ఆనందం ఐదింతలు

ఎన్ని విజయాలు సాధించినా కొన్ని విజయాలు మాత్రం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. కొన్ని మైలురాళ్లను చేరుకున్నప్పుడు విజయం మాత్రమే ఆనందాన్ని పరిపూర్ణం చేస్తుంది. అది కూడా తమ టెస్టు చరిత్రలో ఆడిన 500వ మ్యాచ్‌లో గెలిస్తే ఉండే సంతోషమే వేరు. కోహ్లిసేన కూడా ఈ ఆనందాన్ని దేశానికి అందించింది. 300, 400 తరహాలోనే 500వ టెస్టులో కూడా భారత్ గెలుపు జెండా ఎగరేసింది. తొలి రెండు రోజుల తడబాటు నుంచి వెంటనే కోలుకొని తమదైన రీతిలో సమష్టిగా సత్తా చాటిన మన జట్టు కాన్పూర్ టెస్టును ఎప్పటికీ మరచిపోలేని విధంగా చిరస్మరణీయం చేసుకుంది. ఓవరాల్‌గా భారత్‌కు ఇది 130వ విజయం కాగా... సొంతగడ్డపై 88వది. స్వదేశంలో భారత్ వరుసగా 12వ మ్యాచ్‌ను ఓటమి లేకుండా ముగించడం మరో విశేషం.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top