ఉండగా.. ఆ మొత్తం కోసం రూ.20 వేలు లంచం ఇప్పుడు ఇచ్చి మిగిలింది తర్వాత ఇవ్వాలన్నాడు. దీనిపై ఈనెల 17న సుభానీ ఏలూరు ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు పథకం ప్రకారం రూ.20 వేలను సుభానీకి ఇచ్చి పంపగా.. ఈ సొమ్మును తీసుకుండుగా హనుమంతరావును రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుడిని రాజమండ్రి ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ చెప్పారు. -
నిమ్మ రైతులను ఆదుకోవాలి
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కిలో నిమ్మ ధర రూ.100కు పైగా పలికింది. ఈ ఏడాది నిమ్మ ధర దిగజారి పోవడంతో సరైన గిట్టుబాటు ధర లభించకపోవడంతో పెట్టుబడులు పెరిగి ఆర్థికంగా అప్పులు పాలయ్యే పరిస్థితి ఏర్పడింది. తక్షణమే ప్రభుత్వం స్పందించి నిమ్మ పంటకు గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలి. రాయంకుల సత్యనారాయణ, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్, కామవరపుకోట మండలం గిట్టుబాటు ధర కల్పించాలి నిమ్మ తోట దిగుబడి రావడానికి పెట్టుబడి ఖర్చు ఎక్కువగా ఉంటుంది. దీంతో అప్పు చేసి మరీ పెట్టుబడి పెట్టాను. ఈ ఏడాది నిమ్మ ధర దిగజారి పోవడంతో ఆర్థికంగా అప్పులు పాలయే పరిస్థితి ఏర్పడింది. తక్షణమే ప్రభుత్వం స్పందించి గిట్టుబాటు ధర కల్పించి నిమ్మ రైతులను ఆదుకోవాలి. – మద్దుకూరి సత్యనారాయణ, ఈస్ట్ యడవల్లి, కామవరపుకోట మండలం -
అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు
పెనుగొండ: ఉండి నియోజకవర్గంలో దళితులు నివసిస్తున్న ఇళ్లను అక్రమంగా కూల్చివేయడం దారుణమని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నన్నేటి పుష్పరాజ్ విమర్శించారు. శనివారం ఆచంట వేమవరంలోని మాల మహానాడు కార్యాలయంలో పోలీసులు గృహ నిర్బంధ చేశారు. ఆకివీడు మండలం ధర్మవరం అగ్రహారంలో దళితులకు అండగా పోరాటం చేస్తామని పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. ఉద్యమాలను అరెస్ట్లతో ఆపలేరన్నారు. దళితులు నివాసాలు రహదారికి ఎలాంటి ఇబ్బంది లేకపోయినా తొలగించడానికి సన్నాహాలు చేస్తున్నారన్నారు. వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇచ్చిన హామీ ప్రకారం ఇబ్బంది కలుగుకుండా చర్యలు తీసుకోవాలన్నారు. లేకుంటే మాలమహానాడు ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. -
గంజాయి కేసులో నిందితుడి అరెస్టు
జంగారెడ్డిగూడెం: గంజాయి కేసులో తప్పించుకుని తిరుగుతున్న నిందితుడిని అరెస్టు చేయగా, మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు జంగారెడ్డిగూడెం సీఐ ఎంవీ సుభాష్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఏప్రిల్ 29న 394.795 కేజీల గంజాయిని తరలిస్తున్న ముఠా సభ్యులను అరెస్టు చేశారు. ఐదుగురిని అరెస్టు చేయగా, ఇద్దరు తప్పించుకున్నారు. వారిలో కాకినాడ జిల్లా పెద్దాపురానికి చెందిన పిడుగు శ్రీనివాసరావు అలియాస్ బాబిని స్థానిక జాతీయ ప్రధాన రహదారిపై ఫైర్ స్టేషన్ వద్ద శుక్రవారం అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. బైక్, సెల్ఫోన్ సీజ్ చేశామన్నారు. కోర్టులో హాజరు పరచగా, 14 రోజులు రిమాండ్ విధించినట్లు తెలిపారు. అతనిపై మండపేట రూరల్, తిమ్మాపురం, జగ్గంపేట, రాజమండ్రి ప్రకాష్ నగర్లో 36 దొంగతనం కేసులు, దేవరపల్లి, పెనుమంట్ర, రాజమండ్రి, నెల్లూరు జిల్లా వి.సత్రం పోలీస్స్టేషన్లో గంజాయి అక్రమ రవాణా కేసులు ఉన్నాయని తెలిపారు. -
నిమ్మ ధర పతనం
కామవరపుకోట: నిమ్మ ధర దిగజారటంతో రైతులు నష్టాలు చవిచూస్తున్నారు. గత వారం రోజుల నుంచి నిమ్మకాయ రేట్లు పడిపోవడంతో రైతులు నిరాశకు గురవుతున్నారు. ప్రస్తుతం కామవరపుకోట మార్కెట్ యార్డులో రైతుకు కిలో రూ.8 నుంచి రూ.10 రూపాయలకు నిమ్మకాయల రేటు దిగజారిపోయింది. మండలంలో వేల ఎకరాల్లో రైతులు నిమ్మ సాగు చేస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కిలో రూ.100 పైబడి నిమ్మ ధర పలికింది. ఇప్పుడు దారుణంగా పడడంతో కూలీల ఖర్చు కూడా రావడంలేదని రైతులు వాపోతున్నారు. గత ఏడాది రికార్డు స్థాయిలో నిమ్మ ధర లభించడంతో చాలామంది రైతులు మరి ముఖ్యంగా కౌలు రైతులు ఎకరాకు రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు అధిక మొత్తంలో కౌలు చెల్లించి మరీ సాగు చేపట్టారు. ఈ ఏడాది మే నెల ప్రారంభం నుండే నిమ్మ ధర ఒక్కసారిగా పడిపోవడంతో పెట్టిన పెట్టుబడులు తిరిగిరాని పరిస్థితి నెలకొందని అప్పులు పాలవుతామని కౌలు రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రేట్లు పడిపోవడం వల్ల కోత కోసే కూలీలకు ఖర్చులు , రవాణా ఖర్చులు కూడా గిట్టుబాటు కావడం లేదని రైతులు వాపోతున్నారు. ఇదే రేట్లు నిమ్మకాయకు కొనసాగితే రైతులు అప్పులు పాలు కావాల్సిందేనని, నిమ్మ తోటలు తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. కొంతమంది వ్యాపారులు దళారులు కుమ్మకై ్క ధరలు తగ్గిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. దీనికి తోడు అకాల వర్షాలు పంట దిగుబడి, నాణ్యతపై ప్రభావం చూపయని ఇది కూడా ధరల పతనానికి కారణమని మరి కొంతమంది చెబుతున్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి నిమ్మ పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని వ్యాపారుల సిండికేట్ను నియంత్రించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఆందోళనలో రైతులు -
ప్లాస్టిక్రహిత జిల్లా లక్ష్యం
అత్తిలి: జిల్లాను ప్లాస్టిక్రహిత జిల్లాగా తీర్చిదిద్దాల ని జిల్లా ప్రత్యేక అధికారి, మహిళలు, పిల్లలు, విక లాంగులు, సీనియర్ సిటిజన్ల శాఖ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి ఎ.సూర్యకుమారి పిలుపునిచ్చారు. శనివారం తణుకు మాంటిస్సోరి హైస్కూల్, జూనియర్ కళాశాలల్లో ఏర్పాటుచేసిన స్వర్ణాంధ్ర–స్వచ్చాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ సీహెచ్ నాగరాణితో కలిసి ఆమె హాజరయ్యారు. మానవాళి మనుగడకు ప్లాస్టిక్ను నిర్మూలించడం అవసరమని, అందరూ జ్యూట్ బ్యాగులు వాడాలని సూర్యకుమారి సూచించారు. కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ ప్లాస్టిక్ నిర్మూలన, జ్యూట్ బ్యాగులు, స్టీల్ వాటర్ బాటిల్స్ వినియోగంపై ఉపాధ్యాయులు విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. ప్లాస్టిక్ ప్రత్యామ్నాయాలపై ప్రదర్శనలో విజేతలకు ప్రశంసా ప త్రాలను అందజేశారు. మున్సిపల్ కమిషనర్ టి.రామ్కుమార్, తహసీల్దార్ డీవీఎస్ఎస్ అశోక్వర్మ, ఐసీడీఎస్ పీడీ డి.శ్రీలక్ష్మి, ఎంపీడీఓ లోహిత్ సాగర్, పాఠశాల హెచ్ఎం ఎస్.లక్ష్మి, ప్రిన్సిపాల్ ఏ.జ్ఞాన మంజరి, డైరెక్టర్ అనపర్తి ప్రకాశరావు పాల్గొన్నారు. -
మంత్రి నియోజకవర్గంలో కొరత
తొలకరి సీజన్లో నీటి ఎద్దడితో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. స్వయంగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల నియోజకవర్గంలోనూ సమస్య అధికంగా ఉంది. యలమంచిలి, ఆచంట, పోడూరు, పెనుమంట్ర తదితర ఎనిమిది మండలాల్లో నారుమడులు బీటలు తీశాయి. గోదావరికి వరద పోటెత్తుతుంటే సాగునీటి ఎద్దడి ప్రభుత్వ వైఫల్యమే. – జేఎన్వీ గోపాలన్, సీపీఎం జిల్లా కార్యదర్శి శివార్లలో తీవ్ర ఎద్దడి సాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. పంట కాలువ శివారు ప్రాంతాలకు నీరు అందడం లేదు. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. నారుమడులు నెర్రలు తీసి ఎండిపోయే పరిస్థితి ఏర్పడి తీవ్రంగా నష్టపోతున్నాం. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి సాగునీరు అందించడానికి చర్యలు తీసుకోవాలి. – కుడిపూడి శ్రీనివాస్, రైతు, చినమల్లం రైతులు నష్టపోతున్నారు తొలకరి ప్రారంభంలోనే తీవ్ర సాగునీటి పరిస్థితులు ఉన్నాయి. నారుమడులు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆగస్టు నెలాఖరు వరకు నాట్లు సాగితే నవంబర్, డిసెంబర్లో వచ్చే తుపానులతో నష్టపోవడం ఖాయం. అలాగే దాళ్వా ఆలస్యమై రైతులు ఇబ్బంది పడాల్సి వస్తుంది. – మామిడిశెట్టి రామాంజనేయులు, కౌలురైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి -
రెడ్బుక్ పాలనతో ప్రజాస్వామ్యానికి చేటు
పెనుగొండ: ప్రజలను మభ్య పెట్టి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో రెడ్బుక్ పాలనతో ప్రజాస్వామ్యం పీక నొక్కుతోందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు వి మర్శించారు. శుక్రవారం తూర్పుపాలెంలోని పార్టీ కార్యాలయంలో ఆచంట నియోజకవర్గస్థాయి బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ముదునూరి మాట్లాడుతూ సూపర్ సిక్స్ హామీలపై ప్రశ్నిస్తుంటే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. కూటమి ఏడాది పాలనలో సంక్షేమాన్ని మరిచి ప్రశ్నించిన వారిపై 4,500 కేసు లు నమోదు చేశారన్నారు. రూ.18,500 కోట్ల విద్యు త్ చార్జీల భారాన్ని ప్రజలపై మోపారన్నారు. ఎన్నికల సమయంలో సంపద సృష్తించి సంక్షేమం నా లుగు రెట్లు అమలు చేస్తామని బ్యాండ్లు ఇచ్చి, ఇప్పుడేమో సంపద ఎలా ఉందో సృష్టించాలో చెప్పాలంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో రైతులు, యు వత, మహిళలు, నిరుద్యోగులు ఇలా అన్నివర్గాలను కూటమి ప్రభుత్వం మోసం చేసిందన్నారు. అలాగే గత జగన్ ప్రభుత్వంలో అందించిన సంక్షేమ పథకాలను నిలిపివేశారన్నారు. ఇంటింటికీ రేషన్ అందించే ఎండీయూ వాహనాలను మూలకు చేర్చారన్నా రు. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. డెప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశ్నించడం మరిచి పోయారన్నారు. చంద్రబాబు మోసాన్ని ప్ర తి గడపకూ తీసుకువెళ్లాలని పార్టీ శ్రేణుల కు పిలుపునిచ్చారు. కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు. అడుగడుగునా దోపిడీ మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ సంక్షేమం అమలుపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించకుండా, వనరులు దోచుకోవడంపై దృష్టి పెడుతోందని విమర్శించారు. అడుగడుగునా దోపిడీ కి పాల్పడుతున్నారన్నారు. పొలాలకు నీరు సరఫరా, రైతులకు ధాన్యం సొమ్ముల చెల్లింపులో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. పింఛన్లకు తిలోదకాలు నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకు డు ముదునూరి మురళీ కృష్ణంరాజు మాట్లాడుతూ కూటమి పాలకులు కొత్త పింఛన్ల మంజూరుకు తిలోదకాలు ఇచ్చి ఆరు లక్షల పింఛన్లు నిలిపి వేశా రన్నారు. చంద్రబాబు వంచనను మండల, గ్రామస్థాయిలో ప్రతి ఇంటా వివరించాలన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో 34 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు మంజూరు చేశామని, కూటమి పాలనలో ఒక్కరికై నా ఇంటి స్థలం ఇచ్చారా అని ప్రశ్నించారు. కార్యకర్తలు భయపడాల్సిన పని లేద ని, రాబోయేది జగన్ ప్రభుత్వమే అన్నారు. చంద్రబాబు వంచనను ఎండగట్టాలి ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ మాట్లాడుతూ మభ్యపెట్టడం చంద్రబాబు నైజమన్నారు. గత ప్రభుత్వం కన్నా ఎక్కువ సంక్షేమం ఇస్తామని చెప్పి ప్రజలను మరోసారి మోసగించారని, చంద్రబాబు వంచనను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. నరసాపురం పార్లమెంట్ ఇన్చార్జి గూడూరి ఉమాబాల మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యాచారాలు పెచ్చుమీరిపోతున్నాయన్నారు. బడుగు, బలహీన, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు రాష్ట్రంలో తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. ఆయా వర్గాలకు నామినేటేడ్ పోస్టుల్లో 50 శాతం పదవులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం కేటాయిస్తే నేడు దానిని కూటమి ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆచంట నియోజకవర్గ పరిశీలకుడు ఖండవల్లి వాసు, ఎంపీపీలు సబ్బిటి సుమంగళి, కేవీవీ నారాయణ రెడ్డి(వాసు), జెడ్పీటీసీలు గుంటూరి పెద్దిరాజు, కర్రి గౌరీ సుభాషిణీ, మండల కన్వీనర్లు నల్లిమిల్లి బాబిరెడ్డి, పిల్లి నాగన్న, గూడూరి దేవేంద్రుడు, జక్కంశెట్టి చంటి తదితరులు పాల్గొన్నారు. సంక్షేమాన్ని విస్మరించిన కూటమి ప్రభుత్వం ప్రశ్నించిన వారిపై 4,500 కేసులు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి -
గిరిజనులను విస్మరించిన కూటమి ప్రభుత్వం
భీమవరం(ప్రకాశం చౌక్): గిరిజనులను కూటమి ప్రభుత్వం విస్మరించి, వారికి రిజర్వేషన్లు అమలు చేయడంలో అన్యాయం చేస్తోందని వైఎస్సార్ సీపీ ఎంబీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పెండ్ర వీరన్న అన్నారు. స్థానిక అంబేడ్కర్ భవనంలో సాలా శ్రీను అధ్యక్షతన శుక్రవారం గిరిజన తెగల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. వీరన్న మాట్లాడుతూ భీమవరం మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి గిరిజన మహిళకు రిజర్వేషన్ కాగా దీనిని మార్చి ఓసీ మహిళకు కేటాయించారన్నారు. గిరిజనులకు అన్యాయం జరిగిందంటూ కలెక్టర్, జేసీలకు విన్నవించినా పట్టించుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వంలో ఎస్టీ వర్గాలు రాజకీయ పదవులకు అర్హులు కాదా అని ప్రశ్నించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పాలకొల్లు ఏఎంసీ చైర్మన్ పదవితో పాటు శాసనమండలిలో కూడా గిరిజనులకు అవకాశం కల్పించారని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వ తీరు ఇలానే ఉంటే గిరిజనులు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఎస్టీ వర్గాలకు అన్యాయం వైఎస్సార్సీపీ నరసాపురం పార్లమెంట్ ఇన్చార్జ్ గూడూరి ఉమాబాల మాట్లాడుతూ నామినేటెడ్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, అలాగే మహిళలకు 50 రిజర్వేషన్ అమలు చేసిన ఘనత మాజీ సీఎం జగన్కే దక్కిందన్నారు. ఈ రిజర్వేషన్లు మార్పులు చేసి కూటమి ప్రభుత్వం ఆయా వర్గాలకు అన్యాయం చేస్తోందన్నారు. ఎస్టీ వర్గాలు రాజకీయంగా చైతన్యం కావాలని వారికి వైఎస్సార్సీపీ పూర్తి మద్దతు ఇస్తుందన్నారు. వైఎస్సార్సీపీ భీమవరం ఇన్చార్జ్ చినమిల్లి వెంకట్రాయుడు మాట్లాడుతూ భీమవరం ఏఎంసీ చైర్మన్ పదవిని ఎస్టీ మహిళకు కేటాయించి తదుపరి ఓసీ మహిళకు కేటాయించడం రాజ్యాంగ విరుద్ధమ న్నారు. ఎస్టీ వర్గాలపై కూటమి ప్రభుత్వానికి ఉన్న చులకన భావనకు ఇదే నిదర్శనమన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు మేడిది జాన్సన్ మాట్లాడుతూ గిరిజనులకు అన్యాయం జరిగిందని, తాము అండగా ఉంటామన్నారు. పార్టీ నేత గంటా సుందర్కుమార్ మాట్లాడుతూ దళిత జేఏసీ తరఫున పూర్తి బాధ్యత తీసుకుని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతో కలిసి పోరాటానికి సిద్ధంగా ఉన్నామన్నారు. వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు గాదిరాజు రామరాజు, ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి భారతి విజయరాజు, ఎస్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బండి రమేష్, కూతాడ పెద్ద సత్యనారాయణ, సాల వెంకటేశ్వరరావు, కారంపూడి అనంత నాగు, ఎస్టీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
శానిటేషన్ మేస్త్రి, వర్కర్ ఆత్మహత్యాయత్నం
నూజివీడు: నూజివీడు మున్సిపల్ కమిషనర్ ఆర్.వెంకటరామిరెడ్డి దూషించారంటూ పట్టణంలోని మున్సిపాలిటీలో పనిచేసే శానిటేషన్ మేస్త్రి దలాయి కొండలరావు, శానిటేషన్ కాంట్రాక్టు కార్మికురాలిగా పనిచేస్తున్న ఆయన భా ర్య పైడమ్మ శుక్రవారం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. ఉదయం 9 గంటల సమయంలో ఇంటి వద్ద నిద్రమాత్రలు మింగగా కుటుంబసభ్యులు, స్థానికులు వారిని ఏరియా ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మున్సిపల్ వైస్ చైర్మన్ పగడాల సత్యనారాయణ ఆస్పత్రికి వచ్చి బాధితులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతమొందిద్దాం భీమవరం (ప్రకాశంచౌక్): స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్రలో భాగంగా శనివారం ‘ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతమొందిద్దాం’ అనే నినాదంతో కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ సీహెచ్ నాగ రాణి తెలిపారు. జిల్లా, డివిజన్, మండల, గ్రామ, వార్డు స్థాయిల్లో తప్పక నిర్వహించాలని, ఈ మేరకు పంచాయతీరాజ్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు ప్రణాళికను పక్కాగా అమలు చేయాలన్నారు. ప్లాస్టిక్ నిషేధాన్ని ప్రతిఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలన్నారు. గెస్ట్ లెక్చరర్ పోస్టులకు 23న ఇంటర్వ్యూలు భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో గెస్ట్ లెక్చరర్ పోస్టుల భర్తీకి ఈనెల 23న భీమవరంలోని జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖాధికారి కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూలు మొదలవుతాయని, సంబంధిత పీజీ సబ్జెక్టుల్లో 50 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించిన అభ్యర్థులు అర్హులన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల యల మంచిలిలో ఇంగ్లిష్, ప్రభుత్వ జూనియర్ కళాశాల వీరవాసరంలో కెమిస్ట్రీ, కామర్స్, ప్రభు త్వ జూనియర్ కళాశాల తాడేపల్లిగూడెంలో మేథమెటిక్స్, ఎస్సీఐఎం ప్రభుత్వ జూనియర్ కళాశాల తణుకులో కామర్స్, ఎస్సీఐఎం జూనియర్ కళాశాల తణుకు సీఈటీలో బీటెక్ సివిల్, ప్రభుత్వ జూనియర్ కళాశాల దుంపగడపలో బోటనీ, జువాలజీ, ప్రభుత్వ జూని యర్ కళాశాల గరల్స్ పాలకొల్లులో కెమిస్ట్రీ, ప్రభుత్వ జూనియర్ కళాశాల అత్తిలిలో మేథమెటిక్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. పాత పెన్షన్ అమలు చేయాలి ఏలూరు (ఆర్ఆర్పేట): 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ మెమో 57 ప్రకారం పాత పెన్షన్ అమలు చేయాలని వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోందని ఆ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గెడ్డం సుధీర్ ప్రకటనలో తెలిపారు. -
తాగునీటి కోసం నిరసన
పెనుగొండ: తాగునీటి సమస్యలు పరిష్కరించాలంటూ మహిళలు నిరసన బాట పట్టారు. పోడూరు మండలం కవిటంలో తాగునీరు లేక నానా అవస్థలు పడుతన్నామని శుక్రవారం మహిళలు ఖాళీ బిందెలతో నరసాపురం రహదారిపై కవిటం బ్రిడ్జి వద్ద నాలుగు రోడ్ల కూడలిలో బైఠాయించారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. తాగునీరు రాక ఇబ్బంది పడుతున్నా అధికారులు ని మ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించా రు. అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవ డం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాగడానికి కాలనీవాసులకు కనీసం ట్యాంకుల ద్వారా నీటి సరఫరా చేయాలని కోరినా పట్టించుకోలేదన్నారు. దీంతో పిల్లాపాపలతో దాహార్తితో అలమటిస్తున్నామ న్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి తాగునీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని కోరారు. -
కల్లుగీత.. బెల్టు వ్యథ
సాక్షి, భీమవరం: జిల్లాలో విచ్చలవిడిగా సాగు తున్న మద్యం అమ్మకాలు కల్లుగీత కార్మికుల ఉపాధిని దెబ్బతీస్తున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. బెల్టు షాపుల ద్వారా ఊరువాడా తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు మద్యం దొరుకుతోంది. దీంతో సంప్రదాయ కల్లుతాగే వారి సంఖ్య తగ్గిపోతుండటంతో తమ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని గీత కార్మికులు వాపోతున్నారు. 170 సంఘాలు.. 10 వేల కార్మికులు జిల్లాలో 170 కల్లుగీత కార్మిక సంఘాల పరిధిలో 10 వేల మంది వరకు గీత కార్మికులు ఉన్నారు. తాడేపల్లిగూడెం, తణుకు, ఆచంట తదితర నియోజకవర్గాల్లో వీరి సంఖ్య అధికంగా ఉంది. ప్రాణాలకు తెగించి గ్రామాల్లో తాటిచెట్లు ఎక్కి కల్లును తీసి పొలం గట్లు, రోడ్లు వెంబడి మకాంలలో అమ్మకాలు చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. తరతరాలుగా ఈ వృత్తినే నమ్ముకుని ఉన్నారు. గ్రామాల్లో కళకళలాడే కల్లుగీతను కూటమి ప్రభుత్వం సంక్షోభంలోకి నెట్టేసిందని కార్మిక సంఘం నేతలు విమర్శిస్తున్నారు. బెల్టు బారులు.. మద్యం ఏరులు జిల్లాలో 193 మద్యం దుకాణాలకు గాను పట్టణ ప్రాంతాల్లో దాదాపు 71 షాపులు ఉండగా, 410 పంచాయతీల పరిధిలో 122 షాపులు ఉన్నాయి. మద్యం దుకాణాలు లేని గ్రామాల్లో లిక్కర్ సిండికేట్లు బెల్టు షాపులు ఏర్పాటుచేసి అమ్మకాలు చేయిస్తున్నారు. లైసెన్స్డ్ షాపు పరిధిలో రెండు నుంచి ఐదు వరకు బెల్టులు ఉన్నట్టు సమాచారం. సముద్ర తీరం, మెట్ట ప్రాంతాల్లోని కొన్ని గ్రామాల్లో బెల్టు షాపుల కోసం లోపాయికారీగా వేలం పాటలు కూడా జరిగాయి. తీర ప్రాంతంలోని ఒక గ్రామంలో రూ.17.80 లక్షలకు, మరో గ్రామంలో రూ.6 లక్షలకు బెల్టు షాపులు దక్కించుకున్నట్టు గీత కార్మిక సంఘం నాయకులు చెబుతున్నారు. బెల్టు షాపుల నిర్వాహకులు చిన్న చిన్న బడ్డీ దుకాణాల్లో మద్యం సీసాలు పెట్టి అమ్మకాలు చేయడంతో పాటు కావాల్సిన చోటుకి డోర్ డెలివరీ కూడా చేస్తున్నారు. గీత కార్మికుల డిమాండ్లు బెల్టుషాపులను రద్దు చేసి కల్లుగీత కు టుంబాలను ఆదుకోవాలని, బెల్టులతో నష్టపోయి న కుటుంబాలకు రూ.లక్ష ఆర్థిక సహకారం అందించాలని, బెల్టుషాపుల ఎత్తివేతకు గ్రామస్థాయిలోని ఉద్యోగులతో కమిటీలు ఏర్పాటుచేయాలని, వృత్తి నిర్వహణలో ప్రమాదవశాత్తు కార్మికులు మృతి చెందితే వారి కు టుంబానికి రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలని తదితర డిమాండ్లతో ఇటీవల కలెక్టర్కు కల్లుగీత కార్మిక సంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు. కల్లు.. తల్లకిందులు జిల్లాలో మద్యం ఏరులై పారుతుండటంతో కల్లు అమ్మకాలు గణనీయంగా తగ్గినట్టు కార్మికులు చెబుతున్నారు. గత ప్రభుత్వంలో నిబంధనలు కచ్చితంగా అమలయ్యేవని, బెల్టుషాపుల జాడే ఉండేది కాదన్నారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నిర్ణీత వేళల్లో మాత్రమే మద్యం అమ్మకాలు చేయడం వలన గీత కార్మికులకు ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదన్నారు. గతంలో ప్రధాన రహదారుల వెంబడి ఒక్కో మకాంలో రోజుకు రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు, గ్రామాల్లో రూ.1,500లు నుంచి రూ. 2,000ల వరకు అమ్మకాలు చేస్తే.. కూటమి ప్రభుత్వంలో రూ.200ల నుంచి రూ.300 అమ్మకాలు జరగడం గగనమవుతోందని చెబుతున్నారు. గోదావరి చెంతనే రక్షిత నీటి కోసం ఇబ్బందులున్నా కానీ మద్యానికి కొదవ ఉండటం లేదంటున్నారు. బెల్టులు ఏర్పాటుచేసిన మద్యం షాపులకు మొదటిసారి రూ.5 లక్షలు జురిమానా విధించాలని, రెండోసారి తప్పుచేస్తే లైసెన్స్ రద్దు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా ఎకై ్సజ్ అధికారులు 370 మందిని అరెస్టు చేసి 730 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నా ఒక్క షాపునకు జరిమా విధించడం గాని, లైసెన్స్ రద్దు చేసిన దాఖలాలు కాని లేకపోవడం కూటమి సర్కారు ద్వంద్వ నీతికి నిదర్శనమంటున్నారు. ఉపాధికి గండి గ్రామాల్లో విచ్చలవిడిగా మద్యం బెల్టు షాపులు తమ ఉపాధి దెబ్బతింటోందని గీత కార్మికుల ఆవేదన నష్టపోతున్న కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ జిల్లాలో 10 వేల మంది గీత కార్మికులు గీత కార్మికులంటే చంద్రబాబుకు చిన్నచూపు కల్లుగీత కార్మికులంటే చంద్రబాబుకు చిన్నచూపు. మద్యం ఆదాయం కోసం కల్లుగీత వృత్తిని నిర్వీర్యం చేస్తున్నారు. తెలంగాణ, కేరళలో కల్లుగీత కార్మికులకు ప్రోత్సాహకాలు అందిస్తుంటే మన రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఉన్న వాటిని అమలు చేయకుండా గీత కార్మికులకు అన్యాయం చేస్తోంది. –జుత్తిగ నరసింహమూర్తి, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, భీమవరం ఎల్లవేళలా మద్యం అమ్మకాలు బెల్టు షాపులు వచ్చాక కల్లు తాగే వారు బాగా తగ్గిపోయారు. ఎక్కడపడితే అక్కడ చిన్న చిన్న బడ్డీకొట్టుల్లో ఎల్లవేళలా మద్యం అమ్మకాలు చేస్తున్నారు. కల్లు దుకాణంలో గతంలో రోజుకు రూ.2 వేల వరకు అమ్మకాలు చేస్తే ఇప్పుడు రూ.200 కూడా అమ్ముడుపోవడం లేదు. –బి.రత్నం, కల్లుగీత కార్మికుడు, ఆరేడు, ఉండి మండలం -
బదిలీ చేశారు.. జీతాలు ఆపారు
ఏలూరు (ఆర్ఆర్పేట): రాష్ట్రంలో ఇటీవల జరిగిన బదిలీల్లో స్థానచలనం కలిగిన ఉపాధ్యాయులకు ప్రభుత్వం జీతాలు చెల్లించకుండా మీనమేషాలు లెక్కిస్తోంది. ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు జీతాలను ఆలస్యం చేస్తోందని ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలు మండిపడుతున్నాయి. తాజాగా ఉపాధ్యాయుల బదిలీలను సాకుగా చూపి జీతాలు చెల్లించకుండా కాలయాపన చేస్తోందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీతాలు అందక ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. పొజిషన్ ఐడీలు కేటాయించడంలో.. సాధారణంగా ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు వారు బదిలీ అయిన ప్రాంతాల్లో జీతాలు తీసుకునేలా అక్కడి డీడీఓకు సమాచారం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దీని నిమిత్తం పొజిషన్ ఐడీలు కేటాయించాలి. గత నెల 15వ తేదీ లోపులో అన్ని క్యాడర్ల ఉపాధ్యా యుల బదిలీలను పూర్తి చేశారు. ఇది జరిగి నెల రోజులు దాటినా ఇప్పటికీ ఉపాధ్యాయులకు పొజిషన్ ఐడీలు కేటాయించలేదు. దీంతో జూన్కు సంబంధించి జూలైలో రావాల్సిన జీతాలు ఉపాధ్యాయులకు అందలేదు. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు రాష్ట్రస్థాయిలో పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ అధికారులకు విజ్ఞప్తులు చేసినా చలనం కలుగలేదు. ఇప్పటివరకూ ఉపాధ్యాయుల క్యాడర్ స్ట్రెంగ్త్ కూడా నిర్ధారించిన దాఖలాలు లేవని సంఘ నాయకులు అంటు న్నారు. ఈ కారణంగా వచ్చే నెల కూడా తమకు జీతాలు అందే సూచనలు కనిపించడం లేదని ఉపాధ్యాయ వర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. జీతాలందక పాట్లు సాధారణంగా జూన్లో ప్రతి కుటుంబంలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. విద్యా సంవత్సరం ప్రారంభంలో పిల్లల స్కూల్ ఫీజులు, విద్యా సామగ్రి కోసం వేలల్లో వెచ్చించాల్సి ఉంటుంది. అలాగే బదిలీ అయిన ప్రాంతానికి వెళ్లేందుకు రవాణా ఖర్చులు, ఇంటి అద్దెలు, అడ్వాన్సుల రూపంలో మరింత ఖర్చు పెరిగిందని, ఈ నేపథ్యంలో జీతాలు రాకపోవడం ఇబ్బంది కలిగిస్తోందని ఉపా ధ్యాయులు అంటున్నారు. 4,884 మందిపై ప్రభావం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో మొత్తం 4,884 మంది ఉపాధ్యాయులను బదిలీ చేశారు. గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయులు 76 మందికి, మో డల్ ప్రైమరీ పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా 284 మందికి, స్కూల్ అసిస్టెంట్, సమాన స్థాయి కేడర్ ఉపాధ్యాయులుగా 2,274 మందికి, సెకండరీ గ్రేడ్, సమాన స్థాయి కేడర్ ఉపాధ్యాయులుగా 2,159 మందికి, లాంగ్వేజ్ పండితులు 42 మందికి, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులు 33 మందికి, ఆర్ట్/డ్రాయింగ్/క్రాఫ్ట్/మ్యూజిక్ /ఒకేషనల్ ఉపాఽ ద్యాయులు 16 మందికి స్థాన చలనం కలిగింది. జీతాలు విడుదల కాకపోవడం వీరిపై పెను ప్రభావం చూపుతోంది. పొజిషన్ ఐడీలు కేటాయించడంలో అలసత్వం గురువులకు జీతాలు లేక అగచాట్లు 4,884 మంది ఉపాధ్యాయులపై ప్రభావం ఉపాధ్యాయులపై ఒత్తిడి పాఠశాల విద్యాశాఖ అధికారులు తాము చేయాల్సిన పనిని సక్రమంగా చేయకుండా ఉపాధ్యాయులను ఒత్తిడిలోకి నెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలు విరమించాలి. బదిలీ అయిన ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించే ఏర్పాట్లు చేయకుండా వారిపై యాప్ల అప్లోడ్ పేరిట భారం పెంచుతున్నారు. వెరీ అర్జెంట్, మోస్ట్ అర్జెంట్ అంటూ మెసేజ్లు పెట్టడం తప్ప ఉపాధ్యాయుల జీతాలు అర్జెంట్ అనే విషయాన్ని మరచిపోతున్నారు. – తాళ్లూరి రామారావు, ఏపీటీఎఫ్, ఏలూరు జిల్లా అధ్యక్షుడు జీతాలు వెంటనే చెల్లించాలి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రాతిపదికగా ఇటీవల నిర్వహించిన బదిలీల్లో స్థానచలనం కలిగిన ఉపాధ్యాయులకు వెంటనే జీతాలు చెల్లించే ఏర్పాటుచేయాలి. జీతాలు లేని కారణంగా సుమారు 5 వేల ఉపాధ్యాయ కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయి. జీతాలు రాక ఈఎంఐలు కట్టడానికి కూడా లేక డిఫాల్ట్ అవుతున్నారు. ప్రభుత్వం ఉపాధ్యాయులతో ఆడుకోకుండా ఆదుకోవాలి. – గెడ్డం సుధీర్, వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
లేసు.. భేష్
సాక్షి, భీమవరం: హస్తకళల్లో లేసు అల్లికలు ముఖ్యమైనవి. ఇక్కడి మహిళలు సూది మొనకు దారం తగిలించి అలవోకగా అల్లికలు చేస్తుంటారు. బ్రిటిష్ హయాంలో జల రవాణాకు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం కేంద్రంగా ఉండేది. అప్పట్లో క్రిస్టియన్ మిషనరీ సంస్థల ద్వారా పరిచయమైన లేసు అల్లికలను తర్వాతి కాలంలో ఈ ప్రాంతానికి భౌగోళిక గుర్తింపు తెచ్చే స్థాయికి ఇక్కడి మహిళలు అభివృద్ధి చేశారు. టవల్స్, టేబుల్ క్లాత్స్, లంచ్ మ్యాట్స్, క్రోచట్ బ్యాగ్స్, డెకో కుషన్స్, బీచ్ కలెక్షన్స్ తదితర ఇక్కడి హ్యాండ్ మేడ్ ఉత్పత్తులకు విదేశాల్లో మంచి గిరాకీ ఉంది. వీటిని అమెరికా, యూరప్, సింగపూర్, కొరియా తదితర దేశాలకు ఎగుమతులు చేసే కంపెనీలు నరసాపురం, పరిసరాల్లో 50కు పైగా ఉన్నాయి. దేశ విదేశాల్లో జరిగే ఎక్స్పోలు, డిజైనర్లు, థర్డ్ పార్టీల ద్వారా ఆర్డర్లు తీసుకుని ఎగుమతులు చేస్తుంటారు. గతంలో ఏటా రూ.300 కోట్లు మేర లేసు ఉత్పత్తులు ఎగుమతులు జరిగేవి. అండగా నిలిచిన వైఎస్సార్ స్థానిక మహిళలు పొద్దు పొడవక ముందే లేచి ఇంటి పనులు, వంట ముగించుకుని, పిల్లలను స్కూళ్లకు, భర్తను పనికి పంపి అల్లికల పనిలో పడతారు. నలుగురైదుగురు కలసి టీవీ చూస్తున్నా, కబుర్లు చెప్పుకుంటున్నా వారి చేతిలో సూది, దారం కదులుతూనే ఉంటాయి. ఒక మహిళ రోజులో ఐదారు గంటలు పనిచేస్తే కేజీ దారం అల్లికకు పది రోజుల పడుతుంది. డిజైన్ను బట్టి కేజీకి గతంలో రూ.15 నుంచి రూ. 50 మాత్రమే వారికి కంపెనీలు ఇచ్చేవి. దళారుల దోపిడీని గుర్తించిన దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మహిళలకు అండగా 2004లో నరసాపురం రూరల్ సీతారాంపురంలో లేసు పార్కును ఏర్పాటుచేశారు.కేజీ దారం అల్లికకు ఒక్కసారిగా రూ.100 పెంచారు. దీనికి సమానంగా ప్రైవేట్ కంపెనీలు వేతనాన్ని పెంచాయి. మొదట్లో లేసు పార్కు పరిధిలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఆరు మండలాలకు చెందిన 10 వేల మంది సభ్యులు ఉంటే తర్వాతి కాలంలో ఈ సంఖ్య 15 మండలాల్లోని 30 వేల మందికి పెరిగింది. మార్కెటింగ్ మేనేజర్, ఇతర సిబ్బంది ఆర్డర్లు తెచ్చి మహిళలతో అల్లికలు చేయించడం ద్వారా అప్పట్లో ఏడాదికి రూ.100 కోట్ల విలువైన ఉత్పత్తులు ఎగుమతులు జరిగేవి. ఈ పార్క్ ద్వారా గతంలో స్థానిక మహిళలు అమెరికా, యూరప్, సింగపూర్ తదితర దేశాలకు వెళ్లి లేసు ఉత్పత్తులను ప్రదర్శించడం గమనార్హం. యాంత్రీకరణ, ఇతర దేశాల నుంచి పోటీ, కోవిడ్ పరిణామాల అనంతరం లేసు పరిశ్రమ ప్రాభవం కోల్పోయి ఎగుమతులు తగ్గినా ఏడాది క్రితం భౌగోళిక గుర్తింపు దక్కించుకుని సత్తాను చాటింది. పారిస్ వేదికగా గత ఏడాది 206 దేశాలు పాల్గొన్న ఒలింపిక్స్ పోటీల్లో ఇక్కడి లేసు ఉత్పత్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నిర్వాహకుల ఆర్డరుపై సీతారాంపురానికి చెందిన సంస్థ క్రీడాకారులు, సందర్శకుల కోసం లేస్, ఫ్యాబ్రిక్లను ఉపయోగించి ఒలింపిక్స్ థీమ్, లోగోలతో టవల్స్, డెకో కుషన్స్, బీచ్ కలెక్షన్స్ తదితర ఉత్పత్తులను భారీ మొత్తంలో పంపింది. ఒక జిల్లా..ఒక ఉత్పత్తికి ఎంపిక ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నుంచి దాదాపు రెండు లక్షల మంది మహిళలు లేసు అల్లికలు చేస్తున్నారు. 2024–25కి గాను నరసాపురం లేసుకు కేంద్ర ప్రభుత్వ ఒక జిల్లా–ఒక ఉత్పత్తి అవార్డు దక్కింది. కేంద్ర ప్రభుత్వ వాణిజ్య పన్నులు, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీ ప్రగతి మైదానంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ చదలవాడ నాగరాణి అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని అల్లికలు చేసే మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. ఆనందంగా ఉంది చిన్నతనం నుంచి ఇంట్లో అమ్మ, నానమ్మలను చూసి లేసులు అల్లడం అలవాటు చేసుకున్నాను. ఇప్పటికీ రోజూ ఖాళీ సమయంలో అల్లికలు చేస్తుంటాం. వీటిపై వచ్చే డబ్బులు ఇంటిలోని చిన్నచిన్న అవసరాలకు ఎంతో ఉపయోగపడతాయి. లేసు అల్లికలకు అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. – రాట్నాల లక్ష్మి, గృహిణి,ఎల్బీ చర్లతరతరాలుగా అల్లికలు మా చిన్నతనంతో పోలిస్తే ఇప్పుడు లేసులు అల్లేవారు కొంత తగ్గారని చెప్పవచ్చు. అప్పట్లో ఏ ఇంటి వద్ద చూసిన ఆడవాళ్లు అల్లికలు చేస్తూ కనిపించేవారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇప్పటితరం వారు రకారకాల డిజైన్లలో అల్లికలు చేస్తూ జిల్లాకు దేశ విదేశాల్లో మంచి గుర్తింపు తీసుకురావడం అభినందనీయం. – తెలగంశెట్టి వెంకటలక్షి్మ, నరసాపురం -
వైఎస్సార్సీపీ మైనార్టీ విభాగం అధికార ప్రతినిధిగా సయ్యద్ బాజీ
ఉంగుటూరు: వైఎస్సార్సీపీ మైనారిటీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉంగుటూరుకు చెందిన షేక్ సయ్యద్ బాజీని నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి శుక్రవారం ప్రకటన వెలువడింది. మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబను సయ్యద్ బాజీ, మైనారిటీ నేతలు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. బాజీ మాట్లాడుతూ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి ఏలూరు(మెట్రో): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో చాలాకాలంగా పెండింగ్లో ఉన్న దాదాపు 2000కు పైగా మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులను వెంటనే పరిష్కరించాలని పీడీఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి డిమాండ్ చేశారు. గత జనవరి నుంచి అన్ని మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులు అప్రూవ్ కాకుండా అలాగే ఉన్నాయని, విద్యాశాఖకు సంబంధించిన దాదాపు 700 బిల్లులు పరిష్కారానికి నోచుకోకుండా పడి ఉన్నాయని, త్వరితగతిన ఈ సమస్యను పరిష్కరించకపోతే యుటీఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని యుటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్ రుద్రాక్షి అన్నారు. పీఎఫ్ లోన్లు అప్లికేషన్ పెట్టిన తర్వాత 20 రోజులలోపు సీఎఫ్ఎంఎస్ లోనికి వెళ్ళేలా చూడాలని కోరారు. మావుళ్ళమ్మ దేవస్థానం చైర్మన్గా నాగభూషణం భీమవరం(ప్రకాశంచౌక్): భీమవరం శ్రీమావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం చైర్మన్గా బొండాడ నాగ భూషణాన్ని నియమించినట్లు రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నాగ భూషణాన్ని అభినందించి మాట్లాడారు. నాగ భూషణం మాట్లాడుతూ ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. అగ్నిప్రమాదంలో బేకరీ దగ్ధం పెనుగొండ: విద్యుత్ షార్ట్ సర్క్యుట్తో సిద్ధాంతంలో బెంగుళూరు అయ్యంగార్ బేకరీ పూర్తిగా అగ్నికి ఆహుతైంది. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో రూ.25 లక్షలకు పైగా ఆస్థి నష్టం ఉంటుందని అంచనా వేస్తున్నారు. తెల్లవారు జామున ఒక్కసారిగా మంటలు చెలరేగి పెద్ద శబ్దాలతో భారీ స్థాయిలో మంటలు చెలరేగాయి. పాలకొల్లు నుంచి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడానికి శ్రమించాల్సి వచ్చింది. -
మంచినీటి చెరువులో చేపలు మృతి
కాళ్ల: మండలంలోని కోలనపల్లి రక్షిత మంచినీటి సరఫరా చెరువులో చేపలు చనిపోవడంపై గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. గత ఐదు రోజులుగా చెరువులో చేపలు చనిపోయి నీటిపై తేలటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. నీరు కలుషితంగా మారి చేపలు చనిపోయాయా.. లేక ఆక్సిజన్న్ అందక చనిపోయాయా అన్న విషయంపై సందిగ్ధత నెలకొంది. ఇటీవల చెరువుకు నీరు నింపారని, దానివల్లే చేపలు ఇలా చనిపోతున్నాయా? అని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. చనిపోయిన చేపల వల్ల వాసనతో చెరువు చుట్టూ ఉన్న కుటుంబాలతో పాటు రోడ్డుపై వెళ్ళే వారు ముక్కులు మూసుకోవాల్సి వస్తుందని గ్రామస్తులు తెలిపారు. చెరువు గట్టు చుట్టూ మొలిచిన పిచ్చి మొక్కలతో చిట్టడవిని తలపిస్తుందని, విషసర్పాలకు ఆవాసంగా చెరువుగట్టు మారిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఓ పక్క గ్రామంలో మంచినీటి కోసం నానా అవస్దలు పడుతుంటే మరో పక్క ఇలా మంచినీటి చెరువులో చేపలు చనిపోవటంపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ఫణిని వివరణ కోరగా చెరువులో ఉన్న నీటిను వెంటనే పూర్తిస్థాయిలో బయటికి మళ్ళించి, కొత్తనీరు పెట్టాలని పంచాయతీ అధికారులకు సూచించామన్నారు. చెరువు గట్టు చుట్టూ ఉన్న చెత్త, చెదారాలు పూర్తిస్థాయిలో తొలగించాలని కార్యదర్శికి తెలిపామన్నారు. -
ఆటపాక కేంద్రంలో ఆహ్లాదం ఆవిరి
కై కలూరు: పక్షి ప్రేమికుల స్వర్గధామం ఆటపాక పక్షుల విహారం కేంద్రం కళావిహీనంగా మారింది. గత ఏడాది ఇదే రోజుల్లో పక్షుల విహార చెరువు నీటితో కళకళలాడింది. అధికారుల ముందస్తు ప్రణాళిక లోపించడంతో ఏటా చెరువు నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇటీవల కొల్లేరు సమస్యలపై అధ్యయనం చేయడానికి సుప్రీంకోర్టు ఆదేశాలతో వచ్చిన కేంద్ర సాధికారిత కమిటీ(సీఈసీ) సభ్యులకు నీరు లేకుండా సహజ అందాలను కోల్పోయిన పక్షుల కేంద్రాన్ని చూపించారు. ప్రస్తుతం వాతావరణం అనుకూలించడంతో సుదూర ప్రాంతాల నుంచి పక్షి ప్రేమికులు కేంద్రం సందర్శనకు వచ్చి బోటు షికారు లేకపోవడంతో నిరాశగా వెనుదిరుగుతున్నారు. ఆటపాక పక్షుల విహార కేంద్రం రాష్ట్రంలోనే వినుతి కెక్కింది. ఇతర దేశాల నుంచి పెద్ద సంఖ్యలో అరుదైన పెలికాన్ పక్షులు ఆటపాకకు రావడం, సంతానోత్పత్తి తర్వాత తిరిగి వెళ్ళడం క్రమం తప్పకుండా జరిగేది. దీంతో ఆటపాక పక్షుల కేంద్రాన్ని పెలికాన్ ప్యారడైజ్గా పిలిచేవారు. పక్షుల కేంద్రంలో విహార చెరువు 286 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. పక్షుల ఆవాసాలకు 158 కృత్రిమ ఇనుప స్టాండ్లను అటవీశాఖ ఏర్పాటు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఆటపాక పక్షుల కేంద్ర సందర్శననకు పెద్ద ఎత్తున పర్యాటకులు ఏటా విచ్చేస్తున్నారు. నీటి సరఫరాలో నిర్లక్ష్యం ఆటపాక పక్షుల విహార కేంద్రం చెరువులో నీటిని నింపడం ఏటా అటవీ శాఖకు తలనొప్పిగా మారుతోంది. ఇక్కడ చెరువులో 6 అడుగులు నింపే కెపాసిటి ఉంది. సమీపంలోని పోల్రాజ్ డ్రైయిన్లో నీటని అటవీ శాఖ చెరువుకు ఏర్పాటు చేసిన తూములు తెరిచి నీటిని నింపుతారు. సాధారణంగా జూలై నెలలో పక్షుల విహార చెరువు పూర్తిగా నీటితో నిండుతుంది. అలాంటిది ఈ ఏడాది జూలై నెల ముగింపు దశకు వస్తున్నా కేవలం అడుగు నీరు మాత్రమే ఉంది. నీరు పూర్తి స్థాయిలో లేకపోవడంతో పక్షులు హాయిగా విహరించే అవకాశం లేదు. ఆటపాక గ్రామంలో పంట కాల్వలో నీరు పుష్పలంగా ఉంది. జాన్పేట సమీపం నుంచి బోదె ద్వారా కాల్వ నీటిని నింపుకునే అవకాశం ఉంది. పక్షుల కేంద్రం సమీపంలో ఆక్వా చెరువులలో నిండుగా నీరు ఉండటం, పక్షుల విహార చెరువులో మాత్రం నీరు లేకపోవడం బాధకరమని పలువురు వాపోతున్నారు. బోటు షికారు లేదు ఈ కేంద్రంలో బోటు షికారు ప్రత్యేకం.పెలికాన్, పెయింటెడ్ స్టార్క్తో సహా పలు రకాల పక్షుల్ని దగ్గర నుంచి వీక్షింవచ్చు. దీంతో ప్రతి ఒక్కరూ బోటు షికారు కోసం క్యూ కడతారు. కొన్ని నెలలుగా బోట్లు మూలనపడ్డాయి. సందర్శకుల ప్రవేశం, బోటు షికారు రేట్లను పెంచారని అందుకు తగ్గట్లుగా మౌలిక సౌకర్యాలను మెరుగుపర్చాలని పక్షి ప్రేమికులు కోరుతున్నారు. జూలై సగం గడిచినా నిండని విహార చెరువు నిరాశగా వెనుదిరుగుతున్న పర్యాటకులు వర్షాలు పడకపోవడం వల్లే.. ప్రతీ ఏటా విస్తార వర్షాల కారణంగా పోల్రాజ్ డ్రెయిన్లో నీరు ఎక్కువగా వచ్చేది. ఆ సమయంలో పక్షుల దొడ్డి తూము తెరిచి నీటిని నింపుతాం. అలాంటిది పోల్రాజ్లో అనుకున్న నీరు రాలేదు. పక్షుల కేంద్రానికి విచ్చేసే పర్యాటకుల కోసం మరో కొత్త విహార బోటును తీసుకొస్తున్నాం. ఇప్పుటికే రెండు బోట్లు ఉన్నాయి. రహదారుల అభివృద్ది, ప్రత్యామ్నాయ నీటి వనరుల కోసం ప్రతిపాదనలు పంపాం. – ఎం.రంజిత్కుమార్, డిప్యూటీ ఫారెస్టు రేంజ్ ఆఫీసర్, కై కలూరు -
ప్రైవేటు పాఠశాల బస్సు దగ్ధం
కుక్కునూరు: మండలంలోని ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన స్కూల్ బస్సు దగ్ధమైన ఘటన గురువారం రాత్రి జరిగింది. మండలంలోని ప్రైవేటు పాఠశాల స్కూల్ బస్సులో విద్యార్థులను గమ్యస్థానాలకు చేర్చిన అనంతరం డ్రైవర్ గణపవరంలో బస్సు నిలిపి ఉంచాడు. రాత్రి 7 గంటల తరువాత బస్సులో ఉన్నట్టుండి మంటలు చెలరేగి బస్సు మంటల్లో చిక్కుకుంది. దీంతో గ్రామస్తులు స్పందించి మంటలను ఆర్పివేశారు. మంటలు అంటుకోవడానికి షార్ట్ సర్క్యూటా లేక మరేదైనా కారణమా తెలియాల్సి ఉంది. ఇదే ప్రమాదం విద్యార్థులు ఉన్నప్పుడు జరిగి ఉంటే పరిస్థితి ఏమిటని పలువురు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో ప్రైవేటు పాఠశాలలు కాలం చెల్లిన వాహనాలకు రంగులు వేసి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయన్న ఆరోపణలు మిన్నంటుతున్నాయి. బస్సులకు అటెండర్లను నియమించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల మండల కేంద్రంలోని ప్రైవేటు పాఠశాల యాజమాన్యం గత వారం రోజుల క్రితం వరకు బస్సును వారి పేరు మీదకు మార్పు చేయకుండానే స్ప్రింగ్ లీఫ్ అనే తెలంగాణ అడ్రస్ తో ఉన్న బస్సును వినియోగించింది. ఇందుకు రవాణా శాఖ నిర్లక్ష్యమేనని పలువురు వాఖ్యానిస్తున్నారు. -
ఇది ప్రభుత్వ వైఫల్యమే
దెందులూరు: కృష్ణా డెల్టా శివారు భూములకు సాగునీరు అందక నారుమళ్లు ఎండిపోతున్నాయి. ఏలూరు రూరల్ మాదేపల్లి, కాట్లంపూడి, లింగారావుగూడెం గ్రామాల్లో బీటలు వారిన సాగు పొలాలను రైతు సంఘం నాయకులు శుక్రవారం పరిశీలించారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ కృష్ణా డెల్టా పరిధిలో వేలాది ఎకరాలకు సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా వస్తున్న సాగునీటిని కేఈ కెనాల్లోకి మళ్లించి కృష్ణా డెల్టా శివారు ప్రాంత భూములకు సాగునీరు అందించి పంటలు కాపాడాలని కోరారు. ఇరిగేషన్ అధికారుల ప్రణాళికా లోపంతో అన్నదాతలు నష్టపోవాల్సి వస్తోందని, ఇది ప్రభుత్వం, అధికారుల వైఫల్యమేనని విమర్శించారు. పంట కాలువలు తూడు, గురప్రు డెక్క, నాచు, చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయాయని చెప్పారు. వేసవికాలంలో తగిన విధంగా కాలువల బాగు చేసే పనులు చేపట్టలేదని చెప్పారు. గురప్రు డెక్కను తొలగించకుండా కలుపు మందు చల్లారని, ఈ నీటినే ఏలూరు రూరల్ మండలంలోని ప్రజలు తాగునీటి అవసరాలకు ఉపయోగిస్తారని, అత్యంత ప్రమాదకర కలుపు మందులు చల్లడం దారుణమన్నారు. కార్యక్రమంలో అన్నం రెడ్డి రంగారావు, సుంకర నరసింహారావు, వి.రామారావు, పి.భాస్కరరావు, టి.రంగారావు, బైరెడ్డి కష్ణారావు పాల్గొన్నారు. -
