జాతీయ పతాకాన్ని ఎగరేసిన కోహ్లి
ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో్ ఉన్న భారత క్రికెట్ జట్టు 71వ స్వాతంత్ర్యదినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. ఈ మేరకు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి జాతీయ పతాకాన్ని ఎగరేశాడు. జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో భారత క్రికెట్ జట్టు బృందంలోని మొత్తం సభ్యులు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియోను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.శ్రీలంకతో మూడు టెస్టుల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు.. ఐదు వన్డేల సిరీస్ కు సిద్ధమవుతోంది. ఆదివారం నుంచి వన్డే సిరీస్ ఆరంభం కానుంది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
వైరల్ వీడియోలు