'దుమ్ముగూడెం'ను జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించాలి: వైఎస్ జగన్

దుమ్ముగూడెం - నాగార్జునసాగర్ టేల్‌పాండ్ ప్రాజెక్ట్‌ను జాతీయ ప్రాజెక్ట్‌గా గుర్తించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి వైఎస్ జగన్ లేఖ రాశారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్ట్‌ను జాతీయ ప్రాజెక్ట్‌గా గుర్తించాలని లేఖలో ప్రధాని మోడీని వైఎస్ జగన్ కోరారు. ఖమ్మం, వరంగల్ , పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో 4 లక్షల ఎకరాలు ఈ ప్రాజెక్ట్‌తో సాగులోకి వస్తుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top