ఉపాధి వేతనాల కోసం ఎదురుచూపులు
ఏలూరు (టూటౌన్): ఉపాధి కూలీలకు నెలలు తరబడి వేతనాలు చెల్లించకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా గత రెండు నెలలుగా వేతనాలు విడుదల కాలేదు. ఒక పక్క పని ప్రదేశాలలో కనీస సౌకర్యాలు లేకపోయినా కూలి డబ్బుల కోసం ఆశపడి పనిచేస్తున్నా వేతనాలు చెల్లించకపోవడం పట్ల కూటమి ప్రభుత్వంపై ఉపాధి హామీ కూలీలు మండి పడుతున్నారు. గత వైఎస్సార్సీపీ పాలనలో ప్రతీ 15 రోజులకోసారి ఉపాధి హామీ కూలీలకు వేతనాలు చెల్లించేవారని దానికి భిన్నంగా ప్రస్తుత కూటమి పాలకులు రెండు నెలలు దాటినా వేతనాలు చెల్లించకపోవడం పట్ల ఉపాధి కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 5.57 లక్షల మంది ఉపాధి కూలీలు ఏలూరు జిల్లా వ్యాప్తంగా 27 మండలాల పరిధిలో మొత్తం 3.77 లక్షల జాబ్ కార్డులు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 5.57 లక్షల మంది ఉపాధి కూలీలు పనిచేస్తున్నారు. కూలికి ఏడాదికి వంద రోజులు పనిదినాలు కల్పించాల్సి ఉండగా జిల్లాలో సగటున ఒక్కో కూలీకి 46 రోజుల పనిదినాలనే కల్పించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నిర్ధేశించిన ప్రకారం ప్రతి 15 రోజులకొకసారి కూలీలకు వేతనాలు చెల్లించాల్సి ఉండగా అది ఎక్కడా అమలు కావడం లేదు. కూలీలకు పే స్లిప్స్ ఇవ్వడం లేదు. రూ.50 కోట్ల బకాయిలు ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఉపాది హామీ పథకంలో కూలీలకు గత మే 15 నుంచి ఇంతవరకు దాదాపు రెండు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు. దీంతో ఏలూరు జిల్లాలో కూలీలకు రూ.50 కోట్ల వేతన బకాయిలు పేరుకుపోయాయి. మే, జూన్ నెలలకు సంబంధించి వేతన బకాయిలు మొత్తం రూ.50 కోట్లు ఉన్నాయి. వీటికి అదనంగా ప్రస్తుత జూలై నెలకు సంబంధించిన బకాయి వేతనాలు మరో రూ.10 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. పని ప్రదేశాలలో కనీస సౌకర్యాల కరవు ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనుల్లో భాగంగా పని ప్రదేశాలలో కనీస సౌకర్యాలు కల్పించాలని ఇటు ఉపాధి కూలీలు, అటు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. పని ప్రదేశాలలో నీడ కోసం టెంట్, మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లు, పనిముట్లు, మేట్లకు రూ.5 అదనపు పారితోషికం ఇవ్వాలని కోరుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదల పట్ల నిరంకుశంగా వ్యవహారిస్తున్నాయని వాటిని ఎదుర్కోవటం కోసం రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటాలు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు చెబుతున్నారు. రెండు నెలలుగా అందని వైనం ఏలూరు జిల్లాలో రూ.50 కోట్లకు పైగా పేరుకుపోయిన బకాయిలు -
200 రోజులకు పెంచాలి
ఉపాధి హామీలో పనిదినాలు 100 రోజుల నుంచి 200 రోజులకు పెంచాలి. సుప్రీంకోర్టు చెప్పినట్లు కనీస వేతనం రూ.600 ఇవ్వాలి. పని ప్రదేశాలలో మౌలిక సౌకర్యాలు కల్పించాలి. పనిముట్లు, మెడికల్ కిట్లు, మజ్జిగ, టెంట్, మంచినీరు వంటివి ఏర్పాటు చేయాలి. పనికి తగ్గ వేతనం సక్రమంగా ఇవ్వాలి. పీవీ రామకృష్ణ, జిల్లా కార్యదర్శి, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం అప్పులు చేసి బతకాల్సి వస్తోంది మే నుంచి కూలి డబ్బులు అందలేదు. రోజువారీ కూలి పనులు చేస్తేనే మా కుటుంబ పోషణ గడిచేది. రెండు నెలలుగా ఉపాధి కూలీ డబ్బులు అందకపోవడంతో అప్పులు చేసి బతకాల్సి వస్తోంది. ఒక ప్రక్క వ్యవసాయ పనులు లేవు. మరో పక్క పూర్తి స్థాయిలో ఉపాధి పనులు కల్పించడం లేదు. బుద్దుల గంగాభవానీ, ఉపాధి కూలీ, టి.నర్సాపురం మూడు నెలలుగా డబ్బులు అందలేదు ఇప్పటికీ మూడు నెలలుగా ఉపాధి కూలీ సొమ్ములు అందలేదు. దీంతో పిల్లల చదువులు, కుటుంబ పోషణకు ఇబ్బంది ఏర్పడుతుంది. కుటుంబ జీవనం చాలా ఇబ్బందిగా తయారైంది. ఏడాదికి వంద రోజులు పనులు కల్పిస్తామని హామీ ఇచ్చినా క్షేత్ర స్థాయిలో దాన్ని అమలు చేయడం లేదు. ఇప్పటికై నా పాలకులు దయతలచి వేతన బకాయిలను తక్షణం చెల్లించాలి. ఉడతా వెంకటేష్, ఉపాధి కూలీ, బుట్టాయగూడెం కనీస వేతనం ఇవ్వడం లేదు ఉపాధి హామీ కూలీలకు కనీస వేతనం రోజుకు రూ.307 చెల్లించాలనే నిబంధన ఉన్నా కొల్లేరు ప్రాంతంలోని ఉపాధి కూలీలకు రోజుకు రూ.150 నుంచి రూ.200 మాత్రమే ఉపాధి వేతనాలు చెల్లిస్తున్నారు. పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. ప్రతి 15 రోజులుకు వేతనాలు చెల్లించాల్సి ఉండగా నెలల తరబడి పెండింగ్లో ఉంచుతున్నారు. చిన్నం మాధవ, వనదుర్రు, ముదినేపల్లి మండలం -
బాబు సర్కారు వంచనను ఎండగట్టాలి
సాక్షి, భీమవరం: ఎన్నికల ముందు కూటమి ఇచ్చిన హామీలకు, అధికారంలోకి వచ్చాక సాగిస్తున్న పాలనకు పొంతన లేదని వైఎస్సార్సీపీ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కో–ఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఏడాది కాలంగా చంద్రబాబు సర్కారు వంచించిన తీరును ఎండగట్టి ప్రజలకు అండగా నిలబడేందుకే బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారని చెప్పారు. ఉండి నియోజకవర్గ పార్టీ కన్వీనర్ పీవీఎల్ నరసింహరాజు అధ్యక్షతన గురువారం కాళ్ల మండలం పెదఅమిరంలోని నిర్మలాదేవి ఫంక్షన్ హాలులో జరిగిన నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశానికి బొత్స ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు, పవన్కల్యాణ్, లోకేష్లు ఎన్నికల సమయంలో రైతులు, నిరుద్యోగులు, మహిళలు తదితర వర్గాల వారికి ఇచ్చిన హామీలు, పాలనలోకి వచ్చాక వారు మాట మార్చిన వీడియోలను ప్రత్యక్షంగా స్క్రీన్పై చూపించారు. బాబు ష్యూరిటీ –భవిష్యత్తు గ్యారెంటీ పేరిట అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే సూపర్ సిక్స్ హామీలను త్రికరణ శుద్ధిగా అమలుచేస్తామని, ఆ పథకాల ద్వారా ఏ కుటుంబానికి ఎంత లబ్ధి చేకూరేదీ వివరిస్తూ ఎన్నికల సమయంలో కూటమి నేతలు పంచిన బాండ్ పేపర్లను ఈ సందర్భంగా బొత్స చూపించారు. వాటిలో ఏ పథకాలు అమలుచేశారో చె ప్పాలని బొత్స ప్రశ్నించినప్పుడు ఏమీ చేయలేదంటూ కార్యకర్తలు ముక్తకంఠంతో చెప్పారు. అన్ని హామీలూ అమలుచేసినట్టు సీఎం చంద్రబాబు చెబుతున్నారని, ఎవరైనా ఎదురు ప్రశ్నిస్తే నాలుక మందమంటున్నారని బొత్స మండిపడ్డారు. ప్రతి ఇంటికీ వెళ్లి కూటమి పాలనలో వారికి జరిగిన మోసాన్ని వివరించాలని ఆయన పిలుపునిచ్చారు. మండల, గ్రామ స్థాయిలో సమావేశాలు ఏర్పాటుచేసుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బొత్స సూచించారు. ఉండిలో చందాల సంస్కృతి పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు మాట్లాడుతూ అభివృద్ధి నిధి పేరిట రైతులు, వ్యాపారుల నుంచి చందాలు వసూలు చేసే సంస్కృతిని కొత్తగా ఉండి నియోజకవర్గంలో చూస్తు న్నామని విమర్శించారు. కూటమి నేతల తీరును చూసి ఆయా వర్గాల వారు బెంబేలెత్తిపోతున్నారని చెప్పారు. ఏడాది కాలంలో ఈ నియోజకవర్గంలో 800 మంది పేదల ఇళ్లను కూల్చారని, కానీ ఇదే నియోజకవర్గంలో 25 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్కు దక్కుతుందని తెలిపారు. ఇంటింటా ఆవేదన : మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ వెళుతున్నప్పుడు ప్రజలు వారి ఆవేదనను వ్యక్తం చేస్తున్నారన్నారు. జగన్ పాలనలో చేతిలో ఎప్పుడూ డబ్బులు ఉండేవని, ఇవాళ అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సి వస్తోందని వాపోతున్నారని వివరించా రు. పవన్ కల్యాణ్ను నమ్మి మోసపోయామని కా పు మహిళలు ఆవేదన చెందుతున్నారని చెప్పారు. కొత్త పథకాలు వస్తాయనుకుంటే కాపు నేస్తం కూడా ఇవ్వడం లేదంటున్నారని తెలిపారు. అందుకే బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ కార్యక్రమం ప్రతి కార్యకర్తా ప్రజల గొంతుకగా పనిచేయాలి ప్రభుత్వ వైఫల్యాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలి వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ బొత్స పిలుపు సెంటు భూమి ఇవ్వలేదు నరసాపురం పార్లమెంట్ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు మాట్లాడుతూ చంద్రబాబు అనేక వాగ్దానాలు చేసి ఏడాదైందని.. రైతులు, నిరుద్యోగులు, మహిళలకు ఒక్క రూపాయి సాయం చేయలేదని చెప్పారు. ఒక్క నిరుపేదకూ సెంటు స్థలం కూడా ఇవ్వలేదని విమర్శించారు. ప్రజలను వంచించారు ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికల ముందు సూపర్ సిక్స్ అంటూ ఊదరగొట్టి ఇప్పుడు తలచుకుంటేనే భయమేస్తోందని చంద్రబాబు అనడం ప్రజలను వంచించడమేనన్నారు. సంపద సృష్టిస్తానని చెప్పి అందుకు సలహాలు ఇవ్వాలంటూ ప్రజలను కోరడం విడ్డూరంగా ఉందన్నారు. వైఎస్సార్సీపీని బలోపేతం చేయాలి మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గూడూరి ఉమాబాల మాట్లాడుతూ కూటమి మోసాలను ప్రజలకు చాటిచెప్పి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీని బలోపేతం చేయాలన్నారు. భీమవరం నియోజకవర్గ కో–ఆర్డినేటర్ చినమిల్లి వెంకటరాయుడు మాట్లాడుతూ ఎన్నికల ముందు హామీలివ్వడం, అధికారంలోకి వచ్చాక వాటిని గాలికొదిలేయడం చంద్రబాబు నైజమని విమర్శించారు. ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పెండ్ర వీరన్న మాట్లాడుతూ చంద్రబాబు చేస్తున్న మోసాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపైనా ఉందన్నారు. కార్యకర్తలకు సముచిత స్థానం అబద్ధాలు చెప్పడం, మోసాలు చేయడంలో చంద్రబాబును మించిన వారుండరని నియోజకవర్గ ఇన్చార్జి పీవీఎల్ నరసింహరాజు అన్నారు. కూటమి ఏమీ చేయకుండానే అన్నీ చేశామంటూ ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు. కష్టించి పనిచేసే ప్రతి కార్యకర్తకూ పార్టీలో సముచిత స్థానం ఉంటుందని, ఆ దిశగా తాను కృషిచేస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పీవీఎల్ కోరారు. క్షత్రియ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పాతపాటి శ్రీనివాసరాజు, జిల్లా అధికార ప్రతినిధి మేడిద జాన్సన్, అధిక సంఖ్యలో వైఎస్సార్సీపీ శ్రేణులు పాల్గొన్నారు. -
జాలిపూడి మార్గం.. ప్రయాణం నరకం
తాము అధికారంలోకి వస్తే గుంతలు లేని రోడ్లు చూస్తారని, కొత్త రోడ్లు వేస్తామని హామీలిచ్చి గద్దెనెక్కిన తర్వాత ఈ ఊసే మరిచిపోయారు కూటమి నేతలు. ఏలూరు మండలం జాలిపూడి రోడ్డే ఇందుకు నిదర్శనం. మాదేపల్లి సెంటర్ నుంచి జాలిపూడి గ్రామం వరకు రోడ్డు పూర్తిగా ఛిద్రంగా మారింది. భారీ గోతులతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అన్నట్టు ఉంది. రాత్రి వేళల్లో వాహనచోదకుల అవస్థలు వర్ణనాతీతం. జాలిపూడి గ్రామానికి వెళ్లే మార్గంలో రోడ్డు దుస్థితికి అద్దం పడుతున్న దృశ్యాలివి.– సాక్షి ఫొటోగ్రాఫర్/ఏలూరు -
సాంకేతికతతో నేరస్తులపై నిఘా
ఐజీ అశోక్కుమార్ భీమవరం: ఆధునిక సాంకేతికతో పాత నేరస్తులపై ప్రత్యేక నిఘా పెట్టి, నేర నియంత్రణకు కృషి చేయాలని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్కుమార్ అన్నారు. గురువారం స్థానిక విష్ణు కళాశాలలో అర్ధ సంవత్సర నేర సమీక్షా సమావేశాన్ని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి అధ్యక్షతన నిర్వహించారు. కలెక్టర్ నాగరాణితో కలిసి ఐజీ అశోక్కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఈ ఏడాది జనవరి నుంచి జూన్ నెలాఖరు వరకు జిల్లాలో జరిగిన నేరాలు, ప్రమాదాలు, కేసులపై సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేసుల దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేసేందుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. నేరాలను తగ్గించడానికి అనుసరించాల్సిన విధివిధానాలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ నేరాల నియంత్రణలో రాష్ట్రస్థాయిలో జిల్లా పోలీసు శాఖ ప్రథమ బహుమతిని అందుకోవడం గర్వకారణమన్నారు. రోడ్డు ప్రమాదాలు, ఓపెన్ డ్రింకింగ్ను అరికట్టడానికి కృషి చేయాలన్నారు. జిల్లా ఎస్పీ నయీం అస్మి మాట్లాడుతూ సాంకేతికత ఆధారిత పోలీసింగ్ తో జిల్లాలో నేరాలు గణనీయంగా తగ్గాయని తెలిపారు. పీ4 కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నా రు. గంజాయి అక్రమ రవాణా, విక్రయం, వినియోగాన్ని అరికట్టడానికి కృషి చేస్తున్నామన్నారు. జిల్లా అదనపు ఎస్పీ వి.భీమారావు, ప్రొహిబిషన్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఆర్ఎస్ కుమారేశ్వరన్, డీఎంహెచ్ఓ జి.గీతా భాయ్, డీటీఓ టి.ఉమా మహేశ్వర రావు, ఎఫ్ఎస్ఎల్ అడిషనల్ డైరెక్టర్ ఫణి భూషణ్, డీఈఓ నారాయణ పాల్గొన్నారు. -
పేరుకే ఉచితం.. దోపిడీ అధనం
వరదల పేరిట కూటమి నేతలు దోపిడీకి తెరలేపారు. గోదావరి పక్కనే స్టాక్ పాయింట్ను ఏర్పాటుచేసి లారీకి రూ.9 వేల చొప్పున వసూలు చేస్తున్నారు. రవాణా ఖర్చులతో వినియోగదారులకు చేరే సరికి ఈ ధర మరింత భారంగా మారుతోంది. అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడంతో నిర్వాహకుల ఇష్టారాజ్యంగా మారింది. సాక్షి, భీమవరం: వరదల సమయంలో కొరత రాకుండా జిల్లాలో స్టాక్ పాయింట్లు ఏర్పాటుకు ఏప్రిల్లో జిల్లా ఇసుక కమిటీ నిర్ణయించింది. జిల్లా అవసరాలకు తగ్గట్టుగా ఐదు లక్షల టన్నుల ఇసుకను నిల్వ చేయాలన్నది లక్ష్యం. జిల్లా అవసరాల కోసం ప్రత్యేకంగా కేటాయించిన తూర్పుగోదావరి జిల్లా పెండ్యాల ఓపెన్ రీచ్ నుంచి ఇసుక తరలింపు చేయాల్సి ఉంది. ఈ మేరకు జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో ఒక్కొక్కటి చొప్పున స్టాక్ పాయింట్ ఏర్పాటుచేసి నిర్వహణ బాధ్యతల్ని ఏజెన్సీలకు అప్పగించారు. లక్ష్యం మేరకు ఒక్కో స్టాక్ యార్డు వద్ద 70 వేల టన్నుల ఇసుకను నిల్వ చేయాలి. కాగా జిల్లా అంతటా కలిపి కేవలం 1.20 లక్షల టన్నులు మాత్రమే స్టాకు పెట్టడం గమనార్హం. వీటిలో ఆచంట స్టాక్ పాయింట్లో 20,100 టన్నులు పెట్టగా, భీమవరంలో 6,240, నరసాపురంలో 2,450, పాలకొల్లులో 19,555, తాడేపల్లిగూడెంలో 35,180, తణుకులో 7,878, ఉండిలో 28,990 టన్నులు నిల్వ చేసినట్టు తెలుస్తోంది. ఇసుక ర్యాంపు నుంచి స్టాక్ పాయింట్కు దూరాన్ని బట్టి ఒక్కో టన్నుకు రూ.306 నుంచి రూ.581 ధరగా నిర్ణయించారు. కాగా ఈ స్టాక్ పాయింట్లలో అమ్మకాలు మొదలు కావాల్సి ఉంది. సిద్ధాంతంలో అనుమతులున్నాయా ? సిద్ధాంతం వశిష్ట గోదావరి వంతెన దిగువన హైవేను ఆనుకుని భారీ మొత్తంలో నిల్వలతో స్టాక్ పాయింట్ను ఏర్పాటుచేశారు. తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీకి చెందిన ముఖ్య నేత ఈ స్టాక్ పాయింట్ నిర్వహణను చూస్తున్నట్టు తెలిసింది. పక్కనే కిలోమీటరు దూరంలో సీఆర్జెడ్ పరిధిలోని నడిపూడితో పాటు పక్కనే తూర్పుగోదావరి జిల్లా కడింపాడు ర్యాంపు నుంచి లారీకి రూ.1,500 నుంచి రూ.2 వేల కిరాయిలపై ఇక్కడికి ఇసుకను తరలించినట్టు సమాచారం. ఇక్కడ స్టాక్ పాయింట్ ఏర్పాటుకు రెవెన్యూ, మైన్స్ అధికారులు సంయుక్తంగా పరిశీలన చేసినట్టు అధికారి ఒకరు తెలిపారు. ఉన్నత స్థాయి నుంచి అనుమతులు వచ్చిందీ లేనిది ఇంకా తమ దృష్టికి రాలేదన్నారు. కాగా బుధవారం నుంచి ఇక్కడ అమ్మకాలను ప్రారంభించారు. 21 టన్నుల లారీకి రూ.9 వేలు వసూలు చేస్తున్నట్టు లారీ అసోసియేషన్ నాయ కులు చెబుతున్నారు. గోదావరికి కిలోమీటరు దూ రం నుంచి ఇసుక తెచ్చి స్టాకు పెట్టి అమ్మకాలు చేస్తున్నారని, లారీ ఇసుకకు రూ.3 వేలు కూడా ఖర్చుకాదని చెబుతున్నారు. గతంలో ఇక్కడి కడింపాడు ర్యాంపు నుంచి రూ.5 వేలకు లోడింగ్ చేస్తే ఇప్పుడు స్టాకు పాయింట్ పేరిట అదనంగా రూ.4 వేలు వసూలు చేస్తున్నారని, ఈ భారం వినియోగదారులపై పడుతోందని అంటున్నారు. మూతపడిన ర్యాంపులు ర్యాంపుల్లోకి నీరు చేరి జూలై ప్రారంభంలోనే దాదాపు మూతపడ్డాయి. వరద నీరు తగ్గి మరలా ర్యాంపులు తెరిచేందుకు మరో నాలుగు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ఈలోపు జిల్లా అవసరాలకు ఈ నిల్వలు ఏ మేరకు సరిపోతా యోనేది వేచిచూడాలి. ఇదిలా ఉండగా వరదల వేళ ప్రజల అవసరాన్ని సొమ్ము చేసుకునేందుకు సొంత అవసరాల పేరిట ఆచంట, పెనుగొండ, పోడూరు, యలమంచిలి తదితర మండలాల్లో కూటమి నేతలు భారీ ఎత్తున ఇసుక నిల్వలు పెట్టారు. వీటిలో ఏ స్టాకు పాయింట్లకు అనుమతులు ఉన్నాయి?, వేటికి లేవో? తెలియని పరిస్థితి. అధనం ఎవరి జేబుల్లోకి.. గోదావరి చెంతనే ఉన్న సిద్ధాంతం స్టాకు పాయింట్ వద్ద 20 టన్నుల లారీ లోడింగ్కు రూ.9 వేలు వసూలు చేస్తున్నారు. నిర్వాహకులకు ఖర్చు రూ.3 వేలు కూడా కాదు. ప్రభుత్వం ఇసుక ఉచితమని చెప్పి అదనపు వసూళ్లు చేయడం సరికాదు. ఈ అదనపు వసూళ్లు ఎవరి జేబుల్లోకి వెళుతున్నాయో తెలియని పరిస్థితి. – రావూరి రాజా, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా లారీ అసోసియేషన్ అధ్యక్షుడు ఇసుకాసురులు వరదల పేరుతో స్టాక్ పాయింట్లు గోదావరి చెంతనే లారీ ఇసుకకు రూ.9 వేలు వసూలు రవాణా ఖర్చులతో ధర మరింత అదనం దోపిడీ దారుణమంటున్న లారీ ఓనర్స్ అసోసియేషన్ -
ఎరువుల దుకాణాల్లో సోదాలు
తణుకు అర్బన్: తణుకులో ఎరువులు, పురుగు మందుల దుకాణాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. ముందుగా జయలక్ష్మి ఫెర్టిలైజర్స్ కర్మాగారాన్ని ఆకస్మిక తనిఖీ చేసి స్టాకు నిల్వలు, నాణ్యత పరీక్షా కేంద్రాన్ని పరిశీలించి సూచనలు చేశారు. అనంతరం రైల్వేస్టేషన్ రోడ్డులోని నారాయణ అగ్రికేమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ దుకాణంలో సోదాలు చేసి నకిలీలను విక్రయించవద్దని వ్యాపారులను హెచ్చరించారు. పట్టణవ్యాప్తంగా చేపట్టిన తనిఖీల్లో సరైన పత్రాలు లేనందున రూ.61,61,050 విలువైన బయో స్టిములెంట్స్ విక్రయాలను నిలుపుదల చేశారు. సహాయ వ్యవసాయ సంచాలకులు బుల్లిబాబు, నరేంద్ర, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ పోలీస్ గోపాలకృష్ణ, మండల వ్యవసాయ అధికారి రాజేంద్రప్రసాద్, వ్యవసాయ అధి కారి (టెక్నికల్) కృష్ణకాంత్ పాల్గొన్నారు. రైతుల అభ్యంతరాలపై విచారణ భీమవరం (ప్రకాశంచౌక్): జాతీయ రహదారి– 165లో భాగంగా పాలకోడేరు మండలం విస్సాకోడేరు, పెన్నాడ అగ్రహారం, శృంగవృక్షం గ్రామ రైతులు లేవనెత్తిన ఆరు అభ్యంతరాలపై గురువారం జేసీ టి.రాహుల్కుమార్రెడ్డి ఎన్హెచ్ అధికారుల సమక్షంలో విచారణ చేపట్టారు. రోడ్డు అలైన్మెంట్, నష్టపరిహారం చెల్లింపు తదితర విషయాలను రైతులు జేసీ దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తామని జేసీ చెప్పా రు. భూములను ఇచ్చేందుకు అభ్యంతరం లేదని, న్యాయమైన పరిహారం అందించాలని రైతులు కోరారు. అలైన్మెంట్ ఏ సర్వే నంబర్ నుంచి వెళ్తుందనే వివరాలను రైతులు కోరగా త్వరలో క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలను అందిస్తామని జేసీ తెలిపారు. గొరగనమూడి గ్రామం నుంచి రైతులు ఎటువంటి అభ్యంతరాలు లేవనెత్తలేదు. ఎన్హెచ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్అండ్బి ఎన్.శ్రీనివాస్రావు, పాలకోడేరు తహసీల్దార్ ఎన్.బి.విజయలక్ష్మి కలెక్టరేట్ ల్యాండ్ సూపరింటెండెంట్ సీహెచ్ రవికుమార్ పాల్గొన్నారు. ‘భవ్య భీమవరం’ పనులు వేగిరపర్చాలి భీమవరం (ప్రకాశంచౌక్): భవ్య భీమవరం పేరిట చేపట్టిన అభివృద్ధి పనులను ఆగస్టు 15 నాటికి పూర్తయ్యేలా కృషి చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పనులపై దా తలు, అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పనులు ప్రారంభించి ఆరు నెలలు దాటిందన్నారు. ప్లాస్టిక్ నిషేధాన్ని ఆరు నెలల క్రితమే అమలు చేసినా ఇప్పటికీ ఎందుకు కట్టడి చేయలేకపోతున్నా రని అధికారులను ప్రశ్నించారు. ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు కనిపిస్తే శానిటరీ సెక్రటరీలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే ప్రతి పట్టణంలో చేపట్టాల్సిన పింక్ టాయిలెట్ల నిర్మాణంలో అవరోధాలపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తణుకు బస్టాండ్లో శంకుస్థాపన చేసిన పింక్ టాయిలెట్ నిర్మాణంపై సాకులు చూపిస్తున్న ఆర్టీసీ ఆర్ఎంపై అసహనం వ్యక్తం చేశారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలన్నారు. పట్టణంలో అనుమతి లేని బ్యానర్లు, హోర్డింగులను వెంటనే తొలగించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. జేసీ టి.రాహుల్కుమార్ రెడ్డి, భీమవరం ము న్సిపల్ కమిషనర్ కె.రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేడు ఓపీఎస్ కోసం నిరసన ఏలూరు (ఆర్ఆర్పేట)/ద్వారకాతిరుమల: డీఎ స్సీ 2003 ఉపాధ్యాయులు, 2004 సెప్టెంబర్ 1 కంటే ముందు నోటిఫికేషన్ విడుదలై సీపీఎస్ పరిధిలోని గ్రూప్ 2 ఉద్యోగులు, కానిస్టేబుళ్లకు కేంద్ర ప్రభుత్వ మెమో 57 ఆధారంగా పాత పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఏలూరులో నిరసన చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని డీఎస్సీ 2003 టీచర్స్ ఫోరమ్ రాష్ట్ర కన్వీనర్ కట్టా శ్రీనివాసరావు, జిల్లా కన్వీనర్లు వి.జగదీష్, ఈ.శంకర్, బాలసుబ్రహ్మణ్యం, రమేష్, గోపాలకృష ఓ ప్రకటనలో కోరారు. సంపూర్ణ మద్దతు : ఉద్యమానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఫ్యాప్టో ఏలూరు జిల్లా చైర్మన్ జి.మోహన్, సెక్రటరీ జనరల్ ఎం. ఆదినారాయణ, ఫ్యాప్టో సభ్య సంఘాలు, ఇతర ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు తెలిపారు. -
కళ్లు తేలేస్తున్న'టైగర్'
సాక్షి, భీమవరం: రెండు దశాబ్దాల క్రితం వరకు మీసం మెలేసిన టైగర్ (మోనోడాన్) రొయ్య ఆక్వా రంగంలో రారాజుగా వెలుగొందింది. ఈ రొయ్యలకు 2002 వరకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉండేది. ఆ తరువాత కాలంలో వివిధ రకాల తెగుళ్ల కారణంగా వీటి పెంపకానికి ఆదరణ తగ్గింది. అనంతరం వనామి రొయ్యలపై ఆక్వా రైతులు దృష్టి పెట్టడంతో టైగర్ రొయ్యల సాగు అంతర్థానమైంది. చాలా కాలం తర్వాత మళ్లీ తెరపైకి వచ్చి రైతులను ఊరించిన టైగర్ రొయ్యల సాగు అంతలోనే ఉసూరుమనిపించింది. 10 నుంచి 20 కౌంట్తో సాగుదారులకు సిరులు కురిపిస్తుందనుకుంటే.. 50 నుంచి 80 కౌంట్ దశలోనే నిండా ముంచేస్తోంది. నకిలీ సీడ్, ప్రతికూల వాతావరణం నష్టాలకు కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.నష్టాల్లో ముంచేసి.. ఈ సీజన్లో ఊహించని విధంగా టైగర్ రొయ్యలకు వైట్ స్పాట్, విబ్రియో వైరస్ ప్రబలి నీటిపైకి తేలిపోతున్నాయి. ఒక చెరువు నుంచి మరొక చెరువుకు వైరస్ సోకుతుండటంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో రైతులు 80 కౌంట్ నుంచి 50 కౌంట్కు హడావిడిగా పట్టుబడులు చేస్తున్నారు. ఇదే అదునుగా దళారులు దోచుకునే పనిలో పడ్డారు. కంపెనీలు 10 కౌంట్ నుంచి 20 కౌంట్ మాత్రమే తీసుకుంటున్నాయని, అంతకంటే ఎక్కువ ఉంటే అయినకాడికి వ్యాపారులకు అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైరస్తో 5 నెలలకే పట్టుబడి చేయాల్సి వచ్చిందని, 30 కౌంట్ రొయ్యలను రూ.470కి అమ్ముకోవాల్సి వచ్చిందని చినమైనవానిలంకకు చెందిన రైతులు వాపోతున్నారు. దీంతో పెట్టుబడులు కూడా రాక తీవ్రంగా నష్టపోయామని చెబుతున్నారు. రెండు రాష్ట్రాల్లో మోనోడాన్ సీడ్ను ఉత్పత్తి చేసే హేచరీలు ఐదారు మాత్రమే ఉండగా.. సీడ్ కోసం రెండు నెలల ముందే అడ్వాన్సులు చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఈసారి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరగడంతో కొన్ని హేచరీలు నాణ్యత లేని సీడ్ను ఉత్పత్తి చేయడం వైరస్ల వ్యాప్తికి కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోపక్క మే నెలలో జిల్లాలో సాధారణం కంటే 66.4 మి.మీ., జూన్లో 15.1 మి.మీ., అధిక వర్షపాతం నమోదు కావడం ప్రతికూల ప్రభావం చూపాయంటున్నారు. నకిలీ సీడ్ ఉత్పత్తికి అడ్డుకట్ట వేసేవిధంగా హేచరీలపై ప్రభుత్వ అజమాయిషీ ఉండాలని రైతులు కోరుతున్నారు. ఆశలు రేకెత్తించి.. ఆరు నెలల పంట కాలానికి కేజీకి 20 కౌంట్ టైగర్ రొయ్యలకు కిలో రూ.1,050 ధర పలికి రెండు సీజన్లుగా ఊరించింది. ఏపీ, తమిళనాడులోని కొన్ని హేచరీలు మడగాస్కర్ సముద్ర జలాల్లోని నాణ్యమైన బ్రూడర్స్ నుంచి సీడ్ ఉత్పత్తి చేయడంతో రెండేళ్ల క్రితం టైగర్ రొయ్య మళ్లీ తెరపైకి వచ్చింది. వీటి సాగుకు ఉప్పునీటి చెరువులు అనుకూలం. రాష్ట్రంలోని తీరం వెంబడి 1.05 లక్షల ఎకరాల్లో ఉప్పునీటి చెరువులు ఉండగా.. 2023 సీజన్లో కృష్ణా జిల్లాలో 5,200 ఎకరాలు, బాపట్లలో 582 ఎకరాలు, ప్రకాశం జిల్లాలో 427 ఎకరాలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 457 ఎకరాల్లో టైగర్ రొయ్యల సాగు చేశారు. ఆశాజనకంగా ఉండటంతో గత సీజన్లో 12 వేల ఎకరాల్లో సాగు చేసినట్టు అంచనా. పశ్చిమ గోదావరి జిల్లాలో 6 నెలల్లో 20 కౌంట్ తీయగా, 8 నెలల కాలానికి కొందరు 10 నుంచి 11 కౌంట్ కూడా తీశారు. పెట్టుబడులకు రెట్టింపు లాభాలు రావడంతో ఈ ఏడాది జిల్లాలోని బియ్యపుతిప్ప, చినమైనవానిలంక, దర్భరేవు తదితర ప్రాంతాల్లో దాదాపు 5 వేల ఎకరాల్లో టైగర్ సాగు చేపట్టారు. నష్టాలకు భయపడి కొన్నేళ్లుగా ఖాళీగా వదిలేసిన చెరువులను టైగర్ కోసం వినియోగంలోకి తెచ్చారు. తీవ్రంగా నష్టపోయాం గత ఏడాది 1.50 ఎకరాల్లో టైగర్ సీడ్ వేసి ఆరు నెలలకు 22 కౌంట్తో తీశాను. లాభసాటిగా ఉండటంతో ఈ సీజన్లో 3.50 ఎకరాల్లో సాగు చేశాను. ఎర్ర ఉబ్బు, తెల్ల మచ్చ (వైట్స్పాట్) తెగుళ్లు సోకడంతో 50 కౌంట్ ఉన్నప్పుడే అమ్మేసుకోవాల్సి వచ్చింది. వైరస్కు జడిసి చుట్టుపక్కల చాలామంది రైతులు 100 కౌంట్, 80 కౌంట్కు కూడా అయినకాడికి పట్టుబడులు చేశారు. – శీలబోయిన వెంకటేశ్వరరావు, ఆక్వా రైతు, వేములదీవి వైరస్ వచ్చేసింది రెండేళ్లుగా టైగర్ సాగు బాగుండటంతో ఈసారి తీరప్రాంత గ్రామాల్లో వనామీకి బదులు టైగర్ రొయ్యల సీడ్ వేశాం. కొన్నేళ్లుగా ఖాళీగా ఉన్న చెరువులను రూ.లక్షలు పెట్టి బాగుచేసి మరీ ఈ సీజన్లో వినియోగంలోకి తెచ్చాం. ఊహించని విధంగా వైరస్లు రావడంతో ధర లేక రైతులందరూ తీవ్రంగా నష్టపోయాం. – వాతాడి హరినాథ్, ఆక్వా రైతు, చినమైనవానిలంక -
శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.82 కోట్లు
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయ హుండీల నగదు లెక్కింపు స్థానిక ప్రమోద కల్యాణ మండపంలో గురువారం అత్యంత కట్టుదిట్టమైన భద్రతల నడుమ జరిగింది. ఈ లెక్కింపులో శ్రీవారికి విశేష ఆదాయం సమకూరింది. గడచిన 30 రోజులకు గాను నగదు రూపేణా స్వామివారికి రూ. 2,82,31,619 ఆదాయం లభించినట్టు ఆలయ ఈఓ ఎన్వీ సత్యన్నారాయణ మూర్తి తెలిపారు. అలాగే కానుకల రూపేణా భక్తులు సమర్పించిన 202 గ్రాముల బంగారం, 5.546 కేజీల వెండితో పాటు, అధికంగా విదేశీ కరెన్సీ లభించిందన్నారు. అదేవిధంగా లెక్కింపులోకి రాని రదైన పాత రూ. 2000, రూ.500 నోట్లు ద్వారా రూ.35,500 లభించినట్టు చెప్పారు. ఈ లెక్కింపులో ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మావుళ్లమ్మ హుండీ ఆదాయం రూ.88.69 లక్షలు భీమవరం (ప్రకాశం చౌక్): భీమవరం పట్టణ ఇలవేల్పు శ్రీ మావుళ్లమ్మవారి ఆలయంలో భక్తులు హుండీల ద్వారా సమర్పించిన కానుకలను గురువారం లెక్కించినట్లు ఆలయ సహాయ కమిషనర్, కార్యనిర్వహణదికారి బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు. 114 రోజుల కాలానికి మొత్తం ఆదాయం రూ.88,69,425, బంగారం 92.500 గ్రాములు, వెండి 623.500 గ్రాములు, పలు దేశాల విదేశీ కరెన్సీ లభించిందన్నారు. లెక్కింపులో ఆలయ ప్రధానార్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ, దేవదాయశాఖ అధికారి వి.హరిసూర్యప్రకాశ్, శ్రీ శక్తీశ్వర స్వామి దేవస్థానం యనమదుర్రు ఈఓ దండు కృష్ణంరాజు, కొణితివాడ గ్రూప్ టెంపుల్స్ ఈఓ కర్రి శ్రీనివాస్, కరూర్ వైశ్య బ్యాంకు సిబ్బంది, పోలీస్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. క్షీరారామలింగేశ్వరస్వామి హుండీ ఆదాయం రూ.13 లక్షలు పాలకొల్లు సెంట్రల్: పంచారామక్షేత్రం శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో స్వామివారి హుండీ ఆదాయం రూ.13,31,554 వచ్చింది. గురువారం దేవదాయ శాఖ తనిఖీ అధికారి వి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో హుండీలను లెక్కించారు. మూడు నెలల 28 రోజులకు గాను ఈ ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో వెంకటేశ్వరరావు సేవా వలంటీర్స్, భాగ్యలక్ష్మి సేవా సభ్యులు, రెవెన్యూ, పోలీసు, బ్యాంక్ ఆఫ్ ఇండియా సిబ్బంది, ఆలయ సూపరింటెండెంట్ పసుపులేటి వాసు, సీనియర్ అసిస్టెంట్ గాంధీ, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. -
కాలువలో మృతదేహం లభ్యం
గుంటూరు వాసిగా గుర్తింపు ఉంగుటూరు: ఉంగుటూరులోని ఏలూరు కాలువలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడు గుంటూరుకు చెందిన గుంజి దుర్గనారాయణ (42)గా పోలీసులు గుర్తించారు. మద్యం సేవిస్తూ మతి స్థిమితం లేనట్లుగా తిరుగుతుంటాడని, ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెంది ఉంటాడని, అతడి కాలికి పోలియో ఉందని చేబ్రోలు ఎస్సై సూర్యభగవాన్ తెలిపారు. నాలుగురోజులు క్రితం గూడెం ప్రాంతంలో కాలువలో పడి ఉండవచ్చునని భావిస్తున్నారు. అతని జేబులో ఉన్న వివరాల ప్రకారం సమాచారాన్ని బంధువులకు తెలియజేసినట్లు ఎస్సై చెప్పారు. పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని తాడేపల్లిగూడెం మ్యాచురీలో భద్రపరిచారు. పాము కాటుకు వ్యక్తి మృతి యలమంచిలి: మండలంలోని పెదలంక గ్రామానికి చెందిన గెద్దాడ నాగేశ్వరరావు (57) పాముకాటుకు గురై మరణించినట్లు హెడ్ కానిస్టేబుల్ ఈతకోట సత్యనారాయణ తెలిపారు. వ్యవసాయ కూలీగా జీవనం సాగించే నాగేశ్వరరావు గురువారం పశువులకు గడ్డి కోస్తుండగా పాముకాటు వేసింది. స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే రాజోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. నాగేశ్వరరావుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుని కుమారుడు నాగ శ్రీను ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. యువతి అదృశ్యంపై కేసు నమోదు పాలకొల్లు సెంట్రల్: ఉల్లంపర్రు గ్రామంలోని సత్యసాయి కాలనీకి చెందిన యువతి అదృశ్యంపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 11వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువతి తిరిగి రాలేదు. చుట్టుపక్కల, బంధువుల ఇళ్లల్లో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో గురువారం రూరల్ పోలీస్ స్టేషన్లో ఆమె సోదరుడు ఫిర్యాదు చేశాడు. ఎస్సై బి సురేంద్రకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
పశువుల పాల ఉత్పత్తిపై ప్రభావం
జంగారెడ్డిగూడెం: పశువులకు వచ్చే ముద్ద చర్మ వ్యాధి (లుంపీ స్కిన్ డిజీస్) పాల ఉత్పత్తిపై అధిక ప్రభావం చూపుతుంది. ఈ వ్యాధి సోకిన పశువుల చర్మంపై ముద్దలు, గడ్డలు ఏర్పడుతాయి. ఈ వ్యాధి వల్ల పశువులు చాలా ఇబ్బందులు పడతాయి. వీటి నివారణకు పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో ఏటా టీకాలు వేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వ్యాధి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పశువైద్యాధికారి బీఆర్ శ్రీనివాసన్ వివరించారు. వ్యాధి లక్షణాలు ● పశువుల శరీరంపై చిన్న గడ్డలు, ముద్దలు ఏర్పడతాయి. ● అధిక జ్వరం వచ్చి, బలహీనంగా, అలసటగా కనిపిస్తాయి. ● ఆహారం తీసుకోకపోవడం లేదా తక్కువగా తీసుకుంటాయి. ● ఈ వ్యాధి సోకిన పశువులు తక్కువ పాలు ఇస్తాయి. వ్యాధి వ్యాప్తి, నివారణ ముద్ద చర్మ వ్యాధి వైరస్ దోమలు, ఇతర కీటకాల కారణంగా వ్యాపిస్తుంది. వ్యాధి ఉన్న పశువుల నుంచి ఇతర పశువులకు ఈ వ్యాధి వేగంగా వస్తుంది. గోట్ పాక్స్ వైరస్ వ్యాక్సిన్ వలన ఈ వ్యాధి నివారణ సాధ్యమవుతుంది. పశువులకు ఈ వ్యాధి రాకుండా ఉండేందుకు ప్రభుత్వం ఏటా వ్యాక్సిన్ను అందిస్తుంది, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ● పశువుల నివాస ప్రదేశాలను శుభ్రంగా ఉంచాలి. ● వ్యాధి సోకిన పశువులను ఇతర పశువుల నుంచి వేరుగా ఉంచాలి. ● పశువులకు దోమల నుంచి రక్షణ కల్పించాలి. సమయానికి వ్యాక్సిన్ వేయించాలి ● ఏదైనా లక్షణాలు గమనిస్తే వెంటనే స్థానిక వెటర్నరీ వైద్యులను సంప్రదించాలి. పాడి – పంట జాగ్రత్తలతో వ్యాధిని నివారించవచ్చు ముద్ద చర్మ వ్యాధి పశువులకు ప్రమాదకరమైనది. సరైన జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధిని నివారించవచ్చు. ప్రభుత్వం ద్వారా అందిస్తున్న గోట్ పాక్స్ వైరస్ వ్యాక్సిన్ వినియోగిస్తే, ఈ వ్యాధి నుంచి పశువులను కాపాడుకోవచ్చు. ప్రతి రైతు పశువైద్యాధికారుల సలహాలు పాటించి తమ పశువులను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. – బీఆర్ శ్రీనివాసన్, పశువైద్యాధికారి -
25 నుంచి తేనెటీగల పెంపకంపై శిక్షణ
తాడేపల్లిగూడెం: డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిఽధిలోని కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా తేనెటీగల పెంపకంపై ఈ నెల 25, 29, 31 తేదీల్లో ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కేవీకే సమన్వయకర్త డాక్టర్ పి.విజయలక్ష్మి తెలిపారు. అంతరించిపోతున్న తేనెటీగలను రక్షించుకోడానికి, కుటీర పరిశ్రమ ద్వారా లాభాలను పొందడానికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఒక ఎకరాకు ప్రారంభంలో రూ.20 నుంచి రూ.25 వేల పెట్టుబడితో మొదలు పెట్టి రెండు మూడు రెట్లు ఆదాయం తేనెద్వారా. పుప్పొడి, ఇతర ఉత్పత్తులు మైనం, విషం ద్వారా పొందవచ్చునన్నారు. ఆసక్తి కలిగిన వారు ఎనిమిది ఫేమ్లు కలిగిన పెట్టె కోసం రూ.5500, ఐదు ఫేమ్లు ఉన్న పెట్టెల కోసం రూ.4500 ధరతో కేవీకేలో సిద్ధంగా ఉంచామన్నారు. వివరాల కోసం 73826 33692, 94905 05926 నంబర్లలో సంప్రదించాలన్నారు. 20న బాస్కెట్బాల్ బాలికల జట్టు ఎంపిక ఏలూరు రూరల్: ఈ నెల 20వ తేదీన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జూనియర్ స్థాయి బాలికల జట్టు ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు కె కృష్ణారెడ్డి, కార్యదర్శి గవ్వ శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఏలూరు కస్తూరిభా బాలికల పాఠశాల ఆవరణలో మధ్యాహ్నం 3 గంటలకు ఈ పోటీలు జరుగుతాయన్నారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారిణిలు 2007 జనవరి 1వ తేదీ తర్వాత పుట్టినవారై ఉండాలన్నారు. ఎంపికై న జట్టు ఆగస్టు 14 నుంచి 17 వరకూ పిఠాపురంలో జరిగే అంతర జిల్లాల బాస్కెట్బాల్ పోటీల్లో పాల్గొంటుందని వివరించారు. ఆసక్తి గల క్రీడాకారిణులు ఒరిజినల్ పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రంతో హాజరుకావాలని సూచించారు. వివరాలకు అసోసియేషన్ ట్రెజరర్ కె మురళీకృష్ణ 94411 71933 నంబర్లో సంప్రదించాలని సూచించారు. 2.8 కిలోల గంజాయి స్వాధీనం భీమవరం: భీమవరం ఒకటో పట్టణంలోని గునుపూడి రైల్వే అండర్ పాస్ వద్ద మంచినీటి సర్వీసు రిజర్వాయరు సమీపంలో రూ.60 వేలు విలువైన 2.862 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్లాస్టిక్ సంచుల్లో గంజాయి కలిగి ఉన్న నిందితులు నాయక్ కరుణాకర్, నీలపు దుర్గాప్రసాద్, గాడిన ప్రభుకుమార్, జెండా నాగరాజును మధ్యవర్తుల సమక్షంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఐ ఎం.నాగరాజు పర్యవేక్షణలో ఎస్సై కృష్ణాజీ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో బాలింత మృతి
పాలకొల్లు సెంట్రల్: మోటార్సైకిల్ను కారు ఢీకొన్న ప్రమాదంలో ఓ బాలింత దుర్మరణం పాలైంది. వివరాల ప్రకారం అప్పనచెర్వు రామచంద్రరావు పేటకు చెందిన ఎం నందిని మూడు నెలల బాలింత (25). శిశువును ఇంటి వద్దే ఉంచి భర్త రత్నరాజు, పెద్ద కుమారుడితో కలిసి వైద్య పరీక్షల నిమిత్తం మోటార్సైకిల్పై పాలకొల్లులో ఆసుపత్రికి వెళ్లారు. తిరిగి వస్తుండగా పెనుమదం రోడ్డులో ఎస్ఆర్ఆర్ పేట ప్రాంతానికి వచ్చే సరికి ఓ కారు వీరి మోటార్సైకిల్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నందిని మృతి చెందగా రత్నరాజుకు తీవ్ర గాయాలయ్యాయి. బాబు పక్కనే ఉన్న తుప్పల్లో పడడంతో స్వల్పగాయాలతో సురక్షితంగా ఉన్నాడు. రత్నరాజు ఫిర్యాదు మేరకు పోడూరు ఎస్సై కె సుధాకర్రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నందిని మృతదేహం ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చురీలో ఉంచారు. -
లారీ ఢీకొని తాపీ కార్మికుడి మృతి
కలిదిండి (కై కలూరు): లారీ ఢీకొని తాపీ కార్మికుడు మృతి చెందిన ఘటన కలిదిండి మండలం గుర్వాయిపాలెం సమీప రామిరెడ్డినగర్ వద్ద గురువారం జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుపాడుకు చెందిన అవురుగొట్టు సత్యబాబు(45) సైకిల్పై వచ్చి గుర్వాయిపాలెంలో తాపీ పని చేసి తిరిగి ఇంటికి వెళుతుండగా కలిదిండి వ్యవసాయ మార్కెట్ నుంచి బియ్యం బస్తాలతో ఆకివీడు రైల్వేస్టేషన్కు వెళుతున్న లారీ వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో సత్యబాబు అక్కడికక్కడే మృతి చెందాడు. అతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య లక్ష్మీ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని కై కలూరు ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. -
వెలవెలబోతున్న ఎర్ర కాల్వ
చింతలపూడి : ఈ ఏడాది మెట్ట ప్రాంతంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా ఎర్ర కాల్వ వెలవెలబోతోంది. చింతలపూడి మండలం శెట్టివారిగూడెం వద్ద మేడవరపు చెరువు అలుగు నీరు ప్రవహించేదే ఎర్రకాల్వ. ఇక్కడి నుంచి సుమారు 21 కి.మీటర్లు ప్రవహించి ఎర్రకాల్వ ప్రాజెక్టులో కలుస్తుంది. సుమారు 350 ఎరకాల విస్తీర్ణం కలిగి ఉన్న మేడవరపు చెరువు కింద సుమారు 2 వేల ఎకరాలకు పైగా సాగునీరు అందుతుంది. ఒకప్పుడు ఎర్రకాల్వ అంటే పొలాలను ముంపునకు గురిచేసే మహమ్మారి అని రైతులంతా భయపడేవారు. 1998లో అప్పటి రాష్ట్ర మంత్రి కోటగిరి విద్యాధరరావు సుమారు రూ.4.11 కోట్ల నిధులు మంజూరు చేయించి కాల్వను 17.5 కి.మీటర్లు అభివద్ధి చేశారు. అప్పటి నుంచి రైతులకు ముంపు బాధ తప్పింది. రానురాను మెట్ట ప్రాంతంలో వర్షాభావ పరిస్ధితుల కారణంగా ఎర్రకాల్వ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. మినీ ప్రాజెక్టుగా మార్చాలని డిమాండ్ మేడవరపు చెరువును అభివృద్ధి చేసి మినీ ప్రాజెక్టుగా మార్చాలని ఇక్కడి రైతులు ఎప్పటినుంచో కోరుతున్నారు. వరదల సమయంలో ఎర్రకాల్వ నీరు కిందికి ప్రవహించి ఇక్కడి రైతులకు ఉపయోగపడటం లేదని రైతులు వాపోతున్నారు. కనీసం చెక్ డ్యామ్లు కట్టినా భూగర్భ జలాలు పెరిగి మెట్ట ప్రాంతానికి కొంతవరకు ఉపయోగం ఉంటుందని అంటున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు ఎర్రకాల్వకు నిధులు మంజూరు చేయించి అభివృద్ధి చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్లో కురిసిన వర్షాల వల్ల వచ్చిన వరద నీరు వృథాగా కిందకు పోయింది. వచ్చే వేసవిలో నైనా చెక్డ్యాంల నిర్మాణం చేపట్టాలని రైతులు కోరుతున్నారు. అలాగే మేడవరపు చెరువు ఆక్రమణలు తొలగించి చెరువును అభివృద్ధి చేస్తే రైతులకు మరింత మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మేడవరపు చెరువును అభివృద్ధి చేయాలి ప్రభుత్వం మేడవరపు చెరువు పూడికను తొలగించి అభివృద్ధి చేయాలి. ఎర్రకాల్వ నీరు కిందికి పోకుండా ఎక్కడికక్కడ చెక్డ్యాంలు నిర్మించాలి. కాల్వ నీరు రైతులకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం ఎర్ర కాల్వ అభివృద్ధికి నిధులు కేటాయించాలి. – చేపూరి ఖాదర్బాబు, రైతు, వైఎస్సార్ సీపీ నాయకులు, శెట్టివారిగూడెం -
వైఎస్సార్ టీయూసీ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా షాన్వాజ్ఖాన్
నరసాపురం: వైఎస్సార్ టీయూసీ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా నరసాపురం పట్టణానికి చెందిన ఎండీ షాన్వాజ్ఖాన్ను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నియమించారు. ఈ మేరకు గురువారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. షాన్వాజ్ఖాన్ దీర్ఘకాలంగా వైఎస్సార్ సీపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ఆయన గతంలో వామపక్ష పార్టీల్లోను, వామపక్ష అనుబంధ కార్మిక సంఘాల్లోను పనిచేసి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఔన్జీసీ కార్మిక యూనియన్లో కూడా పదేళ్లపాటు పనిచేశారు. తరువాత కాంగ్రెస్లో చేరగా వైఎస్సార్సీపీ అవిర్భావంలోనే పార్టీలో చేరి అప్పటి నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నారు. తనకు రాష్ట్రస్థాయి పదవి లభించడంపై పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజుకు కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్సార్ సీపీ క్రిష్టియన్ మైనారిటీ సెల్ సంయుక్త కార్యదర్శిగా డేవిడ్ రాజు పెనుగొండ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర క్రిష్టియన్ మైనారిటీ సెల్ సంయుక్త కార్యదర్శికి ఆచంట నియోజకవర్గానికి చెందిన బి డేవిడ్ రాజు నియమితులయ్యారు. ఈ మేరకు తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. కొడమంచిలికి చెందిన డేవిడ్రాజు నియామకంపై వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులు ప్రజాప్రతినిధులు అభినందలు తెలిపారు. -
యథేచ్ఛగా మట్టి దోపిడీ
భీమవరం అర్బన్: జిల్లా కేంద్రమైన భీమవరం మండలంలో మట్టి దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. అనుమతులు లేకుండా చెరువుల మట్టిని తవ్వి తరలిస్తున్నా అధికారులు చోద్యం చూస్తుండడంతో మట్టి వ్యాపారం మూడు లారీలు, ఆరు ట్రాక్టర్లుగా సాగుతోంది. మండలంలో పెదగరువు, బరువానిపేట, దొంగపిండి తదితర గ్రామాల్లో చెరువుల మట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు అక్రమార్కులు. చెరువులు తవ్వాలనే రైతుల వద్దకు మట్టి మాఫియా వాలిపోయి కొంత సొమ్ముకు మాట్లాడుకుని ఖాళీ స్థలం, ఇళ్లు పూడ్చుకునే వారికి మేము పూడ్చేస్తామంటూ ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. దూరాన్ని బట్టి మట్టి ట్రాక్టర్లకు రూ.800 నుంచి 1500 వరకు, లారీలకు రూ.4 వేలు నుంచి 6 వేలు వరకు విక్రయించి జేబులు నింపుకుంటున్నారు. చెరువులో మట్టిని బయటకు తరలించాలంటే రెవెన్యూ, వ్యవసాయ, మత్స్యశాఖ, మైనింగ్, ఆర్అండ్బీ, తదితర శాఖలు అనుమతులు ఉండాలి. కానీ కింది స్థాయి అధికారుల చేతులు తడిపి నిబంధనలకు నీళ్లు వదలి మట్టి మాఫియా తమ వ్యాపారాన్ని జోరుగా సాగించేస్తున్నాయి. కాగా మట్టి పెళ్లలు రోడ్డుపై పడడంతో ద్విచక్రవాహనాలు జారిపోయి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్తులు, వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా సుమారు 80 టన్నుల బరువు మట్టితో రోడ్లపై లారీలు తిరుగుతుంటే రోడ్లు ధ్వంసం అవుతున్నాయని వాపోతున్నారు. బరువానిపేటలో కోట్లలో మట్టి వ్యాపారం బరువానిపేట సమీపంలోని సుమారు 18 ఎకరాల్లో గత 4 నెలలుగా భారీ లారీలపై మట్టి తోలకాలు జరుగుతున్నాయి. గతంలో ఇక్కడినుంచి తరలివెళ్తున్న లారీలను గొల్లవానితిప్ప వద్ద ఆర్డీవో అడ్డుకుని సీజ్ చేశారు. మళ్లీ ఎండలు కాయడంతో మట్టి లారీలు తిరుగుతున్నాయి. రాత్రి పగలు అనే తేడా లేకుండా లారీలు తిప్పి మట్టి తరలించి కోట్లు కొల్లగొడుతున్నట్లు బాహాటంగానే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై భీమవరం తహసీల్దార్ రావి రాంబాబును వివరణ కోరగా గ్రామాల్లో చెరువుల తవ్వకం, మట్టి రవాణ వంటివి తమ దృష్టికి రాలేదన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
