జింబాబ్వే లక్ష్యం 236

ప్రపంచ కప్ గ్రూప్-ఎ మ్యాచ్లో ఆదివారం తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్.. ప్రత్యర్థి జింబాబ్వే ముందు 236 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. పాక్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. మిస్బా(73), వహాబ్ రియాజ్ (54) రాణించారు. ఉమర్ అక్మల్ 33 పరుగులు చేశాడు. మిగితా వారంతా అంతగా రాణించలేక పోయారు.

బ్యాటింగ్కు దిగిన పాక్ ముందు నుంచే తడబడుతూ నాలుగు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. టాపార్డర్ బ్యాట్స్ మెన్లు రాణించలేకపోయారు. మిస్బా, రియాజ్ హాఫ్ సెంచరీలు చేయడంతో జట్టు స్కోర్ 200 దాటింది. జింబాబ్వే బౌలర్లలో టీఎల్ చటారా, మూడు, ఎస్సీ విలియమ్స్ రెండు వికెట్లు తీశారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top