టీమిండియా హ్యాట్రిక్

ప్రపంచ కప్లో టీమిండియా జోరు కొనసాగుతోంది. హ్యాట్రిక్ విజయంతో నాకౌట్కు చేరువవుతోంది. తాజాగా ధోనీసేన పసికూన యూఏఈపై 9 వికెట్లతో అలవోక విజయం సాధించింది. ప్రపంచ కప్ పూల్-బిలో భాగంగా శనివారం యూఏఈతో జరిగిన ఈ మ్యాచ్లో 103 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత18.5 ఓవర్లలో కేవలం వికెట్ నష్టపోయి విజయతీరాలకు చేరింది. రోహిత్ శర్మ (57 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించాడు. విరాట్ కోహ్లీ (33 నాటౌట), ధవన్ 14 పరుగులు చేశారు. జట్టు స్కోరు 29 పరుగుల వద్ద ధావన్ (14) .. మహ్మద్ నవీద్ బౌలింగ్లో క్యాచవుటయ్యాడు. ఆ ఆ తర్వాత రోహిత్, కోహ్లీ మరో వికెట్ పోకుండా జట్టును గెలిపించారు. అంతకుముందు భారత బౌలర్లు యూఏఈని 31.3 ఓవర్లలో 102 పరుగులకు ఆలౌట్ చేశారు. యూఏఈ జట్టులో షైమన్ అన్వర్ (35) టాప్ స్కోరర్. అన్వర్తో పాటు ఖుర్రంఖాన్, గురుగె మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. మిగిలినవారు సింగిల్ డిజిట్కే పెవిలియన్ బాట చేరారు. భారత బౌలర్లు అశ్విన్ 4, జడేజా, ఉమేష్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీశారు. అశ్విన్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top