‘వాగ్దానాలకు అతీలేదు గతి లేదు.. మందు కావాలని మాత్రం ఆలోచించారు’
పశ్చిమ గోదావరి జిల్లా: కూటమ ఏడాది పాలనలో ఇచ్చిన హామీలకు చేసిన పాలనకు పొంతన లేదని వైఎస్సార్సీపీ ఉయగోదావరి జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్. బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. జిల్లాలోని ఉండి నియోజకవర్గం ఇంచార్జ్ పీవీఎల్ నరసింహరాజు ఆధ్వర్యంలో బాబు షూరిటీ -మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బొత్స సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాద్ రాజు, నరసాపురం పార్లమెంట్ పరిశీలకులు ముదునూరి మురళి కృష్ణంరాజు, కన్వీనర్ ఉమాబాల, మాజీమంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు , ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, భీమవరం నియోజకవర్గ ఇంచార్జ్ చిన్నమిల్లి వెంకటరాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు బొత్స మాట్లాడుతూ.. ‘ కూటమి నేతల మెడలు వంచి పాలన చేయించాలనే ఉద్దేశంతోనే బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం చేపట్టాము. ఐదు కోట్ల మందిపై ప్రమాణం చేసి భవిష్యత్తు గ్యారెంటీ అంటూ బాండ్లు ఇచ్చారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఇచ్చిన వాగ్దానాలను కూటమీ ప్రభుత్వం నెరవేర్చలేదు. మూడు సిలిండర్లని ఒక సిలిండర్ ఇచ్చారు. సూపర్ సిక్స్ హామీల గురించి అడిగితే నాలికమందం అంటున్నాడు చంద్రబాబు. చంద్రబాబు మాయగాడు.. మాయగాడికి తోడు ఒక మోసగాడు తోడయ్యాడు. ఎప్పుడు ఎన్నికల్లో గెలిచిన ప్రజలను మోసం చేయడమే వారి ఉద్దేశం. ప్రజలకు ఐదువేళ్లు నోట్లోకి వెళ్లడం కావాలి.. మందు కాదు. చంద్రబాబు ప్రజలకు మందే కావాలని ఆలోచించాడు. రైతులకు పెట్టుబడి సాయం ఇప్పటి వరకు ఇవ్వలేదుచంద్రబాబు 100 అబద్ధాలు ఆడితే లోకేష్ 200 అబద్దాలు ఆడుతున్నాడు. చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలకు అతీలేదు గతి లేదు. అడిగితే ఒకరేమో నాలికమందమని ఇంకో ఆయన ఏమో తాటతీస్తాను మక్కెలు ఇరగ కొడుతాను అంటున్నాడు. ఐదు లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలు మానేశారు ఈ రాష్ట్రంలో.. ఇది వాస్తవం. ఆడబిడ్డ నిధి 1500.. ఎప్పటినుండి ఇస్తారు. P-4 పేరుతో అభివృద్ధి పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారు.’ అని బొత్స మండిపడ్డారు. -
గురుకుల విద్యార్థులకు ర్యాంకులు
తాడేపల్లిగూడెం రూరల్: సైన్స్, ఒలంపియాడ్ ఫౌండేషన్ పరీక్షలో పెదతాడేపల్లి డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ సాంఘీక, సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించారని ప్రిన్సిపాల్ బి.రాజారావు తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం గురుకుల పాఠశాల ఆవరణలో అభినందన సభ నిర్వహించారు. ప్రిన్సిపాల్ రాజారావు మాట్లాడుతూ సైన్స్, ఒలంపియాడ్లో ప్రపంచ వ్యాప్తంగా 72 దేశాలకు చెందిన 92,499 విద్యార్థులు పాల్గొన్నారని, వీరిలో 158 మంది గురుకుల విద్యార్థులు ఉన్నారన్నారు. అంతర్జాతీయ స్థాయిలో గురుకులంనకు చెందిన సీహెచ్. సాహస్ హిందీలో 131వ ర్యాంకు, డి.హర్షవర్ధన్ హిందీలో 150వ ర్యాంకు, ఎ.పాల్సన్ హిందీలో 149వ ర్యాంకు, జి.హర్షవర్ధన్ హిందీలో 176వ ర్యాంకు, టి.మురళీ గణితంలో 1210వ ర్యాంకులు సాధించారన్నారు. అనంతరం విద్యార్థులను అభినందిస్తూ సర్టిఫికెట్లు అందజేశారు. ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. -
యథేచ్ఛగా మట్టి అక్రమ తవ్వకాలు
కామవరపుకోట: మండలంలో మట్టి దందా యథేచ్ఛగా సాగుతోంది. కూటమి ప్రభుత్వ నాయకుల అండదండలతో పగలు రాత్రి తేడా లేకుండా చెరువులోని మట్టిని కొల్లగొడుతూ కాసులు సొమ్ము చేసుకుంటున్నారు అక్రమార్కులు. అధికారుల నుంచి ఏ విధమైన అనుమతులు లేకుండా గత కొన్ని రోజులుగా తడికలపూడి గ్రామ శివారులోని సుబ్బులు కుంట చెరువులో జేసీబీలతో మట్టిని తవ్వి అక్రమంగా తరలిస్తున్నారు. ట్రాక్టర్లకు, జేసీబీలకు సైతం నెంబర్ ప్లేట్లు తీసేసి ఈ మట్టి దందా కొనసాగించడం గమనార్హం. ట్రాక్టర్ ట్రక్కు మట్టి రూ.వెయ్యి నుంచి రూ.1500 వరకు విక్రయించి అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. అధికారులు ఈ వ్యవహారంపై నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇరిగేషన్ అధికారులను వివరణ అడుగగా మట్టి తవ్వకాలకు అనుమతులు లేవని తెలిపారు. తహసీల్దార్కి ఈ విషయం తెలియజేయగా వారిపై చర్య తీసుకుంటామని తెలిపారు. కొత్త చెరువులో మట్టి అక్రమ తవ్వకాలు తాడేపల్లిగూడెం రూరల్: కూటమి నాయకులకు మట్టి బంగారమాయె’ అన్నట్టుగా మారింది. ప్రధానంగా మండలంలోని మాధవరం గ్రామంలో రమారమీ 40 ఎకరాల విస్తీర్ణంలోని కొత్త చెరువులో యథేచ్ఛగా మట్టి అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. రెండు జేసీబీలను ఏర్పాటు చేసి లారీల్లో సరిహద్దు నియోజకవర్గమైన నిడదవోలు మండలంలోని ఇటుక బట్టీలకు తరలిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. నిత్యం పదుల సంఖ్యలోని వాహనాల్లో మట్టి తరలిపోతుంది. లారీ మట్టి రూ.2500 చొప్పున విక్రయిస్తున్నట్లు సమాచారం. దీంతో కూటమి నాయకులకు మూడు పువ్వులు ఆరుకాయలుగా వ్యాపారం సాగుతోంది. చెరువులో నీరు ఉన్నా రాజమార్గం ఏర్పాటు చేసుకుని మరీ లారీల్లో మట్టిని తరలించేయడం గమనార్హం. ఇంత జరుగుతున్నా సంబంధిత శాఖ అధికారులు స్పందించకపోవడంపై వారికి తెలిసీ మిన్నకుంటున్నారా? లేదా ఆమ్యామ్యాల మత్తులో జోగుతున్నారా ? అనే దానిపై ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు. దీనిపై సంబంధిత శాఖ అధికారికి ఫోన్ చేయగా స్పందించలేదు. -
రూ.22.43 లక్షల ఎరువుల అమ్మకాలు నిలుపుదల
తాడేపల్లిగూడెం రూరల్: రాష్ట్ర విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్, వ్యవసాయ శాఖ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం బుధవారం తాడేపల్లిగూడెంలోని ఎరువులు, పురుగు మందుల గోదాములను తనిఖీ చేసింది. ఈ సందర్భంగా కోరమండల్ స్టాక్ పాయింట్ను తనిఖీ చేశారు. అలాగే, ఎఫ్ఎంసీ గోదామును పరిశీలించి సూక్ష్మ పోషక ఎరువులు బయోస్టిమ్యూలెంట్స్ను గుర్తించి, రూ.22,43,950 విలువైన ఎరువుల అమ్మకాలను నిలుపుదల చేశారు. కంపెనీ స్టాక్ పాయింట్లను పరిశీలించి నిల్వలను తనిఖీ చేశారు. ఈ బృందంలో జిల్లా వనరుల కేంద్రం (పెద్దాపురం) సహాయ వ్యవసాయ సంచాలకులు ఎస్.బుల్లిబాబు, విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ గోపాలకృష్ణ, తాడేపల్లిగూడెం ఏడీఏ గంగాధరరావు, ఏవో నారాయణరావు, వ్యవసాయాధికారి (టెక్నికల్) కృష్ణకాంత్ ఉన్నారు. పెంటపాడులో... పెంటపాడు: మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం ఎరువుల దుకాణాల్లో విజిలెన్స్ తనిఖీలు నిర్వహించారు. మండల వ్యవసాయాధికారి చీర్ల రవికుమార్ ఆధ్వర్యంలో ఐఓపీ గోపాలకృష్ణ, ఏడీఏ బుల్లిబాబు, గూడెం ఏడీఏ గంగాధర్ల ఆధ్వర్యంలో పలు కంపెనీలకు చెందిన అక్రమంగా నిల్వ ఉన్న ఎరువుల అమ్మకాలను నిలుపుదల చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ తనిఖీల్లో రికార్డులు సరిగా లేని రూ.1,07,000 విలువైన ఎరువులను గుర్తించి వాటి విక్రయాలను నిలుపుదల చేసినట్లు చెప్పారు. -
శ్రీవారి దేవస్థానంలో తనిఖీలు
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులకు అందుతున్న వసతులు, సౌకర్యాలు, పారిశుద్ధ్య నిర్వహణ, ప్రసాదాల నాణ్యతలను రాష్ట్ర దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్, ఎస్ఓపీ నోడల్ అధికారిణి భ్రమరాంబ బుధవారం తనిఖీ చేశారు. ముందుగా ఆమె స్వామి, అమ్మవార్లను దర్శించి, ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. ఆలయ ముఖ మండపంలో అర్చకులు, పండితుల నుంచి వేద ఆశీర్వచనాన్ని పొందారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆమెకు శ్రీవారి జ్ఞాపికను, ప్రసాదాలను అందజేశారు. అనంతరం భ్రమరాంబ ఆలయ ఈఓ ఎన్వీ సత్యనారాయణ మూర్తి, ఇతర అధికారులతో కలిసి పారిశుధ్యం, క్యూ లైన్ల నిర్వహణ, దర్శనం ఏర్పాట్లు, డార్మేటరీలో వసతులు, భక్తులు సంచరించే ప్రదేశాల్లో ఉన్న సౌకర్యాలు తాగునీటి సరఫరా, మరుగుదొడ్లు శుభ్రతను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ తర్వాత ప్రసాదాల తయారీ విభాగం, అన్నప్రసాద భవనం, ఉచిత అన్న ప్రసాద వితరణను పరి శీలించారు. భక్తులకు అందిస్తున్న అన్నప్రసాదం, లడ్డూ, పులిహోర, శర్కర పొంగలి, ఉచిత ప్రసాదాల రుచి, నాణ్యతను పరిశీలించి భక్తుల అభిప్రాయాలను సేకరించి సంతృప్తి వ్యక్తం చేశారు. -
పీఎం సూర్యఘర్పై విస్తృత ప్రచారం
ఏలూరు (ఆర్ఆర్పేట): పీఎం సూర్యఘర్ పథకంపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కలిగించేందుకు విస్తృత ప్రచారం అవసరమని ఈపీడీసీఎల్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ టి.వనజ అన్నారు. బుధవారం స్థానిక విద్యుత్ భవన్లో పీఎం సూర్యఘర్ పథకంపై నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో ఆమె ముఖ్యఅతిథిగా మాట్లాడారు. సోలార్ విద్యుత్ ప్యానల్స్ ఏర్పాటుకు ప్రజలను ప్రోత్సాహించాలని సూచించారు. పీఎం సూర్యఘర్ పథకం అమలులో జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవడాన్ని ఆమె ప్రశంసించారు. లబ్ధిదారులకు ఆలస్యం లేకుండా రుణాలు మంజూరు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఈపీడీసీఎల్ ఏలూరు ఆపరేషన్ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజినీర్ పి.సాల్మన్ రాజు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ టెక్నికల్ పి.రాధాకృష్ణ, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఆపరేషన్స్ కేఎం అంబేద్కర్, పలువురు ఈఈలు, ఏఈఈలు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు, సోలార్ వెండర్లు పాల్గొన్నారు. మోటార్సైకిళ్ల చోరీపై కేసు నమోదు మండవల్లి: రెండు మోటార్సైకిళ్ల చోరీపై స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. గుడ్లవల్లేరు మండలం కూరాడ గ్రామానికి చెందిన దివి కార్తీక్ జూన్ 23న మండవల్లి ఇండియన్ బ్యాంక్ ఏటీఎం వద్ద డబ్బులు డ్రా చేసుకుని తిరిగి వచ్చేటప్పటికి అతని బైక్ కన్పించలేదు. దీంతో మండవల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెదపారుపూడి గ్రామానికి చెందిన కొప్పురావూరి శాంతికుమార్ జూన్ 26న సాయంత్రం లోకుమూడి సెంటర్లో మోటార్ సైకిల్ పార్కు చేసి జ్యూస్ పాయింట్కి వెళ్లి తిరిగి వచ్చి చూడగా అతని బైక్ కన్పించలేదు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు. -
సచివాలయ ఉద్యోగుల్లో గందరగోళం
ఏలూరు (మెట్రో): ఉద్యోగాలు ఉంచుతారా... పీకేస్తారా... ఉంచితే ఏ శాఖ కేటాయిస్తారు.. ఏ పనులు చేయమంటారు.. ఇవీ సచివాలయ ఉద్యోగుల మదిలో మెదులుతున్న ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు ఒక జవాబు మాత్రమే దొరికింది. కేవలం ఉద్యోగాన్ని మాత్రం ఉంచుతారు అనే సమాధానంతో సచివాలయ ఉద్యోగులు కాస్త ధైర్యంగా ఉన్నా మిగిలిన విషయాల్లో మాత్రం ప్రభుత్వం ఒక వైపు.. ఆయా శాఖల ఉన్నతాధికారులు మరో వైపు ఇబ్బందులకు గురి చేస్తుండడంతో అల్లాడుతున్నారు. ప్రతి గ్రామంలో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు గత వైఎస్సార్ సీపీ సర్కారు గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చింది. నిరుద్యోగులను సైతం ఆదుకునే విధంగా ఒక్కో సచివాలయంలో 10 నుంచి 15 మందికి శాఖల వారీగా ఉద్యోగాలను కల్పించింది. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే సచివాలయ ఉద్యోగులను తొలగించేందుకు అనేక కుట్రలు పన్నింది. అవి పనిచేయక ఉద్యోగులను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేసేందుకు సిద్ధం అయ్యింది. మొదటి అస్త్రంగా రేషనలైజేషన్ (క్రమబద్ధీకరణ) ఉద్యోగులను ఇబ్బందులు పెట్టే కుట్రల్లో భాగంగా క్రమబద్ధీకరణ అనే విధానాన్ని తీసుకొచ్చింది. దీనిలో భాగంగా ఉద్యోగులను సచివాలయాల నుంచి తొలగించి ఆయా శాఖలకు సర్దుబాటు చేస్తున్నట్లు ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా 517 సచివాలయాలు ఉండగా వాటిలో 187 సచివాలయాలను కూటమి సర్కారు ఈ క్రమబద్ధీకరణ పేరుతో రద్దు చేసింది. జనాభాకు సరిపడా సచివాలయాలను ఏర్పాటు చేశామని ఈ రద్దుకు కారణంగా చెప్పుకొస్తుంది. రెండో అస్త్రంగా వేరే శాఖలకు సర్దుబాటు జిల్లా వ్యాప్తంగా తొలగించిన 187 సచివాలయాల్లో ఉద్యోగులను పూర్తిగా తీసేస్తే వ్యతిరేకత వస్తుందని భావించిన కూటమి సర్కారు ఆ ఉద్యోగులను శాఖలకు సర్దుబాటు చేసే ప్రక్రియ ప్రారంభించింది. ఉద్యోగులకు ఎస్, నో అనే ఆప్షన్లు చూపించి నో అని ఉన్న సచివాలయ సిబ్బందిని వారికి నచ్చిన శాఖకు బదిలీ చేసేందుకు చర్యలు తీసుకుంటుంది. అసలు తాము చదివిన చదువు ఏమిటి, తాము జాయిన్ అయిన ఉద్యోగం ఏమిటి, ఇప్పుడు ఏ ఉద్యోగం చేయాలో తెలీక సచివాలయ ఉద్యోగులు తీవ్ర ఆందోళనను ఎదుర్కొంటున్నారు. శాఖల మధ్య సమన్వయ లోపం ఇక ఉద్యోగులు తమ ఉద్యోగం కాపాడుకోవడం ఒక అదృష్టంగా భావిస్తున్న తరుణంలో ఉన్నతాధికారుల బంతాటతో ఎక్కడ తాము ఉద్యోగం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటున్నారు. ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన ఉద్యోగాల ఏర్పాటు, బదిలీ ఉంటుందని చెప్పడంతో ఏలూరు జిల్లా అధికారులు విడిపోయిన పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాలకు ఉద్యోగుల కేటాయింపులు చేస్తున్నారు. దీంతో అభ్యర్థులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. ఉద్యోగుల బదిలీల్లో వసూళ్ల పర్వం సచివాలయ ఉద్యోగుల బదిలీ అనేది ఉద్యోగికి తీవ్ర ఇబ్బందిగా మారితే అధికారులకు, ఆయా శాఖలో కీలక పాత్ర పోషించే ఉద్యోగులకు మాత్రం కాసుల మూటగా మారాయి. బదిలీల పేరుతో సచివాలయ ఉద్యోగులకు కావాల్సిన ప్రాంతం కేటాయించేందుకు రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకూ వసూళ్లు చేస్తున్నారు. ప్రాంతాలను బట్టి రేటు ఏర్పాటు చేసి ఆ సొమ్ములు ఇవ్వకుంటే దూరంగా నియమిస్తున్నారు. పలుమార్లు కలెక్టర్ ఆగ్రహం జిల్లాలో బదిలీల ప్రక్రియపై కలెక్టర్ వెట్రిసెల్వి ఉన్నతాధికారులను పిలిచి సమావేశాలు ఏర్పాటు చేసినా అధికారులు సమన్వయం చేసుకోకపోగా వారి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. నిబంధనల ప్రకారం చేయాలని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసినా అధికారుల్లో మాత్రం మార్పు రాలేదు. ఇదేమిటని ప్రశ్నించిన సచివాలయ ఉద్యోగులకు దూరంగా బదిలీ అనే బహుమతిని ఇస్తున్నారు. ఇలా సచివాలయ ఉద్యోగులు తమ ఉద్యోగాన్ని కాపాడుకునే పనిలో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. బదిలీల్లో ఉద్యోగులతో కూటమి ప్రభుత్వం ఆటలు ఇదే అదనుగా తీసుకుంటున్న ఉన్నతాధికారులు కొన్ని శాఖల్లో లంచాలు సైతం డిమాండ్ కలెక్టర్ చెప్పినా పట్టించుకోని వైనం జిల్లా వ్యాప్తంగా సచివాలయాలు : 517 క్రమబద్ధీకరణ పేరుతో రద్దు చేసినవి : 187 సచివాలయ ఉద్యోగులు మొత్తం మంజూరు : 5,591 ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న వారు : 4,412 ఖాళీగా ఉన్న ఉద్యోగాలు : 1,179 -
ట్రాక్టర్ను ఢీకొన్న వ్యాన్.. ఒకరు మృతి
తాడేపల్లిగూడెం రూరల్ : ట్రాక్టర్ను వ్యాన్ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. ఈ ఘటన పెదతాడేపల్లి జాతీయ రహదారి నెం.16పై బుధవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. ద్వారకాతిరుమల మండలం కోడిగూడెం గ్రామానికి చెందిన దిర్శిపాము శ్రీను (40) కోడిపెంట కోసం ట్రాక్టర్పై తణుకు వెళ్తుండగా, చిత్తూరు జిల్లా బంగారుపాలెం నుంచి మామిడికాయ లోడుతో వస్తున్న వ్యాన్ ఢీకొంది. శ్రీను తన ట్రాక్టర్ను ఒక్కసారిగా ఎడమ వైపు నుంచి కుడివైపునకు తిప్పడంతో ఈ ప్రమాదం జరిగినట్లు వ్యాన్ డ్రైవర్ హరీష్ తెలిపారు. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ శ్రీను ఇంజన్ చక్రం కింద పడి మృతి చెందగా, వ్యాన్ డ్రైవర్ పనిగంటి హరీష్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. మరొకరికి గాయాలు -
శిశు జనన రేటుపై అవగాహన కల్పించాలి
భీమవరం (ప్రకాశంచౌక్): జూలై 11న నిర్వహించిన ప్రపంచ జనాభా దినోత్సవంలో భాగంగా బుధవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం దంపతులు ఒక బిడ్డతో సరిపెట్టుకుంటున్నారని దానివల్ల భవిష్యత్తులో యువ జనాభా తగ్గిపోతుందన్నారు. జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులలో గర్భిణులు కాన్పులు చేయించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో గర్భిణులకు అవసరమైన మందులు, వైద్య చికిత్స, పౌష్టికాహారం ఉచితంగా అందిస్తామని, వీటిని క్రమం తప్పకుండా అందించేందుకు వైద్య సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. కౌమార దశలో వివాహం, గర్భం దాల్చడంతో వచ్చే ప్రభావాలపై అవగాహన కల్పించాలన్నారు. పదిమంది తల్లులకు నగదు పురస్కారాలను, అందించారు. సాగునీటి సరఫరాపై దిద్దుబాటు చర్యలు భీమవరం: జిల్లాలో సార్వా నాట్లు ఆలస్యం, నారుమళ్లు ఎండిపోవడంపై అధికారులు దృష్టిసారించారు. అనేక మండలాల్లో వరి నారుమళ్లు ఎండిపోతున్న వైనాన్ని పత్రికల్లో ప్రచురించడంతో కలెక్టర్ బుధవారం కలెక్టరేట్లో పంట పొలాలకు సాగునీటి సరఫరాపై ఇరిగేషన్, డ్రెయిన్లు, ఎర్రకాలువ, గోదావరి హెడ్ వాటర్ వర్క్స్ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని శివారు భూములకు సైతం సాగునీరు అందించడానికి జల వనరుల శాఖాధికారులు నిరంతరాయంగా నీటి సరఫరాను పర్యవేక్షించాలని విధుల పట్ల నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. -
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విచారణ
నరసాపురం: నరసాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యా లయంలో బుధవారం ఓ పాత కేసుకు సంబంధించి విచారణ నిర్వహించారు. ఉదయం 11 గంటల సమయంలో ఏసీబీ సీఐ(ఏలూరు) కె.బాలకృష్ణ సిబ్బందితో కలసి కార్యాలయనికి వచ్చి విచారణ చేపట్టారు. 2023లో వీరభద్రరావు సబ్రిజిస్ట్రార్గా ఉండగా అక్రమ భూ రిజిస్ట్రేషన్పై ఫిర్యాదులు అందడంతో అప్పటిలో ఏసీబీ అధికారులు సబ్రిజిస్ట్రార్ కార్యాలయంపై దాడులు నిర్వహించారు. అప్పటి సబ్రిజిస్ట్రార్ సస్పెండ్ అయ్యారు. కేసు దర్యాప్తు చివరి దశకు చేరడంతో మరోమారు సమగ్ర దర్యాప్తు నిమిత్తం మళ్లీ ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. ఈ సందర్బంగా ఏసీబీ సీఐ బాలకృష్ణ మాట్లాడుతూ పాతకేసు దర్యాప్తులో భాగంగా విచారణ జరిపినట్టు చెప్పారు. నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామని వివరించారు. ఏసీబీ విచారణతో రోజంతా పూర్తిగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. 18న డీఎస్సీ–2003 ఉపాధ్యాయుల నిరసన భీమవరం: డీఎస్సీ–2003 ఉపాధ్యాయులకు మెమో–57 అమలుచేస్తూ ఓపీఎస్లోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈనెల 18న ఏలూరు కలెక్టరేట్ వద్ద నిర్వహించే నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీఎస్సీ –2003 ఉపాధ్యాయుల ఫోరం జిల్లా అధ్యక్షుడు సీహెచ్ సూర్యప్రకాష్, బుధవారం ఒక ప్రకటన లో కోరారు. రాష్ట్రంలో నూతన పింఛన్ విధానం సీపీఎస్ అమలుకుముందే నియామకం పూర్త యిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు కేంద్రం ప్రకటించిన మెమోను అమలుచేయాలని కోరారు. తమ డిమాండ్స్ సాధనకు ఏలూరులో నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. న్యాయ సేవలపై అవగాహన కల్పించాలి ఏలూరు (టూటౌన్): న్యాయ సేవలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో ప్రతి పౌరుడు బాధ్యత తీసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణం నుంచి బుధవారం బైక్ ర్యాలీని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత వారం రోజుల నుంచి మధ్యవర్తిత్వం ద్వారా కేసుల పరిష్కారంపై వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా ప్రజలను అవగాహన కలిగిస్తున్నామని, అందులో భాగంగా బుధవారం జిల్లా కోర్టు ప్రాంగణం నుంచి బైక్ ర్యాలీ నిర్వహించామని తెలిపారు. విద్యావంతులైన పౌరులు మారుమూల గ్రామా లలోని ప్రజలను చైతన్యవంతులను చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏడో అదనపు జిల్లా జడ్జి వై.శ్రీనివాసరావు, ఎనిమిదో అదనపు జిల్లా జడ్జి ఐ.శ్రీనివాస మూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్న ప్రసాద్, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కె.కె.వి.బులికృష్ణ, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి వి.రఘునాథ్, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కోనె సీతారాం, ప్రభుత్వ న్యాయవాది బి.జె.రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పంటలు ఎండుతున్నా ప్రభుత్వానికి పట్టదా? ఏలూరు(టూటౌన్): కృష్ణా డెల్టా శివారు ప్రాంత భూములకు సాగునీరు అందించాలంటూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఏలూరు– కై కలూరు రహదారి దిగ్బంధనం కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఎండిన వరి నారు మట్టి గడ్డలతో ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగు నీరు అందించి పంటలు కాపాడాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఏలూరు రూరల్ ఎస్సై ఆధ్వర్యంలో పోలీసులు, స్పెషల్ పోర్స్ మోహరించినా రైతులు రాస్తారోకో నిర్వహించారు. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించింది. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ కృష్ణా డెల్టా శివారు ప్రాంత భూములకు సాగునీరు అందక నారుమళ్ళు, నాట్లు వేసిన చేలు ఎండిపోతున్నా ఇరిగేషన్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. -
తగ్గిన ఉచిత విద్య అడ్మిషన్లు
భీమవరం: ప్రైవేటు స్కూళ్లలో పేదలకు ఉచిత విద్యనందించే పథకానికి కూటమి ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో అడ్మిషన్లు తగ్గిపోయాయి. గత రెండేళ్లుగా జిల్లాలోని ప్రవేటు స్కూళ్లకు ప్రభుత్వం చెల్లించాల్సిన సుమారు రూ.2 కోట్ల నిధులు విడుదల చేయకపోవడంతో ఫీజు మొత్తాన్ని విద్యార్థుల తల్లిదండ్రులే చెల్లించాలని స్కూల్ యాజమాన్యాలు ఒత్తిడి చేయడంతో పేదలు ప్రైవేటు స్కూళ్లలో అడ్మిషన్స్ పొందడానికి వెనుకడుగు వేస్తున్నారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో దాదాపు 1,500 మంది ఉచిత విద్యకు దరఖాస్తు చేసుకోగా వివిధ ప్రవేటు స్కూళ్లకు దాదాపు 1,261 మందిని అలాట్ చేశారు. కేవలం 809 మంది మాత్రమే అడ్మిషన్లు పొందారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేదలు తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లలో చదివించాలనే కల నెలవేర్చడానికి ప్రతి ప్రైవేటు స్కూల్లో ఒకటో తరగతిలో విద్యార్థుల సంఖ్యను బట్టి 25 శాతం సీట్లు పేదలకు కేటాయించేలా చర్యలు తీసుకున్నారు. ఐదేళ్లు నిండినవారికి రిజర్వేషన్ల ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తారు. ప్రైవేటు స్కూళ్లలో ఒకటో తరగతిలో చేరిన విద్యార్థులకు పట్టణ ప్రాంతాల్లో ఒక్కొక్క విద్యార్థికి రూ.7,500, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 6,500 ప్రభుత్వం ఆయా పాఠశాలలకు నిధులు జమచేస్తుంది. జిల్లాలో 700 ప్రైవేటు స్కూళ్లు జిల్లాలోని 20 మండలాల పరిధిలో సుమారు 700 ప్రైవేటు, కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి. వీటిలో 2022–23లో 1,162 మంది, 2023–24లో 1,176 మంది, 2024–25లో 1,787 మంది విద్యార్థులు చేరారు. వీరికి దాదాపు ప్రభుత్వం సుమారు రూ.2 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని అంచనా. ప్రైవేటు స్కూళ్లకు ప్రభుత్వం చెల్లించాల్సిన నిధులు చెల్లించకపోవడంతో కొన్ని ప్రైవేటు యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచే ఫీజులు వసూలు చేశాయి. ఇలాంటి తరుణంలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రైవేటు స్కూళ్లలో చేరడానికి దాదాపు 1,500 మంది దరఖాస్తు చేసుకోగా కేవలం 809 మంది మాత్రమే చేరారు. పాత బకాయిలను చెల్లించకపోవడంతో ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు కొత్తగా విద్యార్థులను చేర్చుకునేందుకు నిరాకరించాయి. వారితో ప్రభుత్వం చర్చలు జరిపి పాత బకాయిలు త్వరలోనే చెల్లిస్తామని హామీ ఇచ్చినా దానిపై కదలికలేదు. దీంతో ఉచిత విద్య పొందడానికి వెళ్లిన విద్యార్ధుల తల్లిదండ్రులకు ప్రభుత్వం సొమ్ములు చెల్లించకపోతే మీరే చెల్లించాలంటూ ఖరాఖండిగా చెప్పడంతో అంత పెద్దమొత్తంలో సొమ్ము చెల్లించలేక అనేక మంది వెనుదిరిగినట్లు తెలిసింది. -
యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు
కామవరపుకోట మండలంలో మట్టి దందా యథేచ్ఛగా సాగుతోంది. కూటమి నాయకుల అండదండలతో పగలు రాత్రి తేడా లేకుండా మట్టిని కొల్లగొడుతున్నారు. 8లో uఒక జిల్లా.. ఒక ఉత్పత్తికి ఎంపిక ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నుంచి దాదాపు రెండు లక్షల మంది మహిళలు లేసు అల్లికలు చేస్తున్నారు. 2024–25కి గాను నరసాపురం లేసుకు కేంద్ర ప్రభుత్వ ఒక జిల్లా–ఒక ఉత్పత్తి అవార్డు దక్కింది. కేంద్ర ప్రభుత్వ వాణిజ్య పన్నులు, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రెండురోజుల క్రితం న్యూఢిల్లీ ప్రగతి మైదానంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ చదలవాడ నాగరాణి అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని అల్లికలు చేసే మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. -
ఆక్వాకు వాతావరణ గండం
పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో రైతులు విలవిల కై కలూరు: మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా మారింది ఉమ్మడి జిల్లాలో ఆక్వా రైతుల పరిస్థితి. ఈ ఏడాది వేసవిలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరగడంతో ఆ ప్రభావం చేపల, రొయ్యల పరిశ్రమపై పడింది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ముందుగా వచ్చి వర్షాలు కురుస్తుండంతో ఆక్వా రైతులు సంతోషించారు. ఇది ఎంతో కాలం నిలవలేదు. జూలై నెలలో ఉష్ణోగ్రతలు భయపెడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆక్వా సాగుకు దినదిన గండంగా మారింది. ఉమ్మడి జిల్లాలో ఆక్వాసాగు విస్తీర్ణం 2.90 లక్షల ఎకరాల్లో సాగువుతోంది. ఇందులో 1.80 లక్షల ఎకరాల్లో చేపలు, 1.10 లక్షల ఎకరాల్లో రొయ్యలు సాగు చేస్తున్నారు. ఏలూరు జిల్లాలో ఏలూరు, కై కలూరు, దెందులూరు, ఉంగుటూరు, పశ్చిమగోదావరి జిల్లాలో భీమవరం, ఆకివీడు, నరసాపురం నియోజకవర్గాల్లో ఆక్వా సాగు ఎక్కువుగా చేస్తున్నారు. రొయ్యల, చేపల పెరుగుదల 28, 30 డిగ్రీల ఉష్ణోగ్రత దగ్గర బాగుంటుంది. మూడు రోజులుగా ఉమ్మడి జిల్లాలో ఉష్ణోగ్రతలు 37 నుంచి 38 డిగ్రీల ఉష్ణోగ్రతకు చేరుతున్నాయి. బుధవారం కై కలూరులో 36 డిగ్రీలు, భీమవరంలో 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల నీటిలో ప్రాణవాయువు కరిగే శక్తి తగ్గుతుంది. అధిక ఉష్ణోగ్రతల వల్ల చెరువుల్లో నీటి లెవల్స్ 3 అంతస్తులుగా వేరుపడతాయి. దీనివల్ల చెరువు పైపొరల్లో డీవో ఎక్కువగా, అడుగు పొరల్లో డీవో తక్కువుగా వుంటూ చేపలు, రొయ్యలకు ఇబ్బంది కలిగిస్తుంది. చెరువు నీటిలో అవసరమైన, హానికరమైన శైవలాలు కూడా ఏర్పడతాయి. నీటి పీహెచ్ పెరిగిపోతుంది. నీటి ఉష్ణోగ్రత పీహెచ్ అధికంగా ఉన్నప్పుడు అమ్మోనియా స్థాయి పెరిగి రొయ్యలు, చేపలకు ఒత్తిడి కలిగించి వ్యాధులకు దారితీస్తుంది. ఎక్కువగా చిరు చేపలు, రొయ్యలు అధిక నీటి గుణాల తారతమ్యాలను తట్టుకోలేవు. -
లేసు.. భేష్
సచివాలయ ఉద్యోగుల్లో గందరగోళం ఉద్యోగాలు ఉంచుతారా... పీకేస్తారా... ఉంచితే ఏ శాఖ కేటాయిస్తారు.. ఏ పనులు చేయమంటారు.. ఇవీ సచివాలయ ఉద్యోగుల మదిలో మెదులుతున్న ప్రశ్నలు. 8లో uగురువారం శ్రీ 17 శ్రీ జూలై శ్రీ 2025సాక్షి, భీమవరం: హస్తకళల్లో లేసు అల్లికలు ముఖ్యమైనవి. ఇక్కడి మహిళలు సూది మొనకు దారం తగిలించి అలవోకగా అల్లికలు చేస్తుంటారు. బ్రిటిష్ హయాంలో జల రవాణాకు నరసాపురం కేంద్రంగా ఉండేది. అప్పట్లో క్రిస్టియన్ మిషనరీ సంస్థల ద్వారా పరిచయమైన లేసు అల్లికలను తర్వాతి కాలంలో ఈ ప్రాంతానికి భౌగోళిక గుర్తింపు తెచ్చే స్థాయికి ఇక్కడి మహిళలు అభివృద్ధి చేశారు. టవల్స్, టేబుల్ క్లాత్స్, లంచ్ మ్యాట్స్, క్రోచట్ బ్యాగ్స్, డెకో కుషన్స్, బీచ్ కలెక్షన్స్ తదితర ఇక్కడి హ్యాండ్ మేడ్ ఉత్పత్తులకు విదేశాల్లో మంచి గిరాకీ ఉంది. వీటిని అమెరికా, యూరప్, సింగపూర్, కొరియా తదితర దేశాలకు ఎగుమతులు చేసే కంపెనీలు నరసాపురం, పరిసరాల్లో 50కు పైగా ఉన్నాయి. దేశ విదేశాల్లో జరిగే ఎక్స్పోలు, డిజైనర్లు, థర్డ్ పార్టీల ద్వారా ఆర్డర్లు తీసుకుని ఎగుమతులు చేస్తుంటారు. గతంలో ఏటా రూ.300 కోట్లు మేర లేసు ఉత్పత్తులు ఎగుమతులు జరిగేవి. అండగా నిలిచిన వైఎస్సార్ స్థానిక మహిళలు పొద్దు పొడవక ముందే లేచి ఇంటి పనులు, వంట ముగించుకుని, పిల్లలను స్కూళ్లకు, భర్తను పనికి పంపి అల్లికల పనిలో పడతారు. నలుగురైదుగురు కలసి టీవీ చూస్తున్నా, కబుర్లు చెప్పుకుంటున్నా వారి చేతిలో సూది, దారం కదులుతూనే ఉంటాయి. ఒక మహిళ రోజులో ఐదారు గంటలు పనిచేస్తే కేజీ దారం అల్లికకు పది రోజుల పడుతుంది. డిజైన్ను బట్టి కేజీకి గతంలో రూ.15 నుంచి రూ. 50 మాత్రమే వారికి కంపెనీలు ఇచ్చేవి. దళారుల దోపిడీని గుర్తించిన దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మహిళలకు అండగా 2004లో నరసాపురం రూరల్ సీతారాంపురంలో లేసు పార్కును ఏర్పాటుచేశారు. కేజీ దారం అల్లికకు ఒక్కసారిగా రూ.100 పెంచారు. దీనికి సమానంగా ప్రైవేట్ కంపెనీలు వేతనాన్ని పెంచాయి. మొదట్లో లేసు పార్కు పరిధిలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఆరు మండలాలకు చెందిన 10 వేల మంది సభ్యులు ఉంటే తర్వాతి కాలంలో ఈ సంఖ్య 15 మండలాల్లోని 30 వేల మందికి పెరిగింది. మార్కెటింగ్ మేనేజర్, ఇతర సిబ్బంది ఆర్డర్లు తెచ్చి మహిళలతో అల్లికలు చేయించడం ద్వారా అప్పట్లో ఏడాదికి రూ.100 కోట్ల విలువైన ఉత్పత్తులు ఎగుమతులు జరిగేవి. ఈ పార్క్ ద్వారా గతంలో స్థానిక మహిళలు అమెరికా, యూరప్, సింగపూర్ తదితర దేశాలకు వెళ్లి లేసు ఉత్పత్తులను ప్రదర్శించడం గమనార్హం. యాంత్రీకరణ, ఇతర దేశాల నుంచి పోటీ, కోవిడ్ పరిణామాల అనంతరం లేసు పరిశ్రమ ప్రాభవం కోల్పోయి ఎగుమతులు తగ్గినా ఏడాది క్రితం భౌగోళిక గుర్తింపు దక్కించుకుని సత్తాను చాటింది. పారిస్ వేదికగా గత ఏడాది 206 దేశాలు పాల్గొన్న ఒలింపిక్స్ పోటీల్లో ఇక్కడి లేసు ఉత్పత్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నిర్వాహకుల ఆర్డరుపై సీతారాంపురానికి చెందిన సంస్థ క్రీడాకారులు, సందర్శకుల కోసం లేస్, ఫ్యాబ్రిక్లను ఉపయోగించి ఒలింపిక్స్ థీమ్, లోగోలతో టవల్స్, డెకో కుషన్స్, బీచ్ కలెక్షన్స్ తదితర ఉత్పత్తులను భారీ మొత్తంలో పంపింది. ఆనందంగా ఉంది చిన్నతనం నుంచి ఇంట్లో అమ్మ, నానమ్మలను చూసి లేసులు అల్లడం అలవాటు చేసుకున్నాను. ఇప్పటికీ రోజూ ఖాళీ సమయంలో అల్లికలు చేస్తుంటాం. వీటిపై వచ్చే డబ్బులు ఇంటిలోని చిన్నచిన్న అవసరాలకు ఎంతో ఉపయోగపడతాయి. లేసు అల్లికలకు అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. – రాట్నాల లక్ష్మి, గృహిణి, ఎల్బీ చర్ల తరతరాలుగా అల్లికలు మా చిన్నతనంతో పోలిస్తే ఇప్పుడు లేసులు అల్లేవారు కొంత తగ్గారని చెప్పవచ్చు. అప్పట్లో ఏ ఇంటి వద్ద చూసిన ఆడవాళ్లు అల్లికలు చేస్తూ కనిపించేవారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇప్పటితరం వారు రకారకాల డిజైన్లలో అల్లికలు చేస్తూ జిల్లాకు దేశ విదేశాల్లో మంచి గుర్తింపు తీసుకురావడం అభినందనీయం. – తెలగంశెట్టి వెంకటలక్ష్మి, నరసాపురం న్యూస్రీల్ అల్లికల్లో రాణిస్తున్న పశ్చిమ మహిళలు కేంద్ర ప్రభుత్వ ఒక జిల్లా–ఒక ఉత్పత్తి అవార్డు సాధించిన నరసాపురం లేసులు ఇప్పటికే భౌగోళిక గుర్తింపుతో ఖండాంతర ఖ్యాతి గత ఏడాది ఒలింపిక్స్లోనూ మెరిసిన మన లేసులు లేసు పరిశ్రమకు ఊపిరిలూదిన మాజీ సీఎం వైఎస్సార్ 2004లో లేసు పార్కు ఏర్పాటు అబ్బురపర్చే అల్లికలతో పశ్చిమగోదావరి జిల్లా అతివలు అవార్డుల మోత మోగిస్తున్నారు. ఔరా అనిపించే హ్యాండ్ మేడ్ ఉత్పత్తులతో ఇప్పటికే నరసాపురం లేసుకు భౌగోళిక గుర్తింపు తెచ్చారు. గత ఏడాది పారిస్లో జరిగిన ఒలింపిక్స్ క్రీడా సంగ్రామంలో మన లేసులను మెరిపించారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక జిల్లా–ఒక ఉత్పత్తి అవార్డును సాధించారు. -
నీరందక రైతుల కన్నీరు
దెందులూరు: సాగునీరు అందక వరి నారుమళ్లు ఎండిపోతున్నాయని, నాట్లు వేసిన చేలు బీటలు వారాయని, కృష్ణా డెల్టా శివారు ప్రాంత భూములకు సాగునీరు అందించి పంటలు కాపాడాలంటూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు, కౌలు రైతులు మంగళవారం ధర్నా చేపట్టారు. ఏలూరు రూరల్ మండలం వెంకటాపురం రైతు సేవా కేంద్రం వద్ద ఎండిపోతున్న వరి నారుమడిలో బీటలు వారిన వరి మట్టిగడ్డలతో నిరసన వ్యక్తం చేశారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్, రైతులు జిల్లెల్లమూడి ప్రసాదరావు, చిన్ని పోతురాజు, అన్నంరెడ్డి రంగారావు, బైరెడ్డి లక్ష్మణరావు మాట్లాడుతూ అప్పులు తీసుకువచ్చి నారుమళ్లు, నాట్లు వేసిన వరిచేలు ఎండిపోతున్నా అధికారులు పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఏలూరు రూరల్ మండలం కృష్ణా డెల్టా పరిధిలోని వెంకటాపురం, మాదేపల్లి, జాలిపూడి, చాటపర్రు, పోణంగి, కొమడవోలు, కాట్లంపూడి తదితర గ్రామాలలో వేలాది ఎకరాల కృష్ణా డెల్టా భూములకు సాగునీరు అందడం లేదన్నారు. కృష్ణా డెల్టాకు సాగునీరు విడుదల చేశామని, పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా డెల్టాకు సాగునీరు అందిస్తున్నామని ప్రభుత్వం, అధికారులు చెబుతున్నా శివారు ప్రాంత భూములకు ఎందుకు సాగునీరు అందించలేకపోతున్నారని ప్రశ్నించారు. పంటలు ఎండిపోవడంతో అన్నదాతలు కన్నీరు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు కృష్ణా మెయిన్ కెనాల్ నుంచి జాలిపూడి, మాదేపల్లి వైపు వెళ్లే ప్రధాన పంట కాలువ గురప్రు డెక్క,తూడు, తుక్కు, ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయిందని కనీసం కాలువలు బాగు చేయకుండా నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. పంట కాలువలు బాగు చేస్తామని హడావుడి చేశారే తప్ప బాగు చేసింది ఏమీ లేదన్నారు. ఇరిగేషన్ అధికారులు మొద్దు నిద్ర వీడి చర్యలు చేపట్టాలని లేనిపక్షంలో అన్నదాతల ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. స్పందన రాకపోతే 16వ తేదీ సాయంత్రం 3 గంటలకు ఏలూరు కై కలూరు రోడ్డును దిగ్బంధించాలని నిర్ణయించారు. ఏలూరు– కై కలూరు రోడ్డును దిగ్బంధిస్తామని హెచ్చరిక -
రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు
తణుకు అర్బన్: రాష్ట్రంలో మహిళలపై దాడులు, అత్యాచార ఘటనలు పెరిగిపోవడం బాధాకరమని బీసీ చైతన్య యువజన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలకు ప్రాధాన్యతతో పాటు భద్రత లేకుండా పోతున్న ఘటనలు బాధాకరమన్నారు. తణుకు సురాజ్య భవన్లో మంగళవారం బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో మహిళా రాజకీయ రిజర్వేషన్లు, బీసీ మహిళా సబ్ కోటాపై రాష్ట్ర మహిళా సదస్సులో ఆయన మాట్లాడారు. చిన్నారులపై అత్యాచారాలు జరుగుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. రాష్ట్రానికి హోం మంత్రిగా ఉన్న మహిళకు కనీసం ఒక ఎస్సైని బదిలీ చేయించే అధికారం కూడా లేకుండా రాజకీయంగా తమ పరిధిలోనే ఉంచుకోవడం అన్యాయమన్నారు. దేశ వ్యాప్తంగా భవిష్యత్తులో జనగణనకు కార్యాచరణ సిద్ధమైందని రాజ్యసభ సభ్యుడు పాక సత్యనారాయణ తెలిపారు. బీసీ చైతన్య వేదిక జాతీయ అధ్యక్షుడు వీరవల్లి శ్రీనివాస్, జిల్లా మహిళాధ్యక్షురాలు కొలగాని కృష్ణవేణి అధ్యక్షతన నిర్వహించిన సదస్సులో జాతీయ ఉపాధ్యక్షుడు కాగిత సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శి అరటికట్ల త్యాగరాజాచారి, జాతీయ మహిళాధ్యక్షురాలు వై.లక్ష్మీశైలజ, రాష్ట్ర గౌరవాధ్యక్షుడు పీవీ రమణయ్య, రాష్ట్ర అధ్యక్షుడు అన్నం వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు మటపత్తి సూర్యచంద్రరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లుక్కా వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
వర్జీనియాకుసరాసరి ధర ఇప్పించాలి
జంగారెడ్డిగూడెం: వర్జీనియా పొగాకు ధర క్రమేపీ పెరుగుతోంది. మంగళవారం నాటికి కేజీ ఒక్కింటికి అత్యధికంగా రూ.359కు చేరింది. జంగారెడ్డిగూడెం 1, 2 వేలం కేంద్రం, కొయ్యలగూడెం వేలం కేంద్రంలో ఈ ధర రూ.359కు చేరింది. వేలం ప్రారంభ సమయంలో కేవలం కేజీ ధర రూ.290 పలికింది. ఈ ధర చాలా రోజులు స్థిరంగానే కొనసాగింది. కొద్ది రోజులుగా పెరుగుతూ 359కు చేరింది. కేజీ అత్యల్ప ధర రూ.200 ఉండగా, సరాసరి కేజీ ధర రూ.277కు చేరింది. గత ఏడాది వేలం ప్రక్రియ ముగిసే సరికి సరాసరి కేజీ ధర రూ.323 లభించింది. ఈ ఏడాది కూడా సరాసరి ధర అంతే ఇప్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. -
మీ మెడకే చుట్టుకుంటుంది
కోకో దిగుమతులు ఆపాలి విదేశీ కోకో గింజల దిగుమతులను నిలుపుదల చేసి, కోకో రైతులకు అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం ధర చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం డిమాండ్ చేసింది. 8లో uమాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ తాడేపల్లిగూడెం రూరల్: చెడు సంస్కృతిని మొదలుపెడితే అది మీ మెడకే చుట్టుకుంటుందనే విషయాన్ని గుర్తించాలని మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ హెచ్చరించారు. మంగళవారం మండలంలోని మాధవరంలో వైఎస్సార్సీపీ మండల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కృష్ణా జెడ్పీ చైర్పర్సన్ హారిక కారుపై దాడి చేసి, దుర్భాషలాడి టీడీపీ రౌడీలు విధ్వంసం సృష్టించారని, ప్రస్తుతం బాబూ ష్యూరిటీ– గూండాయిజం గ్యారంటీ అనే చందంగా ప్రభుత్వ పాలన మారిందని విమర్శించారు. ఒకప్పుడు పవన్ చంద్రబాబు, లోకేష్ను విమర్శించారని, నేడు ఒకే గూటికి చేరారన్నారు. పవన్ పొలిటికల్గా అట్టర్ ప్లాప్ అని ఎద్దేవా చేశారు. 10వ తరగతి పరీక్షలు వాల్యుయేషన్ జవాబుదారీతనం లేకుండాపోయిందన్నారు. చైనా బ్యాచ్ గుప్పెట్లో విద్యా వ్యవస్థఉందన్నారు. రాష్ట్రానికి సీఎంగా ఉండి ప్రైవేట్ విద్యాసంస్థలను ప్రోత్సహించేలా చంద్రబాబు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. స్థానిక ప్రజాప్రతినిధికి, పవన్ కళ్యాణ్కు గ్యాప్ వచ్చినట్టు ఉందన్నారు. పవన్ కల్యాణ్ గురించి మాట్లాడితే ఊరుకోబోమంటూ చిర్రుబుర్రులాడుతున్నాడని, ఊరుకోకపోతే పేడ పిసుక్కుంటావా? అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. రాజకీయాల్లోకి రానంత వరకే వ్యక్తిగతం అని, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అందరూ ప్రశ్నిస్తారన్నారు. జగన్ 2.0లో హాలీవుడ్ స్థాయిలో సినిమా చూపిస్తామని హెచ్చరించారు. ఇటీవల తనపై అవినీతి ఆరోపణలు చేశారని, దానికి ఆధారాలు చూపించాలని ఆయన సవాల్ విసిరారు. -
నారుమడిని సంరక్షించుకోవాలి
ప్రస్తుత ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల నారుమడులకు నష్టం వాటిల్లకుండా సంరక్షణ చర్యలు చేపట్టాలని మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనస్థానం శాస్త్రవేత్త ఎంవీ కృష్ణాజీ తెలిపారు. లీటరు నీటికి 10 గ్రాముల యూరియా చొప్పున ఎకరా నారుమడికి పది లీటర్ల ద్రావణాన్ని పిచికారీ చేయాలని లేదా లీటరు నీటికి మల్టీకే (13045) 10 గ్రాములు చొప్పున పది లీటర్ల ద్రావణాన్ని పిచికారి చేయొచ్చన్నారు. దీని వల్ల 10 నుంచి 15 రోజుల పాటు నారుమడి దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇనప ధాతువు లోపం వచ్చే అవకాశం ఉందని, దీని నివారణకు ఫెరరస్ సల్ఫేట్ 10 గ్రాములు, నిమ్మ ఉప్పు 2 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేయాలన్నారు. -
జాడలేని వానలు
ముసురు పట్టాల్సిన సమయంలో వర్షం జాడే లేకుండా పోయింది. జూలై నెలలో సాగు పనులు జోరుగా సాగుతాయి. ఈ నెలలో 96.5 మి.మీ సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఇంతవరకు సగం కూడా కురవలేదు. మండు వేసవిని తలపిస్తూ ఎండలు మండిపోతున్నాయి. పగలు ఎండ, రాత్రిళ్లు ఉక్కపోతతో ప్రజల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో ఖరీఫ్ పనులకు ఆటంకం ఏర్పడింది. సాక్షి, భీమవరం: ఈ ఏడాది రుతుపవనాలు సకాలంలోనే వచ్చినా ప్రతికూల వాతావరణం వెంటాడుతోంది. గత నెల్లో దంచి కొట్టిన వర్షాలు జూలైలో పత్తాలేకుండా పోయాయి. వాతావరణశాఖ లెక్కల ప్రకారం మే నెలలో జిల్లాలో 72.6 మి.మీ వర్షం కురవాల్సి ఉండగా రికార్డుస్థాయిలో 139 మి.మీ వర్షం కురవడం గమనార్హం. సాధారణం కంటే 66.4 మి.మీ అధిక వర్షపాతం నమోదైంది. జూన్ నెలలో 110.4 మి.మీ సగటు వర్షపాతానికి 125.5 మి.మీ వర్షంతో 15.1 మి.మీ అధిక వర్షపాతం నమోదైంది. ఈ రెండు నెలల్లో అవసరం లేని సమయంలో అధిక వర్షాలు మామిడి రైతులను నిండా ముంచాయి. పండుఈగ వ్యాప్తితో ధర పతనమై నరసాపురం, మొగల్తూరు మండలాల్లోని మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. మే, జూన్ నెలల్లో తాడేపల్లిగూడెం, పెంటపాడు, ఆకివీడు, మొగల్తూరు, భీమవరం, పెనుగొండ, పాలకొడేరు, ఇరగవరం, వీరవాసరం, పాలకొల్లు, గణపవరం మండలాల్లో సాధారణానికి మించి అధిక వర్షపాతం నమోదైంది. అవసరమైన సమయంలో.. తొలకరి పనులకు ఊతమిస్తూ ఈ నెలలో విస్తారంగా వానలు కురవాల్సి ఉంది. జూలై నెలకు 96.5 మి.మి వర్షం పడాలి. అప్పుడే సగం నెల పూర్తికాగా ఇప్పటి వరకు కేవలం 25.5 మి.మీ వర్షం మాత్రమే కురిసింది. జిల్లాలోని అత్తిలి, పెనుమంట్ర, పెనుగొండ, పాలకోడేరు, ఆకివీడు, అత్తిలి, తాడేపల్లిగూడెం, పెంటపాడు తదితర మండలాల్లో ఈ నెలలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఈశాన్య ప్రాంతంలోని ఉపరితల ఆవర్తనం, ద్రోణి వలన వర్షాకాలంలో వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉష్ణోగ్రతలు పెరిగాయని వాతావరణశాఖ నిపుణులు చెబుతున్నారు. తొలకరికి ఆటంకం వర్షాభావ పరిస్థితులతో తొలకరి పనులకు ఆటంకం ఏర్పడుతోంది. 2.08 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగు జరగనుంది. నవంబరు చివరలో వచ్చే తుఫాన్ల బారిన పడకుండా ముందుగానే పంటను ఒబ్బిడి చేసుకునేందుకు జూలై 15లోగా నాట్లు పూర్తిచేయాల్సి ఉండగా ఈ సీజన్లో పరిస్థితి అందుకు భిన్నంగా తయారైంది. క్లోజర్ పనుల జాప్యం, ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం అందకపోవడం, వర్షాలు లేక సాగునీటి ఎద్దడి సమస్యలతో పనులు ముందుకు సాగడం లేదు. ముందస్తు సాగులో భాగంగా ఈపాటికే నాట్లు దాదాపు పూర్తి కావాల్సి ఉంది. పెనుగొండ, పోడూరు, ఆచంట, యలమంచిలి తదితర మండలాల్లో 30 శాతం విస్తీర్ణంలో ఇంకా దమ్ములు కూడా చేయని పరిస్థితి ఉంది. కాలువలకు సరిగా నీరు విడుదల కాకపోవడం, ఎండల తీవ్రతకు నారుమడులు ఎండిపోతున్నాయని, పొలాలు నెరలు తీస్తున్నాయని ఆయా ప్రాంతాలకు చెందిన రైతులు వాపోతున్నారు. కాగా జిల్లాలో నారుమడులు పోయడం దాదాపు పూర్తయ్యిందని, ఇప్పటి వరకు 31 వేల ఎకరాల్లో నాట్లు పడినట్టు జిల్లా వ్యవసాయాధికారి జెడ్ వెంకటేశ్వరరావు తెలిపారు. 38 డిగ్రీల ఉష్ణోగ్ర తతో వేసవిని తలపిస్తున్న ఎండలు, ఉక్కపోత ఈ నెలలో సాధారణ వర్షపాతం 96.5 మి.మీ.. కురిసింది 25.5 మి.మీ వర్షాభావ పరిస్థితులతో ఖరీఫ్ పనులు నత్తనడక 31 వేల ఎకరాల్లో మాత్రమే పూర్తయిన నాట్లు 30 శాతం విస్తీర్ణంలో మొదలుకాని తొలకరి దమ్ములు -
