ముద్రగడ ఏమైనా విద్రోహ శక్తా?: బొత్స

చంద్రబాబు నాయుడు పాలన చూస్తుంటే అసలు ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం ఉందా? లేక ప్రత్యేక రాజ్యాంగాన్ని ఏమైనా అమలు చేస్తున్నారా అనే అనుమానం కలుగుతోందని వైఎస్‌ఆర్‌ సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పోలీస్‌ పాలన నడుస్తోందని ఆయన విమర్శించారు.

బొత్స సత్యనారాయణ సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కాకినాడ నుంచి అమరావతి వరకూ వేలమంది పోలీసులు ఎందుకు మోహరించారని ప్రశ్నించారు. కాపు సామాజిక వర్గం మొత్తం బైండోవర్‌ చేస్తారా?, ముద్రగడ పద్మనాభం ఏమైనా దేశద్రోహానికి పాల్పడుతున్నారా?, ఆయన ఏమైనా విద్రోహశక్తా? అని బొత్స సత్యనారాయణ సూటిగా ప్రశ్నించారు. తూర్పు గోదావరి జిల్లా కర్ఫ్యూను తలపిస్తోందని అన్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top