కర్నూలు ఎస్పీ ఏం చేస్తున్నారు?
సోషల్ మీడియాలో తమకు వ్యతిరేకంగా కామెంట్లు చేసినవాళ్లను రాత్రికిరాత్రే అరెస్టు చేయించే టీడీపీ ప్రభుత్వం.. రాజకీయ హత్యలపై కనీసం స్పందించకపోవడం దారుణమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి అన్నారు. పత్తికొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి నారాయణరెడ్డి హత్య జరిగి 48 గంటలైనా దోషులను పట్టుకోకుండా కర్నూలు ఎస్సీ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ కేంద్రకార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడిన గడికోట.. ఏపీలో ఆటవిక పాలన సాగుతున్నదని విమర్శించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు