ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో ధర్నా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలంటూ ఢిల్లీలో ధర్నా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఆగస్టు 10వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పార్టీ ఆధ్వర్యంలో ఈ ధర్నా చేస్తారు. ఆరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ధర్నా ఉంటుంది.

ఆ తర్వాత 'మార్చ్ టు పార్లమెంట్' కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ మహాధర్నాలో పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనేతలు తదతరులు పాల్గొంటారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top