గిట్టుబాటు ధర కోసం పోరాటం
జంగారెడ్డిగూడెం: వర్జీనియా రైతులు నష్టపోకుండా గిట్టుబాటు ధర కోసం పోరాటం చేద్దామని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి అన్నారని వైఎస్సార్సీపీ నాయకుడు ఘంటశాల గాంధీ అన్నారు. మంగళవారం వర్జీనియా పొగాకు సంఘం రైతు నాయకుడు, వైఎస్సార్సీపీ నేత గాంధీ వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా గాంధీ వర్జీనియా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. గాంధీ మాట్లాడుతూ వర్జీనియా పొగాకుకు మంచి ధర ఇప్పించేందుకు కృషి చేయాలని కోరినట్లు తెలిపారు. స్పందించిన జగన్మోహన్రెడ్డి వీలును బట్టి మరోసారి వర్జీనియా వేలం కేంద్రాలను సందర్శిస్తానని తెలిపారన్నారు. గిట్టుబాటు ధర కోసం పోరాటం చేద్దామని జగన్ పేర్కొన్నారన్నారు. జగన్మోహన్రెడ్డిని కలిసిన వారిలో బండారు సూరిబాబు, బుద్దాల సత్యనారాయణ, బండారు రత్నవల్లి ఉన్నారు. వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగ కార్యదర్శిగా మోషే తాడేపల్లిగూడెం (టీఓసీ): వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన తాడేపల్లి మోషేను రాష్ట్ర ఎస్సీ విభాగ సెక్రటరీగా నియమించారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు అభినందించారు. ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తు గడువు పొడిగింపు ఏలూరు (ఆర్ఆర్పేట): జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు తేదీని పొడిగించినట్లు డీఈవో ఎం.వెంకట లక్ష్మమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా పరిధిలోని అన్ని యాజమాన్యాల ప్రభుత్వ, స్థానిక సంస్థల, మున్సిపల్, ఏపీ మోడల్, గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు అర్హులన్నారు. ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించడానికి తొలుత ఈ నెల 15వ తేదీ వరకూ గడువు ఇవ్వగా, గడువును ఈ నెల 17 వరకు పొడిగించారని తెలిపారు. దరఖాస్తులు సమర్పించడానికి పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులు అర్హులు కారని, సంబంధిత సంవత్సరంలో కనీసం నాలుగు నెలలు విధులు నిర్వహించిన వారు ఇతర అర్హతలన్నీ పూర్తిగా ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. నైట్ వాచ్మెన్ల జీతాలు చెల్లించాలి ఏలూరు (ఆర్ఆర్పేట): ప్రభుత్వ పాఠశాలలలో రాత్రిపూట కాపలాదారుగా పనిచేస్తున్న నైట్ వాచ్మెన్ జీతాలు చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కంకిపాటి బుచ్చిబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద నైట్ వాచ్మెన్ జీతాలు చెల్లించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. ధర్నాలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బుచ్చిబాబు మాట్లాడుతూ నైట్ వాచ్మెన్ల గౌరవ వేతనం నెలల తరబడి చెల్లించడం లేదని విమర్శించారు. దీంతో వారి కుటుంబాల జీవనం చిన్నాభిన్నం అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. జీతం తక్కువ పని ఎక్కువ చేయిస్తూ శ్రమ దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. స్మార్ట్ మీటర్ల బిగింపును వ్యతిరేకించాలి ఏలూరు (టూటౌన్): విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగింపును ప్రజలంతా వ్యతిరేకించాలని వామపక్ష, ప్రజా సంఘాల ఐక్యవేదిక పిలుపునిచ్చింది. విద్యుత్ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ మంగళవారం ఉదయం ఏలూరు సీపీఐ జిల్లా కార్యాలయం స్ఫూర్తి భవనంలో వామపక్ష ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సీపీఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య అధ్యక్షత వహించారు. ఈ నెల 13న విజయవాడ దాసరి భవన్లో స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమ కార్యాచరణను కృష్ణ చైతన్య వివరించారు. గత కొంతకాలంగా విద్యుత్ వినియోగదారులపై ట్రూ అప్ చార్జీలు, ఇంధన సర్దుబాటు చార్జీలు, ఇతర అదనపు చార్జీల పేరుతో అధిక భారాన్ని మోపుతూ వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలపై మోపిన అధిక భారాలను రద్దు చేయాలని, వసూలు చేసిన అదనపు బిల్లులను తిరిగి చెల్లించాలని, విద్యుత్తు స్మార్ట్ మీటర్లు బిగింపు కార్యక్రమాన్ని విడనాడాలని డిమాండ్ చేశారు. -
కూటమి మోసాలను ఎండగట్టాలి
భీమవరం: కూటమి నాయకులు ప్రజలను మోసం చేయడంలో సిద్ధహస్తులని, వారి మోసాలను ‘బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ’ కార్యక్రమం ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు పిలుపునిచ్చారు. భీమవరం మండలం రాయలంలో పార్టీ భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త చినమిల్లి వెంకటరాయుడు అధ్యక్షతన జరిగిన పార్టీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వైఎస్సార్సీపీని మరింత బలోపేతం చేయడం, కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయించడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు కష్టించి పనిచేయాలని అలా పనిచేసినవారికి తప్పక గుర్తింపు ఉంటుందని ప్రసాదరాజు స్పష్టం చేశారు. అధికార పార్టీ నాయకులు పెట్టే కేసులు, ఇబ్బందులకు భయపడాల్సిన అవసరం లేదని వైఎస్సార్సీపీ అండగా ఉంటుందన్నారు. నియోజకవర్గ సమన్వయకర్త చినమిల్లి వెంకటరాయుడు మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్టీని మరింత పటిష్టం చేయడానికి శక్తివంచన లేకుండా పనిచేస్తానని గ్రామ, వార్డుస్ధాయిలో పార్టీ పదవుల నియామకాలు పూర్తిచేసి పటిష్టంగా పార్టీ కార్యక్రమాలు అమలు చేస్తామన్నారు. ఆక్వాను పట్టించుకోరా?: మురళీకృష్ణంరాజు పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి నాయకులు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కి రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలుచేస్తున్నారని మండిపడ్డారు. ఆక్వా రంగం నిర్వీర్యమైపోతున్నా పట్టించుకున్న నాథుడే లేడని కూటమి పాలనలో ఏవర్గం ప్రజలకు మంచి జరగలేదన్నారు. ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో అనేక సంక్షేమ అధివృద్ధి కార్యక్రమాలు అమలుచేస్తే నేటి కూటమి ప్రభుత్వం చేస్తున్న అప్పుల సొమ్మంతా ఎక్కడికి పోతుందని ప్రశ్నించారు. నరసాపురం పార్లమెంట్ సమన్వయకర్త గూడూరి ఉమాబాల మాట్లాడుతూ జగన్ హయాంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నారో తెలియచేయాలన్నారు. పార్టీ జిల్లా అధికార ప్రతినిధులు మేడిది జాన్సన్, కామన నాగేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ఏడాది పాలనలో అప్పులు కుప్పలు తప్ప ప్రజలకు ఒరిగింది ఏమి లేదని దుయ్యబట్టారు. నియోజకవర్గంలో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామన్నారు. సమావేశంలో జెడ్పీటీసీ కాండ్రేగుల నర్సింహరావు, ఎంపీపీ పేరిచర్ల నర్సింహరాజు, పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు కోడే విజయలక్ష్మి, యూత్ అధ్యక్షుడు చిగురుపాటి సందీప్, భీమవరం పట్టణ, వీరవాసరం, భీమవరం రూరల్ మండల పార్టీ అధ్యక్షులు గాదిరాజు రామరాజు, చవ్వాకుల సత్యనారాయణ, జల్లా కొండయ్య, పార్టీ నాయకులు పాలవెల్లి మంగ, ఇంటి సత్యనారాయణ, నాగరాజు శ్రీనివాసరాజు, కోడే యుగంధర్, నేతల జ్ఞానసుందరరాజు, పెనుమాల నర్సింహస్వామి, మద్దాల అప్పారావు, తిరుమాని ధనుంజయ, షేక్ రబ్బాని, రాజా బాలమస్తానయ్య, అల్లూరి రవిరాజు, మానుకొండ ప్రదీప్, డీవీడీ ప్రకాష్, పేరిచర్ల సత్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు. భీమవరంలో ‘బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ’ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు -
ట్రిపుల్ ఐటీల్లోని గెస్ట్ ఫ్యాకల్టీకి వేతనాలు పెంచాలి
నూజివీడు: ట్రిపుల్ ఐటీల్లో 2018లో నియమితులైన గెస్ట్ ఫ్యాకల్టీకి వేతనాలను పెంచాలని ట్రిపుల్ ఐటీ కాంట్రాక్టు టీచింగ్ ఫ్యాకల్టీ అసోసియేషన్ అధ్యక్షుడు నజీర్ హుస్సేన్ డిమాండ్ చేశారు. కాంట్రాక్టు టీచింగ్ ఫ్యాకల్టీ అసోసియేషన్ తరుఫున మంగళవారం ఆర్జీయూకేటీ రిజిస్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్కు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2018లో జాయిన్ అయిన గెస్ట్ ఫ్యాకల్టీకి ఇంతవరకు ఒక్క రూపాయి కూడా వేతనం పెరగలేదన్నారు. రాబోయే రోజుల్లో జరగబోయే గవర్నింగ్ కౌన్సిల్ ఎజెండాలో ఈ అంశాన్ని పెట్టి ఛాన్సలర్ దృష్టికి తీసుకెళ్లి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు సునీత, భవ్య, రామకృష్ణ, నేతాజీ తదితరులు పాల్గొన్నారు. -
విదేశీ కోకో గింజల దిగుమతులను నిలుపుదల చేయాలి
ద్వారకాతిరుమల: విదేశీ కోకో గింజల దిగుమతులను నిలుపుదల చేసి, కోకో రైతులకు అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం ధర చెల్లించేలా ఫార్ములా రూపొందించాలని, అందుకు రాష్ట్ర కోకో బోర్డును ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మండలంలోని పంగిడిగూడెం జెడ్పీ హైస్కూల్ వద్ద ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం ఆధ్వర్యంలో, కోకో రైతుల ప్రాంతీయ సదస్సును మంగళవారం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం నాయకుడు రుద్రరాజు సుబ్బరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా కె.శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోకో రైతుల సమస్యలపై చర్చించి, పలు తీర్మానాలను ఆమోదించారు. అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కోకో పంటను మరింతగా ప్రోత్సహిస్తామని, ప్రస్తుతం ఉన్న 75 వేల ఎకరాలకు అదనంగా మరో లక్ష ఎకరాల్లో కోకో పంట సాగు చేసేలా రైతులను ప్రోత్సహిస్తామని ప్రకటించిందన్నారు. ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న కోకో గింజలను మార్కెట్లో అమ్ముకోవడానికి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మరో లక్ష ఎకరాలు పెంచితే ఆ పంటను రైతులు ఎక్కడ అమ్ముకోవాలని ప్రశ్నించారు. సరైన మార్కెటింగ్ సౌకర్యం లేకపోతే కోకో రైతులు మరింతగా ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొల్లు రామకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పానుగంటి అచ్యుతరామయ్య, కోనేరు సతీష్ బాబు మాట్లాడుతూ కోకో రైతులంతా రైతు ఉత్పత్తిదారుల సంఘంగా ఏర్పడి భవిష్యత్తులో తమ కోకో గింజలను మార్కెటింగ్ చేసుకునేలా కోకో రైతులంతా సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. ఆ తరువాత సీఐటీయూ నాయకులు ఆర్.లింగరాజు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కట్టా భాస్కరరావు మాట్లాడుతూ ప్రపంచీకరణ విధానాల వల్ల విదేశీ ఫ్రీ ట్రేడింగ్ అగ్రిమెంట్స్తో వాణిజ్య, వ్యాపార పంటల రైతులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కోకో రైతులు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావం ప్రకటించారు. ఈ సదస్సులో ఎస్.నాగబాబు, పి.ప్రసాద్, వి.వెంకటేశ్వరరావు, తూంపాటి అజయ్ కుమార్, ఎం.మురళీ, నల్లూరి బాపనయ్య, పలు ప్రాంతాలకు చెందిన కోకో రైతులు పాల్గొన్నారు. కోకో రైతుల సదస్సు డిమాండ్ -
ఉన్నత భవిష్యత్కు బాటలు వేసుకోవాలి
నూజివీడు: పీయూసీలో చేరిన విద్యార్థులు క్రమశిక్షణతో మెలుగుతూ బాగా చదువుకొని ఉన్నత భవిష్యత్కు బాటలు వేసుకోవాలని నూజివీడు ట్రిపుల్ఐటీ ఇన్చార్జి డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ అన్నారు. నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు చెందిన పీయూసీ ప్రథమ సంవత్సర విద్యార్థులకు మంగళవారం ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. డైరెక్టర్ మాట్లాడుతూ ట్రిపుల్ ఐటీలోని విద్యావిధానం పట్ల అవగాహన పెంచుకొని తరగతిలో మెంటార్లు చెప్పే పాఠాలను శ్రద్ధగా విని చదువుకోవాలన్నారు. ఈనెల 21 నుంచి అకడమిక్ షెడ్యూల్ ప్రకారం తరగతులు జరుగుతాయని, 28 నుంచి స్టడీ అవర్స్ ప్రారంభిస్తామన్నారు. విద్యార్థులంతా స్నేహభావంతో మెలగాలని, అమ్మాయిల పట్ల అనుచితంగా ప్రవర్తించినా, ర్యాగింగ్ జోలికి వెళ్లినా విద్యార్థులను పంపించేస్తామని హెచ్చరించారు. డీన్ అకడమిక్స్ సాదు చిరంజీవి, ఏఓ లక్ష్మణరావు, డీన్ స్టూడెంటు వెల్ఫేర్ బాలురు రాజేష్, డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ బాలికలు దుర్గాభవాని, చీఫ్ వార్డెన్ సురేష్ బాబు పలు సూచనలు చేశారు. అసోసియేట్ డీన్స్ భరత్, రఘు తదితరులు పాల్గొన్నారు. -
దళితులపై దాడులను అరికట్టాలని వినతి
భీమవరం: రాష్ట్రంలో ఇటీవల దళితులపై దాడులు పెరిగిపోయాయని, వాటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ది బుదిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఏపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కోనా జోసెఫ్ కోరారు. మంగళవారం భీమవరం వచ్చిన జాతీయ షెడ్యుల్డ్ కులాల కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామచందర్, కమిషన్ డైరెక్టర్ జి.సునీల్ కుమార్బాబులను ఆయన కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జోసెఫ్ మాట్లాడుతూ మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని, వర్గీకరణతో కొందరు మాల, మాదిగలు రెండుగా విడిపోయి ఘర్షణలకు దిగుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు భీమవరంలో స్టడీ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. ముందుగా బీఆర్ అంబేడ్కర్ సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఈది రవికుమార్, కేసి రాజు, గంటా సుందరకుమార్, బి కమలాకర్, టి ప్రశాంత్, పి ముసలయ్య, వి రత్నారాజు తదితరులు పాల్గొన్నారు. -
గురువుల మెడపై బోధనేతర కత్తి
నిడమర్రు: పాఠశాల తెరిచి నెల రోజులు పూర్తవుతున్నా కూటమి ప్రభుత్వంలో విద్యాశాఖ తీసుకుంటున్న నిర్ణయాలతో నేటికీ పూర్తిస్థాయిలో ఉపాధ్యాయులు తరగతి గదికి హాజరుకాలేని పరిస్థితి. ఇప్పటికీ బోధనేతర పనులతోనే ప్రభుత్వ ఉపాధ్యాయులు బిజీబిజీగా గడుపుతున్నారు. రోజు రోజుకీ వాట్సాప్లో అర్జెంట్ మెసేజ్లు, ఆన్లైన్ వర్క్లు, వెబ్ఎక్స్ మీటింగ్లతోపాటు నెలరోజులుగా యోగాంధ్ర, మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ వంటి కార్యక్రమాలతో ఉపాధ్యాయులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఇటువంటి నిర్ణయాలను జీర్ణించుకోలేని నెల్లూరు జిల్లాలోని కోటితీర్థంకు చెందిన ఎంపీపీ పాఠశాల హెచ్ఎం ఎం.మధుసూదనరావు తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశం అయ్యింది. ఉపాధ్యాయుల మెడపై ఇలా భోతనేతర పనుల కత్తి వేలాడుతుండడంతో పాఠశాలల్లో విద్యాప్రమాణాలు లోపిస్తున్నాయి. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో ఆదరణ తగ్గుతోంది. దీంతో ఈ విద్యాసంవత్సరంలో 1వ తరగతిలో విద్యార్థుల నమోదు గణనీయంగా పడిపోయింది. ఉమ్మడి జిల్లాలో సుమారు 117 పాఠశాలల్లో జీరో ఎన్రోల్మెంట్ ఉందని గణాంకాలు చెబుతుండడం గమనార్హం. నెలంతా బోధనేతర కార్యక్రమాలే.. ● జూన్ 12వ తేదీన పాఠశాలలు తెరిచినా ఎస్జీటీలకు, ఎంటీఎస్, వృత్తి విద్యా టీచర్స్ బదిలీల కౌన్సిలింగ్ నిర్వహణతో పదిహేను రోజులు గడిచిపోయాయి. ● అనంతరం గిన్నిస్ రికార్డు కోసం జూన్ 21న చేపట్టిన యోగాంధ్ర కోసం పాఠశాలల్లో ముందస్తుగానే ఆయా కార్యక్రమాలు చేపట్టింది. వీటిల్లో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు భాగస్వాములయ్యారు. ● ఆ తరువాత ఈనెల 10వ తేదీన తలపెట్టిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం (మోగా పీటీఎం)కు సంబంధించి పది రోజుల ముందగానే వివిధ కార్యక్రమాలు చేపట్టారు. ● హమ్మయ్య.. అది కూడా ముగిసిందనుకుంటే ఈనెల 14 నుంచి స్కూల్ లీడర్ షిప్, ఎఫ్ఎల్ఎన్ వంటి శిక్షణ కార్యక్రమాలు ఈ నెలాఖరు వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇలా ప్రభుత్వం చేపడుతున్న అనేక కార్యక్రమాలతో ఉపాధ్యాయులు తరగతి గదులకు దూరమవుతున్నారు. దీంతో తరగతులు సక్రమంగా జరగక పాఠాలు అర్థం కాక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. మొరాయిస్తున్న యాప్లతో ఆందోళన మరో వైపు మొరాయిస్తున్న యాప్లతో సైతం ఉపాధ్యాయులు విసిగిపోతున్నారు. పాఠశాల విద్యాశాఖలో ఉన్న అన్ని యాప్లను ఒకే వేదికపైకి తీసుకు వచ్చి లీప్ (లెర్నింగ్ ఎక్స్లెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్) యాప్ను రూపొందించారు. దాంట్లోనే ఐఎంఎంఎస్, స్టూడెంట్ కిట్స్, మెగాపీటీఎం వంటివాటిని అనుసంధానం చేశారు. దీంతో సర్వర్ డౌన్ సమస్యలతో నేటికీ అన్లైన్లో టీచర్ ఫోటో హాజరు నమోదుకు ఉదయం, సాయంత్రం వేళల్లో 5 నుంచి 15 నిమిషాలు పడుతున్నట్లు ఉపాధ్యాయులు చెపుతున్నారు. ఇదిలా ఉంటే నేటి నుంచి విద్యార్ధి మిత్ర కిట్లు విద్యార్థులకు అందినట్లు తల్లింద్రడులతో బయోమెట్రిక్ వెయించాలని చెబుతున్నారు. కానీ ఏ పాఠశాలలో కూడా దీనికి సంబంధించిన డివైజ్ మిషన్స్ అదుబాటులో లేని పరిస్థితి. పెద్ద స్కూళ్లలో క్లాస్ టీచర్కు ఒక వారం రోజులు ఇదే పనిలో ఉండాల్సిందే అని చెబుతున్నారు. సన్నబియ్యం బస్తా చుట్టూ తిరగాల్సిందే ఈ ఏడాది నుంచి మధ్యాహ్న భోజన పథకంకు సంబంధిచి పాఠశాలలకు సన్నబియ్యం అందించారు. ప్రతి నెలా పాఠశాలకు అందిన అన్ని బస్తాలపై క్యూఆర్ కోడ్లను ఉపాధ్యాయులు స్కానింగ్ చేసి ఆన్లైన్లో నమోదు చేయాలి. తర్వాత వంటకు ముందు ఆ బస్తా ఓపెన్ చేసిన ప్రతిసారి క్యూఆర్ కోడ్ను స్కానింగ్ చేసి ఆ బస్తాలో ఉన్న బియ్యం క్యాలిటీ పరిశీలించి ఆన్లైన్లో నమోదు చేయాల్సిన పరిస్థితి. లేదంటే బియ్యం స్టాక్ గోఔన్ నుంచి ఉపాధ్యాయులకు ఫోన్లు వస్తున్నాయి. డీఈవో వద్ద ఫ్యాప్టో నేతల ఆవేదన ఇటీవల పెరుగుతున్న బోధనేతర పనులు, శిక్షణలతో ఉపాధ్యాయులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని మంగళవారం ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక (ఫ్యాప్టో) నేతలు జిల్లా విద్యాశాధికారి నారాయణను కలసి ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత ఒత్తిడిలో హెలిస్టిక్ ప్రోగ్రస్ కార్డులు పూర్తి చేయలేదనడం సరికాదన్నారు. ఎస్ఎల్డీటీ శిక్షణలు జిల్లా కేంద్రాల్లో కాకుండా అగిరిపల్లి, నల్లజర్లలో రెసిడెన్సియల్ విధానంలో ఏర్పాటు సరైన నిర్ణయం కాదని ఫ్యాక్టో నేతలు డీఈవోకు వివరించారు. నెలరోజులుగా యోగాంధ్ర, మెగా పీటీఎంలతో సరి ప్రస్తుతం లీడర్షిప్, ఎఫ్ఎల్ఎన్ శిక్షణలతో బిజీ ప్రతీ రోజు గంట సమయం ఆన్లైన్, యాప్ల భారం తరగతి గదికి దూరమవుతున్నామంటూ ఉపాధ్యాయుల ఆవేదన బోధనేతర పనుల ఒత్తిడిపై ఉమ్మడి పోరాటం పాఠశాలలు తెరిచి రెండో నెలలో ప్రవేశించినా ఉపాధ్యాయులు సంతృప్తిగా పాఠాలు బోధించిన దాఖలాలు లేవు. యెగా డే, మెగా పేరెంట్స్ మీటింగ్కు సంబంధించి ఆన్లైన్ నమోదు, శిక్షణలతో ఉపాధ్యాయులను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారు. బోధనేతర పనులు తగ్గించే వరకూ అన్ని యూనియన్లు ఉమ్మడి పోరాటంకు సిద్ధం కావాలి. – పుప్పాల ప్రకాశరావు, రాష్ట్ర కార్యదర్శి, ఎస్టీయూ ఉపాధ్యాయుల ప్రాణాలతో చెలగాటం తగదు పాఠశాల ప్రారంభం నెలల్లో జరుగుతన్న శిక్షణలకు అర్థగట్ల జెడ్పీస్కూల్ హెచ్ఎం ఎస్వీఆర్ మూర్తిరాజు బలయ్యారు. ఆన్లైన్ పనులు, శిక్షణల పేరుతో ఉపాధ్యాయుల ప్రాణాలతో చెలగాటం అడడుతున్నారు. ఇలా శిక్షణల పేరుతో టీచర్లను మానసిక ఒత్తిడికి గురి చేయడం తగదు. – బోర్రా గోపీ మూర్తి, టీచర్స్ ఎంఎల్సీ -
నూతన విద్యావిధానాలపై పోరాడాలి
కుక్కునూరు: నూతన విద్యావిధానానికి వ్యతిరేకంగా విద్యార్థులు, తల్లిదండ్రులు ఐక్యంగా పోరాటం చేయాలని పీడీఎస్యూ నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం మండలంలోని లచ్చిగూడెం గ్రామంలో పీడీఎస్యూ ఆధ్వర్యంలో విద్యార్థులు, యువకులతో జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సోయం కార్తీక్, తుర్రం నవీన్ మాట్లాడుతూ జీఓ నెంబర్ 117ను రద్దు చేస్తామని వాగ్దానం చేసిన కూటమి ప్రభుత్వం జీఓ నెంబర్ 19, 21లతో మరింత నష్టకరమైన తొమ్మిది రకాల బడుల విధానాన్ని ప్రవేశపెట్టడం దారుణమని అన్నారు. జీఓ నెంబర్ 117తో 12 వేల ఏకోపాధ్యాయ బడులు ఏర్పడగా వాటికి మరిన్ని జోడించబడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే ఉపాధ్యాయుడితో విద్యా బోధన అసాధ్యం అన్నారు. మూడు, నాలుగు తరగతులను ఉన్నత పాఠశాలకు బదిలీ చేయడం అనాలోచితం, అశాసీ్త్రయమని విమర్శించారు. ప్రపంచ బ్యాంక్ ద్రవ్యనిధి ఆదేశాల మేరకు ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్యను 30 శాతం మేర తగ్గించేందుకు కుట్ర జరుగుతుందన్నారు, ప్రపంచ బ్యాంక్ రుణాలపై ఆధారపడిన ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా 2020 జాతీయ విద్యా విధానాన్ని తీసుకువచ్చాయని, దీనిపై అందరూ ఐక్యంగా పోరాడాలన్నారు. సమావేశంలో పీడీఎస్యూ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
వేసవిని మించి.. ఠారెత్తిస్తున్న ఎండలు
ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలు పెంటపాడు: రోజురోజుకు ఎండలు ఠారెత్తిస్తున్నాయి. వర్షాకాలంలో వేసవిని మించి ఇలా ఎండలు మండిపోతుండడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఎండ వేడిమి, ఉక్కపోత తట్టుకులేక అల్లాడుతున్నారు. ఈ విచిత్ర వాతావరణాన్ని తట్టుకోలేక అనేకమంది వ్యాధుల బారిన పడుతున్నారు. ఎండల వల్ల ప్రజలు బయటకు రాకపోవడంతో వ్యాపారాలు కూడా దెబ్బతింటున్నాయి. కార్మికులు, స్కూలుకు వెళ్లే చిన్నారులు ఎండ దెబ్బకు అల్లాడుతున్నారు. కాగా ఖరీస్ సాగు పనులు ఇప్పటికే ప్రారంభం కాగా వర్షాలు లేకపోవడం, ఎండ వేడికి నాట్లు దెబ్బతినే అవకాశం ఉండడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. వేళాపాళా లేని విద్యుత్ కోతలు అప్రకటిత విద్యుత్ కోతలతో తాడేపల్లిగూడెం నియోజకవర్గం ప్రజలు అల్లాడుతున్నారు. సమయం, సందర్భం లేకుండా లైన్ క్లియరెన్స్, జంగిల్ క్లియరెన్స్, మెయింట్నెన్స్ వర్కులు అంటూ రోజూ ఏదో ప్రాంతంలో కోతలు విధిస్తున్నారు. రాత్రి సమయాల్లో అయితే ఇక చెప్పనక్కరలేదు. దీంతో కరెంటు లేక, ఉక్కపోత తట్టుకోలేక చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దోమలు బెడద కూడా ఎక్కువగానే ఉంది. పెంటపాడు, గూడెం ప్రాంతాల్లో ప్రతిరోజూ 10 గ్రామాల చొప్పున విద్యుత్ కోత ఉంటోంది. ఈ సమస్య ఎప్పటికీ తీరుతుందో తెలియడం లేదని ప్రజలు వాపోతున్నారు. -
వైభవంగా సువర్చలా హనుమద్ కల్యాణం
జంగారెడ్డిగూడెం: గుర్వాయిగూడెం మద్ది క్షేత్రంలో మంగళవారం సువర్చలా హనుమద్ కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. అర్చకులు స్వామివారికి ప్రభాతసేవ, నిత్యార్చన పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక అలంకరణలో స్వామివారు భక్తులకు దర్శనం ఇచ్చారు. పూర్వాభాద్రా నక్షత్రం పురస్కరించుకుని మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛరణల నడుమ అష్టోత్తర మండపంపై శ్రీ సువర్చలా హనుమద్ కల్యాణ క్రతువు వైఖానస ఆగమ శాస్త్రబద్ధంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కల్యాణాన్ని వీక్షించి తరించారు. మధ్యాహ్నం వరకు దేవస్థానానికి వివిధ సేవలు, విరాళాల రూపంలో రూ.1,83,399 సమకూరినట్లు ఈవో ఆర్వీ చందన తెలిపారు. సారా స్థావరంపై ఎకై ్సజ్ దాడులు బుట్టాయగూడెం: జీలుగుమిల్లి మండలం పి.అంకంపాలెం సమీపంలో సారా తయారీ స్థావరంపై మంగళవారం ఎకై ్సజ్ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో 200 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశామని, 5 లీటర్ల సారా స్వాధీనం చేసుకుని ఒక వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎకై ్సజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె. శ్రీనుబాబు తెలిపారు. దాడుల్లో ఎకై ్సజ్ ఎస్సైలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ ఏసీ బస్సుల్లో ఆషాఢం ఆఫర్
ఏలూరు (ఆర్ఆర్పేట): ఆర్టీసీ ఏసీ బస్సుల ప్రయాణికులకు ఆషాఢం ఆఫర్ అందిస్తున్నట్టు ఏలూరు జిల్లా ప్రజా రవాణా అధికారి షేక్ షబ్నం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు ఆర్టీసీ డిపోల నుంచి బయలుదేరే అన్ని ఏసీ బస్సుల్లో ప్రయాణికులకు వెళ్లేటప్పుడు 10 శాతం, తిరిగి వచ్చేటప్పుడు 10 శాతం ప్రయాణ చార్జీల్లో రాయితీ ఇస్తున్నట్టు తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్టీసీ బస్సుల్లో సురక్షితంగా ప్రయాణం చేయాలన్నారు. ఉరి వేసుకుని యువతి ఆత్మహత్య భీమడోలు: గుండుగొలనులో ఓ యువతి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల ప్రకారం.. గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన సిరికోటి నర్మద అలియాస్ మౌనిక (20) ఈనెల 13వ తేదీ ఆదివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చే సరికి ఆమె విగత జీవిగా పడి ఉంది. ప్రేమ వ్యవహారమే యువతి మృతికి కారణమని అనుమానిస్తున్నారు. నర్మద అమ్మమ్మ కురమా మాణిక్యం ఫిర్యాదు మేరకు భీమడోలు ఎస్సై వై.సుధాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫిట్స్తో కాలువలో పడి.. భీమవరం: ఫిట్స్తో ప్రమాదవశాత్తు కాలువపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందినట్లు భీమవరం టూటౌన్ ఎస్సై కె రామారావు మంగళవారం చెప్పారు. పట్టణంలోని సత్యవతి నగర్కు చెందిన గుమ్మాడి రామచంద్రరావు(32) ఈనెల 13వ తేదీన ఫిట్స్తో కాలువలో పడిపోయాడు. అతడిని బంధువులు ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. రామచంద్రరావు తల్లి రత్నకుమారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రామారావు చెప్పారు. తణుకులో బుల్లెట్ చోరీ తణుకు అర్బన్: తణుకులో బుల్లెట్ వాహనం చోరీ చేసిన ఘటన చోటుచేసుకుంది. స్థానిక మునిసిపల్ కార్యాలయంలో అసిస్టెంట్ ఇంజనీరుగా పనిచేస్తున్న మహమ్మద్ ఆలీషా తన ఇంటి ముందు పార్కింగ్ చేసిన బుల్లెట్ సోమవారం రాత్రి అపహరణకు గురైందని తెలిపారు. బుల్లెట్ను ఇద్దరు యువకులు వేసుకుని వెళ్తున్నట్లుగా సమీపంలోని సీసీ పుటేజీ ద్వారా గుర్తించినట్లు చెప్పారు. బుల్లెట్ చోరీపై పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఆలీషా తెలిపారు. ‘మన మిత్ర’ యాప్ ద్వారా నీటితీరువా పన్నుల చెల్లింపు ఏలూరు (మెట్రో): జిల్లాలో నీటితీరువా పన్నులను ‘మన మిత్ర’ యాప్ ద్వారా చెల్లించవచ్చని జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు ‘మన మిత్ర’ యాప్ను డౌన్లోడ్ చేసుకుని నీటితీరువా పన్నులను చెల్లించాలన్నారు. ఏదైనా సమస్యలు ఎదురైతే 95523 00009 నంబర్లో సంప్రదించాలన్నారు. -
మహిళలకు రక్షణ కరువు
కై కలూరు: కూటమి పాలనలో మహిళలకు పూర్తిగా రక్షణ కరువైందని వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం సెక్రటరీలు గంటా సంధ్య, కూసంపూడి కనక దుర్గారాణి మండిపడ్డారు. ఉమ్మడి కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక కారుపై గుడివాడలో జరిగిన దాడిని ఖండిస్తూ కై కలూరు పార్టీ కార్యాలయంలో సోమవారం సమావేశం నిర్వహించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎన్నికల్లో కూటమి పాలనలో మహిళలపై దాడులను జరగనివ్వమని పదేపదే వల్లించిన వాగ్ధానాలు ఇప్పుడేమయ్యాయని? ప్రశ్నించారు. హోం మంత్రి అనిత సాటి మహిళగా ఇలాంటి దాడులను ఖండిచాలన్నారు. జిల్లా ప్రథమ పౌరురాలు రక్షణ కల్పించండని వేడుకున్నా పోలీసులు చోద్యం చూశారన్నారు. ముదినేపల్లి వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ సభ్యురాలు ఈడే వెంకటేశ్వరమ్మ, నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు దున్నా బేబీ మాట్లాడుతూ మహిళలపై దాడులు పెరుగుతున్నా అదుపు చేయలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందన్నారు. బీసీ వర్గానికి చెందిన మహిళా చైర్పర్సన్పై దాడి అమానుషమన్నారు. ముదినేపల్లి మండల వైస్ ఎంపీపీ రాచూరి రాధ, ఆటపాక 1, ఆడపాక 2 ఎంపీటీసీ సభ్యులు తమ్మిశెట్టి లక్ష్మీ, పట్టపు బాలమ్మ, మహిళా నాయకులు అర్జ విజయదుర్గ, మద్దా రాణి, ఆరేపల్లి శివ నాగలక్ష్మీ, తేరా జ్ఞానావతి పాల్గొన్నారు. -
వార్డు సచివాలయ కార్యాలయం మార్పు
ఆకివీడు: స్థానిక నగర పంచాయతీలోని సచివాలయం–5 కార్యాలయ భవనం శిథిలావస్థలో ఉండటంతో కార్యాలయాన్ని స్థానిక వెలంపేట రామాలయం వద్దకు మార్పు చేసేందుకు చర్యలు చేపట్టామని నగర పంచాయతీ చైర్పర్సన్ జామి హైమావతి సోమవారం చెప్పారు. జాతీయరహదారికి చేర్చి పెట్రోల్ బంకు ఎదురుగా ఉన్న నాలుగు అంతస్తుల భవనం కూలడానికి సిద్ధంగా ఉందని, దానిలో సచివాలయం, ప్రైవేటు విద్యా సంస్థను నడుపుతున్నారని సాక్షిలో వచ్చిన కథనానికి ఆమె స్పందించారు. భవన యజమానికి, విద్యా సంస్థ యజమాన్యానికి నోటీసులు ఇచ్చినట్లు ఆమె తెలిపారు. సచివాలయ కార్యాలయం మార్చి, మంగళవారం ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య భీమవరం అర్బన్: భీమవరం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యనమదుర్రు గ్రామానికి చెందిన తోలేరు సత్యనారాయణ (60) అనారోగ్యంతో ఇంటివద్దే ఉంటున్నాడు. ఆస్పత్రులు చుట్టూ తిరిగి ఎన్ని చికిత్సలు చేయించుకున్నా ఆరోగ్యం కుదుట పడటం లేదు. దీంతో ఆ బాధ తట్టుకోలేక ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సత్యనారాయణ కుమారుడి ఫిర్యాదు మేరకు హెడ్ కానిస్టేబుల్ పి.మహేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బంగారం, వెండి చోరీ నరసాపురం రూరల్: మండలంలోని గొందిలోలో తాళం వేసిన ఇంట్లో చోరీ చేసిన ఘటన ఆదివారం రాత్రి జరిగింది. ఈ ఘటనకు సంబందించి ఎస్సై టి.వెంకట సురేష్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన శీలబోయిన దేశింగరావు ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఈ నెల 12 ఇంటికి తాళం వేసి ఊరు వెళ్లారు. తిరిగి 13న ఇంటికి వచ్చేసరికి తాళం పగులగొట్టి బీరువాలోని సుమారు రెండున్నర కాసులు బంగారం, 30 గ్రాముల వెండి, సుమారు రూ.5 వేల నగదు పట్టుకుపోయారు. చోరీ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎసై టీవీ సురేశ్ గ్రామానికి వెళ్లి చోరీ జరిగిన తీరును పరిశీలించారు. భీమవరం నుంచి క్లూస్ టీంను రప్పించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
బీడు వారిన భూములు
దెందులూరు: దెందులూరు మండలంలో సాగునీరు అందక నారుమళ్లు ఎండిపోతున్నాయి. పోతునూరు, కేదవరం, గుండుగొలనుతో పాటు దెందులూరు శివారు ప్రాంతాల్లో 450 ఎకరాలకు పైగా పొలాల్లో సాగు ప్రశ్నార్థకంగా మారింది. గోదావరి కాలువకు ఆనుకుని ఉన్న గ్రామాల్లో ఈ పరిస్థితి ఉండటంతో రైతులకు దిక్కుతోచడం లేదు. ఎవరికి చెప్పాలో తెలియక ఎప్పుడు నీళ్లు వస్తాయోనని రైతులు ఎదురుచూస్తున్నారు. అందరూ సన్నా చిన్నకారు రైతులే. ప్రభుత్వం మాత్రం వందల ఎకరాల్లో సాగునీరు లేక పంట ఎండుతున్నా.. పట్టించుకోకపోవడంపై రైతులు, రైతు కూలీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇరిగేషన్ అధికారులు కూడా కనీసం ఏం జరుగుతుందో.. పరిశీలన కూడా చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇరిగేషన్ ఉద్యోగులు పట్టించుకోకపోతే జిల్లా అధికారులకు ఈ విషయం ఏం తెలుస్తుందని.. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టిలో కూడా లేకపోతే తమ సమస్య ఎప్పటికీ పరిష్కారం అవుతుందని రైతులు ప్రశ్నిస్తున్నారు. దెందులూరు నియోజకవర్గంలో నారుమళ్లకు అందని సాగు నీరు 450 ఎకరాల్లో సాగు ప్రశ్నార్థకం -
ట్రిపుల్ ఐటీకి చేరుకుంటున్న పీయూసీ–1 విద్యార్థులు
నూజివీడు: పీయూసీ ప్రథమ సంవత్సర విద్యార్థులు సోమవారం నూజివీడు ట్రిపుల్ఐటీకి చేరుకున్నారు. నూజివీడుతో పాటు ఒంగోలు, శ్రీకాకుళంకు సంబంధించిన పీయూసీ ప్రథమ సంవత్సరం విద్యార్థులు 2030 మంది తొలిరోజు నూజివీడు క్యాంపస్కు చేరుకున్నారు. విద్యార్థులతో పాటు వారి వెంట తల్లిదండ్రులు రావడంతో క్యాంపస్లో కోలాహలం నెలకొంది. డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ అధికారులు రాజేష్, దుర్గాభవానీలు, చీఫ్ వార్డన్లు సురేష్బాబు, గౌతమిలు కేర్టేకర్ల సహాయంతో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా రూంలు కేటాయించారు. -
తూర సైజు పెంచాలి
ఉండ్రాజవరం దగ్గర కొత్తచెరువు బోది వద్ద తూర పెంచాలి. తూర సైజు చిన్నగా ఉండటం వల్ల సాగునీటి సమస్య తలెత్తింది. సమస్య వెంటనే పరిష్కరించాలి. –చెన్ను లక్ష్మణ, రైతు 50 ఎకరాల్లో సాగునీటి సమస్య కేధవరం, పోతునూరు, గుండుగొలను గ్రామాల్లో 450 ఎకరాలకు సాగునీటి సమస్య ఉంది. రైతుల సమస్య పరిస్థితి అధ్వానంగా తయారైంది. ఎవరికి చెప్పాలో ఎవరు పరిష్కరిస్తారో అర్థం కావట్లేదు. –మురల సత్యనారాయణ, రైతు● -
అక్రమ చేపల చెరువుల జాతర
సాక్షి, టాస్క్ఫోర్స్: పచ్చని పైర్లతో ధాన్యగారంగా పేరుపొందిన ముదినేపల్లి మండలాన్ని ఆక్వా చెరువులు ఆక్రమిస్తున్నాయి. వ్యవసాయ భూములను చేపల చెరువులుగా మార్చాలంటే కఠిన నిబంధనలు ఉన్నప్పటికీ కూటమి నేతల ముందు అవి పనిచేయడం లేదు. కై కలూరు నియోజకవర్గంలో ప్రభుత్వానికి సమాంతర పాలన సాగుతోంది. ఆక్వా చెరువుల వల్ల తమకు నష్టం జరుగుతోందని గ్రామస్తులు రొడ్కెక్కుతున్నా అక్రమార్కుల కుట్రల ముందు ప్రజల వేదన అరణ్యరోదనగా మారుతోంది. ఏడాదిలో 400 ఎకరాల్లో చెరువులు కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ఒక్క ముదినేపల్లి మండలంలో దాదాపు 400 ఎకరాల్లో చేపల, రొయ్యల చెరువులను తవ్వేశారు. దేవరం గ్రామంలో ప్రస్తుతం 27 ఎకరాల విస్తీర్ణంలో ఎలాంటి అనుమతులు లేకుండా చెరువులు తవ్వుతున్నారు. ఇదే మండలంలో పెదగొన్నూరులో 100, ఊటుకూరులో 100, వాడవల్లిలో 80, వణుదుర్రులో 70, దేవపూడిలో 40, పేరూరులో 10, గురజలో 10, వైవాకలో 6 ఎకరాల్లో చెరువులు తవ్వారు. కూటమిలో టీడీపీ, జనసేన నేతలు పోటాపోటీగా చెరువులు తవ్వేస్తున్నారు. ఓ సినీ నిర్మాతకు చెందిన చెరువు తవ్వకం ఇటీవల వివాదంగా మారింది. వణుదుర్రు గ్రామంలో ఆక్వా చెరువుల వల్ల తాగునీటి చెరువు కులుషితమవుతోందని గ్రామస్తులు ఆందోళన చేసినా ఫలితం కనిపించలేదు. చట్టాలంటే లెక్కే లేదు కూటమి నేతలు చట్టాలను లెక్క చేయడం లేదు. వ్యవసాయ భూములను చేపల చెరువులుగా మార్పు చేయాలంటే మండల స్థాయి కమిటీ నుంచి జిల్లా స్థాయి కమిటీ సిఫార్సుల మేరకు డీఎల్సీలో ఆమోదం తెలపాలి. ఏపీ స్టేట్ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ(అప్సడా) నిబంధనలు పాటించాలి. మత్స్య శాఖ, రెవెన్యూ, ఇరిగేషన్, డ్రెయినేజీ, అగ్రికల్చర్, పొల్యుషన్ కంట్రోల్ బోర్డు శాఖలు పరిశీలన చేసి జిల్లా అధికారులకు నివేదిక ఇవ్వాలి. వరి పొలాలకు 3 మీటర్లు, తాగునీటి చెరువు, శ్మశానాలకు 10 మీటర్ల దూరంలో మాత్రమే చెరువు తవ్వాలి. ఇవేమి పాటించడం లేదు. దేవరంలో చేపల చెరువు తవ్వకాలపై గ్రామ వీఆర్వో ఏడుకొండలను వివరణ కోరగా మీరు ముదినేపల్లిలో బుజ్జిని కలవండని చెప్పడం విస్తుగొలిపింది. మత్స్యశాఖ అధికారి సతీష్కుమార్ను అడిగితే రెండేళ్ళ క్రితం చెరువు తవ్వకాలకు ధరఖాస్తు చేశారని, ఇప్పుడు అనుమతులు గురించి తెలీదని తప్పించుకున్నారు. ఈ విధంగా పలు శాఖల అధికారులు కూటమి నేతలకు భయపడి దాటవేత ధోరణి అనుసరిస్తున్నారు. ఇది మా అడ్డా కూటమి విజయంలో మా మండలం కీలకపాత్ర పోషించింది. ఇది మా అడ్డా అనే ధోరణి మండలంలో కనిపిస్తోంది. అక్రమ చెరువుల తవ్వకం, అక్రమ మైనింగ్ యథేచ్చగా సాగుతున్నా రెవెన్యూ, పోలీసు శాఖలు అటుగా చూడడానికి జంకుతున్నారు. ఇక పేకాట సంగతి సరే సరి. చెరువు గట్లు పేకాట క్లబ్లుగా మారుతున్నాయి. సమీప గుడివాడ నుంచి పేకాటరాయుళ్లు ఈ మండలానికి వస్తున్నారు. ఈ మండలంలో పేరు మోసిన పేకాట నిర్వాహకుడు పలుమార్లు పోలీసుల చేతికి చిక్కినా.. రాజకీయ నాయకుల అండతో బయటపడుతున్నాడు. రాష్ట్ర స్థాయిలో టీడీపీ నాయకుల పరిచయాలతో ఏదైనా చేయవచ్చనే ధోరణి ఈ మండలంలో స్పష్టంగా కనిపిస్తోంది. వరిని మింగుతున్న చెరువులు వరిని ఆక్వా చెరువులు మింగేస్తున్నాయి. పచ్చని పొలాలు చేపల, రొయ్యల చెరువుగా మారుతున్నాయి. నియోజకవర్గంలో కై కలూరు, కలిదిండి, మండవల్లి, ముదినేపల్లి మండలాల్లో వ్యవసాయ సాగు విస్తీర్ణం 22,493 ఎకరాల్లో ఉంది. మొత్తం 10,766 రైతులు జీవనం సాగిస్తున్నారు. ఇక ఆక్వా చేపల, రొయ్యల విషయానికి వస్తే నాలుగు మండలాల్లో 84,755 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ముదినేపల్లి మండలంలో పూర్వం 25 వేల ఎకరాల విస్తీర్ణంలో వ్యవసాయ సాగు ఉండేది. ఇప్పుడు 14,000 ఎకరాలకు పడిపోయింది. ముదినేపల్లి మండంలో విచ్చలవిడి చెరువుల తవ్వకాల వల్ల రానున్న రోజుల్లో వ్యవసాయం కనుమరగయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ముదినేపల్లి మండలంలో ఏడాదిలో 400 ఎకరాల్లో చెరువులు అమలుకాని అప్సడా నిబంధనలు చోద్యం చూస్తున్న రెవెన్యూ, మత్స్య శాఖ అధికారులు -
ఎండుతున్న నారుమళ్లు
భీమవరం: నీటిపారుదల శాఖాధికారుల నిర్లక్ష్యం కారణంగా జిల్లాలోని అనేక ప్రాంతాల్లో సాగు నీరందక సార్వా నారుమళ్లు ఎండిపోతున్నాయని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మామిడిశెట్టి రామాంజనేయులు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం జిల్లాలోని వివిధ గ్రామాల్లో పర్యటించి రైతుల సమస్యలు తెలుసుకున్న అనంతరం భీమవరంలో విలేకర్లతో మాట్లాడారు. సాగునీటి సమస్యపై పోడూరు, ఆచంట, యలమంచిలి, పాలకోడేరు, అత్తిలి, వీరవాసరం మండలాల్లోని రైతులతో మాట్లాడినట్లు రామాంజనేయులు తెలిపారు. చెంతనే గోదావరి ఉన్నా సార్వా నారుమళ్లకు నీరందకపోవడంతో ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల పరిస్థితి అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని సామెత చందాన గోదావరిలోని నీరు సముద్రంలోకి వెళ్తుంటే అనేక మండలాల్లో వేలాది ఎకరాలకు సాగునీరందక నారుమళ్లు ఎండిపోయాయన్నారు. కొన్నిచోట్ల కనీసం దమ్ము చేసే అవకాశం లేదని కౌలురైతులు వాపోతున్నారన్నారు. ఇరిగేషన్ శాఖమంత్రి జిల్లాలోనే ఉన్నా ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యంతో వేలాది రూపాయలు ఖర్చుచేసి వేసిన నారుమళ్లు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. కాలువలు వదిలి రెండు నెలలైందని మరోపక్క గోదావరి ఉధృతంగా సముద్రంలోకి వెళ్తున్నా రైతులకు సాగునీటి కష్టాలేంటని ప్రశ్నించారు. కాలువలకు లెవల్ పెంచి పూర్తి స్థాయిలో సాగునీరు ఇవ్వాలని, తక్షణం చించినాడ, కవిటం, దేవ, చినమల్లం బ్యాంక్ కెనాల్, మోగల్లు పంట కాలువలకు నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
భర్త బెదిరిస్తున్నాడని ఫిర్యాదు
జంగారెడ్డిగూడెం: తనపై పెట్టిన మనోవర్తి కేసు వెనక్కి తీసుకోవాలని భర్త బెదిరిస్తున్నట్లు భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై షేక్ జబీర్ తెలిపారు. జంగారెడ్డిగూడెంకు చెందిన నన్నుబ్రోలు నాగదుర్గాప్రసాద్, సత్యతులసిలకు 17 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరు ప్రస్తుతం విడిగా ఉంటున్నారు. సత్యతులసి భర్తపై మనోవర్తి కేసు పెట్టిందన్నారు. ఈ నెల 13న సత్యతులసి తన పిల్లలతో ఉన్న సమయంలో నాగుదుర్గాప్రసాద్ మద్యం సేవించి ఇంటికి వచ్చి బూతులు తిడుతూ, కొడుతూ కేసు వెనక్కి తీసుకోవాలని దౌర్జన్యం చేశాడన్నారు. కేసు వెనక్కి తీసుకోకపోతే చంపుతానని బెదిరించాడని, దీంతో సోమవారం ఫిర్యాదు చేసిందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. విజిలెన్స్ తనిఖీలు జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం మండలంలో విజిలెన్స్, వ్యవసాయ అధికారులు ఎరువులు, పురుగుమందులు, విత్తనాల షాపులను సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విజిలెన్స్ సీఐ జి.మధుబాబు మాట్లాడుతూ వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు జంగారెడ్డిగూడెం మండలంలో తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు. తనిఖీల్లో భాగంగా చాముండేశ్వరి ఎంటర్ప్రైజెస్లో నిర్వహించిన తనిఖీల్లో వ్యత్యాసాలు గుర్తించామన్నారు. గడువు ముగిసిన పురుగుమందులు గుర్తించినట్లు చెప్పారు. సరైన ధ్రువీకరణ పత్రాలు చూపించకపోవడంతో సేల్స్ నిలుపుదల ఉత్తర్వులు ఇచ్చినట్లు చెప్పారు. తనిఖీల్లో సీఐ మధుబాబుతో పాటు సహాయ వ్యవసాయ సంచాలకుడు బి.వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. -
ఎస్టీ మహిళ రిజర్వేషన్ కొనసాగించాలి
భీమవరం మార్కెట్ యార్డ్ చైర్మన్కు సంబంధించి ఎస్టీ మహిళ రిజర్వేషన్ కొనసాగించాలని ఎస్టీ సంఘాల నాయ కులు డిమాండ్ చేశారు. భీమవరం ఏఎంసీ చైర్మన్ రిజర్వేషన్ మార్చడంపై సోమవారం కలెక్టరేట్కు ఎస్టీ సంఘాల నాయకులు సాలా శ్రీను ఆధ్వర్యంలో వచ్చి నిరసన తెలిపారు. అనంతరం జేసీకి వినతిపత్రం సమర్పించారు. వైఎస్సార్సీపీ ఎంబీసీ విభాగ రాష్ట్ర అధ్యక్షుడు పెండ్ర వీరన్న మాట్లాడుతూ మొదటగా భీమవరం ఏఎంసీ చైర్మన్ను ఎస్టీ మహిళకు కేటాయించి తర్వాత ఓసీ మహిళగా మార్చడం అన్యాయమన్నారు. కూటమి ప్రభుత్వానికి ఎస్టీలపై ఉన చిన్నచూపునకు ఇది నిదర్శనమన్నారు. కేంద్ర మంత్రి, ఎమ్మెల్యే పక్కన ఎస్టీ మహిళ చైర్మన్ హోదాలో కూర్చోవడానికి అర్హురాలు కాదా అని ప్రశ్నించారు. ఏఎంసీని ఎస్టీ మహిళకు కేటాయించకుంటే పోరాటం చేస్తామని హె చ్చరించారు. సాలా వెంకటేశ్వరరావు, కారంపూడి అనంతనాగు, నల్లగుంట ఏసు, బండి రాంబాబు పాల్గొన్నారు. -
అర్జీల పరిష్కారానికి చర్యలు
భీమవరం: బాధితుల సమస్యలపై సానుకూలంగా స్పందించి తక్షణమే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆదేశించారు. సోమవారం పట్టణంలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్లో ఫిర్యాదులు స్వీకరించారు. అర్జీదారులతో ము ఖాముఖి మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. మొత్తంగా 12 ఫిర్యాదులు అందగా ఆయా పోలీస్స్టేషన్ల అధికారులతో ఎస్పీ మాట్లాడారు. జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) వి.భీమారావు, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ వి.పుల్లారావు, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ దేశంశెట్టి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
బెల్టుషాపులను ప్రోత్సహించడం సిగ్గుచేటు
