‘చంద్రబాబు దుబాయ్ టూర్ ఎందుకెళ్లారు?’
ముఖ్యమత్రి చంద్రబాబునాయుడు, టీడీపీ నేతలు స్థాయి దిగజారి ఆరోపణలు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐడీఎస్ పథకం కింద రూ.10వేల కోట్లను తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారని నాడు చంద్రబాబు, టీడీపీ నేతలు అన్నారని, ఇప్పుడేం జవాబు చెబుతారని ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసం ఎదుటివారిపై బురదజల్లే కార్యక్రమాలు మానుకుంటే మంచిదని ఆయన హితవు పలికారు. కేంద్రం ప్రకటించిన ఐడీఎస్(స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం) అపహాస్యం అయిందని బొత్స అన్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు