న్యూఢిల్లీ/ముంబై: హెచ్డీఎఫ్సీ స్డాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిస్టింగ్లోనూ, క్లోజింగ్లోనూ, ట్రేడింగ్ వాల్యూమ్స్లోనూ అదరగొట్టింది. ఈ కంపెనీ షేర్ శుక్రవారం ఇష్యూ ధర, రూ.290తో పోల్చితే బీఎస్ఈలో 7 శాతం లాభంతో రూ.311 వద్ద లిస్టయింది. ఇంట్రాడేలో 27 శాతం లాభంతో రూ.369 వద్ద గరిష్ట స్థాయిని తాకింది. ఇంట్రాడేలో రూ.308 కనిష్ట ధరను తాకిన ఈ షేర్ చివరకు 19 శాతం లాభంతో రూ.344 వద్ద ముగిసింది.
ఎన్ఎస్ఈలో కూడా 19 శాతం లాభంతో రూ.344 వద్దే ముగిసింది. బీఎస్ఈలో 2.13 కోట్లు, ఎన్ఎస్ఈలో 16.88 కోట్ల షేర్లు మొత్తం మీద 19 కోట్ల పైగా షేర్లు ట్రేడయ్యాయి. ట్రేడింగ్కు అందుబాటులో ఉన్న షేర్లు 24.12 కోట్లు కావడం విశేషం. బీఎస్ఈలోనూ, ఎన్ఎస్ఈలోనూ అత్యధికంగా ట్రేడైన షేర్లు ఈ కంపెనీవే. ఎక్సే్చంజ్ టర్నోవర్లో కూడా ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, రిలయన్స్ ఇండస్ట్రీస్ను తోసిరాజని ఈ కంపెనీయే అగ్రస్థానంలో నిలిచింది.
శుక్రవారం ట్రేడింగ్ ముగిసేనాటికి కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.69,159 కోట్లుగా ఉంది. హెచ్డీఎఫ్సీ గ్రూప్ నుంచి దాదాపు 22 ఏళ్ల తర్వాత వచ్చిన ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) ఇదే. ఈ నెల 7–9 మధ్య వచ్చిన ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.8,695 కోట్లు సమీకరించింది. రూ.275–290 ప్రైస్బాండ్తో వచ్చిన ఈ ఐపీఓ 4.9 రెట్లు ఓవర్ సబ్స్క్రైబయింది.