బెల్టు షాపులను ప్రభుత్వ మే ప్రోత్సహించడం సిగ్గుచేటని, గీత వృత్తిని కాపాడాలంటూ పీడీఎఫ్ ఎమ్మె ల్సీ బొర్రా గోపిమూర్తి , ఏపీ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్య దర్శి జుత్తిగ నరసింహామూర్తి డిమాండ్ చేశారు. భీమవరంలో కలెక్టరేట్ వద్ద కల్లు గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ‘కలెక్టర్ గారికి చెప్పుకుందాం రండి’ పేరుతో ధర్నా చేపట్టారు. గీత కార్మికులు మోకులతో వినూత్న ప్రదర్శన చేసి నిరసన తెలిపారు. అనంతరం కలెక్టరేట్లో జేసీకి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ గోపిమూర్తి రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం దొరుకుతుందని, ప్రభుత్వ విధానాలు, ఎకై ్సజ్ పాలసీల వలన కల్లుగీత కార్మికుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. నరసింహమూర్తి మాట్లాడుతూ కల్తీ మద్యాన్ని అరికట్టడంలో అధికారులు విఫలమవుతున్నారని, బెల్ట్షాపులు ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో ఎకై ్సజ్ అధికారుల సహకారంతో నడుస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్ర సహాయ కార్యదర్శి బొక్కా చంటి, సంఘ జిల్లా అధ్యక్షుడు కామన మునిస్వామి పాల్గొన్నారు. -
అర్జీలను వేగంగా పరిష్కరించాలి
భీమవరం(ప్రకాశం చౌక్): పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీలను వేగంగా పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్కుమార్రెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో పీజీఆర్ఎస్లో భాగంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత గడువులోపు పరిష్కారం చూపాలని, నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. డీఆర్వో మొగిలి వెంకటేశ్వర్లు, కేఆర్ఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.శివన్నారాయణ రెడ్డి, పీజీఆర్ఎస్ నోడల్ అధికారి వై.దోసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అర్జీల్లో కొన్ని.. ● పాలకోడేరుకు చెందిన తొంట రాజమణి తనకు తల్లికి వందనం ఇప్పించాలని అర్జీ అందించారు. ● పెనుగొండ మండలం పితానివారిపాలేనికి చెందిన వేండ్ర మోహన్రావు అనారోగ్య కారణంతో కాలు తొలగించారని సామాజిక పింఛన్ సొమ్ము పెంచాలని కోరారు. ● ఆచంటకి చెందిన కె.సాల్మన్రాజు తన పాస్బుక్ లో 27 సెంట్ల భూమి చూపుతుండగా సర్వేలో 25 సెంట్లు మాత్రమే ఉందని, మిగిలిన రెండు సెంట్లు అప్పగించాలని కోరారు. ● పాలకొల్లులోని 13వ వార్డుకు చెందిన వానపల్లి జేబీ రామ్ సిద్ధార్థ తనకు మానసిక వికలాంగుల పింఛన్ ఇప్పించాలని దరఖాస్తు అందించారు. జేసీ రాహుల్కుమార్ రెడ్డి -
నిలకడగా వశిష్ట గోదావరి
పెనుగొండ: వశిష్ట గోదావరి నిలకడగా ప్రవహిస్తోంది. రెండు రోజులుగా పెరుగుతూ వచ్చిన వరద సోమవారం స్థిరంగా ఉంది. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఆదివారం రాత్రి నుంచి గోదావరి వరద తగ్గుముఖం పట్టిందని, ఇప్పట్లో పెరిగే అవకాశాలు లేవని అంచనా వేస్తున్నారు. లంక గ్రామాల్లోని కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై బురద చేయడంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నరసాపురంలో పెరుగుతూ.. నరసాపురం: నరసాపురం వశిష్ట గోదావరి వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతం నుంచి భారీగా నీరు నదిలోకి వచ్చి చేరుతుండగా నీటిమట్టం పెరుగుతోంది. నీరంతా సముద్రంలోకి వెళుతుందని ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు. సముద్రం పోటు సమయంలో మాత్రం నీటిమట్టం కాస్త పెరుగుతోంది. నరసాపురంలో ఏటిగట్టును ఆనుకుని ఉన్న పొన్నపల్లి, మాధవాయిపాలెం ప్రాంతాల్లో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రెండు, మూడు రోజులపాటు నీటిమట్టం పెరిగే అవకాశం ఉంది. ఆఫ్లైన్ అడ్మిషన్లకు వినతి భీమవరం: డిగ్రీ అడ్మిషన్లను ఆఫ్లైన్ పద్ధతిలో నిర్వహించాలని, ఇంటర్న్షిప్ భారాన్ని తగ్గించాంలంటూ సోమవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో భీమవరంలో జేసీ రాహుల్కుమార్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు బి.గణేష్ మాట్లాడుతూ సాధారణ డిగ్రీ విద్యలో మార్పులు విద్యార్థులను గందరగోళంలోకి నెట్టుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అడ్మిషన్లలో సింగల్ మేజర్ విధానం ఇప్పటికే విఫలమైందని, ఈ విధానాన్ని కొనసాగించడం భావ్యం కాదన్నారు. డిగ్రీ విద్యలో డబుల్ మేజర్ విధానాన్ని అమలుచేయాలని కోరారు. డిగ్రీ ప్రవేశాలు ఆన్లైన్లో ఉండటం వల్ల చాలా సీట్లు ఖాళీగా మిగిలిపోతున్నాయని అన్నారు. జిల్లా కమిటీ సభ్యులు బి.సింధు, ఎం.భాగ్యలక్ష్మి, పి.సాయికృష్ణ పాల్గొన్నారు. కేసుల్లో మధ్యవర్తిత్వంపై అవగాహన భీమవరం: కోర్టు కేసుల్లో మధ్యవర్తిత్వంపై ప్రజలకు, కక్షిదారులకు అవగాహన కల్పించడానికి సోమవారం భీమవరంలో 1కే వాక్ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్ నుంచి బీఎస్ఎన్ఎల్ వద్ద గల కోర్టు కాంప్లెక్స్ వరకు మండల న్యాయసేవా సంస్థ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. భీమవరం 3వ అ దనపు జిల్లా జడ్జి, మండల న్యాయ సేవా సంస్థ చైర్మన్, పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి బి.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కోర్టుల్లో ఏళ్ల తరబడి కేసులు పెండింగ్లో ఉన్నాయని కక్షిదారులు సహృద్భావ వాతావరణంలో మధ్యవర్తిత్వం ద్వారా రాజీపడితే సమయం, డబ్బు ఆదా అవుతుందన్నారు. కేసుల రాజీకి ప్రత్యేకంగా శిక్షణ పొందిన న్యాయవాదులను నియమించామని వారి సేవలు వినియోగించుకోవచ్చునన్నారు. ప్రిన్సిపల్ సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) జి.సురేష్ బాబు, 2వ అదనపు జ్యుడీషియల్ మొదటి తరగతి మేజిస్ట్రేట్ ఎన్.జ్యోతి, బెంచ్ మేజిస్ట్రేట్ నాగరాజు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు యేలేటి యోహాన్, భీమవరం డీఎస్పీ ఆర్జీ జయసూర్య, డీఎన్నార్ లా కళాశాల ప్రిన్సిపల్ రఘురాం, న్యాయవాదు లు, పారా లీగల వలంటీర్లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. 23న ఉద్యోగ మేళా భీమవరం (ప్రకాశంచౌక్): నరసాపురం వైఎన్ కళాశాలలో ఈనెల 23న మెగా ప్లేస్మెంట్ డ్రైవ్ (ఉద్యోగ దిక్సూచీ) నిర్వహించనున్నట్ట జేసీ రాహుల్కుమార్ రెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో ఉద్యోగ మేళా పోస్టర్ను ఆవిష్కరించారు. సుమారు 15 కంపెనీల్లో 700కు పైగా ఉద్యోగావకాశాలు కల్పిస్తారన్నారు. వివరాలకు సెల్ 94508 38388, 95020 24765 నంబర్లలో సంప్రదించాలని కోరారు. డీఆర్వో మొగిలి వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. -
మహమ్మారి మద్యం.. బతుకులు ఛిద్రం
జిల్లాలో జరిగిన సంఘటనలు ●● మార్చి 19న తణుకు గణేష్చౌక్ ప్రాంతంలోని మద్యం షాపు నైట్ పాయింట్ వద్దకు అర్ధరాత్రి సమయంలో మద్యం కొనేందుకు వచ్చిన వ్యక్తికి సిబ్బందికి డిజిటల్ పేమెంట్ విషయమై వివాదం తలెత్తింది. సదరు వ్యక్తి ఇనుప రాడ్తో విచక్షణరహితంగా దాడి చేయడంతో సిబ్బంది ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ●● మార్చి 29న తణుకు రూరల్ వేల్పూరులోని మద్యం దుకాణం కాంపౌండ్లో అనుమానాస్పద రీతిలో వ్యక్తి మృతి చెందడం వివాదస్పదంగా మారింది. అతడి ఒంటిపై గాయాలున్నాయని, మద్యం దుకాణం వద్ద ఎవరో కొట్టి హత్యచేశారని ఆరోపిస్తూ బంధువులు వైన్స్ షాపు వద్ద ఆందోళనకు దిగారు. ● ● మే 12న కాళ్ల మండలం ఎల్ఎన్ పురంలో చెరువుల వద్ద ఇద్దరు యువకులు కలిసి మద్యం సేవిస్తుండగా వివాదం తలెత్తింది. మద్యం మత్తులో ఒక యువకుడు మరో యువకుడిపై చాకుతో దాడిచేయగా తీవ్ర గాయాలతో మృతిచెందాడు. ●● మే 27న రాత్రి సమయంలో భీమవరం రైల్వే ఫ్లై ఓవర్పై మద్యం మత్తులో ఓ యువతి రోడ్డుపై అడ్డంగా పడుకుని హల్చల్ చేసింది. అర గంట పాటు ట్రాఫిక్కు అంతరాయంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ●● జూన్ 13న రాయలంకు చెందిన వ్యక్తి మద్యం సేవించి కాళ్ల మండలం పెదఅమిరంలోని ఫ్యాక్టరీ సమీపంలో రోడ్డు పక్కన రాయిపై పడిపోవడంతో గాయమై మృతి చెందాడు. ●● జూన్ 15న ఓ డ్రైవర్ మద్యం మత్తులో కారు నడుపుతూ ముగ్గురిని ఢీకొట్టిన ఘటన ఆకివీడులోని జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ●● జూన్ 30న ఇరగవరం మండలం అర్జునుడుపాలెంలో మద్యం మత్తులో ఒక వ్యక్తి తన భార్య, కుమార్తైపె చాకుతో దాడి చేయడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ●● జూలై 3న భీమవరం టూటౌన్ పరిధిలోని ఒక ప్రదేశంలో మద్యం సేవిస్తున్న ఇద్దరు యువకుల మధ్య కోడిగుడ్డు విషయమై ఘర్షణ తలెత్తడంతో ఒక యువకుడు బ్లేడుతో మరో యువకుని గొంతు కోయడంతో తీవ్ర గాయాలయ్యాయి. ●● జూలై 6న తాడేపల్లిగూడెంలోని భీమవరం బైపాస్ రోడ్డులోని మద్యం దుకాణం వద్ద కలిసి మద్యం సేవిస్తున్న ఇద్దరు కూలీల మధ్య వివాదం చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో ఒకరు నాపరాయితో దాడి చేయడంతో మరో కూలీ మృతిచెందాడు. ●● ఇవి జిల్లాలో చోటుచేసుకున్న ఘటనల్లో కొన్ని మాత్రమే. మద్యం మత్తులో జరిగిన రోడ్డు ప్రమాదాలు, వెలుగుచూడని, పోలీస్స్టేషన్ వరకూ చేరని ఘటనలు మరెన్నో. సాక్షి, భీమవరం: జిల్లాలో గీత కార్మికులకు చెందిన 18 షాపులతో కలిపి 193 మద్యం షాపులు ఉన్నాయి. నెలకు రూ.120 కోట్ల వరకు అమ్మకాలు జరుగుతున్నాయని అంచనా. కాగా జిల్లాలో నెలకు రూ.175 కో ట్ల వరకు మద్యం అమ్మకాలు చేయాలని ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ నిర్ణయించినట్టు సమాచారం. ఈ మేరకు రోజుకు సగటున రూ.6 కోట్లు వరకు మద్యం అమ్మకాలు చేయాల్సి ఉంది. లక్ష్యాన్ని చేరేందుకు నిబంధనల అమలులో అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఇదే అదునుగా లిక్కర్ సిండికేట్లు ఎకై ్సజ్ పాలసీని తుంగలోకి తొక్కుతున్నాయి. బెల్టు షాపులు, సిట్టింగ్ ఏర్పాట్లు, మంచింగ్ కోసం ఫాస్ట్ఫుడ్ సెంటర్లు అందుబాటులో ఉంచుతున్నారు. లూజ్ సేల్స్, నైట్ పాయింట్లు పేరిట వేళాపాలా లేకుండా మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. గతంతో పోలిస్తే ప్రైవేట్ పాలసీ వచ్చాక 25 శాతం మేర లిక్కర్, 80 శాతం మేర బీర్లు అమ్మకాలు పెరిగాయి. వీటిని మరింత పెంచుకునే పనిలో ఎకై ్సజ్ శాఖ ఉంది. శాంతిభద్రతలకు విఘాతం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఊరికి దూరంగా ఉన్న మద్యం దుకా ణాలు.. కూటమి తెచ్చిన ప్రైవేట్ పాలసీతో జనావాసాలు, రద్దీ ప్రాంతాల్లోకి వచ్చేశాయి. ప్రస్తుతం అమ్మకాలు పెంచుకునేందుకు విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేస్తున్నారు. ఏనీ టైం ఎక్కడపడితే మద్యం దొరికే పరిస్థితులు ఉన్నాయి. వేళాపాలా లేకుండా మందుబాబులు మత్తులో జోగుతూ ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. ఒక్కోసారి హత్యలకు సైతం దారితీస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. జనావాసాల్లోని షా పుల వద్ద మందుబాబుల ఆగడాలతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. తెగ తాగించేస్తున్నారు మద్యం నుంచి సంపద సృష్టిలోకూటమి సర్కారు జిల్లాకు నెలవారీ టార్గెట్లు నెలకు రూ.175 కోట్ల మద్యం విక్రయించాల్సిందే.. లక్ష్యం చేరేందుకు విచ్చలవిడిగా అమ్మకాలు మద్యం మత్తులో హత్యలు, దాడులకు తెగబడుతున్న మందుబాబులు గత ప్రభుత్వంలో పక్కాగా నిబంధనలు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మద్యం దుకాణాలు ప్రభుత్వ అధీనంలో ఉండటం వలన కచ్చితంగా నిబంధనలు అమలయ్యేవి. నిర్ణీత వేళల్లో మాత్రమే అమ్మకాలు జరిగేవి. షాపు వద్ద మద్యం కొనుగోలు చేసి తీసుకుపోవడమే తప్ప అక్కడే కూర్చుని తాగే వీలుండేది కాదు. బెల్టుషాపులకు ఆస్కారమే లేదు. ప్రస్తుత పరిస్థితి ఇందుకు భిన్నంగా తయారైందని ప్రజలు విమర్శిస్తున్నారు. అమ్మకాలను కట్టడి చేయాలి ఈ ప్రభుత్వం వచ్చాక మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. సమయపాలన లేకుండా ఎక్కడిపడితే అక్కడ మద్యం దొరుకుతుండటంతో క్రైం రేటు పెరుగుతోంది. జిల్లాలో లిక్కర్, బీర్ల అమ్మకాలు భారీగా పెరిగాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మద్యం అమ్మకాల కట్టడికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. – కర్రా జయసరిత, న్యాయవాది, పాలకొల్లు -
నరసాపురం లేసుకు ఓడీఓపీ అవార్డు
భీమవరం (ప్రకాశంచౌక్) : న్యూఢిల్లీలో కేంద్ర ప్రభు త్వ వాణిజ్య పన్నులు, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో ‘నరసాపూర్ క్రోచెట్ లేస్ ప్రొడక్ట్స్’కు కేంద్ర మంత్రి పియూష్ గోయల్ చేతులమీదుగా కలెక్టర్ సీహెచ్ నాగరాణి అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నరసాపురం లేసు అల్లికలకు గతేడాది జీఐ గుర్తింపు రావడం, ఇప్పుడు వన్ డిస్ట్రిక్ట్–వన్ ప్రొడక్ట్ (ఓడీఓపీ) కింద అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ గుర్తింపులతో వేలాది మంది నేత కార్మికులు, కళాకారులకు ప్రోత్సాహం ఇవ్వగలుగుతామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో లేసు ఉత్పత్తులు గుర్తింపు పొందడంతో పాటు ఇప్పుడు ఈ అవార్డు అందుకోవడం లేసు తయారీదారుల కృషి ఫలితం అన్నారు. లేసు తయారీదారులకు కలెక్టర్ నాగరాణి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. -
స్మార్ట్ మీటర్లతో ప్రజలపై భారం
ఏలూరు(ఆర్ఆర్పేట): విద్యుత్ స్మార్ట్మీటర్ల నిర్ణ యాన్ని కూటమి ప్రభుత్వం విరమించుకోకపోతే బషీర్బాగ్ విద్యుత్ పోరాట అమరుల స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు నిర్మిస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి అన్నారు. సోమవారం సీపీఎం నగర కమిటీ ఆధ్వర్యంలో జిల్లా విద్యుత్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. స్మార్ట్మీటర్ల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, ట్రూఅప్ చార్జీల పేరుతో ప్రజలపై భారాలు వేయొద్దని నినదించారు. నాడు ప్రతిపక్ష నేతగా నారా లోకేష్ స్మార్ట్మీటర్లను వ్యతిరేకించారని.. నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటినే కొనసాగించేలా చూస్తుండటం దారుణమన్నారు. సీపీఎం నగర కార్యదర్శి డీఎన్వీడీ ప్రసాద్, వైఎస్ కనకారావు, ఎం.ఇస్సాక్, పి.ఆదిశేషు తదితరులు పాల్గొన్నారు. -
హెచ్ఎం మూర్తి రాజు మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి
మండిపడ్డ ఉపాధ్యాయ సంఘాలు నల్ల బ్యాడ్జీలతో నిరసన యలమంచిలి: హెచ్ఎం మూర్తిరాజు మరణం బాధాకరమని యూటీఎఫ్ జిల్లా కోశాధికారి పోలిశెట్టి క్రాంతికుమార్ అన్నారు. మూర్తిరాజు మృతికి సంతాపం తెలుపుతూ సోమవారం మండలంలోని ఏనుగువానిపాలెం హైస్కూల్ వద్ద ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. పలు పాఠశాలల ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి భోజన విరామ సమయంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా క్రాంతికుమార్ మాట్లాడుతూ అధికారులు శిక్ష ణల పేరుతో ఉపాధ్యాయులను మానసిక వేదనకు గురిచేసి వారి ప్రాణాలతో చెలగాటం ఆ డుతున్నారని విమర్శించారు. దీనికి కారకులైన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి దండు పద్మావతి, మండల శాఖ అధ్యక్షుడు గుత్తిందీవి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి పంతం రామమూర్తి నాయుడు, గౌరవాధ్యక్షు డు వి.జగ్గారావు, కార్యదర్శులు బి.శైలజ, ము ద్దల బాపిరాజు, మల్లుల శ్రీధర్ పాల్గొన్నారు. పాలకోడేరు: పాలకొల్లు మండలం అరట్లకట్ల హైస్కూల్ గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయుడు ఎస్వీఆర్ మూర్తిరాజు మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఫ్యాప్టో చైర్మన్ పీఎస్ విజయరామరాజు (యూటీఎఫ్) డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో జరుగుతున్న ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమంలో సోమవారం మూర్తిరాజు మృతిచెందారని తెలిపారు. రెసిడెన్షియల్ ట్రైనింగ్ ఇవ్వడంలో అధికారులు, ప్రభుత్వ వైఖరి మారని కారణంగానే హెచ్ఎం మూర్తిరాజు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకోడేరులో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉపాధ్యాయ సంఘాలు దూర ప్రాంతాల్లో రెసిడెన్షియల్ మోడ్ శిక్షణలను రద్దు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని విమర్శించారు. పదవీ విరమణకు దగ్గరగా ఉన్న ఉపాధ్యాయులు ఆరోగ్యపరమైన సమస్యలతో బాధపడుతుంటారని, అలాంటి వారిని రెసిడెన్షియల్ శిక్షణలకు దూరంగా ఉంచాలన్నా పరిగణనలోకి తీసుకోలేదని మండిపడ్డారు. ఒంటెద్దు పో కడలతో ప్రభుత్వం, అధికారులు పంతాలూ పట్టింపులకు పోతున్న ధోరణిలో ఉండటం వల్లే ఇలాంటి మరణాలు జరుగుతూనే ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ధోరణిని ఫ్యాప్టో పశ్చిమగోదావరి కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఉపాధ్యాయులకు ఆన్లైన్ వర్క్కు సంబంధించిన బాధ్యతలు పెడుతూ ప్రతి విషయాన్నీ ఆన్లైన్లో అప్లోడ్ చేయమనడం, వాటిలో ఉండే చి న్నపాటి లోపాలకు అధికారులు ఉపాధ్యాయులను ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. తద్వా రా ఉపాధ్యాయులపై విపరీతమైన ఒత్తిడి పెడుతున్నారని విమర్శించారు. సమావేశంలో ఫ్యాప్టో కోచైర్మన్ పి.సాయివర్మ (ఎస్టీయూ), ఫ్యాప్టో జనరల్ సెక్రటరీ ప్రకాష్ (ఏపీటీఎఫ్), ఫ్యాప్టో డిప్యూటీ జనరల్ సెక్రటరీ (ఏపీటీఎఫ్–1938) పాల్గొన్నారు. ఆరోగ్యం బాగోకపోయినా.. తాడేపల్లిగూడెం (టీఓసీ): ఆరోగ్యం బాగోకపోయినా ట్రైనింగ్లు అంటూ జిల్లాస్థాయి అధికారులు ఒత్తిడి చేస్తున్నారని, ఇది సరికాదని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) జిల్లా అధ్యక్షుడు జి.ప్రకాశం, ప్రధాన కార్యదర్శి బీవీ నారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా అఽధికారుల తీరును ఖండించారు. సోమవారం వారు తాడేపల్లిగూడెంలో విలేకరులతో మాట్లాడుతూ హెచ్ఎం మూర్తిరాజు శిక్షణ కేంద్రంలోనే మరణించడం బాధాకరమైన విషయమన్నారు. హెచ్ఎం ఎస్వీఆర్ మూర్తిరాజు తాను అనారోగ్యంతో ఉన్నానని, ట్రైనింగ్ నుంచి మినహాయింపు ఇవ్వాలని జిల్లా అధికారులను విజ్ఞప్తి చేసినా, తన తరపున తన అసిస్టెంట్ను పంపిస్తానని కోరినా జిల్లా అధికారులు మినహాయింపు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఒత్తిడితో ప్రధానోపాధ్యాయులకు ట్రైనింగ్లు ని ర్వహించడం సరికాదని విమర్శించారు. -
తీరంలో యథేచ్ఛగా తవ్వకాలు
నరసాపురం రూరల్: నరసాపురం తీర ప్రాంత గ్రామాల్లోని మట్టి, బొండు ఇసుకతో పాటు సముద్ర పరీవాహక ప్రాంతంలోని ఇసుకను అక్రమంగా తవ్వేస్తున్నారు. ఈ మట్టి దందాకు అధికారుల అండదండలు ఉండటంతో కూటమి నేతలకు కాసుల వర్షం కురుస్తోంది. యథేచ్ఛగా మట్టి, ఇసుక తవ్వకాలు సాగిస్తున్నప్పటికీ సంబంధిత శాఖల అధికారులు పట్టించుకోవడం లేదు. ఇటీవల జరుగుతున్న అన్యాయంపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లినవారిపై కేసులు నమోదు చేస్తామంటూ ఓ అధికారి బెదిరింపులకు దిగడం గమనార్హం. నరసాపురం మండలం వేములదీవి, చినమైనవానిలంక, బియ్యపుతిప్ప ప్రాంతాల్లోని సీఆర్జడ్, జిరాయితీ భూముల్లోని ఇసుకను కూటమి పార్టీల నాయకులు యథేచ్ఛగా భారీ యంత్రాలతో తవ్వి, లారీలు, ట్రాక్టర్లలో ఎగుమతి చేసి సొమ్ము చేసుకుంటున్నప్పటికీ అడ్డుకోవాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. నిబంధనల మేరకు సీఆర్జెడ్ భూముల్లో ఎలాంటి తవ్వకాలు చేపట్టకూడదని అధికార పార్టీ నేతలు, మట్టి అమ్మకందారులు కుమ్మకై ్క యథేచ్ఛగా ఇసుకను విక్రయిస్తున్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధి ఒకరు తన పంచాయతీ పరిధిని దాటి వేరొక పంచాయితీలో ఇసుక తవ్వకానికి పూనుకోవడంతో అక్కడివారు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినప్పటికీ అధికార పార్టీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధినని తననే అడ్డుకుంటారా అంటూ దూషించినట్లు తెలిసింది. తప్పుడు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేస్తామని బెదిరిస్తున్నట్లు సమాచారం. నరసాపురం నియోజకవర్గంలో ఇలాంటి పాలన ఎప్పుడూ చూడలేదని అధికారులందరూ కూటమి నేతలకు తొత్తులుగా మారి వారికి అనుకూలంగా పనిచేస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. కూటమి నేతలకు కాసుల వర్షం నిబంధనలకు పాతర పట్టించుకోని అధికారులు -
ఉధృతంగానే గోదావరి
ముంపులో కనకాయలంక కాజ్వే యలమంచిలి: యలమంచిలి మండలంలో గోదావరిలో వరద ఉధృతి పెరగడంతో కనకాయలంక కాజ్వే ఆదివారం నీట మునిగింది. దీంతో కనకాయలంక ప్రజలు అడుగున్నర లోతు వరదనీటిలో రాకపోకలు సాగిస్తున్నారు. వరదనీరు ఇంకా పెరిగితే పెరిగితే పడవలు ఏర్పాటు చేస్తామని వీఆర్వో ఘనలక్ష్మీ తెలిపారు. అయితే భద్రాచలం వద్ద వరద ఆదివారం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో సోమవారం ఉదయం వరకు కాజ్వేపై వరదనీటి ప్రవాహం కొనసాగే అవకాశం ఉంది. వరద ఉధృతిలో ఉన్న కనకాయలంక కాజ్వేను నరసాపురం ఆర్డీఓ దాసి రాజు, తహసీల్దార్ గ్రంధి నాగ వెంకట పవన్కుమార్లు పరిశీలించి, స్థానిక అధికారులకు సహాయ చర్యలపై సూచనలిచ్చారు. వేలేరుపాడు మండలం ఎద్దెలవాగు వంతెన వద్ద నాటు పడవపై ప్రయాణిస్తున్న గిరిజనులు వేలేరుపాడు/ పోలవరం రూరల్/ పెనుగొండ/యలమంచిలి : భద్రాచలం వద్ద గోదావరి శాంతించినా దిగువన వరద పోటు కొనసాగుతోంది. వేలేరుపాడు నుంచి కొయిదా వెళ్లే రహదారిలో ఎద్దెలవాగు వంతెన ఇంకా నీటమునిగే ఉంది. దీంతో వేలేరుపాడు మండలంలో 18 గిరిజన గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ఆదివారం ఉదయం భద్రాచలం వద్ద 33.50 అడుగులు ఉన్న నీటిమట్టం రాత్రి 8 గంటలకు 30.20 అడుగులకు తగ్గింది. అయినా వేలేరుపాడు మండలంలో దిగువనున్న కొయిదా, కాచారం, టేకుపల్లి, పేరంటపల్లి, కట్కూరు, ఎడవల్లి, చిట్టంరెడ్డిపాలెం, ఎర్రతోగు, బుర్రెడ్డిగూడెం, సిద్ధారం, కుంకుడు కొయ్యలపాకలు, మరో ఏడు గిరిజన గ్రామాలు జలదిగ్బంధనంలో ఉన్నాయి. దీంతో అధికారులు ఎద్దెలవాగు వంతెన వద్ద నాటు పడవ ఏర్పాటు చేశారు. భద్రాచలం వద్ద 30.20 అడుగులకు పోలవరం మండలంలో గోదావరి వరద తగ్గుముఖం పట్టింది. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే వద్ద ఆదివారం రాత్రికి స్పిల్వే 48 గేట్ల నుంచి దిగువకు 7.19 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద కూడా నీటిమట్టం 30.20 అడుగులకు చేరుకుంది. క్రమేపీ వరద ప్రవాహం తగ్గుతోంది. ఆదివారం ఉదయానికి స్పిల్వే నుంచి 7.63 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు వెళ్తుండగా.. రాత్రికి ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరు తగ్గుతుండటంతో వరద ఉధృతి తగ్గింది. భద్రాచలం వద్ద 36.60 అడుగులకు చేరిన నీటిమట్టం క్రమేపీ తగ్గుతూ ఆదివారం రాత్రికి 30.20 అడుగులకు చేరింది. సిద్ధాంతంలో ఉధృతంగా.. పెనుగొండ మండలంలో గోదావరికి వరద ఉధృతి మరింత పెరిగింది. దీంతో ఏటిగట్టు పొడవున లంక భూములను తాకుతూ వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. సిద్ధాంతం మధ్యస్థ లంకకు నీటి మట్టం చేరుకోవడంతో పడవల రాకపోకలపై నియంత్రణ విధించారు. గోదావరిలో వెళ్లవద్దంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. సిద్ధాంతంలో పడవలను ఒడ్డుకు చేర్చారు. కేదారీఘాటలోని పుష్కర రేవులో ప్రతిష్టించిన లింగం గోదావరి వరద నీటిలో మునిగింది. ఘాట్లో మూడు పుష్కర రేవుల్లోకి వరద నీరు ఉధృతంగా రావడంతో పై మెట్ల వరకూ నీటి మట్టం చేరుకుంది. ఆచంట మండలంలో కోడేరులో పుష్కర ఘాట్ వరకూ వరద నీరు చేరింది. మరింత ఉధృతి వస్తే తప్ప ఆచంట మండలంలోని లంక గ్రామాలకు ఎలాంటి ముప్పులేదని అధికారులు తెలిపారు. మరింత ఉధృతి పెరిగితే సురక్షిత ప్రాంతాలకు ప్రజలు చేరుకోవాలని సూచించారు. భద్రాచలం వద్ద శాంతించినా ఉమ్మడి జిల్లాలో తగ్గని వరద పోటు పోలవరం ప్రాజెక్టు నుంచి 7.19 లక్షల క్యూసెక్కులు విడుదల సిద్ధాంతం ఒడ్డున పడవల రాకపోకలు నిలిపివేత ముంపులో కనకాయలంక కాజ్వే -
బూటకపు హామీలతో మోసగించారు
తణుకు అర్బన్: ఎన్నికల ముందు బూటకపు హామీలిచ్చి ఇంటింటికీ మేనిఫెస్టో బాండ్లు పంపిణీ చేసిన కూటమి ప్రభుత్వం ప్రజల్ని నమ్మించి మోసం చేసిందని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మండిపడ్డారు. తణుకు మండలం మండపాక గ్రామంలో ఆదివారం నిర్వహించిన బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గతంలో చంద్రబాబు వెన్నుపోటు, మోసం చేయడంలో నిష్ణాతుడని తెలిసినప్పటికీ మరోసారి నమ్మి మోసపోయామని ప్రజానీకం ఆవేదన చెందుతున్నార ని అన్నారు. ఏ గుమ్మంలోకి వెళ్లినా గతంలో వలంటీర్లు ఇంటిగడపలోకి వచ్చి పనులు చేసేవారని, రేషన్ ఇంటి గుమ్మంలోకి వచ్చేదని నేడు కార్యాలయాల చుట్టూ తిరిగినా పనులు చేయడంలేదని చెబుతున్నారని, ప్రజల కష్టాలు వర్ణనాతీతమని స్పష్టం చేశారు. హామీలు అమలుచేయరా అని నిలదీస్తుంటే దాడులు, హత్యలు, విధ్వంసానికి దిగుతున్నారన్నారు. శ్రీకాళహస్తిలో జనసేన ఇన్చార్జ్ డ్రైవర్ను చిత్రహింసలకు గురిచేసి హత్యచేశారని, గుడివాడలో జెడ్పీ చైర్పర్సన్పై టీడీపీ గూండాలు దాడికి దిగి సభ్యసమాజం తలదించుకునేలా దౌర్జన్యానికి పాల్పడ్డారన్నారు. రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చేశారని ఏరోజు ఏ ప్రాంతంలో ఏ దాడులు జరుగుతాయో, ఏ మారణకాండ సృష్టిస్తారోనని ప్రజలు భయాందోళనలో బతుకుతున్నారని మండిపడ్డారు. పరిపాలన అంతా దాచుకో దోచుకో అనే రీతిలో ఇస్టానుసారంగా దోచేసుకుంటున్నారని, తాడేపల్లి కేంద్రంగా కూటమి ప్రభుత్వం భారీ దోపిడీకి తెరతీసి ప్రజల సమస్యలను పక్కదారి పట్టిస్తుందని అన్నారు. కల్తీ మద్యం విక్రయాలు చేస్తూ ప్రజల ఆరోగ్యంతో కూటమి ప్రభుత్వం ఆటలాడుతుందన్నారు. అనంతరం మండపాక గ్రామంలో ఇంటింటికి తిరిగి బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కరపత్రాలను అందచేశారు. ఏఎంసీ మాజీ చైర్పర్సన్, తణుకు మండల మహిళాధ్యక్షురాలు ఉండవల్లి జానకి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ రుద్రా ధనరాజు, తణుకు మండల ఎస్సీసెల్ అధ్యక్షుడు జంగం ఆనంద్కుమార్, పబ్లిసిటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు జల్లూరి జగదీష్, నాయకులు ముళ్లపూడి బాబూరావు, బద్దే ప్రవీణ్, జువ్వల వెంకట్రావు, ఉండవల్లి సుందరరావు, ఉండవల్లి సురేష్, మరిశెట్టి రామకృష్ణ, మద్దల రవికాంత్, పమ్మి విజయశేఖర్, సరెళ్ల క్రాంతి, పాలపర్తి అఖిల్, మొంటెయి విజయరాజు తదితరులు పాల్గొన్నారు. -
చోరీ ఫోన్ల రికవరీలో జాప్యం
● జిల్లాలో మొత్తం 4,990 ఫిర్యాదులు ● వేరే రాష్ట్రాల్లో వాడుతున్న ఫోన్లను ట్రాక్ చేయడంలో భాషతో ఇబ్బందిభీమవరం : మీ ఫోన్ పొగొట్టుకున్నారా? అయితే మీ ఫోన్కు సంబంధించిన వివరాలు పంపితే చాలు పోగొట్టుకున్న మీ మొబైల్ను రికవరీ చేసి మీకు అందిస్తామని పోలీసు శాఖ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. ఖరీదైన ఫోన్లు పొగొట్టుకున్న బాధితులు ఎంతో ఆశతో సెల్ ట్రాకింగ్కు ఫిర్యాదు చేస్తున్నా.. మీ ఫోన్ రికవరీ చేయలేకపోతున్నామని పోలీసులు చెబుతున్నారు. అందుకు ప్రధాన కారణం భాష ఇబ్బంది. ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా అపహరణకు గురైన ఫోన్ ఇతర రాష్ట్రాల్లో వినియోగిస్తున్నట్లు ఫోన్ సిగ్నల్స్ ద్వారా పోలీసులు గుర్తించినా.. అక్కడి పోలీసులతో మాట్లాడడానికి భాష ఇబ్బందిగా మారింది. దీంతో ఎక్కువ ఫోన్లను రికవరీ చేయలేకపోతున్నట్లు తెలుస్తోంది. సెల్ ట్రాకింగ్ సిస్టమ్లో ఇతర భాషలపై అనుభవం ఉన్న సిబ్బంది లేకపోవడమే దీనికి కారణంగా చెబుతున్నారు. ఇతర భాషలు తెలిసిన పోలీసు సిబ్బందిని నియమిస్తే ఎక్కువ ఫోనన్లు రికవరీ చేసే అవకాశముంటుందని పోలీసులు చెబుతున్నారు. జిల్లాలో 4,990 ఫిర్యాదులు జిల్లాలోని ప్రధాన బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, కూడళ్ల వద్ద నిత్యం సెల్ఫోన్ దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. పెద్ద సంఖ్యలో సెల్ఫోన్లు అపహరణకు గురవుతున్నా పోలీసులకు ఫిర్యాదు చేసేది కొద్దిమంది మాత్రమే. ఫిర్యాదు చేయాల్సి వస్తే.. ఫోన్ కొనుగోలు చేసిన రసీదులు చూపించడం, ఎక్కువ సార్లు పోలీసు స్టేషన్ చుట్టూ తిరగాల్సి రావడంతో ఫోన్ పోయినా మిన్నకుండి పోతున్నారు. ఖరీదైన ఫోన్లు, కొత్త ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు మాత్రం తన ఫోన్ కోసం ఫిర్యాదు చేస్తున్నారు. రికవరీ చేసింది 1,612 మాత్రమే జిల్లా వ్యాప్తంగా సెల్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా పది విడతల్లో సుమారు రూ.2.40 కోట్ల విలువైన 1,612 సెల్ఫోన్లు మాత్రమే రికవరీ చేయగలిగారు. ఫిర్యాదు అందిన సెల్ ఫోన్లు వాడుతూ ఉంటే అవి ఎక్కడ వినియోగిస్తున్నారో సెల్ ట్రాకింగ్ ద్వారా గుర్తించి ఆయా ప్రాంతాల్లోని పోలీసుల సహకారంతో వాటిని రికవరీ చేస్తుంటారు. పట్టుబడ్డ ఫోన్లు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వినియోగిస్తున్న వాటిని పోలీసులు రికవరీ చేస్తున్నట్లు తెలుస్తోంది. కొంతమంది సెల్ ఫోన్లు దొంగించే ముఠా సభ్యులు ఇక్కడ దొంగిలించిన ఫోన్లు కేరళ, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో విక్రయిస్తున్నారు. అక్కడ వాటిని కొంతమంది నేరుగా విక్రయిస్తుండగా మరికొంతమంది సెల్ ఫోన్ల విడిభాగాలుగా విక్రయిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. -
మహిళలకు రక్షణ కరువు
భీమవరం: కూటమి ప్రభుత్వ హయాంలో మహిళలకు రక్షణ కరువైందని వరుస ఘటనలతో మహిళలు, యువత, బాలికలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని వైఎస్సార్సీపీ నరసాపురం పార్లమెంట్ సమన్వయకర్త గూడూరి ఉమాబాల ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అయిదేళ్ల పాలనలో మహిళలకు అన్నిరంగాల్లో పెద్దపీట వేసి అండగా నిలిస్తే నేడు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో మహిళలపై అఘాయిత్యాలు, హత్యాచారాలు, దాడులు, హత్యలు పెచ్చుమీరిపోయాయన్నారు. జగన్ ప్రభుత్వం మహిళలకు అనేక సంక్షేమ పథకాలు అమలుచేసి పెద్దన్నగా అండగా నిలిచారని ఐదేళ్లపాటు మహిళలు సుఖ, సంతోషాలతో జీవనం సాగిస్తే నేడు దినదిన గండంగా జీవనం సాగించాల్సి వస్తుందని ఉమాబాల వాపోయారు. కాకినాడ జీజీహెచ్ పారామెడికల్ విద్యార్థుల వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడితే ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోందని దుయ్యబట్టారు. కృష్ణా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై దాడి సభ్యసమాజం తలదించుకునేలా ఉందన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి మహిళలపై దాడులు పెరుగుతూనే ఉన్నాయని ఇలంటి వాటికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. -
హారికను పరామర్శించిన మండలి చైర్మన్
భీమవరం: టీడీపీ, జనసేన మూకల దాడికి గురైన కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికను శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేనురాజు ఆదివారం పరామర్శించారు. శనివారం పెడనలోని హారిక గృహానికి వెళ్లిన దాడి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని తామంతా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అడ్వకేట్ సుబ్బారాయుడుకి ప్రశంసలు పెనుగొండ: పెనుగొండకు చెందిన అడ్వకేట్ అడపా వెంకట సుబ్బారాయుడు, మరో రచయితతో కలసి రచించిన శ్రీరూబ్రిక్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ పుస్తకానికి ప్రశంసలు దక్కాయి. నల్సార్ వర్శిటీ స్నాతకోత్సవంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్, తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ పాల్, సుప్రీంకోర్టు జస్టిస్ పీఎస్ నరసింహ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పుస్తకాన్ని అవిష్కరించారు. ఈ సందర్భంగా పుస్తక రచయిత అడపా వెంకట సుబ్బారాయుడును పలువురు ప్రశంసించారు. సుబ్బారాయుడు పెనుగొండకు చెందిన హైకోర్డు న్యాయవాది ఇండుగపల్లి రామానుజరావు కుమారుడు. నరసాపురం లేసుకు మరో గుర్తింపు భీమవరం (ప్రకాశంచౌక్): నరసాపురం లేసుకు మరో అరుదైన గుర్తింపు లభించింది. కేంద్ర ప్రభుత్వ శ్రీఒక జిల్లా– ఒక ఉత్పత్తిశ్రీ కింద 2024–25 ఏడాదికి ఎంపికై ంది. రాష్ట్రం నుంచి 26 జిల్లాల ఉత్పత్తులు పోటీ పడగా.. క్షేత్ర స్థాయి పరిశీలన అనంతరం 7 జిల్లాలకు చెందిన ఉత్పత్తులు ఎంపికయ్యాయి. వాటిలో లేసు అల్లికలు ఎంపిక కావడం జిల్లాకు గర్వకారణం. ఈ పురస్కారాన్ని అందుకొనేందుకు కలెక్టర్ చదలవాడ నాగరాణి ఢిల్లీ వెళ్లారు. ప్రగతి మైదానం సోమవారం జరిగే కార్యక్రమంలో అవార్డును కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖల మంత్రి చేతుల మీదుగా అందుకుంటారు. లేసు అల్లికలకు గత కొద్ది నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం నుంచి భౌగోళిక గుర్తింపు కూడా లభించింది. ఈ అవార్డును కలెక్టర్ నాగరాణి ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అందుకున్నారు. నేడు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ భీమవరం (ప్రకాశంచౌక్): ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రారంభించిన మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్)ను ఈ సోమవారం కలెక్టరేట్లో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఆలస్యంగా విద్యార్థినులకు భోజనంపై ఆగ్రహం నూజివీడు: పట్టణంలోని బీఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ల బాధ్యత రాహిత్యం కారణంగా విద్యార్థినులు ఆదివారం ఆకలితో అలమటించారు. మధ్యాహ్నం 12.30 గంటల కల్లా భోజనం పెట్టాల్సి ఉండగా రెండు గంటల వరకు పెట్టలేదు. ప్రిన్సిపాల్ బాధ్యతలను వైస్ ప్రిన్సిపాల్ కు అప్పగించి వెళ్లగా, వైస్ ప్రిన్సిపాల్ మరొక టీచర్ కు బాధ్యతలను అప్పగించారు. 600 మంది విద్యార్థినులు ఉండగా ఆదివారం కావడంతో పిల్లలను కలుసుకునేందుకు వచ్చిన తల్లిదండ్రులను లోపలికి అనుమతించలేదు. రెండు గంటలవుతున్నా భోజనం పెట్టకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. తల్లిదండ్రులు గొడవ చేయడంతో చివరికి రెండు గంటల తరువాత భోజనం పెట్టారు. కొందరు తల్లిదండ్రులు తహసీల్దార్కు సమాచారం అందించడంతో ఆయన వీఆర్వోలను గురుకుల పాఠశాల వద్దకు పంపించారు. సెలవు రోజులు వస్తే ఇలాంటి ఇబ్బందులు తరచూ ఎదురవుతున్నాయని విద్యార్థినుల తల్లిదండ్రులు వాపోతున్నారు. -
కూటమికే ‘ఫిట్నెస్’
సాక్షి, రాజమహేంద్రవరం: ప్రభుత్వ సేవలను ప్రైవేటుకు కట్టబెట్టు... కూటమి నాయకులకు దోచిపెట్టు..! ఇసుక, గనులు, మద్యంలో దోచెయ్... పచ్చ నేతల జేబులు నింపేయ్...! చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏడాదిగా రాష్ట్రంలో ఇదే తంతు...! ఈ జాబితాలోకి రవాణా విభాగం కూడా చేరింది. ఈ శాఖలో అత్యంత కీలకమైన వాహనాల ఫిట్నెస్ (సామర్థ్య) సర్టిఫికెట్ల జారీ సేవలను టీడీపీ నేతకు చెందిన ప్రైవేటు సంస్థకు కట్టబెట్టింది. యువగళంలో పాదయాత్ర చేసినవారికి కేటాయించింది. ఇకపై లైట్, హెవీ మోటార్ వెహికల్స్ ఫిట్నెస్ సర్టిఫికెట్లను కూటమి నేతల నేతృత్వంలోని ప్రైవేటు సంస్థ జారీ చేస్తుంది. ఇప్పటివరకు రవాణా శాఖ కార్యాలయంలో వాహనాల ఫిట్నెస్ను సర్టిఫై చేసేవారు. ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకుంటే వాహనాలకు ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం చలానా కట్టించుకుని సర్టిఫికెట్ ఇచ్చేవారు. ఈ పనులన్నీ ఇక ప్రైవేటు సంస్థకు చెందిన వెహికల్ ఫిట్నెస్ టెస్టింగ్ స్టేషన్లో జరుగుతాయి. దీనిపై ఎవరికీ అజమాయిషీ ఉండదు. నేరుగా కేంద్ర ప్రభుత్వమే పర్యవేక్షిస్తుంది. కూటమి నేతలకే ఏటీఎస్ సెంటర్లురాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాకు ఒక ఆటోమేటెడ్ వెహికల్ ఫిట్నెస్ టెస్టింగ్ స్టేషన్ (ఏటీఎస్) మంజూరైంది. తొలి దశలో 15 ప్రారంభమయ్యాయి. త్వరలో మరికొని్నటిని అందుబాటులోకి తెచ్చేలా సన్నాహాలు జరుగుతున్నాయి. ఇదే అదనుగా రంగంలోకి దిగిన టీడీపీ నేతలు సింహభాగం సెంటర్లను కైవసం చేసుకున్నారు. దీనివెనుక మంత్రి లోకేష్ చక్రం తిప్పినట్లు సమాచారం. యువగళం పాదయాత్ర చేసిన టీడీపీ నేతలకు కట్టబెట్టినట్లు ఆరోపణలున్నాయి.కాకినాడ, రాజానగరం, అనకాపల్లి ప్రాంతాల్లో మాత్రం ఓ రాజ్యసభ సభ్యుడి అనుయాయులకు అప్పగించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే తంతు నడిచినట్లు తెలిసింది.గ‘లీజు’ఒక ఏటీఎస్ స్థాపించేందుకు సుమారు రూ.5 కోట్లు ఖర్చవుతోంది. ప్రభుత్వం ఏకంగా> రూ.3 కోట్ల సబ్సిడీ ఇస్తోంది. మిగిలిన రూ.2 కోట్లు ప్రైవేటు సంస్థ వెచ్చించాలి. దీనిపై కార్మికులు మండిపడుతున్నారు. ఏటా ఫిట్నెస్కు ప్రతి జిల్లా నుంచి రూ.కోట్లు వసూలవుతాయి. వాటిని ఆ ప్రైవేటు సంస్థే తీసుకుంటుంది. ఫిట్నెస్ టెస్ట్ల ద్వారా రెండేళ్ల పాటు వసూలు చేసిన సొమ్మును ఆ సంస్థ సొంతానికి వాడుకోవచ్చు. ప్రభుత్వానికి పైసా చెల్లించాల్సిన పనిలేదు. ఆ సంస్థ బాగుపడేలా ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వడమేమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. ప్రైవేటీకరణ ఏకంగా 20 ఏళ్లకు రాసివ్వడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రపంచ బ్యాంకు, వివిధ సంస్థల నుంచి అప్పులు తీసుకువచ్చేందుకు కూటమి ప్రభుత్వం ఇలా దీర్ఘకాలిక లీజులు ఇస్తోందని వివిధ రాజకీయ పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు.మిగిలిన రాష్ట్రాలు వ్యతిరేకించినా..కేంద్రం తీసుకున్న ఫిట్నెస్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఏ రాష్ట్రమూ అమలు చేయడం లేదు. రాజస్థాన్, కర్ణాటక, గుజరాత్లో వాహన కార్మికుల నుంచి వ్యతిరేకత వచ్చింది. కర్ణాటక, రాజస్థాన్ ప్రభుత్వాలు అమలు నిలిపివేశాయి. గుజరాత్ పాత, కొత్త విధానాల్లో చేయించుకునే వెసులుబాటు కల్పించింది. మిగిలిన రాష్ట్రాలు అమలుపై వెనక్కి తగ్గినా.. ఏపీలో కూటమి ప్రభుత్వం మాత్రం కార్మికులను ఇబ్బందిపెట్టేలా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. కేవలం తమ పార్టీల నేతలకు లబ్ధి చేకూర్చేందుకే ఇలా చేస్తోందన్న చర్చ నడుస్తోంది.ప్రభుత్వ ఆదాయానికి గండిరాష్ట్రవ్యాప్తంగా అన్ని రకాల వాహనాలు కలిపి సుమారు 1.80 కోట్లు ఉన్నాయి. వీటిలో ఏటా 15 లక్షల వాహనాలు ఫిట్నెస్ కోసం వస్తుంటాయి. తద్వారా ప్రభుత్వానికి ఏటా రూ.150 కోట్ల ఆదాయం వస్తుంది. ఫిట్నెస్ సర్టిఫికెట్ల జారీని ప్రైవేటు సంస్థలకు అప్పగించడంతో ఈ ఆదాయానికి గండి పడినట్లే.దూరంగా సెంటర్లు.. వెల్లువెత్తుతున్న నిరసనలుఫిట్నెస్ సెంటర్లను జిల్లా కేంద్రాలకు దూరంగా ఏర్పటు చేస్తున్నారు. దీనిపై కార్మికులు, డ్రైవర్లు, వివిధ పార్టీల నేతల నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలోని 18 మండలాలకు సంబంధించి రాజానగరం వద్ద ఏటీఎస్ పెట్టారు. నల్లజర్ల నుంచి రాజానగరం వచ్చి వెళ్లాలంటే 150 కిలోమీటర్లు ప్రయాణించాలి.దీనిపై కార్మికులు, మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్, వివిధ రవాణా వాహన కార్మిక సంఘాల ప్రతినిధుల జేఏసీ కన్వీనర్లు వాసంశెట్టి గంగాధరరావు, బాక్స్ ప్రసాద్ తదితరులు రాజానగరం ఏటీఎస్ దగ్గర మంగళవారం నిరసన తెలిపారు. ఇచ్చాపురం నుంచి శ్రీకాకుళం రావాలంటే 130 కిలోమీటర్లు ప్రయాణించాలి. పనులు మానుకుని రావాల్సిన పరిస్థితి తలెత్తిందని ఆటో, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు బుధవారం భారీ ర్యాలీ నిర్వహించి, నిరసన తెలిపారు.చలానాపై ఆందోళనఫిట్నెస్ సర్టిఫికెట్ పొందేందుకు తొలుత సంస్థ పేర్కొన్న మొత్తాన్ని ఆన్లైన్లో చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవాలి. నిర్దేశించిన సమయంలోగా పరీక్ష చేయించుకోకుంటే చలానా సమయం ముగిసిపోతుంది. తిరిగి చలానా తీయాలి. గతంలో చలానాకు వారం నుంచి 15 రోజుల వరకూ గడువుండేదని, ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవని వాహనదారులు వాపోతున్నారు. పైగా ప్రభుత్వం గతంలో వసూలు చేసిన దాని కంటే చలానా రూ.200కు పైగా పెంచారని చెబుతున్నారు.చిన్నవాటికీ తిరస్కరణఇదివరకు వాహనం ఫిట్నెస్కు వెళ్తే చిన్నపాటి మరమ్మతులుంటే సరిచేసుకుని వస్తే సర్టిఫికెట్ ఇస్తామని చెప్పేవారు. ప్రస్తుతం బ్రేక్ ఆయిల్ తక్కువగా ఉండటం చిన్నపాటి విషయానికీ అన్ఫిట్ చేసేస్తున్నారు. ఈ విషయం వారం తర్వాత మెసేజ్ ద్వారా తెలుస్తోంది. అప్పటికి చలానా గడువు ముగిసిపోతోంది. మళ్లీ చలానా కట్టాల్సి వస్తోంది. ఇదే అదనుగా బ్రోకర్లు రంగంలోకి దిగి రూ.వేలు వసూలు చేస్తున్నారు.ఫిట్నెస్ ప్రైవేటీకరణపై పోరాటంకార్మికులు ఏమీ చేయలేరన్న ఉద్దేశంతో ఫిట్నెస్ ప్రైవేటీకరణకు పాల్పడ్డారు. దీనిని ఉపసంహరించుకునే దాక పోరాటం ఉధృతం చేస్తాం. వేలాదిగా కార్మికులతో రోడ్డెక్కుతాం. ఈ విషయంలో కార్మిక జేఏసీ తీసుకున్న నిర్ణయానికి వైఎస్సార్ సీపీ సంపూర్ణ మద్దతు ఇస్తుంది. మాజీ సీఎం వైఎస్ జగన్ అండగా ఉంటారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వాహనమిత్ర ద్వారా రూ.10 వేల ఆర్థిక సాయం ఇచ్చేది. కూటమి ప్రభుత్వం అది ఇవ్వడం లేదు. ఏ ప్రభుత్వం మంచి చేసిందో కార్మికులు గ్రహించాలి. – మార్గాని భరత్రామ్, వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ, రాజమహేంద్రవరంఉపసంహరించుకోవాలిఫిట్నెస్ జారీని ప్రైవేటు సంస్థలకు అప్పజెప్పడాన్ని వ్యతిరేకిస్తున్నాం. దీనిని తక్షణమే ఉపసంహరించాలి. కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేటు వ్యక్తులకు సామర్థ్య పరీక్షలు అప్పగిస్తే పారదర్శకత ఏం ఉంటుంది? ఒక వాహనానికి పరీక్ష చేయాలంటే 40 నిమిషాలు పడుతోంది. కొన్ని పాఠశాలలు, కళాశాలల వాహనాలు సెంటర్ వద్దకు రాకపోయినా ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇచ్చేస్తున్నారు. – వాసంశెట్టి గంగాధరరావు, కార్మిక సంఘాల ప్రతినిధుల జేఏసీ కన్వీనర్, రాజమహేంద్రవరం -
మైనింగ్ దెబ్బకు రోడ్లు ఛిద్రం
మైనింగ్ మాఫియాకు కై కలూరు నియోజకవర్గం కేజీఎఫ్ గనిగా మారింది. కూటమి పాలనలో మట్టి, ఇసుకను ఆదాయ వనరుగా మార్చేసుకున్నారు. 8లో uకేదారీ ఘాట్లోకి వరద నీరు పెనుగొండ: సిద్ధాంతం వద్ద గోదావరి నీటిమట్టం క్రమేపీ పెరుగుతోంది. కేదారీఘాట్లోని పుష్కర రేవుల్లోకి వరద నీరు ప్రవేశించింది. మధ్య లంకలోకి పడవల రాకపోకలపై జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. ఆచంట మండలంలోని పెదమల్లంలంక, పల్లెపాలెం, అయోధ్యలంక, పుచ్చల్లంక, నక్కిలంకల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ తహసీల్దార్లకు ఆదేశాలు అందాయి. -
ఆషాఢం
