కొట్టేశాం...సఫారీని, సెమీస్ బెర్త్ని
ప్రపంచ నంబర్వన్ జట్టు దక్షిణాఫ్రికాను డిఫెండింగ్ చాంపియన్ భారత్ ఆల్రౌండ్ షోతో దెబ్బ కొట్టింది. చాంపియన్స్ ట్రోఫీలో సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. గ్రూప్ ‘బి’లో ఆదివారం జరిగిన పోరులో భారత్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన దక్షిణాఫ్రికా 44.3 ఓవర్లలో 191 పరుగులు చేసి ఆలౌటైంది. డికాక్ (72 బంతుల్లో 53; 4 ఫోర్లు) రాణించాడు. భారత బౌలర్లలో భువనేశ్వర్, బుమ్రా చెరో 2 వికెట్లు తీయగా... జడేజా, అశ్విన్, పాండ్యా తలా ఒక వికెట్తో టాపార్డర్ను దెబ్బతీశారు. తర్వాత భారత్ 38 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసి జయభేరి మోగించింది. ఓపెనర్ శిఖర్ ధావన్ (83 బంతుల్లో 78; 12 ఫోర్లు, 1 సిక్స్) తన సూపర్ ఫామ్ చాటగా... కెప్టెన్ కోహ్లి (101 బంతుల్లో 76 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకున్నాడు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
వైరల్ వీడియోలు