More

దళిత బంధు నిలుపుదలపై తెలంగాణ హైకోర్టులో పిల్

21 Oct, 2021 17:09 IST

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దళిత బంధు పథకం నిలుపుదలపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. సామాజికవేత్త మల్లేపల్లి లక్ష్మయ్య కోర్టులో ఈ పిల్ దాఖలు చేశారు. కాగా హుజురాబాద్‌ ఉప ఎన్నికల నేపథ్యంలో దళిత బంధు ఆపాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆ ఆదేశాలను రద్దు చేయాలని ​కోరుతూ లక్ష్మయ్య పిల్ వేశారు.

పిల్‌లో.. ప్రభుత్వ పథకాలు అన్ని అమలు అవుతున్నప్పుడు కేవలం దళిత బంధును మాత్రమే ఆపాలని ఎన్నికల సంఘం ఆదేశాలు  ఇచ్చిందని, కనుక దళిత బంధు పథకాన్ని యధావిధిగా అమలయ్యేలా చూడాలని పిటిషనర్ పేర్కొన్నారు.

చదవండి: వెలుగులోకి మాజీ ఎమ్మెల్యే కొడుకు, ట్రైనీ ఐఏఎస్‌ నిర్వాకం..

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

వికారాబాద్‌: అవ్వ మిస్సింగ్‌, చివరకు..

బీఆర్‌ఎస్‌ ఎంపీలకు ప్రివిలేజ్‌ నోటీసులు

జానారెడ్డి సహా పలువురి నామినేషన్ల తిరస్కరణ

అందుకే నాంపల్లి ప్రమాదం జరిగింది: అగ్నిమాపక శాఖ

రేవంత్‌రెడ్డిపై తెలంగాణ సీఈవోకు ఫిర్యాదు