సంప్రదాయ సమ్మేళనం ● జిల్లాలో ఆధ్యాత్మిక శోభ ● అమ్మవార్లకు సారెలు, విశేష అలంకరణలు ● ఇళ్లలో తెలగ పిండి, మునగాకు వంటకాలు ● ఆడపడుచుల చేతికి గోరింటాకు లేపనాలు ● చక్కర్లు కొడుతున్న కొత్త జంటలు ● దుకాణాల్లో ఆఫర్ల మేళాలు సాక్షి, భీమవరం: సంస్కృతి, సంప్రదాయాల పుట్టిల్లు తెలుగు నేల. ప్రకృతితో మమేకం చేస్తూ ఇక్కడి ప్రతి నెలకి ఏదోక విశిష్టత ఉంటుంది. అందులోనూ నాలుగో నైలెన ఆషాఢ మాసం మరింత ప్రత్యేకమైనదిగా భావిస్తారు. వాతావరణాన్ని చల్లబరుస్తూ తొలకరి వర్షాలు, పొంగి ప్రవహించే కాలువలు, వరి నాట్లుతో పచ్చ తివాచీని పరుచుకునే పంట పొలాలు, గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు, ప్రత్యేక వంటకాలు, ఆచారాలు ఆహ్లాదాన్ని అందిస్తాయి. పౌర్ణమి నాడు చంద్రుడు ఉత్తరాషాఢ, పూర్వాషాఢ నక్షత్రాల్లో సంచరించడం వలన ఈ నెలను ఆషాఢ మాసంగా పిలుస్తారు. మిగిలిన నెలలతో పోలిస్తే శూన్య మాసంగా భావించి శుభకార్యాలు తలపెట్టనప్పటికి దేవతారాధనకు ఇదే సరైన సమయంగా పెద్దలు చెబుతారు. ఆషాఢంలోని తొలి ఏకాదశి రోజునే శ్రీమన్నారాయణుడు యోగ నిద్రలోకి వెళ్లేది. హిందువుల తొల పండుగ కూడా ఇదే. గురు పౌర్ణమి, స్కంధ షష్ఠి తదితర పర్వదినాలు జరుపుకుంటారు. జిల్లాలోని గ్రామ దేవతలకు ఆషాఢం సారెలు, మొక్కుబడులు సమర్పించుకోవడం అనాదిగా వస్తోంది. భీమవరం మావూళ్లమ్మ, రాయకుదురు మావూళ్లమ్మ, మహాలక్షి, ఏలూరుపాడులోని ముసలమ్మ, ఎల్లమ్మ, మోగల్లులోని పెన్నేరమ్మ, మారమ్మ, గంగాదేవి అమ్మవార్లు, జిల్లాలో పేరొందిన గ్రామ దేవతల ఆలయాల్లో ఆషాఢ మాసం పూజలు ఘనంగా జరుగుతున్నాయి. శాఖాంభరిగా, ప్రత్యేక అలంకరణల్లో అమ్మవార్లు భక్తులకు దర్శనిమిస్తున్నారు. నవ దంపతుల చక్కర్లు కొత్తగా పెళ్లైన జంట ఆషాఢంలో అత్తవారింటి గడప దాటకూడదని సంప్రదాయం. ఈనెల్లో దంపతులు కలిస్తే తొమ్మిది నెలల తర్వాత మండు వేసవిలో కాన్పు వచ్చే అవకాశం ఉంది. వైద్య సదుపాయాలు అంతగా లేని ఆ రోజుల్లో ఇది తల్లీబిడ్డకు మంచిది కాదు. తొలకరి జల్లులతో సార్వా పనులు మొదలయ్యేది ఇప్పుడే. కొత్త పెళ్లికొడుకు పొలం పనులకు పోకుండా భార్య కొంగు పట్టుకుని తిరిగితే తిండి గింజలకు ఇబ్బంది పడాల్సి వస్తుందన్నది ఒక కారణం. అనుభవ జ్ఞానంతోనే పూర్వీ కులు ఆషాఢం వేళ కొత్తజంట అత్తింటి గడప దాటకూడదనే ఆచారం తెచ్చారంటారు. అయినా ఇంటిలోని వారికి ఏవో సాకులు చెప్పి నవ దంపతులు చక్కర్లు కొట్టడం, ఏమీ తెలీనట్టుగా అత్తమామలు లోలోపల మురిసిపోవడం ప్రతి ఇంటా జరిగే తంతే. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలోని పట్టణాల్లో పార్కులు, పేరుపాలెం బీచ్, ఇతర పర్యాటక కేంద్రాలు కొత్త జంటలతో కళకళతాడుతున్నాయి. గోరింట పూస్తుంది ఆరేళ్ల పాపాయి నుంచి 60 ఏళ్ల వృద్ధురాలి వరకు అరచేతులు, కాళ్లకు పారాణిగా గోరింటాకు పెట్టుకునేందుకు ఉత్సాహపడతారు. పల్లెల్లోని అమ్మ మ్మలు, నానమ్మలు గోరింటాకును రుబ్బించి పట్టణాల్లోని తమ కుమార్తెలు, కోడళ్లు, మనవరాళ్లకు పంపిస్తుంటారు. ఈ సీజన్లో గోరింటాకు పెట్టుకోవడం వెనుక శాసీ్త్రయ కారణంగా ఉంది. వర్షాల వలన ఇంట్లో పనులు చేసుకునే మహిళల కాళ్లు, చేతులు పగుళ్లు తీస్తుంటాయి. గోరింటాకు పగుళ్లు రాకుండా చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబు తున్నారు. ఇలా ఆషాఢ ఆచారాలు ఆధ్యాత్మికతతో పాటు ఆరోగ్య కారకాలుగా ఉన్నాయి. అన్నింటా ఆఫర్ల మేళా ఆషాఢం వేళ అన్నింటా ఆఫర్ల మేళానే. జిల్లాలో ఏలూరు, భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు, జంగారెడ్డిగూడెం, నరసాపురం, నూజివీడు తదితర పట్టణాల్లోని క్లాత్, రెడీమేడ్, జ్యూయలరీ, కాస్మోటిక్స్ షోరూంలతో పాటు మండల కేంద్రాల్లోని చిన్న దుకాణాల్లో సైతం ప్రస్తుతం ఆషాఢం ఆఫర్లు నడుస్తున్నాయి. మహిళల్ని ఆకర్షించి అమ్మకాలు ఆషాఢం సేల్ అంటూ వ్యాపారులు ఆఫర్లు ప్రకటిస్తున్నారు. వంటకాలూ ప్రత్యేకమే వర్షాలతో శరీరం చల్ల బడి నజ్జు చేయడం, ప్రతికూల వాతావరణంతో ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంది. వీటికి నివారణగా తెలగపిండి–మునగాకు, పప్పు–వాగ కాయలు ఈ ఆషాఢ మాసంలో వండుకోవడం జిల్లా అంతటా కనిపిస్తుంది. గ్రామల్లో నివసించే వారు పట్ట ణాల్లోని తమ వాళ్లకు ప్రత్యేకంగా వండి పంపిస్తుంటారు. వీటిలోని పోష కాలు శరీర ఉష్ణోగ్రతలను అదుపులో ఉంచి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఆషాఢంలో ఒక్కసారైన ఈ కూరలు తినాలనేది ఆనాదిగా వస్తున్న ఆచారం. ఈ సీజన్లో వచ్చే నేరేడుపండ్లు, తాటికాయాలు ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి. అరుదైన కాలం ఆషాఢం ఆషాఢ మాసం అన్ని నెలల్లోనూ అరుదైనది. సూర్యుడు మిధున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సమయంలో వాతావరణంలో పెనుమార్పులు సంభవిస్తాయి. వీటిని తట్టుకునేలా మనుషులు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో వచ్చే మార్పుల ప్రభావం వ్యాధి నివారణకు ఉపకరిస్తుంది. పండితులు చాతుర్మాస దీక్షలు చేపడతారు. ఆధ్యాత్మికతతో పాటు ఆరోగ్యం పెనవేసుకున్నా మాసం ఆషాఢం. – రామశాస్త్రి, పండితులు, ఆకివీడు -
జెడ్పీ చైర్పర్సన్ కారుపై దాడి అమానుషం
కై కలూరు: కూటమి పాలనలో మహిళలపై దా డులు పెరుగుతున్నాయని ముదినేపల్లి మండలానికి చెందిన వైఎస్సార్సీపీ ముదిరాజుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కోమటి విష్ణువర్థన్ అన్నారు. శనివారం ఆయన సాక్షితో మాట్లాడుతూ గుడివాడలో జరిగే పార్టీ కార్యక్రమానికి హాజరవుతున్న కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక కారు అద్దాలను పగలగొట్టి కూటమి గూండాలు బీభత్సం చేయడం అత్యంత బాధాకరమన్నా రు. దాడి చేసిన వారిపై ప్రభుత్వం కఠిన చ ర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహి ళా ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. దాడులు దేనికి సంకేతం? దెందులూరు: కృష్ణా జిల్లాపరిషత్ చైర్పర్సన్ హారికపై దాడి చేసి, దౌర్జన్యానికి పాల్పడటం దుర్మార్గపు చర్య అని ఉమ్మడి పశ్చిమగోదా వరి జిల్లాపరిషత్ వైస్ చైర్మన్ పెనుమాల విజయబాబు అన్నారు. శనివారం సాక్షితో ఆయన మా ట్లాడుతూ ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనన్నారు. కూటమి ప్రభుత్వంలో సా మాన్య ప్రజానీకంతో పాటు జిల్లాస్థాయి ప్రజాప్రతినిధులకు కూడా రక్షణ లేకుండా పోయిందనే విషయాన్ని ఈ దాడి నిరూపించిందన్నారు. వెంటనే న్యాయస్థానాలు ఈ ఘటనను సుమోటోగా స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు. దాడి చేసి, దౌర్జన్యానికి పాల్పడిన వారిపై ప్రభుత్వం సీరియస్గా స్పందించి చర్యలు తీసుకోకపోతే భవిష్యత్ కార్యక్రమాన్ని ప్రకటించడానికి ఎంతో సమయం పట్టదని అన్నారు. ప్రైవేటీకరణ విధానాలను తిప్పికొట్టాలి భీమవరం: విద్యా, వైద్యరంగాలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలని చూస్తోందని, ఈ విధానాలను తిప్పికొట్టాలని ఎమ్మెల్సీ బి.గోపిమూర్తి అన్నారు. శనివారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో జరిగిన జిల్లా ఆశావర్కర్ల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యూనియన్ జిల్లా అధ్యక్షురాలు చింతపల్లి లక్ష్మి అధ్యక్షత వహించారు. ఎమ్మెల్సీ గోపి మూర్తి మాట్లాడుతూ గిన్నిస్ బుక్ రికార్డు పేరుతో విద్య వైద్యరంగాలను ప్రభుత్వం నుంచి వేరు చేసే ప్రయత్నంలో భాగమే యోగా, తల్లిదండ్రుల సమావేశాలు అని విమర్శించారు. సీఐటీయూ అఖిల భారత ఉపాధ్యక్షుడు అంగన్వాడీ సంఘ రాష్ట్ర అధ్యక్షురాలు కె.బేబీ రాణి మాట్లాడుతూ ఆశావర్కర్లకు ప్రసూతి సెలవులు లేకుండా పనిచేయించుకోవ డం దారుణమన్నారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రాజారామ్మోహన్రాయ్, యూనియన్ జిల్లా కార్యదర్శి డి.జ్యో తి మాట్లాడుతూ మూడేళ్లలో జిల్లాలో చేసిన పోరాటాలను వివరించారు. భీమవరం స్టేషన్లో తనిఖీలు భీమవరం: రైళ్లలో గంజాయి అక్రమ రవాణను అరికట్టాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు జిల్లా అ దనపు ఎస్పీ వి.భీమారావు తెలిపారు. భీమవ రం టూటౌన్ పోలీసులు, ఈగల్ టీమ్స్, రైల్వే పోలీసులు, డాగ్ స్క్వాడ్ బృందాలు సంయుక్తంగా శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో భీమవరం టౌన్ రైల్వేస్టేషన్లో తనిఖీలు చేశారు. విశాఖ ఎక్స్ప్రెస్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టి బ్యాగులను, లగేజీలను నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ సహాయంతో క్షుణ్ణంగా పరిశీలించామని భీమారావు తెలిపారు. గంజాయి, ఇత ర మాదక ద్రవ్యాలు లభించలేదన్నారు. గంజాయి, మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగం గురించి సమాచారాన్ని టోల్ ఫ్రీ నంబరు 1972కు అందించాలని ప్రజలను కోరారు. భీమవరం టూటౌన్ ఇన్స్పెక్టర్ జి.కాళీచరణ్ పాల్గొన్నారు. వరదను సమర్థంగా ఎదుర్కొంటాం యలమంచిలి: గోదావరిలో వరద పెరిగితే సమర్థంగా ఎదుర్కోవడానికి అధికార యంత్రాగం సన్నద్ధంగా ఉందని నరసాపురం ఆర్డీఓ దాసి రాజు చెప్పారు. గోదావరిలో నీరు పెరు గుతున్న నేపథ్యంలో శనివారం ఆయన మండలంలోని లంక గ్రామాల్లో పర్యటించారు. కనకాయలంకలో కాజ్వే కింద నుంచి వరద నీరు పాక్షికంగా ప్రవహిస్తుండటంతో గ్రామస్తులను అప్రమత్తం చేశారు. వరద పెరిగితే ఇంజన్ పడవలు ఏర్పాటు చేస్తామని, ప్రజలు నిత్యావసరాలను ముందుగానే నిల్వ చేసుకోవాని సూచించారు. కనకాయలంక, పెదలంకలో ప్రజలను అప్రమత్తం చేసేలా టాంటాం వేయించాలని తహసీల్దార్ గ్రంధి నాగ వెంకట పవన్కుమార్ను ఆదేశించారు. -
ఉధృతంగా గోదావరి
‘కళ్ల కలక’లం వర్షాకాలం కావడంతో జిల్లాలో కళ్ల కలకతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు వ్యక్తిగత శుభ్రత పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. 8లో uఆదివారం శ్రీ 13 శ్రీ జూలై శ్రీ 2025పోలవరంలో క్రమేపీ పెరుగుతూ.. పోలవరం రూరల్: గోదావరి వరద క్రమేపీ పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ఉప నదుల నీరు చేరడంతో వరద ప్రవాహం పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే వద్ద 31.430 మీటర్లకు నీటిమట్టం చేరుకుంది. స్పిల్వే 48 గేట్ల నుంచి 7,43,222 క్యూసెక్కుల నీరు దిగువకు చేరు తోంది. అయితే భద్రాచలం వద్ద శనివారం ఉద యం 11 గంటలకు 41.30 అడుగులకు చేరుకున్న నీటిమట్టం క్రమేపీ స్వల్పంగా తగ్గుతూ రాత్రికి 41 అడుగులకు చేరుకుంది. భద్రాచలం వద్ద వరద స్వల్పంగా తగ్గుతూ నిలకడగా ప్రవహిస్తోంది. దిగువన వరద స్వల్పంగా పెరుగుతోంది. సాక్షి ప్రతినిధి, ఏలూరు: గోదావరికి వరద పోటెత్తుతోంది. పూర్తి జలకళతో గోదావరి, శబరి నదులు ప్రవహిస్తున్నాయి. ఎగువ రాష్ట్రాల్లో విస్తారంగా కురిసిన వర్షాలతో లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు చేరుతుంది. ముంపు మండలాలైన ఏజెన్సీ గ్రామాలను అతలాకుతలం చేస్తూ పోలవరం నుంచి ధవళేశ్వరం మీదుగా లక్షలాది క్యూసెక్కుల నీరు సముద్రంలో కలుస్తోంది. శనివారం సాయంత్రం 6 గంటల సమయానికి పోలవరం ప్రాజెక్టు నుంచి 7,43,222 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు. మరోవైపు మండలాల్లోని మూడు గ్రామాలకు చెందిన ప్రజలను పునారావాస కేంద్రాలకు తరలించారు. ముంపు మండలాల్లో హైఅలర్ట్ గోదావరికి వరద ఉధృతి కొనసాగుతున్న క్రమంలో ముంపు మండలాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. మహారాష్ట్ర, తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురవడంతో గోదావరికి పది రోజులుగా భారీగా వరద నీరు చేరు తుంది. ఈనెల 2 నుంచి ప్రారంభమైన వరద నీరు శుక్రవారం 5,02,478 క్యూసెక్కులు, శనివారం సాయంత్రం 6 గంటల సమయానికి 7,43,222 క్యూసెక్కులు నీరు పోలవరానికి చేరింది. భద్రాచలం వద్ద 41.30 అడుగుల ఎత్తులో నీరు ప్రవహిస్తుంది. మరోవైపు ఆదివారం, సోమవారం గోదావరి నిలకడగా కొనసాగే అవకాశం ఉందని, ఎగువ ప్రాంతాల్లో వరద తగ్గుముఖం పట్టడంతో తీవ్రత కొంత తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈనెల 2 నుంచి శనివారం వరకు 30.52 లక్షల క్యూసెక్కుల నీరు ఎగువ ప్రాంతాల నుంచి పోలవరానికి చేరుకుంది. పోలవరం నుండి దిగువకు విడుదల చేశారు. ముంపు గ్రామాల్లో భయం.. భయం పోలవరం ముంపు గ్రామాల్లో వరద భయం వెంటాడుతోంది. వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో మూడు గ్రామాలకు వరద ముంపు పొంచి ఉంది. దీంతో జిల్లా అధికార యంత్రాంగం కుక్కునూరు మండలంలోని గొమ్ముగూడెం, లచ్చిగూడెం గ్రామాలకు చెందిన 70 కుటుంబాలు దాచారంలోని ఆర్అండ్ఆర్ కాలనీకి తరలించారు. వేలేరుపాడు మండలంలోని రేపాకగొమ్ముగూడెంకు చెందిన సుమారు 100కు పైగా కుటుంబాలు పునరావాస కాలనీకి తరలివెళ్లాయి. అలాగే రాష్ట్రం విపత్తుల నివారణ దళం సభ్యులు (ఎన్డీఆర్ఎఫ్) రెండు మండలాలకు చేరుకున్నారు. ఒక్కో మండలంలో 35 మంది బృందంతో అత్యవసర సేవలందించడానికి వీలుగా సిద్ధం చేశారు. జిల్లా అధికార యంత్రాంగం పునరావాస కేంద్రంలో పరిస్ధితిని సమీక్షిస్తున్నారు. మరోవైపు వేలేరుపాడు, కోయిదా, ప్రధాన రహదారిపై ఉన్న ఎద్దులవాగు వంతెన గోదావరి వరద పొంగిపొర్లడంతో వంతెన పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. దీంతో 18 గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కుక్కునూరు శివారులో వేలేరు వద్ద కిన్నెరసాని వాగుకు వరద నీరు చేరడంతో సమీపంలోని పొలాల్లోకి వరద నీరు పోటెత్తింది. అలాగే కుక్కునూరు మండలంలో గుండేటివాగు లోలెవల్ వంతెన జలదిగ్బంధంలో చిక్కుకుపోవడంతో రాకపోకలు స్తంభించాయి. న్యూస్రీల్ 7.43 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల వేలేరుపాడు, కుక్కునూరులో పునరావాస కేంద్రాలు నిలకడగా శబరి, గోదావరి రెండు రోజుల్లో వరద తగ్గుముఖం పట్టే అవకాశం నీటమునిగిన ఎద్దులవాగు, గుండేటివాగు వంతెనలు వేలేరుపాడులో 18 గ్రామాలకు నిలిచిన రాకపోకలు -
రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు
భీమవరం: కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్సార్సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు కోడె విజయలక్ష్మి మండిపడ్డారు. శనివారం భీమవరంలో జరిగిన మహిళా కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కాకినాడ రంగరాయ కళాశాల పారా మెడికల్ విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఘటనపై అధికారులు పొంతన లేని సమాధానం చెబుతున్నారని ఆరోపించారు. ఎందరో ఉద్యోగిను లు బయటకు చెప్పలేక వేధింపుల వేదన అనుభవిస్తున్నారన్నారు. ల్యాబ్ అసిస్టెంట్ కల్యాణ చక్రవర్తి మహిళల ఫొటోలు తీసి బయటకు పంపడంతో పాటు, వీటి ద్వారా మహిళలను బెదిరించడం అత్యంత దారుణమన్నారు. లైంగిక వేధింపుల బాధితులకు న్యాయం చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని, ఇ లాంటి ఘటనలు పునరావృతం కాకుండా హోం మంత్రి చర్యలు తీసుకోవాలని, బాధ్యులైన అధికారులపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన రాష్ట్రంలో జరిగిన కీచక పర్వమని మండిపడ్డారు. మహిళలు మీద చేయి వేస్తే తాటా తీస్తానన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏమయ్యారని ప్రశ్నించారు. 50 మంది మహిళలను నెల రోజుల నుంచి వేధిస్తే ఏం చర్యలు తీసుకున్నారని నిలదీశారు. బాధ్యులపై చర్యలు తీసుకోకుంటే మహిళా లోకం ఉద్యమిస్తుందని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం ప్రజలపై అధిక భారాలను మోపుతోందని, గ్యాస్పై రూ.50 పెంచిందన్నారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడం లేదని విమర్శించారు. గిడుతులూరి రత్నం, భోగిరెడ్డి మంజుల, కె.విజయలక్ష్మి, కోడే భారతి పాల్గొన్నారు. -
కూటమి అరాచక పాలనపై పోరాడుదాం
పాలకొల్లు సెంట్రల్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోందని, సుపరిపాలన.. ఇది మంచి ప్రభుత్వం అంటూ వారి డప్పు వారే కొట్టుకుంటూ పగటి వేషగాళ్లలా నాయకులు డ్రామాలా డుతున్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ము దునూరి ప్రసాదరాజు విమర్శించారు. శనివారం స్థానిక లయన్స్ కమ్యూనిటీ హాల్లో వైఎస్సార్సీపీ పాలకొల్లు నియోజకవర్గ సమావేశాన్ని ఇన్చార్జి గు డాల శ్రీహరిగోపాలరావు (గోపి) అధ్యక్షతను నిర్వహించారు. బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ముదునూరి మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్సార్సీపీ శ్రేణులపై సుమారు 4,500 కేసులు బనాయించారని మండిపడ్డారు. కూటమి దుర్మార్గపు పాలనను ఎండగట్టేలా పోరాటం చేస్తామన్నారు. గత ఎన్నికల సమయంలో ప్రతి కుటుంబానికీ బాబు ష్యూరిటీ–పవన్ గ్యారంటీ అంటూ బాండ్లు అందించారని, ఈ మేరకు ఏడాది పాలనలో చేకూరిన లబ్ధిపై ప్రజలు ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు ఇస్తే గాలికి వదిలేసినట్టేనని ఎద్దేవాచేశారు. ఉచిత బస్సు ప్రయాణానికి గ్యారంటీ లేదని, రైతులకు పెట్టుబడి సాయం, యువతకు నిరుద్యో గ భృతి లేదా 20 లక్షల ఉద్యోగాలు, 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1,500, ఏడాదికి మూ డు గ్యాస్ సిలిండర్ హామీలు ఏమయ్యాయని ప్ర శ్నించారు. 50 ఏళ్లకే బీలకు పెన్షన్ హామీని పట్టించుకోవడం లేదని విమర్శించారు. కూటమి నేతలకు దమ్ముంటే మెడికల్ కళాశాలను అభివృద్ధి చే యాలని అన్నారు. ప్రతి కార్యకర్తకూ వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని, కేసులకు అదిరేది, బెదిరేది లేదని ముదునూరి భరోసా ఇచ్చారు. జగన్ను సీఎం చేయడమే లక్ష్యం నరసాపురం పార్లమెంట్ ఇన్చార్జ్ గుడూరి ఉమాబాల మాట్లాడుతూ పార్టీలో చిన్నపాటి సమస్యలుంటే సర్దుకుపోవాలని, అందరి లక్ష్యం జగన్ ను మరోమారు ముఖ్యమంత్రి చేయడం కోసమే అనే ఆలోచనా విధానం ఉండాలన్నారు. ఇది మోసపూరిత ప్రభుత్వం ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ మాట్లాడుతూ ఇది మంచి ప్రభుత్వం అని డప్పు కొట్టుకుంటూ టీడీపీ నాయకులు తిరగడం ఆశ్చర్యంగా ఉందన్నారు. మంచి ప్రభుత్వమో మోసపూరిత ప్రభుత్వమో ప్రజలు చెప్పాలని అన్నారు. పేదవాడు కనిపిస్తే దోచుకునే విధానం కూటమి నేతలదని అదే పేదవాడు కనిపిస్తే భోజనం పెట్టే గుణం జగన్ది అని అన్నారు. సూపర్ సిక్స్.. సూపర్ ఫ్లాప్ నియోజకవర్గ ఇన్చార్జ్ గుడాల శ్రీహరిగోపాలరావు మాట్లాడుతూ సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ అయ్యిందన్నారు. బాబు పవన్ల పరిస్థితి ఎలా ఉందంటే బాబు బుడగను చూపించి ఇది సంచి అంటే ప్రశ్నించే తత్వం మర్చిపోయిన పవన్ అవును ఇది సంచేననే దుస్థితిలో ఉన్నారన్నారు. ముందుగా వైఎస్సార్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఉమాబాల జ్యోతి ప్రజ్వలనం చేశారు. ఈ కార్యక్రమంలో భీమవరం నియోజకవర్గ ఇన్చార్జి చినమిల్లి వెంకట్రాయుడు, సీనియర్ నాయకులు గుణ్ణం నాగబాబు, చెల్లెం ఆనందప్రకాష్, కుమారదత్తాత్రేయ వర్మ, యడ్ల తాతాజీ, జెడ్పీటీసీలు నడపన గోవిందరాజులు నాయుడు, గుంటూరి పెద్దిరాజు, ఎంపీపీలు యినకొండ ధనలక్ష్మి, సబితి సుమంగళి, కర్రా జయసరిత, జిల్లా యూత్ అధ్యక్షుడు సందీప్, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు బండి రమేష్, జిల్లా వీవర్స్ అధ్యక్షుడు వీరా మల్లికార్జునుడు, పట్టణ, మండల అధ్యక్షులు కోరాడ శ్రీనివాసరావు, ఉచ్చుల స్టాలిన్, పెన్మెత్స ఏసురాజు, కొర్రపాటి వీరాస్వామి, గుమ్మాపు పెద్దిరాజు, కవురు గోపి, గొల్లపల్లి శ్రీనివాస్, మద్దా చంద్రకళ, సునీల్, గుబ్బల సత్యనారాయణ, సాలా నర్సయ్య, విన్స్టన్బాబు, ఖండవల్లి వాసు, మైలాబత్తుల మైఖేల్రాజు, మామిడి బాబు, రావూరి బుజ్జి, బోణం బులివెంకన్న, పెదపాటి పెద్దిరాజు, పాలపర్తి సందీప్, పెచ్చెట్టి కృష్ణాజి, పెండ్ర వీరన్న, శంకరాపు శ్రీను, కడలి ఏడుకొండలు పాల్గొన్నారు. సూపర్సిక్స్ హామీలపై నిలదీయండి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి -
మధ్యవర్తిత్వంతో కేసుల పరిష్కారం
డ్రోన్ల వినియోగంపై శిక్షణ వ్యవసాయ రంగంలో ఇటీవల డ్రోన్ల వినియోగం పెరిగింది. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమం ద్వారా డ్రోన్ల వినియోగంపై శిక్షణకు శ్రీకారం చుట్టారు. 8లో uఏలూరు (టూటౌన్): కక్షిదారుల మధ్య సామరస్య వాతావరణంలో కౌన్సెలింగ్ నిర్వహించి కేసులు పరిష్కరించడమే మధ్యవర్తిత్వ లక్షణం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి అన్నారు. మధ్యవర్తిత్వంతో కేసుల పరిష్కారం అంశంపై వారం రోజుల పాటు నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా శుక్రవారం జిల్లా కోర్టు ప్రాంగణం నుంచి ఫైర్ స్టేషన్ సెంటర్ తదితర ప్రాంతాలలో 1కే వాక్ నిర్వహించి, ప్రజలకు అవగాహన కల్పించారు. మధ్యవర్తిత్వం చేసేందుకు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా 80 మంది న్యాయవాదులు, రిటైర్డ్ న్యాయమూర్తులు, సోషల్ వర్కర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చామని, ఈ కార్యక్రమం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని మధ్యవర్తిత్వం ద్వారా కేసుల పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. రెండో అదనపు జిల్లా జడ్జి యు.ఇందిరా ప్రియదర్శిని, 7వ అదనపు జిల్లా జడ్జి వై.శ్రీనివాసరావు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్న ప్రసాద్, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కె.కె.వి.బులి కృష్ణ, అదనపు సీనియర్ సివిల్ జడ్జి పి.ఎస్.వి.కృష్ణ సాయి తేజ, ఇతర న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. విద్యుత్ రెవెన్యూ అధికారిగా బాధ్యతల స్వీకరణ ఏలూరు (ఆర్ఆర్పేట): ఈపీడీసీల్ ఏలూరు ఆపరేషన్ సర్కిల్ పరిధిలోని ఏలూరు డివిజన్ విద్యుత్ అసిస్టెంట్ రెవెన్యూ అధికారిగా టీ.వెంకాయమ్మ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. తాడేపల్లిగూడెం డివిజన్లో జూనియర్ అకౌంట్స్ అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న వెంకాయమ్మకు ఇటీవల సంస్థ సీఎండీ ఏఏఓగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలం
సీపీఎం జిల్లా కార్యదర్శి గోపాలన్ తణుకు అర్బన్: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలుచేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఎం జిల్లా కార్యదర్శి జేఎన్వీ గోపాలన్ విమర్శించారు. తణుకు సీపీఎం భవనంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆడ బిడ్డ నిధి, ఉచిత బస్సు హామీల అమలుకోసం మహిళలు వేచిచూస్తున్నారని అన్నారు. విద్యుత్ బిల్లులు పెంచబోమని, అవసరమైతే తగ్గిస్తామని చెప్పి నేడు రూ.15 వేల కోట్ల విద్యుత్ భారాన్ని ఇంధన సర్దుబాటు చార్జీలుగా వేయడం దుర్మార్గమని అన్నారు. మరో రూ.842 కోట్ల విద్యుత్ భారాన్ని బిల్లుల్లో కలిపేందుకు ప్రతిపాదన చేస్తున్నారని మండిపడ్డారు. స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగులకొట్టమని అప్పట్లో మంత్రి లోకేష్ అన్నారని నేడు యథేచ్ఛగా బిగిస్తున్నారని అన్నారు. నేటికీ ధాన్యం బకాయిలు చెల్లించకపోవడంతో రైతులు అల్లాడుతున్నారని స్పష్టం చేశారు. తమ సైకిల్ యాత్రలో ప్రజలు ఈ సమస్యలను తమ దృష్టికి తీసుకువచ్చినట్లు చెప్పారు. ఈ నెల 25, 26, 27 తేదీల్లో జిల్లా విస్త్రృతస్థాయి సమావేశాలు తణుకులో నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై ‘దారి తప్పుతున్న టీడీపీ కూటమి ఏడాది పాలన’ పుస్తకాలను ఆవిష్కరించారు. -
ముంచెత్తుతున్న వరద
సాక్షి ప్రతినిధి, ఏలూరు: గోదావరికి వరద సీజన్ వచ్చేసింది. శుక్రవారం ఒకేరోజు 6.35 లక్షల క్యూసెక్కుల నీరు ఎగువ ప్రాంతాల నుంచి పోలవరానికి పోటెత్తింది. దీంతో ఏజెన్సీ ప్రాంతంలో అప్రమత్తమయ్యారు. ఎద్దులవాగు వంతెన పైకి నీరు చేరి శుక్రవారం అర్ధరాత్రికి నీటమునిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో 18 గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోనున్నాయి. మరో మూడు రోజులు పాటు వరద ఉధృతి తీవ్రంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎగువ రాష్ట్రాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు గోదావరికి ఉపనది శబరి వరద నీటితో పోటెత్తుతోంది. గత వారం రోజులుగా రోజూ సగటున 2 లక్షల క్యూసెక్కుల నీరు పోలవరం నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం మీదుగా సముద్రంలో వరద నీరు కలుస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం ఆకస్మాత్తుగా వరద తీవ్రత రెట్టించింది. ఏటా జూలై, ఆగస్టు నెలలో గోదావరికి వరదలు పోటెత్తడంతో ముంపు మండలాలైన వేలేరుపాడు, కుక్కునూరు, పశ్చిమగోదావరి జిల్లాలోని లంక గ్రామాలున్న యలమంచిలి, ఆచంట మండలాల్లో వరద తీవ్రత ఉంటుంది. ప్రధానంగా ముంపు మండలాల్లో రాకపోకలు నిలిచిపోయి.. వందలాది ఇళ్ళు జలదిగ్భందంలో చిక్కుకుంటాయి. ఈ పరిణామాల మధ్య ఈ ఏడాది కూడా గోదావరి వరద తీవ్రత శుక్రవారం ఆకస్మాత్తుగా పెరగడంతో ఏజెన్సీ మండలాల్లో హై అలర్ట్ ప్రకటించారుఉ. రాత్రి 7 గంటల సమయానికి భద్రాచలం వద్ద 37.60 అడుగులకు నీటిమట్టం చేరింది. 6,98,510 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. రాత్రి 8 గంటల సమయానికి పోలవరం నుంచి దిగువకు 6,35,634 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. వరద తీవ్రత శనివారం మధ్యాహ్నానికి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. శనివారం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయ్యే అవకాశం ఉందని, 7.50 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేసే స్థాయిలో ఇన్ఫ్లో ఉందని అధికారుల అంచనా. మహారాష్ట్ర, తెలంగాణాల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో వరద తీవ్రత మొదలైంది. జలదిగ్బంధంలో ఎద్దులవాగు వంతెన వేలేరుపాడు–కొయిదా మార్గంలోని ఎద్దులవాగు వంతెన జలదిగ్బంధంలో చిక్కుకుంది. శుక్రవారం రాత్రికి పూర్తిగా నీటమునిగింది. దీంతో 18 గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వేలేరుపాడు మండల కేంద్రానికి జిల్లా కేంద్రంతో సంబంధాలు తెగిపోయాయి. కుక్కునూరు– దాచారం రహదారిలో గుండేటివాగు ఉధృతంగా ప్రవహించి వంతెన నీటమునిగింది. దీంతో ఈ రెండు గ్రామాల మధ్య రాకపోకలు ఆగిపోయాయి. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయితే కుక్కునూరు మండలంలో దాచారం, గొమ్ముగూడెం పంచాయితీ నలువైపులా నీరు చేరి రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయి. గొమ్ముగూడేనికి చెందిన 15 కుటుంబాలను పునరావాస కాలనీలకు తరలించారు. ముంపు ప్రాంతాల్లో ఐటీడీఏ పీవో పర్యటన వేలేరుపాడు/కుక్కునూరు/పోలవరం రూరల్: కలెక్టర్ ఆదేశాల మేరకు గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో శుక్రవారం ఐటీడీఏ పీవో రాములనాయక్ పర్యటించారు. కుక్కునూరు మండలంలో వరద ప్రభావిత గ్రామాలైన లచ్చిగూడెం, గొమ్ముగూడెంలో పర్యటించి గ్రామస్తులతో మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. దాచారం ఆర్ అండ్ ఆర్ కాలనీల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలిరావాలని గ్రామస్తులకు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే వద్ద నీటిమట్టం 30.110 మీటర్లకు చేరింది. స్పిల్ వే 48 గేట్ల నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. పోలవరం నుంచి 6.35 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల ఏజెన్సీలో నీటమునిగిన ఎద్దులవాగు వంతెన 18 గ్రామాలకు నిలిచిన రాకపోకలు మరో మూడు రోజులు ఉధృతి కొనసాగే అవకాశం ఏజెన్సీలో అప్రమత్తం -
మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
భీమవరం: మున్సిపల్ పర్మినెంట్, అప్కాస్ ఔట్ సోర్సింగ్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను తక్షణం నెరవేర్చాలని లేకుంటే ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామని మునిసిపల్ వర్కర్స్ యూనియన్ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కిలారి మల్లేశ్వరరావు, జిల్లా కార్యదర్శి తాడికొండ శ్రీనివాసరావు, ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యుడు చెల్లబోయిన రంగారావు హెచ్చరించారు. కార్మికుల హక్కుల సాధనకు చేపట్టిన దశల వారీ ఆందోళనల్లో భాగంగా శుక్రవారం భీమవరం కలెక్టరేట్ను ముట్టడించి, ధర్నా ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లేశ్వరరావు, శ్రీనివాసరావు, రంగారావు మాట్లాడుతూ కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికుల వేతనాలు పెంచాలని, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. ఇంజినీరింగ్ సెక్షన్లో పనిచేస్తున్న పర్మినెంట్ కార్మికులకు పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలన్నారు. అవుట్ సోర్సింగ్లో పనిచేస్తున్న మునిసిపల్ ఇంజినీరింగ్, పారిశుధ్య కార్మికుల కనీస వేతనం రూ.35 వేలకు పెంచాలని లేకుంటే సమాన పనికి సమాన వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని డీఆర్వో ఎం.వెంకటేశ్వర్లకు అందచేశారు. -
బడుగులకు మొండిచేయి
శనివారం శ్రీ 12 శ్రీ జూలై శ్రీ 2025సాక్షి, భీమవరం: వ్యవసాయ మార్కెట్ కమిటీ(ఏఎంసీ) చైర్మన్ల రిజర్వేషన్లలో ఎస్టీ, మైనార్టీలకు ప్రభుత్వం మొండిచేయి చూపింది. జిల్లాలో పది ఏఎంసీలు ఉండగా వీరికి ఎక్కడా స్థానం కల్పించలేదు. ఐదు జనరల్కు, మూడు బీసీ, రెండు ఎస్సీలకు కేటాయించారు. తొలుత భీమవరం ఏఎంసీ ఎస్టీ మహిళ, నరసాపురం బీసీ మైనార్టీకి కేటాయించగా కూటమి నేతల ఒత్తిళ్ల మేరకు మార్పులతో రివైజ్డ్ జాబితాను విడుదల చేసినట్టు తెలుస్తోంది. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల పరిధిలో పది ఏఎంసీలు ఉన్నాయి. వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా వీటి నుంచి ప్రభుత్వానికి ఏడాదికి రూ.65.98 కోట్ల ఆదాయం సమకూరుతోంది. రూ.15.6 కోట్ల ఆదాయ ఆర్జనతో భీమవరం మొదటిస్థానంలో ఉండగా రూ.12.45 కోట్లతో ఉండి రెండో స్థానంలో ఉంది. అత్తిలి రూ.2.75 కోట్లు, ఆచంట రూ.1.91 కోట్లతో చివరి స్థానాల్లో ఉన్నాయి. నియోజకవర్గంలో ఎమ్మెల్యే తర్వాత స్థానం ఏఎంసీ చైర్మన్దే. ఈ పదవి కోసం ఎంతోమంది ఆశావహులు ఉంటారు. ఒత్తిడి మేరకు రిజర్వేషన్లలో మార్పు జీఓ నెంబర్ 77 ప్రకారం మొత్తం స్థానాల్లో 50 శాతం జనరల్కు రిజర్వు చేయగా, మిగిలిన 50 శాతంలో బీసీ, మైనార్టీలకు 29 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు ఆరు శాతం సర్దుబాటు చేయాలి. ఈ నెల 8న జిల్లాలోని ఏఎంసీ చైర్మన్ల పదవికి జిల్లా యంత్రాంగం రిజర్వేషన్లు ఖరారు చేసింది. జిల్లా యూనిట్గా జనాభా ప్రాతిపదికన వీటిని రూపొందించినట్టు సమాచారం. రెండు ఏఎంసీలకు ఓసీ జనరల్, రెండు చోట్ల ఓసీ మహిళ, ఒకటి బీసీ మహిళ, ఒకటి బీసీ జనరల్, ఒకటి ఎస్సీ, ఒకటి ఎస్సీ జనరల్, భీమవరం ఎస్టీ మహిళ, నరసాపురం బీసీ మైనార్టీకి కేటాయించారు. ఈ జాబితా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. భీమవరం, నరసాపురంలలో ఏఎంసీ చైర్మన్ పదవులకు టీడీపీ, జనసేనలోని అగ్రవర్ణాల నుంచి తీవ్ర పోటీ ఉంది. చైర్మన్ల విషయంలో ఇప్పటికే రెండు చోట్ల కూటమి నాయకత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఆచంట ఏఎంసీకి సంబంధించి గతంలోనే బీసీల నుంచి టీడీపీ నాయకత్వం అభ్యర్థిని దాదాపు ఖరారు చేసింది. రిజర్వేషన్లు బెడిసికొట్టడంతో ఆశావాహుల గొంతులో పచ్చివెలక్కాయ పడింది. ఆయా నియోజకవర్గాల కూటమి నేతలు తమకు అనుకూలంగా రిజర్వేషన్ల మార్పు కోసం ఉన్నతస్థాయి నుంచి జిల్లా యంత్రాంగంపై ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. దీంతో రాష్ట్రం యూనిట్గా తీసుకుని నేతలకు అనుకూలంగా అదే రోజు రివైజ్డ్ జాబితాను విడుదల చేసినట్టు తెలుస్తోంది. ఈ రిజర్వేషన్ల మేరకు ఎమ్మెల్యేలు సూచించిన పేర్లతో తణుకు ఏఎంసీ చైర్మన్గా కొండేటి శివ, అత్తిలికి దాసం ప్రసాద్, తాడేపల్లిగూడెంకు చాపల మంగాబాయి, పాలకొల్లుకు కోడి విజయభాస్కర్, ఆకివీడుకు బొల్ల వెంకట్రావు చైర్మన్లుగా ప్రతిపాదిస్తూ ఆమోదం కోసం మార్కెటింగ్ శాఖ ప్రభుత్వానికి నివేదించింది. గతంలో పారదర్శకంగా.. పాలనలో బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేసిన జగన్ సర్కారు రిజర్వేషన్ల అమలులో వారికి సముచిత స్థానం కల్పించి అందరికి సమన్యాయం చేశారు. నిబంధనలు మేరకు ఐదు జనరల్కు, రెండు ఎస్సీలకు, ఒకటి ఎస్టీలకు, బీసీలకు కేటాయించిన రెండింటిలో ఒకటి మైనార్టీకి రిజర్వు చేశారు. న్యూస్రీల్చిన్నచూపు తగదు ముందుగా వచ్చిన జాబితాలో భీమవరం ఏఎంసీ ఎస్టీ మహిళకు రిజర్వు చేశారు. తర్వాత రివైజ్ చేసి ఓసీ మహిళకు మార్పుచేశారు. ఎస్టీలకు జిల్లాలో ఎక్కడా కేటాయింపు చేయకపోవడం తగదు. గత ప్రభుత్వంలో నిబంధనలు మేరకు ఎస్టీలకు చైర్మన్ పదవి ఇచ్చారు. – సాలా శ్రీనివాస్, ఎరుకల సంఘం భీమవరం రూరల్ అధ్యక్షుడు మైనార్టీలపై చిన్నచూపు మైనార్టీలపై కూటమి ప్రభుత్వం చిన్నచూపు చూస్తుంది. నరసాపురం ఏఎంసీ చైర్మన్ పదవిని ముందుగా మైనార్టీలకు కేటాయించి, ఒక్కరోజులో మళ్లీ రిజర్వేషన్ మార్చడం దారుణం. ఈ ఏఎంసీ పదవిని ఇంతవరకూ ముస్లిం మైనార్టీలు చేపట్టలేదు. మొదటిసారి ఓ ముస్లిం ఆ పదవిలో చూద్దామని ఆశపడ్డ మాకు ఒక్కరోజులోనే అసంతృప్తి మిగిల్చారు. – ఎండీ బాషా ఖాన్, నరసాపురం ఏఎంసీ చైర్మన్ల రిజర్వేషన్లలో ఎస్టీ, మైనార్టీలకు దక్కని చోటు కావాల్సిన వారికి కట్టబెట్టుకునేందుకు కూటమి నేతల ఒత్తిళ్లు ఆ మేరకు రాష్ట్రం యూనిట్గా రిజర్వేషన్ల సవరణ గత ప్రభుత్వంలో సామాజిక న్యాయం పాటిస్తూ రిజర్వేషన్ల అమలు ఏఎంసీ 2023లోని రిజర్వేషన్లు రెండ్రోజుల క్రితం రివైజ్ చేసిన తర్వాత ఆకివీడు బీసీ (మైనార్టీ మహిళ) బీసీ (మహిళ) బీసీ అత్తిలి ఓసీ ఓసీ (మహిళ) ఓసీ భీమవరం ఓసీ ఎస్టీ (మహిళ) ఓసీ (మహిళ) పాలకొల్లు ఎస్టీ (మహిళ) బీసీ బీసీ పెనుగొండ ఓసీ (మహిళ) ఓసీ ఓసీ తాడేపల్లిగూడెం ఎస్సీ ఓసీ (మహిళ) ఎస్సీ (మహిళ) తణుకు ఎస్సీ (మహిళ) ఎస్సీ ఎస్సీ ఉండి ఓసీ ఓసీ ఓసీ ఆచంట ఓసీ ఎస్సీ (మహిళ) బీసీ (మహిళ) నరసాపురం బీసీ బీసీ (మైనార్టీ) ఓసీ -
కఠినంగా శిక్షించాలి
పాలకొల్లు సెంట్రల్: రంగరాయ కాలేజీలో లైంగిక వేధింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కర్రా జయసరిత డిమాండ్ చేశారు. శుక్రవారం పార్టీ కార్యాలయం వద్ద మాట్లాడుతూ కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో మహిళలు, బాలికలు విద్యా సంస్థకు వెళ్లాలన్నా, రోడ్డుపై తిరగాలన్నా, ఆస్పత్రికి వెళ్లినా అక్కడ కూడా రక్షణ లేకుండా పోయిందన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు జోగాడ ఉమామహేశ్వరరావు, వీరా మల్లిఖార్జునుడు, దేవ రాజేష్, మామిడిశెట్టి చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ జూనియర్ కళాశాల వద్ద ఉద్రిక్తత భీమవరం: భీమవరం పట్టణంలోని ఒక ప్రైవేటు జూనియర్ కళాశాల వద్ద ర్యాగింగ్ అంటూ కలకలం రేగింది. బైపాస్ రోడ్డులోని ఈ జూనియర్ కళాశాలలో ఈ నెల 5న జూనియర్, సీనియర్ విద్యార్థుల వద్ద టాయిలెట్ల వద్ద వివాదం ఏర్పడింది. వివాదానికి కారణమైన ఏడుగురు విద్యార్థులను కళాశాల యాజమాన్యం సస్పెండ్ చేసినట్లు తెలిసింది. బాధిత విద్యార్థుల్లో ఒక విద్యార్ధి తండ్రి శుక్రవారం కళాశాలకు చేరుకుని వివాదం వివరాలు తమకెందుకు చెప్పలేదంటూ కళాశాల ప్రిన్సిపల్ను నిలదీశారు. దీంతో కళాశాల వద్ద ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడినట్లు తెలిసింది. దీనిపై ఇంటర్మీడియట్ జిల్లా అధికారి జి.ప్రభాకరరావును వివరణ కోరంగా వివాదం తన దృష్టికి రాలేదని, వివరాలు తీసుకుంటానన్నారు. హమాలీల కూలి రేట్లు పెంచాలి ఏలూరు (టూటౌన్): ఏలూరు నగరంలో మర్చంట్ అండ్ చాంబర్ పరిధిలో హమాలీ కార్మికులకు కూలీ రేట్ల పెంపుదలలో ఎమ్మెల్యే జోక్యం చేసుకోవాలని కోరుతూ ఏలూరు వైఎంహెచ్ఏ హాలు నుంచి విజ్ఞాపన యాత్రను శుక్రవారం నిర్వహించారు. ఎమ్మెల్యే బడేటి చంటి క్యాంపు కార్యాలయం వద్దకు పదర్శన చేశారు. ఈ సందర్భంగా వినతిపత్రం సమర్పించారు. ఏఐటీయూసీ జిల్లా నాయకుడు బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కూలి రేట్ల పెంపుదల విషయంలో సానుకూలంగా ఉండాలన్నారు. ఐఎఫ్టీయు ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు మాట్లాడుతూ కూలి రేట్ల పెంపుదల కాల పరిమితి ముగిసినప్పటికీ యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తుందని, అది సరి కాదన్నారు. రైళ్లలో ప్రత్యేక తనిఖీలు ఏలూరు టౌన్: ఏలూరు జిల్లాలోకి గంజాయి, మత్తుపదార్థాలు రవాణా కాకుండా అడ్డుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, ఆకస్మిక తనిఖీలు చేస్తూ నిఘా ఏర్పాటు చేశామని ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు అన్నారు. ఈగల్ ఐజీ రవికృష్ణ ఆదేశాల మేరకు ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ పర్యవేక్షణలో ఏలూరులో పోలీస్, రైల్వే పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. ఒడిశా నుంచి వచ్చే ప్రతి రైలులో తనిఖీలు చేశారు. అనుమానస్పద వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. గంజాయి, మత్తు పదార్థాలు రవాణా అడ్డుకోవడమే ప్రధాన లక్ష్యమన్నారు. ఎవరైనా అనుమానితులు కనిపిస్తే వెంటనే 1972కు సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. -
బీజీబీఎస్ పాలకవర్గ ఆగడాలపై చర్యలు తీసుకోవాలి
నరసాపురం: బీజీబీఎస్ మహిళా కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ నూలి శ్రీనివాస్, పాలకవర్గంపై ఆగడాలపై చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. కళాశాలలో కాంట్రాక్ట్ పద్ధతిపై పని చేస్తున్న నలుగురు మహిళా అధ్యాపకులు గత 15 రోజులుగా కళాశాల వద్ద ఆందోళన చేస్తున్నసంగతి తెలిసిందే. తమను అకారణంగా విధులు నుంచి తొలగించి పాలకవర్గం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని ఆరోపిస్తూ ఆందోళన చేస్తున్నారు. శుక్రవారం అధ్యాపకులకు మద్దతుగా నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పీడీ రాజు మాట్లాడుతూ కళాశాల ఆస్తులు అమ్మకానికి పెట్టడం, మహిళా అధ్యాపకులపై లైగింక వేధింపులకు పాల్పడం దారుణమన్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడం ఏంటి అని ప్రశ్నించారు. రానున్న రోజుల్లో ఆందోళన మరింత ఉధృతం చేయాలని సమావేశంలో నిర్ణయించారు. సమావేశంలో ఐద్వా జిల్లా కార్యదర్శి పొగాకు పూర్ణ, సీపీఎం నేత కవురు పెద్దిరాజు, కోట్ల రామ్కుమార్, త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆలయ మరమ్మతులకు అంచనాలు
పాలకొల్లు సెంట్రల్: పంచారామక్షేత్రం శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో కొన్ని నిర్మాణాలు, మరమ్మతులు కోసం అంచనాలు సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం దేవదాయ, ధర్మాదాయ శాఖ డిప్యూటి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జి.శ్రీనివాసరావు శుక్రవారం ఆలయానికి విచ్చేసి, పరిసరాలకు పరిశీలించారు. 2027 గోదావరి పుష్కరాలకు మరమ్మతులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆలయంలో స్వామివారి చుట్టూ ఉన్న ప్రాకార మండపం లోపలి భాగంలో బేడా మండపం లీకేజీలు అవుతున్నాయి. అలాగే పార్వతి దేవి, లక్ష్మీదేవి గర్భాలయాల్లో కూడా వర్షం నీరు కారిపోతుంది. జనార్ధనస్వామి ఆలయం గర్భగుడిలో టైల్స్ ముక్కలుగా ఊడిపడిపోతున్నాయి. జనార్ధనస్వామి ఉపాలయం పక్కన ఉన్న బేడా మండపానికి సంబంధించి సుమారు మూడు స్తంభాలు ప్రమాదకరంగా ఒరిగిపోయి ఉన్నాయి. ముఖ్యంగా 120 అడుగుల ఎత్తయిన గాలిగోపురం లోపల శిథిలావస్థకు చేరుకుంటుంది. ఆయా సమస్యలను శ్రీనివాసరావు పరిశీలించారు. కార్యాలయ నిర్మాణంపై తర్జనభర్జన ప్రస్తుతం ఆలయ కార్యాలయం ఉన్న ప్రాంతంలో మరో మండపం నిర్మాణానికి అంచనాలు తయారు చేస్తున్నారు. ఆలయానికి నైరుతి మూలలో గత కొంతకాలం క్రితం ఖాళీ చేసిన ఎస్పీఆర్ఆర్ క్లబ్ స్థలం ఆలయానికి చెందినదే కావడంతో అప్పట్లో ఆ స్థలం ఆలయ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ స్థలంలో కార్యాలయం నిర్మాణం చేయడమా లేఖ అన్నదాన భవనంగా ఉంచడమా? అనే దానిపై చర్చ లు సాగుతున్నాయి. కార్యక్రమంలో దేవదాయ శాఖ భీమవరం అధికారి సూర్యప్రకాశరావు, వర్దినీడి వెంకటేశ్వరరావు, ఈఓ ముచ్చర్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రసాదం తీసుకోని డీఈ ఆలయం ప్రాకారం బేడా మండపంలో లీకేజీలను తనిఖీ చేస్తూ అంచనాలు వేస్తున్న సమయంలో పక్కన ఉన్న కనకదుర్గమ్మ వారికి తయారు చేసిన దద్దోజనం ప్రసాదాన్ని అక్కడ పురోహితులు పంచిపెడుతున్నారు. అటుగా వస్తున్న డీఈతో పాటు మిగిలిన అధికారులను సైతం అయ్యా ప్రసాదం ఇదిగోండని పెట్టగా చేతులు బాగోలేదు వద్దుల్లేండి అని వెళ్లిపోవడంతో భక్తులను ఆశ్చర్యానికి గురి చేసింది. -
ఉన్నత విద్యామండలి తీరు దారుణం
ఏలూరు (ఆర్ఆర్పేట) : రోజుకో మాట పూటకో విధానంలా ఉన్నత విద్యామండలి తీరు ఉందని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) జిల్లా కార్యదర్శి కె.లెనిన్ అన్నారు. శుక్రవారం స్థానిక కోటదిబ్బ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ముందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా లెనిన్ మాట్లాడుతూ డ్యూయల్ డిగ్రీ విధానం అమలు పరుస్తున్నామని ఉత్తర్వులు ఇచ్చి తిరిగి రివ్యూ చేసి సింగిల్ మేజర్ విధానం కొనసాగిస్తామని పేర్కొనడం హాస్యస్పదమన్నారు. రాష్ట్రంలో ఉన్న స్టేక్ హెూల్డర్స్తో సంప్రదించకుండా ఇష్టానుసారంగా నెలకో నిర్ణయం చేయడం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడటమేనని దుయ్యబట్టారు. గత నిర్ణయానికి అనుగుణంగా డిగ్రీలో డ్యూయల్ మేజర్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు.అదే విధంగా ఇంటర్న్షిప్ భారాన్ని తగ్గించి, మైనర్ సబ్జెక్టులకు క్రెడిట్ పాయింట్స్ పెంచాలని కోరారు. విద్యార్థి చదువుకు తగ్గట్టుగా ఇంటర్న్షిప్ ఇవ్వాలని, ఇంటర్న్షిప్ చేస్తున్న సందర్భంలో విద్యార్థులకు తగిన స్టైఫండ్ ఇచ్చే విధంగా సంబంధిత పరిశ్రమలతో ఒప్పందం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంటర్ పరీక్షల ఫలితాలు వెలవడి మూడు నెలలు గడుస్తున్నా ఇంత వరకూ అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించకపోవడం దుర్మార్గమన్నారు. ఆఫ్లైన్ పద్ధతిలో డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నగర కమిటీ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
●అదుపు తప్పితే అంతే
పొట్టకూటి కోసం కొందరు కూలీలు ప్రమాదకర ప్రయాణాలు సాగిస్తున్నారు. వాహనాల పైన, వెనుక కూర్చుని ప్రయాణిస్తున్నారు. అదుపు తప్పితే ఎంతటి ప్రమాదానికి గురి కావాల్సి వస్తుందనే కనీస విషయాన్ని పట్టించుకోవడం లేదు. నిత్యం రహదారులపై ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా ఇలాంటి ప్రమాదకర ప్రయాణాలు సాగించే వారిలో ఏమాత్రం మార్పు రావడం లేదు. శుక్రవారం ద్వారకాతిరుమల వైపు నుంచి భీమడోలు వైపుగా వెళుతున్న ఒక లోడు లారీపై కూలీలు ఇలా ప్రయాణిస్తూ కనిపించారు. – ద్వారకాతిరుమల -
పాఠశాల విలీనంపై మిన్నంటిన నిరసన
