Breaking News

ఇప్పుడు కొనండి, అప్పుడు అమ్మండి: కియోసాకి

Published on Tue, 11/11/2025 - 19:33

వ్యాపారవేత్త, పెట్టుబడిదారుడు, రచయిత అయిన 'రాబర్ట్ కియోసాకి' ఎప్పటికప్పుడు ఆర్ధిక సూత్రాలను చెబుతూ.. పెట్టుబడికి సంబంధించిన విషయాలను కూడా వెల్లడిస్తూ ఉంటారు. ఇప్పుడు తాజాగా.. పేదవాళ్లు ఏం చేయగలరు? అని తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.

పేదవాళ్ల పట్ల నాకు జాలి ఉంది. పేదవాళ్ళకి డబ్బు ఇవ్వడంపై నాకు నమ్మకం లేదు. ఉదాహరణకు.. ఒక వ్యక్తికి ఒక చేప ఇస్తే.. ఒక రోజు ఆహరం పెట్టినట్లే. అదే వ్యక్తికి చేపలు పట్టడం నేర్పిస్తే.. జీవితాంతం ఆహారం పెట్టినట్లే.. అని కియోసాకి పేర్కొన్నారు.

ఇంతకు ముందు ట్వీట్‌లో వెండి 50 డాలర్లకు చేరింది. తరువాత 70 డాలర్లకు చేరుతుందా అని అడిగాను. దీనిపై చాలామంది స్పందించారు. ప్రపంచంలో చాలా మంది ప్రజలు, పేదవాళ్ళు కూడా 50 డాలర్ల వెండిని కొనుగోలు చేయగలరు. కొద్దిమంది మాత్రమే లక్ష డాలర్లు పెట్టి బిట్‌కాయిన్‌ను కొనుగోలు చేయగలరు. నేను నా మొదటి బిట్‌కాయిన్‌ను 6000 డాలర్లకు కొన్నాను. నా మొదటి 100 బిట్‌కాయిన్‌లు విలువ ఇప్పుడు మిలియన్స్ దాటేసింది.

ఇప్పటి నుంచి ఒక సంవత్సరం తర్వాత వెండి ఔన్సుకు 200 డాలర్లు ఉంటుందని నేను అంచనా వేస్తున్నాను. వెండి ధర భారీగా పెరిగినప్పుడు కొందరు కొనడం ప్రారంభిస్తారు. ధర తక్కువగా ఉన్నప్పుడు కొనండి. రేటు పెరిగినప్పుడు అమ్మండి. జాగ్రత్త అంటూ.. ట్వీట్ చేశారు.

ఇదీ చదవండి: డిసెంబర్ నాటికి బంగారం ధరలు ఇలా..

కియోసాకి ట్వీట్ చూస్తుంటే.. వెండి ధరలు ప్రస్తుతం కొంత తక్కువగా ఉన్నాయి, కాబట్టి ఇప్పుడు కొనండి, భవిష్యత్తులో ధర పెరిగినప్పుడు అమ్మండి అని చెబుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. భారతదేశంలో ఈ రోజు వెండి ధర రూ. 1000 పెరిగింది. దీంతో కేజీ రేటు రూ. 1.70 లక్షలకు చేరింది.

Videos

Adilabad: పిడిగుద్దులతో రెచ్చిపోయిన కాంగ్రెస్, బీఆర్ఎస్

జగన్ కట్టించిన ఇళ్లకు... చంద్రబాబు హంగామా

Prakash Raj: అవును.. నేను చేసింది తప్పే

మీడియాను ఘోరంగా అవమానించిన లోకేష్

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్

కేతిరెడ్డి ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం భారీ ర్యాలీ

మా MROలు వేస్ట్.. జనసేన నేత సంచలన కామెంట్స్

Vidadala Rajini: రాసిపెట్టుకోండి.. జగనన్న ఒకసారి చెప్పాడంటే

New Delhi: పేలుడు ఘటన బాధితులను పరామర్శించిన మోదీ

కపిలతీర్థంలో అయ్యప్ప స్వాములకు అవమానం

Photos

+5

బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌ బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

ట్రెడిషనల్‌ లుక్‌లో సురేఖవాణి కూతురు సుప్రీత (ఫొటోలు)

+5

వైఎస్సార్‌సీపీ ప్రజా ఉద్యమం..కోటి గొంతుకలతో సింహగర్జన (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (ఫొటోలు)

+5

ఈ ఆలయం లో శివుడు తలక్రిందులుగా ఉంటాడు...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ మూవీ ప్రెస్‌మీట్‌లో హీరోయిన్‌ అను ఇమ్మాన్యుయేల్ (ఫొటోలు)

+5

‘సంతాన ప్రాప్తిరస్తు’ ప్రీ రిలీజ్ లో మెరిసిన చాందినీ చౌదరి (ఫొటోలు)

+5

వణికిస్తున్న చలి.. జాగ్రత్తగా ఉండాల్సిందే (ఫొటోలు)

+5

అల్లరి నరేశ్ 12ఏ రైల్వే కాలనీ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

రెహమాన్ కన్సర్ట్ జ్ఞాపకాలతో మంగ్లీ (ఫొటోలు)