సర్పంచ్ ప్రియాంక నిరహార దీక్షను అడ్డుకున్న పోలీసులుపెనుమంట్ర: పెనుమంట్ర దళితవాడలోని ఎలిమెంటరీ పాఠశాలను దూరంగా ఉన్న మరో పాఠశాలలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ సర్పంచ్ తాడిపర్తి ప్రియాంక, ప్రసన్న కుమార్ దంపతులు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను శుక్రవారం పోలీసులు అడ్డుకున్నారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట శాంతియుతంగా దీక్ష చేయడానికి ఏర్పాటు చేసుకున్న శిబిరాన్ని అనుమతులు లేవంటూ ఉదయమే పోలీసులు తొలగించారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రియాంక దంపతులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నేలపైనే బైఠాయించారు. వీరికి మద్దుతుగా విద్యార్థులు తల్లిదండ్రులు కూడా నేలపైనే బైఠాయించి అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ మండల విద్యాశాఖ అధికారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అండగా నిలిచిన వైఎస్సార్ సీపీ నాయకులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన విషయాన్ని తెలుసుకున్న ఆచంట నియోజకవర్గంలోని పెనుమంట్ర, పోడూరు జెడ్పీటీసీ సభ్యులు కర్రి గౌరీ సుభాషిని, గుంటూరు పెద్దిరాజులతో పాటు పలువురు గ్రామ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, దళిత సంఘాల నాయకులు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని సర్పంచ్ ప్రియాంకకు మద్దతుగా నిలిచారు. తహసీల్దార్ వై.రవికుమార్, ఎస్సై స్వామి నాయకులతో గంటకు పైగా చర్చించిన అనంతరం విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి కొద్ది రోజుల్లోనే న్యాయం చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. దీంతో సర్పంచ్ ప్రియాంకతో పాటు తల్లిదండ్రులు నిరసన విరమించారు. కార్యక్రమంలో మండల పరిషత్ ఉపాధ్యక్షులు వాసంశెట్టి కిరణ్, ఈది అనిత ప్రవీణ్, మండల సర్పంచ్ల చాంబర్ అధ్యక్షుడు తమనంపూడి వీర్రెడ్డి, వైఎస్సార్సీపీ మండలాధ్యక్షుడు, సర్పంచ్ గూడూరు దేవేంద్రుడు, నాయకులు కొవ్వూరి వేణుమాధవ్ రెడ్డి, కర్రి రామలింగేశ్వరరెడ్డి, సత్తి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి లేజర్ రన్ పోటీల్లో విద్యార్థి ప్రతిభ
తణుకు అర్బన్: స్థానిక చిట్టూరి ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో శుక్రవారం నిర్వహించిన జిల్లా స్థాయి లేజర్ రన్ (రన్నింగ్ –షూటింగ్ )పోటీల్లో తణుకు మండలం మండపాక గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి ఎస్. నాగ సత్య గణేష్ అండర్ 17 బాలుర విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచినట్లు పాఠశాల హెచ్ఎం కె.ఫణిశ్రీ తెలిపారు. గణేష్ ఈ నెల 12, 13 తేదీల్లో పల్నాడు జిల్లా నరసరావుపేటలో నిర్వహించే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి లేజర్ రన్ పోటీలకు ఎంపికై నట్లు వివరించారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థి గణేష్తో పాటు శిక్షణనిచ్చిన పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ సంకు సూర్యనారాయణను పలువురు అభినందించారు. చేబ్రోలు సర్పంచ్కు అరుదైన గుర్తింపు ఉంగుటూరు: మండలంలోని చేబ్రోలు సర్పంచ్ రందే లక్ష్మీసునీతకు అరుదైన గుర్తింపు లభించింది. జాతీయస్థాయిలో నిర్వహించే సర్పంచ్ సంవాద్లో ప్రథమ స్థానం లభించింది. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ద్వారా కేంద్ర ప్రభుత్వం క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సర్పంచ్ సంవాద్ అనే వేదికను ఏర్పాటు చేశారు. ఈ డిజిటల్ వేదిక ద్వారా ప్రతి నెలా దేశంలో ఉండే సర్పంచ్లు గ్రామాలు ఎలా అభివృద్ధి చేస్తున్నారు? ఇంకా ఎలా చేయాలి? అనే అంశాలపై వారి అభిప్రాయాలను పంచుకుంటూ ఉంటారు. అయితే చేబ్రోలు సర్పంచ్ సునీత వర్మీ కంపోస్టు తయారు చేయడం, పరిశుభ్రత విషయం, తడిచెత్త పొడిచెత్త విడదీయటం, మంచినీటి వనరులు కాపాడుకునే విషయంపై 80 సెకన్లు నిడివితో ఉన్న వీడియో పంపారు. ఈ నేపథ్యంలో ఆమె జూన్ నెలకు సంబంధించి ప్రథమ స్థానంలో నిలిచారు. లక్ష్మీసునీతకు ప్రోత్సాహకంగా రూ.35 వేలు అందిస్తారు. ఈ సందర్భంగా లక్ష్మీ సునీత శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ అవార్డు రావడం తనకు మరింత బాధ్యతను పెంచిందన్నారు. గోదావరికి పంచ హారతుల సమర్పణ పెనుగొండ: ఆషాఢ పౌర్ణమి సందర్భంగా వశిష్టాగోదావరికి శుక్రవారం సిద్ధాంతంలో హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పంచ హారతులు ఇచ్చారు. పూజా కార్యక్రమాలు అనంతరం కలగ భద్రుడు బ్రహ్మత్వంలో గోదావరి హారతులునిచ్చారు. కార్యక్రమంలో హిందూ ధర్మపరిరక్షణ సభ్యులు, పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు దెందులూరు: మండలంలోని మేధినరావుపాలెం గ్రామానికి చెందిన గారపాటి నాగేంద్ర అదృశ్యమయ్యాడంటూ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. నాగేంద్ర గురువారం కుటుంబ సభ్యులపై అలిగి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. అయితే శుక్రవారం పోలవరం కాలులో అతని సెల్ఫోన్, చెప్పులు కనిపించాయంటూ కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. -
డ్రోన్ల వినియోగంపై రైతులకు శిక్షణ
దెందులూరు: వ్యవసాయ రంగంలో యాంత్రికరణ వేగంగా వృద్ధి చెందుతుంది. ఇటీవల డ్రోన్ల ద్వారా పంట చేలకు ఎరువులను వేసేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ, ఆత్మ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో డిప్లమో ఇన్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ ఫర్ ఇన్పుట్ డీలర్స్ (దిశి) కార్యక్రమం ద్వారా జిల్లాలో రైతులకు, ఎరువుల వర్తకులకు శిక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పంటల యాజమాన్య పద్ధతులు, డ్రోన్ల వినియోగం, ఎరువులను సకాలంలో వాడకం గురించి శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణ ద్వారా పంట పెట్టుబడి తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో వ్యవసాయ శాఖ జిల్లా జాయింట్ డైరెక్టర్ ఆత్మ ప్రాజెక్ట్ డైరెక్టర్ హబీబ్ భాష వ్యవసాయ శాఖ అధికారులు ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నారు. ప్రతిభ చూపుతున్న అభ్యర్థులు దిశి శిక్షణ భాగంగా 2023– 24 సంవత్సరానికి గ్రూపులకు సంబంధించిన కొన్ని రోజులు వనరులు సమకూర్చి వ్యాపారస్తులకు కంపెనీ క్షేత్ర పరిశీలకులకు శిక్షణ అందిస్తున్నారు. వారిలో తొమ్మిదో తరగతి ఉత్తీర్ణత అయిన వారికి డైరెక్టర్ ఆత్మ ద్వారా ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేస్తున్నారు. గ్రూపులకు సంబంధించి పరీక్షకు హాజరైన వారిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ముగ్గురు డిస్టింక్షన్లో నిలిచారు. రైతులు, వ్యాపారులు శాసీ్త్రయ పరిజ్ఞానంతో పాటు వ్యవసాయంలో అధిక దిగుబడులు పొందడమే లక్ష్యంగా ఈ శిక్షణ ఇస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రత్యేక శిక్షణ దిశి శిక్షణలో ఒక బ్యాచ్కి 48 క్లాసులు ఉంటాయి. 40 థియరీ క్లాసులు, 8 ఫీల్డ్ విజిట్స్ ఉంటాయి. కాబట్టి ప్రతి బ్యాచ్కు ఒక ఫెసిలిటేటర్ను కేటాయించి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. – హబీబ్ బాషా, జాయింట్ డైరెక్టర్, వ్యవసాయ శాఖ -
పరుపుల పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
ఏలూరు టౌన్: ఏలూరు నగరం శివారు వంగాయగూడెంలోని పరుపుల పరిశ్రమలో గురువారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వంగాయగూడెం కేన్సర్ హాస్పిటల్ సమీపంలోని సుస్మిత ఫర్నిచర్ కుషనింగ్ పరిశ్రమలో ఉదయం 9.30 గంటల సమయంలో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. అక్కడ పనిచేస్తున్న సిబ్బంది ఎవరూ రాకముందే ఈ ప్రమాదం జరగడంతో ప్రాణనష్టం తప్పింది. ఇక్కడ అత్యంత ప్రమాదకరమైన రసాయనాలతో ఫోమ్ను తయారు చేస్తారు. ఈ రసాయనాల మిక్సింగ్కు వినియోగించే ట్యాంకర్ను మైనస్ డిగ్రీల్లో చల్లబరుస్తారు. కెమికల్ మిక్సింగ్ ట్యాంకర్కు సంబంధించిన ఏసీలను ఆన్ చేసిన వాచ్మెన్లు ఇద్దరూ కాలకృత్యాలు తీర్చుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఆ సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ వ్యాప్తి చెందటంతో పరిసర ప్రాంతాల్లోని ప్రజలు ఊపిరాడక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి రెండు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేశారు. డీఎస్పీ శ్రావణ్కుమార్, వన్టౌన్ సీఐ సత్యనారాయణ, రూరల్ ఎస్సై దుర్గాప్రసాద్, పోలీస్ సిబ్బంది సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం సంభవించిందని అగ్నిమాపక అధికారులు చెబుతున్నారు. -
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలి
ఏలూరు (టూటౌన్): రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న రూ.6,400 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.సాయికుమార్, జిల్లా అధ్యక్షుడు డి.శివకుమార్ డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా గురువారం విద్యార్థులతో కలిసి ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయకుండా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. దీనివల్ల డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా కళాశాల యాజమాన్యాలు ఇబ్బంది పెడుతున్నాయన్నారు. ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులకు సైతం హాల్ టికెట్లు ఇవ్వకుండా ఒత్తిడి చేస్తున్నారన్నారు. పేద విద్యార్థులకు ఉన్నత చదువులు దూరం చేసే జీవో నెంబర్ 77 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ ఏలూరు జిల్లా కోశాధికారి, ఎం.క్రాంతికుమార్, సునీల్, ప్రదీప్, విద్యార్థులు పాల్గొన్నారు. -
భార్య దారుణ హత్య
కై కలూరు: ఆస్తిని పెద్ద కొడుక్కి రాసివ్వమని అడిగిన భార్యను అంతమొందించాడో భర్త. ఈ ఘటన ఏలూరు జిల్లా కలిదిండి మండలం ఎస్ఆర్పీ అగ్రహారంలో చోటుచేసుకుంది. వివరాలివి.. గ్రామానికి చెందిన కట్టా పెద్దిరాజు (50), జయలక్ష్మి (47) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు మగ సంతానం. పెద్ద కుమారుడికి ఇటీవల పెళ్లయింది. ఇద్దరు కుమారులు వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తున్నారు. పెద్దిరాజుకు గ్రామంలో 40 సెంట్ల భూమి ఉంది. దీనిని అమ్మకానికి సిద్ధం చేస్తున్నాడు. పెద్ద కుమారుడికి వివాహం జరగడంతో దంపతులు ఇల్లు కట్టుకుంటారని, స్థలం అతడికి రాయాలని జయలక్ష్మి భర్తను కోరింది. ఈ విషయంలో తరచూ భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. తన కంటే బిడ్డలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని పెద్దిరాజు భార్యపై ద్వేషం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం అర్ధరాత్రి నిద్రపోతున్న జయలక్ష్మిపై కత్తితో విచక్షణారహితంగా దాడిచేశాడు. దీంతో ఆమె ఘటనాస్థలిలోనే ప్రాణం విడిచింది. అనంతరం పెద్దిరాజు భయపడి పురుగు మందు తాగి, చాకుతో పీక కోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. ఇరుగు పొరుగువారు పోలీసులకు సమాచారం అందించారు. ప్రాణాలతో ఉన్న పెద్దిరాజును ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పారిజాతగిరి హుండీ లెక్కింపు
జంగారెడ్డిగూడెం : పట్టణంలోని గోకుల తిరుమల పారిజాతగిరిలో గురువారం హుండీ లెక్కింపు నిర్వహించారు. దేవదాయశాఖ ఏలూరు జిల్లా ఇన్స్పెక్టర్ వి.సురేష్కుమార్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. మొత్తం 105 రోజులకు గాను రూ.11,35,112 ఆదాయం వచ్చినట్లు ఈవో కలగర శ్రీనివాస్ తెలిపారు. హుండీ లెక్కింపులో విజయవాడ, ఏలూరు, రిటైర్డ్ ఉద్యోగులు, కామయ్యపాలెం, పుట్లగట్లగూడెం సేవాసంఘం, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, ఇండియన్ బ్యాంకు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. కాగా ఆలయంలో గురుపౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారికి తోమాల సేవ, తీర్థప్రసాద గోష్టి, తదితర పూజలు నిర్వహించారు. స్వామి వారిని నరసాపురం, పాలకొల్లు, తణుకు భక్తులు దర్శించుకున్నారు. 20న భీమవరంలో చెస్ టోర్నమెంట్ భీమవరం: ఇంటర్నేషనల్ చెస్ డేను పురస్కరించుకుని అనసూయ చెస్ అకాడమీ, వెస్ట్ గోదావరి చెస్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో ఈనెల 20వ తేదీన గ్రంధి వెంకటేశ్వరరావు మెమోరియల్ ఇన్విటేషనల్ ఏపీ స్టేట్ ఓపెన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకుడు మాదాసు కిషోర్ చెప్పారు. గురువారం టోర్నమెంట్ బ్రోచర్ ఆవిష్కరించి వివరాలను వెల్లడించారు. పట్టణంలోని తాలూకా ఆఫీసు సెంటర్లోని జీవీఆర్ కళ్యాణ మండపంలో టోర్నమెంట్ జరుగుతుందన్నారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు ఉచితంగా మాస్టర్ చెస్ బోర్డులు, విజేతలకు రూ.20 వేల నగదు బహుమతులు అందిస్తామన్నారు. కార్యక్రమంలో చెస్ అసోసియేషన్ జిల్లా గౌరవాధ్యక్షుడు తోట భోగయ్య విజ్ఞాన వేదిక సేవా సంస్థ అధ్యక్షుడు అల్లు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. సెల్ఫోన్ దొంగల అరెస్ట్ భీమవరం: ఓ వ్యక్తి నుంచి సెల్ఫోన్ దొంగిలించిన ఇరువుర్ని అరెస్టు చేసినట్లు వన్టౌన్ సీఐ ఎం నాగరాజు చెప్పారు. గురువారం ఉదయం వీరమ్మపార్క్ వద్ద సుంకర ఏసుదాసు వాకింగ్ చేస్తుండగా తణుకు పట్టణం అజ్జరం కాలనీకి చెందిన పులిగోరి నాని, అనకాపల్లికి చెందిన షేక్ అలిషా కత్తితో బెదిరించి ఏసుదాసు వద్ద సెల్ఫోన్ లాక్కున్నారు. ఏసుదాసు తన స్నేహితుల సహాయంతో నిందితులను పట్టుకుని పోలీసుస్టేషన్కు అప్పగించారు. కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన నిందితులను కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించినట్లు సీఐ నాగరాజు తెలిపారు. వ్యభిచారం కేసులో నిందితుడి అరెస్ట్ భీమవరం: వ్యభిచారం కేసులో పాతనేరస్తుడ్ని అరెస్ట్ చేసినట్టు భీమవరం వన్టౌన్ సీఐ ఎం నాగరాజు గురువారం చెప్పారు. 2020 మే 13వ తేదీన పట్టణంలోని లాడ్జిలో మహిళలతో వ్యభిచారం చేయిస్తున్న కేసులో రాజమహేంద్రవరం నగరానికి చెందిన కె సాయిరామ్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్ విధించారని సీఐ నాగరాజు తెలిపారు. ఈ కేసులో గతంలోనే ఇద్దర్ని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. -
అక్రమాలకు అడ్డా.. ఉండి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం
ఉండి: భూ అక్రమార్కులకు పశ్చిమగోదావరి జిల్లాలోని ఉండి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అడ్డాగా మారిందంటూ రంగబాబు అనే వ్యక్తి గురువారం కార్యాలయం ముందు టెంట్ వేసి ఆందోళనకు దిగడం స్థానికంగా కలకలం రేపింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చినగొల్లపాలెంలో తమ ఆస్తికి సంబంధించి అక్రమాలు జరుగుతున్నాయన్నారు. భూ అక్రమాలకు సంబంధించి తనతో పాటు మరికొందరు గత కొద్దికాలం నుంచి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి రావడంతో సబ్ రిజిస్ట్రార్ సెలవుపై వెళ్లిపోయినట్టు పేర్కొన్నారు. కృష్ణాజిల్లాతో పాటు రాష్ట్రంలోని మరికొన్ని జిల్లాల నుంచి రిజిస్ట్రేషన్ల కొరకు ఉండికి తరలివస్తున్నట్టు తెలిపారు. ఎకరాకు రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు లంచాలు తీసుకుంటున్న అధికారులు భూ ఆక్రమణ దారులకు కొమ్ముకాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు తగిన న్యాయం చేయకపోతే భార్యాబిడ్డలతో ఉండి రిజిస్ట్రార్ ఆఫీసు ముందు ఆత్మహత్యకు పాల్పడతానని హెచ్చరించారు. తమకు సంబంధించిన 32 ఎకరాల భూమిని అక్రమంగా ఆక్రమించుకునేందుకు ఓ మంత్రి సమీప ఉద్యోగి, రిజిస్ట్రేషన్ శాఖలో ఓ ఉన్నతాధికారి ప్రయత్నిస్తున్నట్లు తనకు అనుమానంగా ఉందని చెప్పారు. దీనిపై అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కాగా, అక్రమ రిజిస్ట్రేషన్ల ఆరోపణలను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ ఇన్చార్జి టి.శరాబందురాజు ఖండించారు. ఇలా చేయడం ఎవరివల్లా కాదన్నారు. ఆరోపణలు చేస్తున్న రంగబాబు ఆస్తి కోర్టు పరిధిలో, అదీ నిషేధిత భూముల జాబితాలోనూ ఉందని పేర్కొన్నారు. సబ్ రిజిస్ట్రార్ వ్యక్తిగత కారణాలతో సెలవుపై వెళ్ళారు గానీ, ఎవ్వరికీ భయపడికాదని స్పష్టం చేశారు. కలకలం రేపిన బాధితుని ఆందోళన -
కంటైనర్ బోల్తా.. 14 ఆవుల మృతి
దెందులూరు: జాతీయరహదారిపై ఆవులను తరలిస్తున్న కంటైనర్ వాహనం బోల్తా పడి 14 ఆవులు మృతిచెందగా 6 తీవ్రంగా, 15 ఆవులు స్పల్పంగా గాయపడ్డాయి. ఈ ఘటన ఏలూరు జిల్లా దెందులూరు మండలం సోమవరప్పాడు వద్ద చోటుచేసుకుంది. విశాఖ నుంచి ఇతర ప్రాంతాలకు ఆవులను తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న దెందులూరు ఎస్సై ఆర్.శివాజీ, సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకున్నారు. వెంటనే మండల పశువైద్యాధికారి డాక్టర్ హరికి సమాచారం అందించగా ఆయన వైద్య సిబ్బందితో వచ్చి గాయపడిన ఆవులను సమీపంలోని గేదెల ఫారం వద్దకు తరలించి వైద్య సేవలందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. చికిత్స పొందుతూ యువకుడి మృతి జంగారెడ్డిగూడెం: చికిత్స పొందుతూ ఓ యువకుడు మృతిచెందాడు. ఎస్సై షేక్ జబీర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కేతవరం గ్రామానికి చెందిన బల్లే వెంకట నరసింహారావు చర్మంపై తెల్లటి మచ్చలు వచ్చి మంట, దురదతో గత రెండేళ్లుగా బాధపడుతున్నాడు. దీంతో మనస్తాపం చెంది పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వాంతులు చేసుకోవడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు నరసింహారావుని కొయ్యలగూడెంలోని ప్రైవేట్ ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మృతుడి తండ్రి బల్లే గురవయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. 2 కిలోల గంజాయి స్వాధీనం జంగారెడ్డిగూడెం: పట్టణంలో గురువారం జరిపిన దాడుల్లో జెడ్పీ హైస్కూల్ ఎదురుగా గంజాయి కలిగి ఉన్న షేక్ బాషా అనే వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ ఎంవీ సుభా ష్, ఎస్సై షేక్ జబీర్ తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచామన్నారు. జంగారెడ్డిగూడెం సర్కిల్ను గంజాయి రహితంగా చేసే కార్యక్రమంలో భాగంగా గట్టి నిఘా పెట్టి ఈ దాడులు చేసినట్లు చెప్పారు. -
జీవితాలతో చెలగాటం
ఏలూరు టౌన్: అగ్నిమాపక అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఎక్కడైనా భారీ అగ్ని ప్రమాదాలు సంభవిస్తే వాటిని అదుపు చేసేందుకు అవసరమైన అగ్నిపమాక వాహనాలు, సిబ్బంది లేకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రజలు, కార్మికుల ప్రాణాల భద్రత గాల్లో దీపమేనా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఏలూరు నగరంలోనే గత మూడు నెలల్లో మూడు భారీ అగ్నిప్రమాదాలు చోటుచేసుకోవటం ఆందోళన కలిగిస్తోంది. పైగా ఒకే తరహా వస్తువుల తయారీ ఇండస్ట్రీల్లో అగ్నిప్రమాదాలు చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. యాజమాన్యాల నిర్లక్ష్యం.. అగ్నిమాపక అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏలూరులో వరుసగా అగ్నిప్రమాదాలు జిల్లాలో 2024 జనవరి నుంచి 2025 జూన్ వరకూ సుమారుగా 598 అగ్నిప్రమాదాలు సంభవించగా ఏలూరు శివారు ప్రాంతాల్లో వరుసగా మూడు నెలల్లో మూడు అగ్నిప్రమాదాలు జరిగాయి. ఈ మూడు అగ్నిప్రమాదాలు పరుపులు, ఫర్నిచర్ తయారీ పరిశ్రమల్లో కావటం గమనార్హం. అదృష్టవశాత్తు అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్న సమయంలో కార్మికులు లేకపోవటంతో పెను ప్రమాదం తప్పింది. ఏలూరు శివారులోని గణేష్ సోఫా అండ్ ఫర్నిచర్స్ పరిశ్రమలో జూన్ 5న భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సాయంత్రం వేళలో ప్రమాదం జరగడం, కార్మికులు ముందుగానే గుర్తించి బయటకు పారిపోవటంతో ప్రాణనష్టం తప్పింది. ఇదే తరహాలో ఏలూరు సోమవరప్పాడులోని సోఫా, పరుపుల తయారీ కంపెనీలోనూ అగ్నిప్రమాదం జరిగింది. తాజాగా గురువారం వంగాయగూడెం కేన్సర్ హాస్పిటల్ సమీపంలో సుష్మిత ఫర్నిచర్, కుషనింగ్ తయారీ ఇండస్ట్రీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కోట్లాది రూపాయాల ఆస్తి నష్టం జరిగింది. ప్రమాదాల నివారణ సాధ్యమేనా? ఏలూరు జిల్లా కేంద్రంలో అగ్నిమాపక శాఖకు కేవలం రెండే ఫైరింజన్లు ఉన్నాయి. ఒక ఫైరింజన్ మరమ్మతుల్లో ఉంది. అత్యవసర పరిస్థితుల్లో ఈ ఫైరింజన్ సామర్థ్యంపై ఆధారపడితే తీవ్ర పరిణామాలు తప్పవని అంటున్నారు. అగ్నిమాపక సిబ్బంది సైతం పూర్తిస్థాయిలో లేరంటున్నారు. దీనితోడు పరిశ్రమల్లో పాటించాల్సిన భద్రతా చర్యలపై అధికారుల పర్యవేక్షణ కొరవడిందని పలువురు విమర్శిస్తున్నారు. తాజాగా వంగాయగూడెం సుస్మిత ఫర్నిచర్ అండ్ కుషనింగ్ ఇండస్ట్రీలో అగ్నిప్రమాదం సంభవించడంతో.. అసలు పరిశ్రమకు ఫైర్సేఫ్టీ సర్టిఫికెట్, అత్యవసర ద్వారం లేదని, ఫైర్సేఫ్టీ చర్యలపై అధికారుల పర్యవేక్షణపైనా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఏలూరు నగరంలోనూ, శివారు ప్రాంతాల్లోనూ పరిశ్రమలు, ఇండస్ట్రీలు, ఆయా వస్తువుల ఉత్పత్తి సంస్థల్లో ఫైర్సేఫ్టీపై నిఘా, పర్యవేక్షణ, తనిఖీలు లేవంటున్నారు. మూడు నెలల్లో 3 భారీ అగ్నిప్రమాదాలు రెండు ఫైరింజన్లతో నెట్టుకొస్తున్న అగ్నిమాపక శాఖ కొరవడిన అధికారుల పర్యవేక్షణ ప్రజలు భద్రత ప్రశ్నార్థకంగా మారిన వైనం -
మహిళ హత్య కేసులో నిందితుడి అరెస్ట్
కై కలూరు: భార్య వివాహేతర సంబంధానికి సహాకరిస్తోందనే కోపంతో ఎదురింటి మహిళను కత్తితో నరికి చంపిన వ్యక్తిని పోలీసులు గురువారం అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. కై కలూరు సీఐ కార్యాలయంలో కేసు వివరాలను ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్కుమార్, రూరల్ సర్కిల్ సీఐ వి.రవికుమార్ వెల్లడించారు. కలిదిండి మండలం పోతుమర్రు శివారు గొల్లగూడెంలో మంగళవారం మధ్యాహ్నం భోజనానికి కూర్చున్న నంగెడ్డ వరలక్ష్మీదేవీ(39)ని ఎదురింటిలో నివాసం ఉంటున్న కట్టా రామాంజనేయులు(33) బయటకు పిలిచి కత్తితో నరికి పరారయ్యాడు. రామాంజనేయులు భార్య కృష్ణవేణి ఇదే గ్రామానికి చెందిన కట్టా నాగమల్లేశ్వరరావుతో చనువుగా ఉంటోంది. ఈ విషయాన్ని పలువురు గ్రామస్తులు భర్త రామాంజనేయులుకు చెప్పారు. మృతురాలు వరలక్ష్మీదేవీ నాగమల్లేశ్వరరావు వద్ద పనిచేస్తుండడంతో రామాంజనేయులు భార్య వివాహేతర సంబంధానికి వరలక్ష్మీదేవి సహాకరిస్తోందని గట్టిగా నమ్మాడు. దీంతో ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న ఆమెను నరికి చంపి పరారయ్యాడు. కై కలూరు మండలం ఉప్పుటేరు వద్ద నిందితుడు రామాంజనేయులును పోలీసులు అరెస్టు చేశారు. సమావేశంలో కలిదిండి, కై కలూరు రూరల్, ముదినేపల్లి ఎస్సైలు వేంకటేశ్వరరావు, రాంబాబు, వీరభద్రరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
విద్యపై శ్రద్ధ చూపాలి
భీమవరం: విద్యార్థులు చిన్నతనం నుంచి విద్యపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చడం ద్వారానే ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు అన్నారు. గురువారం పట్టణంలో గునుపూడి ఉమాసోమేశ్వర మున్సిపల్ హైస్కూల్లో నిర్వహించిన మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాఠశాలలకు వెళుతున్న విద్యార్థులను తల్లిదండ్రులు నిత్యం పర్యవేక్షించాలన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. బెల్టు షాపులు రద్దుచేయాలి తణుకు అర్బన్: గ్రామాల్లో బెల్ట్ షాపులను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ కల్లు గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కామన మునిస్వామి డిమాండ్ చేశారు. స్థానిక అమరవీరుల భవనంలో గురువారం తణుకు డివిజన్ గీత కార్మికుల సహకార సొసైటీల అధ్యక్షుడు కట్టా వెంకటేశ్వర్లు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మునిస్వామి మాట్లాడుతూ గీత కార్మికులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. గ్రా మాల్లో తాటి, ఈత చెట్లను దౌర్జన్యంగా నరికి వేస్తున్నారని, ఆపాలని కోరారు. వృత్తిలో భా గంగా దివ్యాంగులైన, మరణించిన వారి కు టుంబాలకు గతంలో పరిహారం ఇచ్చేవారని, ప్రస్తుతం ఆ విధానం రద్దు చేయడం తగదన్నారు. ఈనెల 14న కలెక్టర్కు గీత కార్మికుల సమస్యలను చెప్పుకుందాం తరలిరండి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కల్లుగీత సహకార సొసైటీల అధ్యక్షుడు కాసాని శ్రీనివాసు, తొంట ముత్యాలు పాల్గొన్నారు. తిరువన్నామలై రైలుకు వీరవాసరంలో హాల్ట్ రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): నర్సాపూర్–తిరువన్నామలై ప్రత్యేక రైలుకు వీరవాసరం స్టేషన్లో రెండు నిమిషాలు హాల్టింగ్ సదుపాయం కల్పించినట్టు విజయవాడ రైల్వే డివిజన్ పీఆర్ఓ నుస్రత్ మండ్రుప్కర్ ప్రకటనలో తెలిపారు. నర్సాపూర్ నుంచి వెళ్లే రైలు (07219) వీరవాసరం స్టేషన్కు మధ్యాహ్నం 1.23 గంటలకు చేరుకుని, 1.25 గంటలకు బయలుదేరుతుందని పేర్కొన్నారు. తిరువన్నామలై నుంచి వచ్చే రైలు (07220) రాత్రి 11.28 గంటలకు వీరవాసరం స్టేషన్కు చేరుకుని, తిరిగి 11.30 గంటలకు బయలుదేరుతుందని తెలిపారు. పాఠశాల విలీనానికి నిరసనగా ఆమరణ దీక్ష పెనుమంట్ర: పెనుమంట్ర దళితవాడలోని ఎంపీపీ ఎలిమెంటరీ పాఠశాలను దూరంగా ఉన్న మరో పాఠశాలలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద తాను ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు పెనుమంట్ర సర్పంచ్ తాడిపర్తి ప్రియాంక గురువారం విలేకరులకు తెలిపారు. 80 ఏళ్ల నాటి పాఠశాలను గత ప్రభుత్వంలో నాడు–నేడు నిధులతో అభివృద్ధి చేశారని, విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియకుండా గత హెచ్ఎం, ఎంఈఓ కలిసి విద్యాకమిటీ సభ్యులను పక్కదారి పట్టించి ఇష్టానుసారం పాఠశాలను మరో పాఠశాలలో విలీనం చేశారన్నారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో తాను దీక్షకు దిగనున్నట్టు చెప్పారు. ఈ మేరకు తహసీల్దార్, పోలీస్ అధికారులు కూడా వినతి పత్రాల అందించానన్నారు. అలాగే గురువారం వైఎస్సార్ నగర్లో శంకుస్థాపన కార్యక్రమాలు జరగ్గా తాము వెళ్లేలోపు ప్రజాప్రతినిధులు కానివారితో కొబ్బరికాయలు కొట్టించి అధికారులు తమను అవమానపరిచారని ప్రియాంక వాపోయారు. సమావేశంలో పెనుమంట్ర–1 ఎంపీటీసీ చింతపల్లి మంగాదేవి, ఉప సర్పంచ్ భూపతిరాజు శ్రీనివాసరాజు పాల్గొన్నారు. -
జిల్లాస్థాయి కార్యక్రమం.. అపహాస్యం
జీవితాలతో చెలగాటం అగ్నిమాపక అధికారుల నిర్లక్ష్యంతో ప్రజల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ప్రమాదా లను అదుపు చేసే వాహనాలు, సిబ్బంది లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. 8లో uపాలకోడేరు: మండలంలోని భూపతిరాజు సుబ్బ తాతరాజు జెడ్పీ హైస్కూల్లో జిల్లాస్థాయిలో నిర్వహించిన మెగా పేరెంట్స్ మీట్ అపహాస్యం పాలైంది. కార్యక్రమం ఆసాంతం లోటుపాట్లు కనిపించాయి. ఉదయం 9 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని ప్రకటించినా 11.30 వరకూ మొదలుకాలేదు. కలెక్టర్ హాజరైన తర్వాత కూడా ఉపాధ్యాయులు పేరెంట్స్కు కబురు పంపారు. అయినా తల్లిదండ్రులు పూర్తిస్థాయిలో హాజరుకాలేదు. నిన్నటివరకూ వేండ్రలో నిర్వహిస్తారని తమకు తెలియదని, మోగల్లు అని అన్నారని ఉపాధ్యాయులు అన్నారు. జిల్లాస్థాయి కార్యక్రమాన్ని డిప్యూటీ ఎంఈఓ, ఎంఈ పర్యవేక్షించాలి కదా అని కొందరు వ్యాఖ్యానించారు. భోజనాన్ని ప్రత్యేకంగా తయారుచేయించకుండా, రోజూ పాఠ శాలకు వచ్చే ఆహారాన్ని ఎక్కువ స్థాయిలో తీసుకురావడం కనిపించింది. ఆహార పదార్థాల పాత్రలను విద్యార్థులే హైస్కూల్లోకి తీసుకురావడం కనిపించింది. తల్లిదండ్రులు, విద్యార్థులు భోజనం తినేందుకు సరైన స్థలం లేక నిలబడే తిన్నారు. నిర్దేశిత లక్ష్యంతో.. ప్రభుత్వం నిర్దేశిత లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. ముఖ్య అతిథిగా ఆమె మాట్లాడు తూ జిల్లావ్యాప్తంగా 1,960 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో సుమారు 6 వేల మంది ఉపాధ్యాయులు భాగస్వాములవుతున్నారన్నారు. జిల్లా ఎస్పీ అ ద్నాన్ నయీమ్ అస్మి మాట్లాడుతూ తల్లిదండ్రుల ఆకాంక్షలు అనుగుణంగా విద్యార్థులు కష్టపడి చదివి ప్రయోజకులు కావాలన్నారు. డీఈఓ ఈ.నారాయణ, హెచ్ఎం జీవీవీ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
మొక్కుబడి తంతు
భార్య దారుణ హత్య ఆస్తిని పెద్ద కొడుక్కి రాసివ్వమని అడిగిన భార్యను భర్త అంతమొందించిన ఘటన కలిదిండి మండలం ఎస్ఆర్పీ అగ్రహారంలో చోటుచేసుకుంది. 8లో uకూటమి మోసాలను ఎండగడదాం శురకవారం శ్రీ 11 శ్రీ జూలై శ్రీ 2025సాక్షి, భీమవరం: పండుగ వాతావరణంలో మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్ (పీటీఎం) అంటూ కూటమి ప్రభుత్వం చేసిన హడావుడి ప్రచార ఆర్భాటమే అయ్యింది. మాకెందుకీ ఖర్చన్న ధోరణీలో ప్రైవేట్ విద్యాసంస్థలు మమా అనిపించగా, చాలాచోట్ల ఎంపీపీ, ప్రైమరీ పాఠశాలల్లో మొక్కుబడి తంతుగానే సమావేశాలు సాగాయి. తల్లిదండ్రుల హాజరు అంతంతమాత్రమే కావడంతో సమావేశాలు వెలవెలబోయాయి. 1,920 పాఠశాలలు.. 121 జూనియర్ కాలేజీలు పిల్లలు బంగారు భవిష్యత్తు కోసం.. బడివైపు ఒక అడుగు పేరిట గురువారం పీటీఎం నిర్వహణకు ప్రభుత్వం పిలుపునిచ్చింది. జిల్లాలోని 1,920 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలకు చెందిన 2,79,204 మంది, 121 జూనియర్ కళాశాలల్లోని 37,124 విద్యార్థులను, వారి తల్లిదండ్రులను కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలన్నది లక్ష్యం. విద్యార్థుల సంఖ్యను బట్టి ఇటీవల సమగ్ర శిక్ష నుంచి పాఠశాలలకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు కాంపొజిట్ గ్రాంట్ విడుదల కాగా ఈ మొత్తం నుంచి 20 శాతం నిధులను పీటీఎంల నిర్వహణకు వెచ్చించేందుకు ఎస్ఎస్ పీడీ ఆదేశాలిచ్చారు. అరకొర కేటాయింపులు : అరకొర కేటాయింపులతో చాలాచోట్ల మొక్కుబడిగానే కార్యక్రమాలు జరిగాయి. పాలకోడేరు మండలం వేండ్ర హైస్కూల్లో ఉదయం తొమ్మిది గంటలకు మొదలుకావాల్సిన జిల్లాస్థాయి మెగా పీటీఎం పేరెంట్స్ లేకపోవడం వలన ఉదయం 11 గంటలకు కూడా మొదలవ్వక ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. త్వరగా హాజరుకావాలని పేరెంట్స్కు ఉపాధ్యాయులు ఫోన్లు చేయాల్సి వచ్చింది. 250 మంది విద్యార్థులకు వంద మందిలోపే పేరెంట్స్ హాజరయ్యారు. ఆకివీడు జెడ్పీ హైస్కూల్లో మధ్యాహ్నం 12.30 గంటలకు పేరెంట్స్ సమావేశం మొదలైంది. కూటమి నేతల రాక కోసం రెండున్నర గంటల పాటు విద్యార్థులు, పేరెంట్స్ వేచి చూడాల్సి వచ్చింది. పాఠశాలలో 400 మంది విద్యార్థులకు వంద మంది పేరెంట్స్ కూడా హాజరుకాలేదు. చాలా హైస్కూళ్లు, ఎంపీపీ, ప్రైమరీ స్కూళ్లలో ఇదే పరిస్థితి. ప్రైవేట్ విద్యాసంస్థలు సొంత నిధులు వెచ్చించాల్సి రావడంతో కొన్ని తరగతులకు చెందిన విద్యార్థులు, వారి పేరెంట్స్కు మాత్రమే పీటీఎంలు నిర్వహించగా, మరికొన్ని చోట్ల సమావేశాలు జరిగిన దాఖలాలే లేవు. ఇవీ మార్గదర్శకాలు విద్యాశాఖ మార్గదర్శకాల మేరకు పండుగ వాతావరణంలో పీటీఎంలు నిర్వహించాలి. పేరెంట్స్కు మహిళలు, పురుషుల విభాగాల్లో ఆటల పోటీలు నిర్వహించడం, గ్రీన్ పాస్పోర్ట్ కింద తల్లి పేరిట ప్రతి విద్యార్థి పెంచే విధంగా ఒక మొక్కను అందజేయడం, వన్–ఆన్–వన్ ఇంటరాక్షన్గా విద్యార్థుల హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్, హెల్త్ నివేదికను పేరెంట్స్కు వివరించాలి. తల్లులకు విద్యార్థులతో పాదపూజ చేయించాలి. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులకు సహపంక్తి భోజనాలు ఏర్పాటుచేయాలి. ● హామీల అమలులో ప్రభుత్వం విఫలం ● మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ న్యూస్రీల్సమస్యలు నిల్.. ప్రచారం ఫుల్ విద్యార్థుల బంగారు భవిష్యత్తును దిశానిర్దేశం చేస్తూ పేరెంట్స్, టీచర్స్ మీట్ జరగాల్సి పోయి కూటమి నేతల ప్రచార ఆర్భాటానికే అన్నట్టు సమావేశాలు సాగాయి. పాఠశాలల్లోని సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను పక్కనపెట్టి అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత ఈ విద్యా సంవత్సరానికి విడుదల చేసిన తల్లికి వందనం గురించి ప్రసంగాలకే నేతలు పరిమితమయ్యారు. కాగితాలపై ఉపన్యాసాలు రాయించి విద్యార్థులతో చదివించారు. ఇరగవరం మండలం రేలంగిలో జరిగిన పీటీఎంలో తమకు ఆహ్వానం అందలేదంటే, తమకు సమాచారం లేదంటూ కూటమి నేతలు ఒకరి వద్ద ఒకరు అసంతృప్తిని వెళ్లగక్కుకోవడం కనిపించింది. పలుచోట్ల సహపంక్తి భోజనాలు తూతూమంత్రంగానే జరిగాయి. పెనుగొండ మండలంలోని పలు పాఠశాలల్లో పప్పు, సాంబరు వడ్డించారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో స్నాక్స్తో సరిపెట్టారు. వేండ్రలో భోజనం పాత్రలను విద్యార్థులతో మోయించడం కనిపించింది. పీటీఎం.. పేలవం ప్రచార ఆర్భాటంగా పేరెంట్స్ టీచర్స్ మీట్ జిల్లాలో 1,920 ప్రభుత్వ, ప్రాథమిక పాఠశాలలు, 121 జూనియర్ కళాశాలల్లో నిర్వహణ లక్ష్యం మమ అనిపించిన ప్రైవేట్ విద్యాసంస్థలు ఎంపీపీ, ప్రాథమిక పాఠశాలల్లో తూతూమంత్రంగా.. చాలాచోట్ల ఉదయం 11 గంటలు దాటినా మొదలుకాని సమావేశాలు నామమాత్రంగానే తల్లిదండ్రుల హాజరు -
కొనలేకపోతున్నాం
మూడు రోజులుగా కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. కిలోకు రూ.10 వరకు ఎక్కువగా చెబుతున్నారు. టమాటా గతనెలలో కిలో రూ.16 ఉంటే ఇప్పుడు రూ.36 అమ్ముతున్నారు. దొండ, బెండకాయల ధరలు పెరిగాయి. ముఖ్యంగా పచ్చి మిరప నెల క్రితం కిలో రూ.18 నుంచి రూ.24 మధ్య ఉండగా ఇప్పుడు ఏకంగా రూ.60కు పైగా అమ్ముతున్నారు. – గొల్లవిల్లి ఆదిలక్ష్మి, గృహిణి, ఏలూరు చర్యలు తీసుకోవాలి మా ఇంటి అవసరాలకు వారానికి సరిపడా కూరగాయలు ఒకేసారి తీసుకుంటాం. ఇప్పుడు పెరిగిన ధరల కారణంగా మరో రూ.200 అధికంగా ఖర్చవుతోంది. ఇది సామాన్యులకు భారం. సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకుని కూరగాయల ధరలను తగ్గించే ఏర్పాట్లు చేయాలి. లేదా పేదల కోసం ప్రత్యేక కౌంటర్లలో కూరగాయలు విక్రయించే ఏర్పాట్లు అయినా చేయాలి. – ముమ్మిన గిరిజ, గృహిణి, ఏలూరు ● -
బెధరగొడుతున్నాయ్
ఏలూరు (ఆర్ఆర్పేట): కూరగాయల ధరలు రోజు రోజుకూ పెరుగుతూ సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఏటా వేసవిలో కూరగాయల ధరలు పెరుగుతూ.. వర్షాలు పడగానే తగ్గుతుంటాయి. అయితే ఈ ఏడాది మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభం కాగా ఇప్పుడు అన్నిరకాల కూరగాయల ధరలు పెరుగుతున్నాయి. మూడు రోజులుగా కూరగాయల ధరలు కిలోకు రూ.5 నుంచి రూ.15 వరకు పెరిగాయి. టమాటా గత నెలలో కిలో రూ.16 నుంచి రూ.18 ఉండగా ప్రస్తుతం రూ.36కు చేరింది. పచ్చిమిర్చి కిలో గత గురువారం రూ.40 ఉండగా ఇప్పుడు రూ.60కు, పందిరి బీర కాయలు రూ.40 నుంచి రూ.50కు, వంకాయలు (కాంతులు) రూ.38 నుంచి రూ.50కు చేరాయి. ఒక్క రోజులో దొండకాయలు కిలో రూ.6, గోరుచిక్కుడు రూ.8 చొప్పున పెరిగాయి. గత సోమవారం కీరా దోస కిలో రూ.40 ఉండగా ప్రస్తుతం రూ.50 పలుకుతోంది. ఇలా అన్నిరకాల కూరగాయల ధరలు పెరిగాయి. రైతు బజారుల్లోనే 400 క్వింటాళ్లు ఏలూరులో సుమారు 90 వేల కుటుంబాల్లో 3.10 లక్షల జనాభా ఉన్నారు. నగరంలో రెండు రైతు బజార్లు అందుబాటులో ఉన్నాయి. వీటికి వన్టౌన్ లో ఎన్ఎస్ కూరగాయల మార్కెట్, పలు ప్రాంతాల్లో చిన్నపాటి కూరగాయల దుకాణాలు ఉన్నాయి. వీటితో పాటు ఇంటింటా తిరుగుతూ కూరగాయలు అమ్మే వ్యాపారులు 30 మంది వరకు ఉన్నాయి. నగరంలోని వన్టౌన్, టూటౌన్ ప్రాంతాల్లోని రైతు బజార్ల ద్వారా రోజుకు సుమారు 400 క్వింటాళ్ల కూరగాయలు, దుంపలు, ఉల్లిపాయలు, ఆకుకూరలు విక్రయాలు జరుగుతున్నాయి. ఇతర దుకాణాలు, ఇంటింటా తిరిగి విక్రయించే వారి ద్వారా మరో 800 క్వింటాళ్ల విక్రయాలు జరుగుతున్నట్టు అంచనా. ఈ లెక్కన నగరవాసులపై పెరిగిన కూరగాయల ధరల భారం రోజుకు సుమారు రూ.6 లక్షల వరకు ఉంటోంది. పట్టించుకోని అధికారులు కూరగాయల ధరలు పెరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ మార్కెట్ కంటే రైతు బజార్లతో కొద్దిమేర ధరలు తక్కువగా ఉన్నా.. ధరల పెరుగుదల అసాధారణంగా ఉందని అంటున్నారు. గతంలో కూరగాయల ధరలు పెరిగితే రైతు బజార్లలో సబ్సిడీపై అందించేవారు. టమాటా, ఉల్లిని ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయించేవారు. వెజిట్రబుల్స్ ఆకాశాన్నంటుతున్న ధరలు కిలోకు రూ.15 వరకు పెరుగుదల ధరల నియంత్రణపై చర్యలు శూన్యం -
‘చంద్రబాబు ఎప్పుడు గెలిచినా ప్రజలను మోసం చేసి గెలిచాడు’
పశ్చిమ గోదావరి జిల్లా: చంద్రబాబు ఎప్పుడు గెలిచినా ప్రజలను మోసం చేసే మాత్రమే గెలిచాడని వైఎస్సార్సీపీ పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాద్రాజు ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలకు వ్యతిరేకత ఏర్పడిందని, ప్రజలకు లేనిపోని హామీలు ఇచ్చి కూటమి పెద్దలు మోసం చేశారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ఇచ్చిన హామీలను నెరవేర్చి చూపించిందని, తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలను ఎప్పుడూ మోసం చేయలేదన్నారు ప్రసాద్రాజు.తాడేపల్లిగూడెం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో బాబు షూరిటీ- మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నర్సాపురం పార్లమెంట్ పరిశీలకులు ముదునూరి మురళీ కృష్ణంరాజు, కన్వీనర్ గూడూరు ఉమాబాల, జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, ఏలూరు పార్లమెంట్ పరిశీలకులు వంకా రవీంద్ర నాథ్ తదితరులు హాజరయ్యారు. దీనిలో భాగంగా ప్రసాద్రాజు మాట్లాడుతూ.. ‘పార్టీని మనం ఎలా బలోపేతం చేసుకోవాలి.. ప్రజల సమస్యల కోసం ఎలా పోరాడాలి అనేవి రెండు మన ప్రధాన అంశాలు. గత 5 ఏళ్ళు ప్రజలకోసం మాత్రమే ఆలోచించి కార్యకర్తలను పక్కన పెట్టిన సంగతి నిజమే. కానీ ఇకనుంచి కార్యకర్తలకు పెద్దపీట వేస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతలపై ఇప్పటివరకూ 4,500 కేసులు పెట్టారు. వైఎస్ జగన్ బయటకి వెళ్లడానికి అనేక ఆంక్షలు పెడుతున్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో దారుణమైన సంస్కృతికి తెరలేపారు.ఏడాది కాలంలో ‘కూటమి’ చేసేందేమీ లేదుఏడాది కాలం అయినా కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీ లేదని నరసాపురం పార్లమెంట్ పరిశీలకులు ముదునూరి మురళి కృష్ణంరాజు విమర్శించారు. ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన తప్ప ఏమీ జరగట్లేదు. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, మహిళలకు నెలకు రూ 1500, బీసీలు, ఎస్సీలు, మైనార్టీలకు 50ఏళ్లకే పెన్షన్ లాంటి అనేక హామీలలో ఏ ఒక్కటి నెరవేరలేదు.ఏం చెప్పి ఓట్లు వేయించుకున్నారని నిలదీయాల్సిన అవసరం ఉంది.దాని ద్వారా ప్రజాలకు మంచి జరిగే అవకాశం ఉంది. ప్రజలు గ్రహించారు వైఎస్ జగన్ మాత్రమే ఇచ్చిన హామీలను నెరవేర్చగలడని. ఎన్ని కేసులు పెట్టుకున్నా పర్వాలేదు. వచ్చేది మన ప్రభుత్వం. ఏ కార్యకర్త భయపడాల్సిన పనిలేదు. లోకేష్ గత ప్రభుత్వంలో తిరిగితే భద్రత ఇచ్చిన సంగతి మరచిపోయారా. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాం’ అని స్పష్టం చేశారు. -
కార్మిక సంఘాల సమ్మె విజయవంతం
భీమవరం: కార్మిక హక్కులను హరిస్తూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లు తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా చేపట్టిన కార్మిక సమ్మె బుధవారం భీమవరంలో విజయవంతమైంది. ఏఐటీయూసీ, సీఐటియూ ఆధ్వర్యంలో పట్టణంలో వేర్వేరుగా ర్యాలీలు, సభలు నిర్వహించారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం నుంచి కార్మికులు తాలూకా ఆఫీసు సెంటర్, ప్రకాశంచౌక్, అంబేడ్కర్ సెంటర్ మీదుగా జువ్వలపాలెం రోడ్డులోని వెంకటేశ్వరస్వామి గుడి వరకు, అక్కడ నుంచి తిరిగి ప్రకాశం చౌక్ సెంటర్కు చేరుకున్నారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కిలారి మల్లేశ్వరరావు, ఏఐటీయూసీ కార్యవర్గ సభ్యుడు చెల్లబోయిన రంగారావు, రాష్ట్ర నాయకుడు ఖాదర్ బాషా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్, పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తూ కార్మిక హక్కులను కాలరాస్తుందని విమర్శించారు. నాలుగు లేబర్ కోడ్లు అమలయితే కార్మికులు జీవించే హక్కు కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. 8 గంటల పనికి తిలోదకాలిస్తూ 12 గంటలు పని తీసుకురావడం అత్యంత దుర్మార్గమన్నారు. సమ్మెలో భాగంగా పోస్టాఫీసు, బ్యాంకులు, వాణిజ్య సంస్ధలను మూసివేయించారు. సీఐటీయూ కార్యాలయం వద్ద నుంచి కార్మికులు పెద్ద సంఖ్యలో పట్టణంలో ఎర్రజెండాలు చేతపట్టి ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తూ చట్టాలు మారుస్తుంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి పార్టీలు మద్దతు పలకడం దారుణమని విమర్శించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బి.బలరామ్ మాట్లాడుతూ దోపిడీ పాలకులకు ఓట్లు వేసినంత కాలం కార్మికుల బతుకుల్లో వెలుగు రాదన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ పట్టణ కార్యదర్శి బి.వాసుదేవరరావు, యూనియన్ బ్యాంక్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకుడు కె.భువనేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
నిశ్శబ్ద విప్లవం రసాయన శాస్త్రం
తాడేపల్లిగూడెం: ప్రపంచాన్ని మార్చే నిశ్శబ్ద విప్లవం రసాయన శాస్త్రమని ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ వి.ప్రసన్నశ్రీ అన్నారు. పట్టణంలోని నన్నయ్య వర్సిటీ ప్రాంగణంలో బుధవారం ప్రారంభమైన రీసెంట్ ట్రెండ్స్ ఇన్ ఆర్గానిక్ అనలైటికల్ అండ్ ఫార్మాస్యూటికల్ డెవలప్మెంట్ అంశంపై అంతర్జాతీయ సమావేశంలో భాగంగా ఆమె మాట్లాడారు. మానవ జీవనంలో రసాయన శాస్త్రం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. కోవిడ్ మహమ్మారి తర్వాత ఆరోగ్య వ్యవస్థ సంస్కరణలలో అద్భుతమైన పురోగతి సాధించామన్నారు. మానవ జీవితంలో కెమిస్ట్రీ, ఫార్మసీ పాత్ర కీలకమైందన్నారు. జన్యు చికిత్స వైద్యం, అనేక ఆవిష్కరణల వైపు ఫార్మా పరిశ్రమ అభివృద్ధి చెందుతోందన్నారు. కెమిస్ట్రీలో ఇటీవలి ధోరణులు, పురోగతి గురించి చర్చించడానికి ఈ సదస్సు చక్కని వేదిక అవుతుందన్నారు. రోవాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కెవీ రామానుజాచారి, చైనా సైంటిస్టు ఎన్.నాగన్న, నిట్ వరంగల్ ప్రొఫెసర్ పి.నాగేశ్వరరావు, గూడెం క్యాంపస్ ప్రిన్సిపాల్ టి.అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
వరద గోదావరి
మత్స్యం.. కొల్లేరు ప్రత్యేకం చేపల గుడ్ల ఉత్పత్తి పెంచేందుకు చేసిన ప్రయోగం విజయవంతమైన సందర్భంగా ఏటా జూలై 10న చేప రైతుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. 4లో uగురువారం శ్రీ 10 శ్రీ జూలై శ్రీ 2025సాక్షి ప్రతినిధి, ఏలూరు: వరద గోదావరి మళ్లీ పోటెత్తుతుంది. ఎగువ రాష్ట్రాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు గోదావరిలో జలకళ మొదలైంది. గత వారం రోజులుగా రోజుకు సగటున 2 లక్షల క్యూసెక్కుల నీరు పోలవరం ప్రాజెక్టు నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు. మరో నాలుగు రోజుల్లో తీవ్రత మరింత పెరుగుతుందని దానికనుగుణంగా 9.32 లక్షల క్యూసెక్కుల నీరు 15 కల్లా వస్తుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు వరద ప్రవాహంతో ముంపు మండలాల్లో అలజడి మొదలైంది. గోదావరికి వరదల సీజన్ ప్రారంభమైంది. వాస్తవానికి జూలై మొదటి వారం నుంచి వరద హడావుడి ప్రారంభమై ఆగస్టు వరకు రెండు సార్లు ముంపు మండలాల్ని అతలాకుతలం చేస్తోంది. ఈ ఏడాది వర్షాలు కొంత ఆలస్యం కావడం, ఇతర కారణాలతో వరద ఉధృతి గతంతో పోల్చితే తక్కువగానే ఉంది. ఈ నెల 2 నుంచి ప్రారంభమైన వరద నీరు క్రమేపీ పెరుగుతూ వచ్చింది. మహారాష్ట్ర ఎగువ ప్రాంతాల్లో వారం రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురవడంతో గోదావరి ఉపనది శబరి పోటెత్తుతుంది. ఈ క్రమంలో ఈనెల 2న 1.06 లక్షల క్యూసెక్కుల నీరు పోలవరం స్పిల్వే నుంచి దిగువకు విడుదల చేశారు. 5వ తేదీ నాటికి 2.09 లక్షల క్యూసెక్కులు, 9 నాటికి 2.27 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు. వరద పోటెత్తే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ అధికారులు అంచనా వేశారు. ఈ నెల 15 కల్లా 9,32,288 క్యూసెక్కుల నీరు పోలవరానికి చేరుతుందని, అదే విధంగా భద్రాచలం వద్ద 43 అడుగుల నీటిమట్టంతో మొదటి ప్రమాదహెచ్చరిక జారీ చేయవచ్చని చెబుతున్నారు. ఈ నేనపథ్యంలో ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. దిగువకు విడుదలవుతున్న నీటిని పోలవరం నుంచి పూర్తి స్థాయిలో డిశ్చార్జ్ చేస్తున్నారు. న్యూస్రీల్ముంపు మండలాల్లో భయం.. భయంపోలవరం ముంపు మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడుకు వరద ప్రమాదం పొంచి ఉంది. ఈ క్రమంలో 9.32 లక్షల క్యూసెక్కులు దాటితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ఈ దశలో రహదారులపైకి నీరు చేరుతుంది. 11.44 లక్షల క్యూసెక్కులు దాటితే రెండవ ప్రమాద హెచ్చరికకు రహదారులు నీటముగి రాకపోకలు నిలిచిపోయి పదుల సంఖ్యలో గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాల్లో ఇళ్ళలోకి నీరు చేరుతుంది. 14.26 లక్షల క్యూసెక్కులు దాటితే మూడో ప్రమాద హెచ్చరికతో రెండు మండలాల్లో 18 గ్రామాలు పూర్తిగా జలదిగ్భందంలోకి వెళ్తాయి. ఈ క్రమంలో అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కే.వెట్రిసెల్వి ఆదేశించారు. ఇప్పటివరకు కుక్కునూరు మండలం గొమ్ముగూడానికి చెందిన 15 కుటుంబాలను మాత్రమే దాచారంలోని పోలవరం పునరావాస కాలనీకి తరలించారు. కొనసాగనున్న ఉధృతి బుధవారం మధ్యాహ్నానికి భద్రాచలంలో 22.40 అడుగుల మేర నీటిమట్టం ఉంది. ఎగువ నుంచి ఇన్ఫ్లో ఎక్కువగా ఉండటంతో గురువారానికి 3 నుంచి 4 అడుగులు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 1986లో 75.60 అడుగుల మేర నీటి మట్టం ఉండటంతో 27 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలైంది. ఇంతవరకు అత్యధికంగా వచ్చిన వరద ఇదే. వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో అత్యధిక గ్రామాలు భారీగా నష్టపోయాయి. ఆ తరువాత 2022లో 71.30 అడుగుల నీటిమట్టంతో 21.78 లక్షల క్యూసెక్కుల నీరు పోలవరానికి ఒకేసారి విడుదలైంది. ఈ క్రమంలో ముంపు మండలాలతో పాటు పశ్చిమలోని లంక గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి. 2022లో జూలై 6న, 2023లో జూలై 20న 2024 జూలై 19న వరదలు ప్రారంభమై సుమారు వారం రోజులు పాటు ఇన్ఫ్లో కొనసాగింది. ముంపు మండలాల్లో అప్రమత్తం ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పోటెత్తుతున్న గోదావరి, శబరి 8 రోజుల వ్యవధిలో పోలవరం నుంచి 13.88 లక్షల క్యూసెక్కులు విడుదల మరో వారం కొనసాగనున్న గోదావరి ఉధృతి గోదావరి ఉధృతి ఇలా (పోలవరం నుంచి నీటి విడుదల) తేదీ విడుదలైన నీరు (క్యూసెక్కుల్లో) జూలై 5 2,09,733 6 2,03,309 7 1,95,294 8 2,02,463 జూలై 9 2,27,066 -
వైఎస్సార్కు ఘన నివాళి
పెనుగొండ: దివంగత సీఎం, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి వేడుకలు దుబాయ్లో ఘనంగా నిర్వహించారు. మంగళవారం రాత్రి దుబాయ్లో గోసంగి ధనలక్ష్మి, జుత్తిగ శ్రీను (భీమవరం శ్రీను), వైఎస్సార్ సీపీ నాయకుల ఆధ్వర్యంలో వైఎస్సార్కు ఘనంగా నివాళులర్పించి, కేక కట్ చేశారు. అనంతరం యూఏఈ వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు కాగితకుమార్, తరపట్ల మోహన్ మాట్లాడుతూ బడుగు బలహీన, మైనార్టీ వర్గాల ఆశాజ్యోతి, పేదల పాలిట పెన్నిధి వైఎస్సార్ అని కొనియాడారు. కార్యక్రమంలో కటికతల ప్రకాష్, విజయ, సాంబార్ మణి, నాగమణి, ఆశీర్వాదం, ప్రసాద్, అశోక్, ఏసుబాబు, వంశీ, కోటి, ఆనంద్, నవీన్ పాల్గొన్నారు. నరసాపురం–అరుణాచలం వీక్లీ ఎక్స్ప్రెస్ ప్రారంభం నరసాపురం: చైన్నె–నరసాపురం మధ్య ప్రతిపాదనలో ఉన్న వందే భారత్ రైలును పట్టాలెక్కించే ప్రయత్నాలు వేగంగా సాగుతున్నాయని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ చెప్పారు. ప్రతి బుధవారం నరసాపురం నుంచి అరుణాచలం మధ్య కొత్తగా ప్రవేశపెట్టిన రైలును మంత్రి జెండా ఊపి ప్రారంబించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా కొత్త రైలు సర్వీసులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పశ్చిమ డెల్టా నుంచి అరుణాచలం ప్రయాణించడానికి కొత్తగా ప్రవేశపెట్టిన ఈ రైలు ఉపయోగంగా ఉంటుందని అన్నారు. ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, రైల్వేస్టేషన్ మేనేజర్ మధుబాబు పాల్గొన్నారు. మత్తు పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు భీమవరం: యువతను చెడుమార్గం పట్టించే మత్తు పదార్థాలు, పొగాకు ఉత్పత్తుల నిల్వలు కలిగి ఉన్నా, అక్రమంగా విక్రయించినా ఉపేక్షించేది లేదని, షాపు యజమానులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి హెచ్చరించారు. ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ కార్యక్రమంలో భాగంగా పోలీ సులు బుధవారం జిల్లాలోని వివిధ విద్యాసంస్థల సమీపాన ఉన్న రిటైల్ దుకాణాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. విద్యాసంస్థల సమీపంలో పొగాకు ఉత్పత్తులు, గుట్కా, ఇతర నిషేధిత మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల అమ్మకాలను నివారించమే ధ్యేయంగా ఆకస్మిక దాడులు చేయిస్తున్నట్లు తెలిపారు. దాడుల్లో భాగంగా దుకాణాలలో విక్రయిస్తున్న నిషేధిత గుట్కా, పాన్, ఖైనీ వంటి హానికర ఉత్పత్తులు ధ్వంసం చేసి దుకాణ యజమానులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. జిల్లా రెడ్క్రాస్కు అవార్డు భీమవరం (ప్రకాశంచౌక్): బుధవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వార్షిక సర్వసభ్య సమావేశంలో పశ్చిమ గోదావరి జిల్లా 2022–2023 సంవత్సరానికి ఉత్తమ జిల్లా అవార్డు అందుకుంది. అవార్డును జిల్లా చైర్మన్ డా.భద్రిరాజు ఎంఎస్వీఎస్ గవర్నర్ చేతుల మీదుగా అందుకున్నారు. రెడ్ క్రాస్ నిధుల సేకరణలో విశేష కృషి చేసిన వ్యవసాయ అధికారి జెడ్. వెంకటేశ్వరరావు, డీఆర్డీఎ ప్రాజెక్టు డైరెక్టర్ ఎం.ఎస్.ఎస్.వేణుగోపాల్, రిటైర్డ్ జిల్లా విద్యా అధికారి ఆర్.వి.రమణ మెడల్స్ అందుకున్నారు. కలెక్టర్, రెడ్క్రాస్ జిల్లా అధ్యక్షురాలు సి.నాగరాణి జిల్లా రెడ్క్రాస్ టీంను అభినందించి, అవార్డు పొందిన అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు. -
అదనపు రుసుం అవసరం లేదు
641 కిలోల గంజాయి ధ్వంసం జిల్లా వ్యాప్తంగా వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న సుమారు 641 కిలోల గంజాయిని ధ్వంసం చేసినట్లు పశ్చిమ గోదావరి జిల్లా పోలీసు వర్గాలు తెలిపాయి. 4లో uతణుకు అర్బన్: ‘పైసలిస్తేనే మీటర్లు’ శీర్షికన సాక్షి పత్రికలో బుధవారం ప్రచురితమైన కథనానికి విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజనీరు ఎస్.నరసింహమూర్తి స్పందించారు. తణుకు విద్యుత్ సబ్ డివిజన్ పరిధిలోని తణుకు పట్టణం, తణుకు, ఇరగవరం మండలాలకు సంబంధించి విద్యుత్ వినియోగదారులు కొత్త విద్యుత్ సర్వీసుల కోసం వార్డు, గ్రామ సచివాలయాల్లో, మీ సేవా కేంద్రాల్లో అవసరమైన ధ్రువపత్రాలను అందచేసి దరఖాస్తు చేసుకోవాలన్నారు. అందుకు సంబంధించి డిపాజట్ మొత్తం ఆన్లైన్లో జమచేయాలని, వినియోగదారులు అంతకు మించి ఎలాంటి అదనపు రుసుములు చెల్లించాల్సిన అవసరంలేదన్నారు. విద్యుత్ సర్వీసులకు పట్టణ పరిధిలో 24 గంటలు, గ్రామ పరిధిలో 7 రోజుల్లో సర్వీసులు ఇస్తారని చెప్పారు. కొత్త విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లకు రుసుం చెల్లించిన 30 రోజుల్లో సర్వీసు ఇస్తామని, సర్వీసులకు సంబంధించి పేరు మార్పు, లైన్లు షిప్టింగ్, అదనపు లోడు పెంపునకు సచివాలయాల్లో, మీసేవా కేంద్రాల్లోను దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
నన్ను చంపాలని చూస్తున్నారు
దెందులూరు: కొల్లేరు వాసులకు ఒక్క రూపాయి బాకీ ఉన్నానని నిరూపించినా రాజకీయాల నుంచి తప్పుకుంటానని దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి అన్నారు. బుధవారం ఏలూరు జిల్లా కొండలరావుపాలెంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజకీయంగా తనను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని, అబ్బయ్యచౌదరిని ఇబ్బంది పెడితే దెందులూరులో రాజకీయంగా పెత్తనం చేయవచ్చని భావిస్తున్నారన్నారు. ఈ క్రమంలోనే అబ్బయ్యచౌదరి ఇంటికి వెళ్లండి.. ముట్టడించండి, వంటావార్పు చేయండని ఎమ్మెల్యే చింతమనేని పిలుపునిచ్చారని మండిపడ్డారు. తనను బెదిరించి హతమార్చాలని చూస్తున్నారని ఆరోపించారు. తాను ఉన్నత ఉద్యోగాన్ని వదిలి మంచి చేసేందుకే రాజకీయాల్లో వచ్చానని అన్నారు. ఐదేళ్లు శాసనసభ్యుడిగా ప్రజలకు ఎంతో సేవ చేశానని.. ఏ ఒక్కరి దగ్గర రూపాయి కూడా తీసుకునే ఆలోచన తమకు లేదన్నారు. నాలుగు దశాబ్దాలుగా సేవ చేసే కుటుంబంగా ప్రజలతో కొఠారు కుటుంబానికి అనుబంధం ఉందన్నారు. తన హయాంలో టీడీపీ కార్యకర్తలకు సైతం మంచి చేశానన్నారు. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కుటుంబంతో కూడా సమయం గడపకుండా నిత్యం ప్రజల్లోనే ఉంటున్నానన్నారు. దెందులూరు నియోజకవర్గంలో 20 ఏళ్ల తర్వాతైనా తాను చేసిన మంచి కనిపిస్తుందన్నారు. అలాంటి తన ఇంటిపై రాళ్లు వేసి, వంటావార్పులు పెట్టించి ఇబ్బందులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు చెరువులు, పొలాలు ఆక్రమిస్తున్నారని, పెట్రోల్ బంకులు, ఇల్లు ధ్వంసం చేస్తున్నారన్నారు. రౌడీషీటర్లను పంపి భయపెట్టాలని చూశారని.. 144 సెక్షన్ ఉన్నా, పోలీసులు ఆపుతున్నా దెందులూరు నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ కార్యకర్తలు తన ఇంటికి వచ్చి అండగా నిలిచారని అబ్బయ్యచౌదరి అన్నారు. కొల్లేరులో వికృత రాజకీయ క్రీడ కొల్లేరు ప్రాంతంలో వికృత రాజకీయ క్రీడ జరుగుతుందని అబ్బయ్యచౌదరి అన్నారు. తన తండ్రి రామచంద్రరావు సహకారంతోనే చింతమనేని ఎంపీపీ అయ్యారని గుర్తు చేశారు. కొల్లేరు వాసులను బెదిరించి, తమపై ఉసిగొల్పుతున్నారని.. మీకు గాని, మీ గ్రామానికి గాని బాకీ ఉన్నానని నిర్ధారించేందుకు తాను కమిటీ వేస్తానని, మీరు కూడా ఒక కమిటీ వేసి నిజనిర్ధారణకు రావాలని ఏలూరు కోటదిబ్బ వద్ద నిరసన తెలుపుతున్న వారిని ప్రశ్నించారు. కలెక్టర్, ఎస్పీ కూడా కమిటీలో భాగస్వాములై నిజాలు నిగ్గు తేల్చాలన్నారు. సమావేశంలో జెడ్పీ వైస్ చైర్మన్ పెనుమాల విజయబాబు, వడ్డీల కార్పొరేషన్ రాష్ట్ర మాజీ చైర్మన్ ముంగర సంజీవ్ కుమార్, దెందులూరు, పెదవేగి, పెదపాడు, ఏలూరు రూరల్ మండలాల పార్టీ అధ్యక్షులు కామిరెడ్డి నాని, జానంపేట ప్రసాద్బాబు, అప్పన్న ప్రసాద్, తేరా ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఏఎస్పీకి ఫిర్యాదు : నియోజకవర్గంలో పరిణామాలతో పాటు రెండు రోజులుగా జరుగుతున్న సంఘటనలపై కొఠారు అబ్బయ్యచౌదరి ఏలూరులో ఏఎస్పీ నక్కా సూర్య చంద్రరావుకు లిఖితపూర్వకంగా వినతిపత్రం అందచేశారు. మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి -
641 కిలోల గంజాయి ధ్వంసం
భీమవరం : జిల్లా వ్యాప్తంగా వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న సుమారు 641 కిలోల గంజాయిని ధ్వంసం చేసినట్లు జిల్లా పోలీసు కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు బుధవారం జిల్లా పోలీసు కార్యాలయం నుంచి ఓ ప్రకటన వెలువడింది. ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆధ్వర్యంలో జిల్లాలోని 23 పోలీస్ స్టేషన్ల పరిధిలో 64 కేసుల్లో సుమారు 641 కిలోల గంజాయిని బుధవారం గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం కొండవీడు గ్రామపరిధిలోని జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ వద్ద ధ్వంసం చేసినట్లు తెలిపారు. ధ్వంసం చేసిన గంజాయిని ముందుగా ఈనెల 8న భీమవరం పోలీస్ హెడ్ క్వార్టర్స్లోని రిసెప్షన్ హాల్లో మధ్యవర్తుల సమక్షంలో కేసుల వారీగా తూకం వేసి పరిశీలించి దానిని ప్రత్యేక కవర్లు, సంచులలో పెట్టి సీలు వేసి పోలీసు బందోబస్త్ మధ్య గుంటూరు తరలించినట్లు పేర్కొన్నారు. -
ఆర్టీసీ ఖాళీ స్థలాల్లో వ్యాపారాలతో అభివృద్ధి
ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆర్టీసీకి సంబంధించి ఖాళీగా ఉన్న స్థలాలను ఔత్సాహిక వ్యాపారవేత్తలకు లీజుకు ఇవ్వడం ద్వారా వారి ఆర్థిక అభివృద్ధికి ఆర్టీసీ కృషి చేస్తోందని ఏలూరు జిల్లా ప్రజా రవాణా అధికారి షేక్ షబ్నం అన్నారు. బుధవారం స్థానిక జిల్లా ప్రజా రవాణా అధికారి కార్యాలయంలో ఔత్సాహిక వ్యాపారులతో ఆమె అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె జిల్లాలోని కలిదిండి, భీమవరం, ఆకివీడు ప్రాంతాల్లోని ఆర్టీసీ ఖాళీ స్థలాలను 15 సంవత్సరాలకు లీజుకు ఇవ్వడానికి టెండర్లు ఆహ్వానించామన్నారు. ఈ టెండర్లకు సంబంధించిన వివరాలు, లీజుకు ఉండే నియమ నిబంధనలను వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు డిపో మేనేజ్ బీ. వాణి, డీఈ బీవీ రావు, ఏఈ సీహెచ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. భార్య, పిల్లలు కనిపించడం లేదని భర్త ఫిర్యాదు భీమవరం: తన భార్య బెల్లం రమ్య, తన పిల్లలు కన్పించడం లేదంటూ భీమవరం మండలం రాయలం గ్రామానికి చెందిన బొల్లం సుబ్బారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసినట్లు భీమవరం టూటౌన్ ఎస్సై రామరావు చెప్పారు. వివరాల ప్రకారం ఈ నెల 5న సుబ్బారావు పనికివెళ్లి తిరిగి ఇంటికి వచ్చేసరికి భార్య, పిల్లలు కన్పించలేదు. దీంతో చుట్టుపక్కల, బంధువుల ఇళ్ల వద్ద వెతికిన ప్రయోజనం లేకపోవడంతో సుబ్బారావు పోలీసులను ఆశ్రయించాడు. 14న మెగా జాబ్ మేళా ఏలూరు (ఆర్ఆర్పేట): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 14న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్టు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ఎన్. జితేంద్ర బాబు తెలిపారు. ఈ మేరకు బుధవార ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. స్థానిక సీఆర్రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఈ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ మెగా జాబ్ మేళాలో సుమారు 30కు పైగా కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని, సుమారు 2,500 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తారని వివరించారు. మరిన్ని వివరాలకు 81435 49464, 89785 24022, 94934 82414 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. -
మత్స్యం.. కొల్లేరు ప్రత్యేకం
అవగాహన కల్పిస్తాం ప్రేరేపిత ప్రయోగం విజయవంతం ద్వారా డాక్టర్ హీరాలాల్ చౌదరీ నీలి విప్లవానికి పితామహుడిగా మారారు. ఆయన 1994లో వరల్ట్ ఆక్వాకల్చర్ అవార్డు అందుకున్నారు. ప్రతి ఏటా మత్స్యశాఖ ద్వారా రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. కై కలూరు ప్రభుత్వ ఆక్వా ల్యాబ్లో రైతులకు గురువారం అవగాహన కలిగిస్తాం. – సీహెచ్ గణపతి, మత్స్యశాఖ అభివృద్ధి అధికారి, కై కలూరుకై కలూరు: చేపల గుడ్లు(స్పాన్) ఉత్పత్తికి సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి చేసిన ప్రయోగ ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా భారతదేశ ఆక్వారంగం అగ్రభాగాన నిలుస్తోంది. ఒడిశా రాష్ట్రం కటక్ సెంట్రల్ ఇన్ల్యాండ్ ఫిషరీస్ రీసెర్చ్ ఇనన్స్టిట్యూట్ (ఐసీఏఆర్)లో 1957 జూలై 10న డాక్టర్ హీరాలాల్ చౌదరీ, డాక్టర్ అలికున్హి శాస్త్రవేత్తలు కలిసి భారతదేశ మేజర్ కార్ప్స్పై విజయవంతమైన ప్రేరిత పెంపక ప్రయోగాన్ని(ఇన్డ్యూసిడ్ బ్రీడింగ్) చేపట్టారు. సాధారణ చేపల్లో ఉదాహరణకు ఐదు లక్షల స్పాన్ ఉత్పత్తి చేస్తే ప్రేరిత ప్రయోగం వల్ల ఆ సంఖ్య 10 నుంచి 20 లక్షలకు చేరింది. అప్పటి నుంచి నీలి విప్లవం తారా స్థాయికి పాకింది. బ్రీడింగ్ ప్రయోగం విజయవంతమైన సందర్భంగా జాతీయ చేపల రైతుల దినోత్సవం జూలై 10న జరుపుకుంటారు. ఉమ్మడి జిల్లాల్లో మత్స్యశాఖ ఆధ్వర్యంలో రైతులకు గురువారం అవగాహన కార్యక్రమాలన నిర్వహిస్తున్నారు. రికార్డు స్థాయిలో ఆక్వా సాగు ఉమ్మడి జిల్లాలో 2.90 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. ఆక్వా రంగం నుంచి వార్షిక ఉత్పత్తి 4 లక్షల టన్నులు ఉండగా, వార్షిక టర్నోవర్ రూ.18 వేల కోట్లు ఉంది. దాదాపు ఆక్వా రైతులు 75 వేల మంది ఈ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఈ జిల్లాల నుంచి 3.5 లక్షల టన్నులు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఇక రాష్టం విషయానికి వస్తే 974 కిలోమీటర్ల మేర సముద్ర తీర ప్రాంతం ఉంది. రాష్ట్రంలో మొత్తం ఆక్వా సాగు 2.26 హెక్టార్లులలో కొనసాగుతుంది. దిగుబడులు 10 లక్షల టన్నులుగా ఉంది. అమెరికాకు ఎగుమతి చేసే రొయ్యలు 3.27 లక్షల టన్నులుగా నమోదైంది. దేశంలోనే సింహభాగం ఉత్పత్తులకు ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలు మణిహారంగా మారాయి. నీలి విప్లవంతో రికార్డులు ఆక్వా సాగులో 1955 పూర్వం చేపల సాగు చేయాలంటే నదులు, సముద్రాలలో చేప పిల్లలను సేకరించాల్సి వచ్చేది. దీన్ని వైల్ట్ కలక్షన్ అంటారు. డాక్టర్ హీరాలాల్ చౌదరీ భారతీయ మేజర్ కార్ప్స్ (కట్లా, రోహు, మ్రిగల్)పై హార్మోన్ ప్రేరేపిత ప్రయోగం చేశారు. దీంతో కోట్లలో చేప స్పాన్ అందుబాటులోకి వచ్చింది. తర్వాత అన్యదేశ కార్ప్స్(కామన్ కార్ప్, గ్రాస్ కార్ప్, సిల్వర్ కార్ప్), టిలాపియా, పంగాసియస్ వంటి ఇతర చేపలు, మంచినీటి రొయ్యలైన మాక్రోబ్రాకియం, రోజెంబర్గి(స్కాంపీ) కూడా అభివృద్ధి చెందాయి. ఒక్క ప్రయోగం భారతీయ మత్స్య పరిశ్రమను సమూలంగా మార్చివేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నర్సరీలు, పెంపక చెరువులు నాణ్యమైన చేప విత్తనాల సరఫరాలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. ఇవి రాష్ట్రానికి మాత్రమే కాక, దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా చేప విత్తనాలను సరఫరా చేస్తున్నాయి. కొల్లేరులో చేపల పట్టబడులు చేస్తున్న దృశ్యం (ఫైల్) నేడు జాతీయ చేపల రైతు దినోత్సవం ఉమ్మడి జిల్లాలో 2.90 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు ఆక్వా అంటేనే కొల్లేరు ఆక్వా పరిశ్రమకు కొల్లేరు లంక గ్రామాలు పెట్టింది పేరుగా ఉన్నాయి. ఉమ్మడి జిల్లాల్లో 9 మండలాల్లో కొల్లేరు విస్తరించి ఉంది. చిత్తడి నేలల కారణంగా చేపల, రొయ్యల పెరుగుదల అధికంగా ఉంటుంది. ఇక చేప పిల్లలను ఉత్పత్తి చేసే ప్రభుత్వ హేచరీ ఏలూరు జిల్లా బాదంపూడిలో ఉంది. చేప నారును సాగు చేసే మత్స్యశాఖనకు చెందిన సీడ్ ఫాంలు ఏలూరు, కొవ్వలిలో ఉన్నాయి. ఉమ్మడి జిల్లాల నుంచి ప్రతి రోజూ 240 లారీలు ఎగుమతులు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నాయి. రాష్ట్రంలో ఆక్వాకు సంబంధించి ప్రాసెసింగ్ ప్లాంట్లు 106, ఐస్ ప్లాంట్లు 258, ఏడాదికి 60,000 మినియన్ల ఉత్పత్తి చేసే రొయ్యల హేచరీస్, ప్రతి రోజూ 9,750 టన్నుల ఉత్పత్తి చేసే మేతల ఫ్యాక్టరీలు 429, ఆక్వాషాపులు 1104, ఆక్వా ల్యాబ్లు 237 ఉన్నాయి. -
మామిడి తోటల్లో కొమ్మ కత్తిరింపులు చేపట్టాలి
నూజివీడు: కోతలు పూర్తయిన నేపథ్యంలో మామిడి తోటల్లో రైతులు కొమ్మ కత్తిరింపులు చేసుకోవాలని నూజివీడు మామిడి పరిశోధన స్థానం శాస్త్రవేత్త కె.రాధారాణి పేర్కొన్నారు. మండలంలోని కొత్తరావిచర్లలో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో బుధవారం మామిడి రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా రాధారాణి మాట్లాడుతూ కొమ్మ కత్తిరింపులు చేయడం వల్ల చెట్ల గాలి వెలుతురు ప్రసరణ బాగా జరిగి పూత, కాపు సరిగ్గా వస్తాయని, తెగుళ్లు, పురుగుల బెడద తగ్గుతుందన్నారు. చెదురుమదురుగా ఉన్న కొమ్మలను ఏటవాలుగా కత్తిరించి కత్తిరించిన చోట బ్లైటాక్స్ను పూయాలన్నారు. తోటల్లో దుక్కులు చేపట్టి చెట్టుకు చుట్టూ పాదులు చేసి పదేళ్ల వయస్సు పైబడిన చెట్లకు యూరియా 2 కిలోలు, సింగిల్ సూపర్ ఫాస్పేట్ 4 కేజీలు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 1.5కేజీలు, బోరాన్ 100గ్రాములు, జింక్ సల్ఫేట్ 100గ్రాములు చొప్పున ఒక్కొక్క చెట్టుకు వేయాలన్నారు. ఆమె వెంట ఉద్యానశాఖ అధికారి ఆర్.హేమ, సర్పంచి కాపా శ్రీనివాసరావు ఉన్నారు. -
ఆధ్యాత్మిక చింతనలో అతివలు
ద్వారకాతిరుమల: మానసిక ఒత్తిడిని దూరం చేసి ప్రశాంతతనిచ్చేది ఆధ్యాత్మిక చింతన. ఆ దిశగా అడుగులు వేస్తూ తమ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ, దేవుని సేవలో తరిస్తున్నారు వందలాది మంది మహిళలు. బృందాలుగా ఏర్పడి, దేవాలయాల్లో భగవద్గీత పారాయణలు చేస్తున్నారు. అందులో భాగంగా తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ద్వారకాతిరుమల శ్రీవారి సన్నిధిలో శ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ శిష్య బృందం భగవద్గీత పారాయణం, స్వామివారి గానామృతం చేశారు. ఇందులో రాష్ట్ర నలుమూలల నుంచి విచ్చేసిన 500 మంది మహిళలు పాల్గొన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో కామవరపుకోట మండలం జలపవారిగూడెంకు చెందిన కామిశెట్టి రాంబాబు, ఉషారాణి దంపతుల ఆధ్వర్యంలో సామాన్య భక్తులు సైతం భాగస్వాములయ్యారు. దూరాన్ని లెక్కచేయకుండా.. ఏలూరు జిల్లాకు చెందిన మహిళలతో పాటు బెంగళూరు, హైదరాబాద్, ఖమ్మం, వైర, సత్తుపల్లి, అశ్వారావుపేట, భద్రాచలం, పాల్వంచ, అలాగే విశాఖపట్నం, నూజివీడు, తిరువూరు, విసన్నపేట, భీమవరం తదితర ప్రాంతాలకు చెందిన మహిళలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మహిళా భక్తులకు శ్రీవారి దేవస్థానం ఈఓ ఎన్వీ సత్యనారాయణ మూర్తి ఆదేశాల మేరకు స్వామి వారి ఉచిత దర్శనంతో పాటు, అన్నప్రసాదాన్ని అందజేశారు. ఏర్పాట్లను ఆలయ ఏఈఓలు పి.నటరాజారావు, రమణరాజు, సూపరింటెండెంట్లు కోటగిరి కిషోర్, గోవాడ సుబ్రహ్మణ్యం, దుర్గాప్రసాద్ పర్యవేక్షించారు. శ్రీవారి క్షేత్రంలో భగవద్గీత పారాయణం, స్వామివారి గానామృతం రాష్ట్ర నలుమూలల నుంచి విచ్చేస్తున్న మహిళలు 500 మందితో ప్రత్యేక కార్యక్రమాలు సంతృప్తినిచ్చింది ఆన్లైన్లో భగవద్గీత పారాయణం నేర్చుకున్నాను. తొలిసారిగా శ్రీవారి సన్నిధిలో, అది కూడా తొలి ఏకాదశి రోజున భగవద్గీత పారాయణం, గానామృతం చేయడం సంతృప్తినిచ్చింది. ఈ కార్యక్రమాల నిర్వహణకు దేవస్థానం అధికారులు పూర్తి సహకారాన్ని అందించారు. – కామిశెట్టి ఉషారాణి, కామవరపుకోట మండలం జలపవారిగూడెం ప్రశాంతత లభిస్తుంది ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటే మానసిక ప్రశాంతత లభిస్తుంది. అందుకే హైదరాబాద్ నుంచి వచ్చాను. తొలి పండుగ నాడు అధిక సమయం శ్రీవారి సన్నిధిలో గడపడం, ఆ స్వామివారిని దర్శించుకోవడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. – కొమ్మూరి గాయత్రి, హైదరాబాద్. ఏడు వందల శ్లోకాలు కంఠస్థం భగవద్గీత పారాయణను ఆన్లైన్ ద్వారా నేర్చుకున్నాను. గోల్డ్మెడల్ కూడా వచ్చింది. శ్రీవారి సన్నిధిలో జరిగిన ఈ కార్యక్రమంలో 700 శ్లోకాలు కంఠస్థం చేసిన సుమారు 200 మంది గోల్డ్మెడలిస్టులం పాల్గొన్నాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరంతరాయంగా పారాయణం, గానామృతం చేశాం. – సెనగపల్లి పూర్ణిమ, విజయవాడ -
కుమారుడిపై తల్లి ఫిర్యాదు
ముదినేపల్లి రూరల్: మద్యం మత్తులో తనపై దాడి చేస్తున్నాడంటూ కుమారుడిపై తల్లి స్థానిక పోలీసుస్టేషన్లో బుధవారం ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం ప్రకారం మండలంలోని వాడవల్లికి చెందిన నిమ్మగడ్డ నాగేశ్వరరావు, మేరమ్మ దంపతులకు నలుగురు కుమారులున్నారు. తండ్రి నాగేశ్వరరావు అనారోగ్యంతో మంచంపై ఉన్నాడు. చివరి కుమారుడైన విజయకుమార్ భార్యను వదిలేసి తల్లిదండ్రుల వద్దనే ఉంటున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి విజయకుమార్ మద్యం మత్తులో కత్తిపీటతో తనపై దాడి చేసినట్లు మేరమ్మ ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు ఫిర్యాదు చేయగా ఎస్సై వీరభద్రరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ అధికారుల బదిలీలు ఏలూరు (ఆర్ఆర్పేట): తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలో పని చేస్తున్న అధికారులను బదిలీ చేస్తూ ఆ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పృథ్వీతేజ్ ఇమ్మడి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల నిర్వహించిన పదోన్నతుల్లో నిడదవోలు విద్యుత్ రెవెన్యూ కార్యాలయానికి జేఓగా నియమితులైన సీహెచ్ శ్రీనివాసరావును పరిపాలనా సౌలభ్యం కోసం రామచంద్రాపురం విద్యుత్ రెవెన్యూ కార్యాలయానికి బదిలీ చేశారు. అలాగే రామచంద్రాపురం విద్యుత్ రెవెన్యూ కార్యాలయానికి ఇటీవల పదోన్నతిపై వెళ్ళిన ఎంవీఎస్ఎస్వీ ప్రసాద్ను నిడదవోలు విద్యుత్ రెవెన్యూ కార్యాలయానికి బదిలీ చేశారు. జెడ్పీ ఉన్నత పాఠశాల ఆకస్మిక తనిఖీ ఇరగవరం : మండలంలోని ఇరగవరం జిల్లా పరిషత్ హైస్కూల్ను బుధవారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ స్కూలు ఆవరణ అంతా తిరిగి పరిశీలించారు. విద్యార్థులు అమ్మ పేరుతో నాటేందుకు సిద్ధపరిచిన మొక్కలను పరిశీలించారు. మధ్యాహ్న భోజనం పథకంలో తయారు చేసే వంటశాలకు వెళ్లి వండిన వంటకాలను, స్టాక్ రూములో ఉన్న స్టాకును పరిశీలించారు. గురువారం నిర్వహించే మెగా పేరెంట్స్ టీచర్స్ డే మీట్ కార్యక్రమం పండుగ వాతావరణంలో నిర్వహించాలని ఆదేశించారు. ఆయన వెంట ఆర్డీఓ ఖతీబ్ కౌసర్ భానో, తహసీల్దార్ ఎం.సుందర్ రాజు ఉన్నారు. విద్యాసంస్థల బస్సులపై 18 కేసులు ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లావ్యాప్తంగా బుధవారం వాహన తనిఖీ అధికారులతో విద్యా సంస్థల బస్సులను తనిఖీ చేయించినట్టు ఏలూరు ఇన్చార్జ్ రవాణా శాఖాధికారి ఎస్బీ శేఖర్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా మొత్తం వివిధ విద్యా సంస్థలకు చెందిన 63 బస్సులను తనిఖీ చేసినట్టు తెలిపారు. వాటిలో పన్నులు చెల్లించని, ఇన్సూరెన్స్, పొల్యూషన్, డ్రైవింగ్ లైసెన్స్ లేని, పలు నిబంధలను అతిక్రమించిన 18 బస్సులపై కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. జిల్లాలో విద్యా సంస్థలు పూర్తి స్థాయిలో ప్రారంభమైన కారణంగా విద్యా సంస్థల యాజమాన్యాలు నిర్వహించే బస్సులన్నీ నిబంధనలకు లోబడి తిప్పాలని, అన్ని బస్సులు పూర్తి ఫిట్నెస్తో, ఇన్సూరెన్స్తో, డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన డ్రైవర్లతో మాత్రమే తిప్పాలని సూచించారు. -
నాణ్యమైన ఆహారం అందించాలి
ఏలూరు (టూటౌన్): వసతి గృహాంలోని విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ సూచించారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్న ప్రసాద్ అమీనాపేట ఏటిగట్టున ఉన్న సాంఘిక సంక్షేమ సమీకృత బాలుర వసతి గృహాన్ని బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాలలకు అందిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. వసతి గృహం కిటికీలకు దోమల మెష్ లేకపోవడం వల్ల దోమల బెడద ఉంటుందని విద్యార్థులు తెలిపారని, ఈ విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు. వసతి గృహానికి రాని విద్యార్థుల వివరాలు సేకరించి, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించి, తిరిగి పాఠశాలకు పంపేలా చర్యలు తీసుకోవాలన్నారు. చికిత్స పొందుతూ యువకుడి మృతి చింతలపూడి: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు మృతి చెందినట్లు ఎస్సై సతీష్కుమార్ బుధవారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లింగంపాలెం గ్రామానికి చెందిన తులిమెల్లి త్రినాథ్ (24) చింతలపూడి వైష్ణవి మెడికల్ షాప్లో సేల్స్మేన్గా పని చేస్తున్నాడు. ఈ నెల 5న రాత్రి మెడికల్ షాప్ కట్టి ద్విచక్రవాహనంపై స్వగ్రామం లింగపాలెం బయలుదేరాడు. చింతలపూడి బైపాస్ రోడ్డు వద్ద పెట్రోల్ బంక్ సమీపంలో బైక్ అదుపుతప్పి గుంతలో పడిపోవడంతో తలకు బలమైన గాయమైంది. స్థానికులు యువకుడిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించి మెరుగైన చికిత్సకోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ త్రినాథ్ చనిపోవడంతో మృతుని తండ్రి తులిమెల్లి సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఉర్దూ పాఠశాల వివాదంపై ఆర్జేడీ విచారణ ఏలూరు (ఆర్ఆర్పేట): నగరంలోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ (మాకా) ఉర్దూ పాఠశాల, తూర్పువీధి ఉర్దూ పాఠశాలల్లో జరుగుతున్న వివాదాలపై పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ జి.నాగమణి బుధవారం విచారణ నిర్వహించారు. తొలుత ఆ రెండు పాఠశాలల్లోని ఉపాధ్యాయులతో ఆమె మాట్లాడారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యే మాధ్యమంలోనే బోధించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ మేరకు ఉపాధ్యాయుల నుంచి రెండు మాధ్యమాల్లో బోధిస్తామని లేఖలు రాయించుకున్నారు. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ విచారణలో జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకటలక్ష్మమ్మ పాల్గొన్నారు. -
తూకంలోనూ తినేస్తున్నారొయ్యా!
ఎండనకా.. వాననకా.. నకిలీలు, వైరస్లు, వాతావరణ మార్పుల నడుమ దినదిన గండాలను దాటుకుని రొయ్యల్ని పెంచితే.. గోతికాడ నక్కల్లా ఆక్వా రైతుల కష్టాన్ని దళారులు దోచేస్తున్నారు. ఇప్పటివరకు ఫీడ్, సీడ్, ప్రాసెసింగ్ ప్లాంట్లు, ఎక్స్పోర్టర్స్ రైతులను వివిధ రూపాల్లో ముంచేస్తున్నారు. తాజాగా రొయ్యల పట్టుబడి తూకంలోనూ మోసాలకు పాల్పడుతూ టన్నుకు 60 కేజీలు కాజేస్తున్న వైనం పశ్చిమగోదావరి జిల్లాలో వెలుగు చూసింది. తూకాల్లో మోసాలపై చర్యలు చేపట్టి రొయ్యల రైతులను రక్షించాలంటూ ఆక్వా రైతు సంఘం నాయకులు కలెక్టర్ సీహెచ్ నాగరాణికి వినతిపత్రం సమర్పించారు. – సాక్షి, భీమవరంఇలా మోసగిస్తున్నారురొయ్యల కొనుగోలుదారులు తూకంలో చేస్తున్న మోసం పాలకొల్లు నియోజకవర్గం మేడపాడులో బయటపడింది. సాధారణంగా ఎల్రక్టానిక్ కాటాల్లో కేజీలు, లీటర్లలో కొలిచేందుకు వీలుగా ‘మోడ్ బటన్’ ఉంటుంది. అవసరాన్ని బట్టి ఈ బటన్ను కేజీలు, లీటర్లలోకి సెట్ చేసుకోవచ్చు. దీనిని ఉపయోగించి వ్యాపారులు మోసాలకు పాల్పడుతున్నట్టు ఆక్వా రైతులు గుర్తించారు. కేజీ మోడ్లో ఉంచితే 1,000 గ్రాములకు కిలోగా డిస్ప్లేలో చూపిస్తుంది. దానిని లీటర్ల మోడ్లోకి మారిస్తే 9,400 గ్రాములు చూపిస్తుంది. అంటే రైతులు 100 కిలోల (క్వింటాల్) రొయ్యలను తూకం వేయిస్తే 94 కిలోలు మాత్రమే చూపుతుంది. క్వింటాల్కు 6 కిలోల చొప్పున టన్నుకు 60 కిలోల రొయ్యలను దళారులు, కంపెనీలు రైతుల నుంచి దోచేస్తున్నాయి. ఎల్రక్టానిక్ కాటా లీటర్ల మోడ్లో ఉన్నప్పుడు డిస్ప్లే మొదటిలో ‘ఎల్’ ఇండికేషన్ వస్తుంది. ఇది కనిపించకుండా ఉండేందుకు ‘ఎల్’ ఇండికేషన్ స్థానంలో బ్లాక్ స్టిక్కర్ను అతికిస్తున్నారు. దీనివల్ల ‘ఎల్’ సింబల్ కనిపించడం లేదని రైతులు చెబుతున్నారు. కాటా మోసాల వల్ల రొయ్యల కౌంట్, ధరను బట్టి టన్నుకు రూ.13 వేల నుంచి రూ.20 వేల చొప్పున రూ.కోట్లల్లో దోచేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లు, పప్పు దినుసులు, అన్నిరకాల వ్యాపారాల్లోనూ ఈ తరహా కాటా మోసాలు జరుగుతున్నాయని రైతులు చెబుతున్నారు.అడ్డుకోవాలని అధికారులకు వినతికాటా మోసాలకు తూనికలు, కొలతల శాఖ అధికారులు చెక్ పెట్టాలని ఆక్వా రైతులు డిమాండ్ చేస్తున్నారు. కేజీల్లో తూకం వేసే కాటాలకు కేజీ మోడ్ మాత్రమే ఉండేలా చూడాలని, వాటికి సీళ్లు, కచి్చతమైన ప్రమాణాలు పాటించేలా ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని కోరుతున్నారు. రైతుల ఫిర్యాదులపై స్పందించేందుకు ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు చేయాలని, కాటా మోసాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఆక్వా రైతు సంఘం నాయకులు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సీహెచ్ నాగరాణికి వినతిపత్రం అందజేశారు. కాగా.. రాష్ట్రవ్యాప్తంగా ఈ తరహా దోపిడీ జరుగుతోందని, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ మోసం జరిగే తీరును వివరిస్తూ పాలకొల్లుకు చెందిన జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం నాయకులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. కాటా మోసం కళ్లారా చూశాం ఇప్పటివరకు కాటా మోసం గురించి వినడమే గానీ.. ఎలా చేస్తారో తెలిసేది కాదు. కాటాకు చిన్న స్టిక్కర్ అతికించి రైతుల కష్టాన్ని దారుణంగా దోచేస్తున్నారు. ఈ తరహా మోసాలు ఒక్క ఆక్వాలోనే కాకుండా ఇతర వ్యాపారాల్లోనూ జరిగేందుకు అవకాశం ఉంది. ఆ దిశగా ప్రభుత్వం తనిఖీలు చేయించి ప్రజలు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలి. – తులసి రాంబాబు, ఆక్వా రైతు సంఘం నేత, వీరవాసరం కాటాలకు కేజీ ఆప్షన్ మాత్రమే ఉంచాలి అటు వైరస్లు, ఇటు ధరల పతనం, సిండికేట్ల దోపిడీతో రొయ్యల రైతులు నష్టపోతుంటే కాటా మోసాలు మమ్మల్ని మరింత కుంగదీస్తున్నాయి. రొయ్యల పట్టుబడికి వినియోగించే కాటాలకు కేవలం కేజీ ఆప్షన్ మాత్రమే ఉండేలా చూడాలి. కాటా మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు తూనికలు, కొలతల శాఖ అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలి. – జీకేఎఫ్ సుబ్బరాజు, కార్యదర్శి, జిల్లా రొయ్య రైతుల సంక్షేమ సమాఖ్య, భీమవరం -
వాడవాడలా.. వైఎస్సార్ స్మృతిలో
అందుబాటులో విత్తనాలు విత్తనోత్పత్తి చేసే రైతులకు మార్టేరు వ్యవసాయ పరిశోధనా స్థానంలో బ్రీడర్ సీడ్ అందుబాటులో ఉన్నాయని పరిశోధనా సహా సంచాలకుడు తెలిపారు. 8లో uకొబ్బరి ధర అదుర్స్ కొబ్బరి రైతుల పంట పండింది. కొబ్బరికాయ ధర రూ.17 పలకడంతో కొబ్బరి రైతులు లాభాలను చూస్తున్నారు. అంతర పంటలతో కూడా ఆదాయం వస్తోంది. 8లో uబుధవారం శ్రీ 9 శ్రీ జూలై శ్రీ 2025సాక్షి, భీమవరం: జోహార్.. వైఎస్సార్.. అంటూ జనహృదయ నేత దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి 76వ జయంతిని జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. మనసున్న మారాజు ఆ మహానేత విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పెద్ద ఎత్తున రక్తదానం, అన్నదానంతో పాటు చీరలు, దుప్పట్లు, పండ్లు పంపిణీ చేసి సేవా కార్యక్రమాలతో అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ ప్రజలే ప్రాణంగా, పేదల అభ్యున్నతే లక్ష్యంగా వైఎస్సార్ పాలన సాగించారని కొనియాడారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, ఇందిరమ్మ, అర్హులందరికీ ప్రభుత్వ పథకాల లబ్ధిని చేకూర్చి పేదల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. ఆయన తెచ్చిన పథకాలనే తర్వాతి ప్రభుత్వాలు పేర్లు మార్చి కొనసాగిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. తండ్రిని మించిన తనయుడిగా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని పరుగులు పెట్టించిన ఘనత వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి దక్కుతుందన్నారు. రాజన్న నిను మరువలేం.. భీమవరం పట్టణంలోని గునుపూడిలో వైఎస్సార్ విగ్రహానికి శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు, భీమవరం నియోజకవర్గ కోఆర్డినేటర్ చినమిల్లి వెంకటరాయుడు, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కోడి విజయలక్ష్మి, జిల్లా అధికార ప్రతినిధిలు మేడిద జాన్సన్, కామన నాగేశ్వరరావు తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పేదలకు చీరలు, స్వీట్లు అందజేశారు. వీరవాసరం మండలం నవుడూరులో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, కోఆర్డినేటర్ చినవెంకటరాయుడు సీహెచ్సీలోని రోగులు, గర్భిణీలు, బాలింతలకు పండ్లు, రొట్టెలు పంచారు. యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చిగురుపాటి సందీప్ ఆధ్వర్యంలో నరసాపురంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని పార్లమెంట్ కన్వీనర్ గూడూరి ఉమాబాల ప్రారంభించారు. శిబిరంలో యువత ఉత్సాహంగా పాల్గొని 87 మంది రక్తదానం చేశారు. తొలుత స్టీమర్ రోడ్డులోని వైఎస్సార్ విగ్రహం వద్దకు ఉమాబాల, మున్సిపల్ చైర్పర్సన్ బర్రే వెంకటరమణ, సందీప్, సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ బందన పూర్ణచంద్రరావు తదితరులు భారీ ర్యాలీగా తరలివెళ్లి నివాళులర్పించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెంలో వైఎస్సార్ జయంతిని వేడుకగా నిర్వహించారు. పట్టణంలోని పోలీస్ ఐల్యాండ్, బస్టాండ్ సెంటర్లోని వైఎస్సార్ విగ్రహాల వద్దకు పార్టీ శ్రేణులతో భారీ ర్యాలీగా వెళ్లి నివాళులర్పించారు. తణుకులో మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ శ్రేణులతో భారీ ర్యాలీగా పట్టణంలోని జెడ్పీ బాయ్స్ హైస్కూల్, వైఎస్సార్ పార్కులోని వైఎస్సార్ విగ్రహాల వద్దకు చేరుకుని పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్లు కట్ చేసి స్వీట్లు పంచారు. పాలకొల్లులో నరసాపురం పార్లమెంట్ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, పార్టీ నాయకురాలు గుడాల మంగతాయారు, పార్టీ నేతలు గుణ్ణం నాగబాబు, చెల్లెం ఆనంద ప్రకాష్, యడ్ల తాతాజీ తదితరులు గాంధీబొమ్మల సెంటర్లోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆస్పత్రిలోని రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఉండి నియోజకవర్గంలో వైఎస్సార్ జయంతిని పార్టీ శ్రేణులు వేడుకగా నిర్వహించారు. ఆకివీడు మండలం సిద్దాపురంలో పండ్లు, రొట్టెలు, చెరుకుమిల్లిలో దుప్పట్లు పంపీణీ చేశారు. కాళ్ల మండలం పెదఅమిరంలో దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పెనుమత్స ప్రసాద్రాజు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు కొండేటి శివకుమార్, ఆకివీడు జెడ్పీటీసీ వేగేశ్న వెంకటరాజు తదితరులు పాల్గొన్నారు. ఆచంటలో మాజీ మంత్రి చెరుకువాడ తనయుడు నరసింహరాజు ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఆచంట సెంటర్లోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి పండ్లు, స్వీట్లు అందజేశారు. న్యూస్రీల్ వాడవాడలా ఘనంగా వైఎస్సార్ 76వ జయంతి మహానేత విగ్రహాలకు నివాళులర్పించిన వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు నరసాపురంలో రక్తదాన శిబిరం జిల్లా వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు -
పునరావాస కేంద్రం పరిశీలన
కుక్కునూరు: గోదావరి వరదల దృష్ట్యా కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశాల మేరకు మంగళవారం పలువురు అధికారులు మండలంలోని దాచారం ఆర్ అండ్ ఆర్ కాలనీలో ఏర్పాటు చేసిన పునరావాస సహాయక కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వరద బాధితులకు పునరావాస కేంద్రంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక సదుపాయాలు అందేలా చర్యలు చేపట్టారు. దాచారం ఆర్ అండ్ ఆర్ కాలనీని సందర్శించిన వారిలో పంచాయతీరాజ్ ఎస్ఈ కె.శ్రీను, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ జి.త్రినాథ్బాబు, గృహనిర్మాణ శాఖ పీడీ జి.సత్యనారాయణ తదితరులున్నారు. ఉపాధ్యాయులను నియమించాలి ఏలూరు (ఆర్ఆర్పేట): నగరంలోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ పాఠశాలలో ప్రస్తుతం ఎస్ఏ ఉర్దూ, ఎస్ఏ గణితం, ఎస్ఏ పీఎస్ ఉపాధ్యాయులు లేనందున వెంటనే అర్హత కలిగిన ఉపాధ్యాయులను నియమించాలని మంగళవారం జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మకు వినతిపత్రం సమర్పించారు. కొన్ని పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు పూర్తిస్థాయిలో అందనందున పూర్తిస్థాయిలో చేరేలా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో పాటు తూర్పువీధి ఉర్దూ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల, తల్లిదండ్రుల కోరిక మేరకు ఇంగ్లీషు మీడియంలోనే బోధన కొనసాగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. డీఈఓకు వినతిపత్రం సమర్పించిన వారిలో ఏపీటీఎఫ్ ఆడిట్ కమిటీ సభ్యుడు ఎస్కే రంగావలి, రూరల్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రామశేషు కుమార్, శ్రీనివాస్ తదితరులున్నారు. బంద్ను జయప్రదం చేయాలి భీమడోలు: కార్మికులను బానిసలుగా మార్చే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 9న దేశ వ్యాప్తంగా తలపెట్టిన భారత్ బంద్ను విజయవంతం చేయాలని సీఐటీయు జిల్లా అధ్యక్షుడు ఆర్.లింగరాజు కోరారు. పూళ్ల రై్స్ మిల్లు వర్కర్లతో కలిసి గోడ పత్రికలు, కరపత్రాలను మంగళవారం ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అసంఘటిత రంగంలో పని చేస్తున్న కోట్లాది మంది కార్మికులు కనీస వేతనాలు లేక పీఎఫ్, ఈపీఎఫ్ పింఛన్ ప్రమాద బీమా లాంటివి లేనందున అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించాలన్నారు. పరిశ్రమల్లో పని చేసే కార్మికులకు భద్రత కల్పించాలని కోరారు. వివిధ శాఖల్లో పని చేసే ఉద్యోగులు, ఆశావర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు వెంకటేశ్వరరావు, బెండి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ముగ్గురు అధికారులకు రాష్ట్ర స్థాయి అవార్డులు భీమవరం (ప్రకాశంచౌక్): పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ముగ్గురు జిల్లా అధికారులు జూలై 9న విజయవాడలో గవర్నర్ చేతుల మీదుగా రెడ్క్రాస్ అవార్డులు అందుకోనున్నారు. అవార్డులు పొందిన వారిలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు, గ్రామీణ అభివద్ధి శాఖ అధికారి ఎం.ఎస్.ఎస్.వేణుగోపాల్, మాజీ విద్యా శాఖ అధికారి ఆర్.వెంకటరమణ ఉన్నారు. వీరు 2022–23, 2023–24 ఆర్థిక సంవత్సరాల్లో రెడ్క్రాస్ కోసం రూ.5 లక్షలకుపైగా నిధులు సమీకరించారన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్, రెడ్క్రాస్ అధ్యక్షురాలు చదలవాడ నాగరాణి, జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, రెడ్క్రాస్ చైర్మన్ డా.ఎం.ఎస్.వి.ఎస్.భద్రిరాజు, వైస్ చైర్మన్ వబిలిసెట్టి కనకరాజు తదితరులు అభినందనలు తెలిపారు. -
బాబు మోసాన్ని ఇంటింటికీ వివరించాలి
ఇరగవరం: ప్రజలకు మోసపూరిత హమీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి నాయకులు ఏ ఒక్క హమీ కూడా నేరవేర్చకుండా ప్రజలను దగా చేశారని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం ఇరగవరం మండలంలోని కొత్తపాడు గ్రామంలో ‘ాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మహిళలను, యువతను, ఉద్యోగులను మోసం చేశారన్నారు. చంద్రబాబు మోసపూరిత హమీలపై క్యూఆర్ కోడ్తో కూడిన బ్రోచర్ను ఇంటింటికీ అందించాలన్నారు. ప్రజలను మోసం చేయడలో చంద్రబాబును మించిన వారు లేరన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కొప్పిశెట్టి అలివేలు మంగతాయారు, మాజీ డీసీఎంస్ డైరెక్టర్ పెన్మెత్స సుబ్బరాజు, పెన్మెత్స రాంభద్ర రాజు, పార్టీ మండల అధ్యక్షుడు కొప్పిశెట్టి దుర్గారావు, సత్తి వెంకట రెడ్డి, గుడిమెట్ల వీర్రెడ్డి, మేట్ల కిరణ్మయి, వీరమల్లు ఫణీంద్ర, కోవ్వూరి శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ బొక్కా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.