'కొత్త రాజధాని చుట్టూ స్కాములే'
రాజధాని పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న దారుణాలు చూస్తుంటే గుండెతరుక్కుపోతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని అక్కడ వస్తుంది.. ఇక్కడ వస్తుందంటూ లీకులిచ్చి తనకు కావాల్సిన వారికి మంచి జరిగేలా చూసుకొని రైతులను మాత్రం చంద్రబాబు మోసం చేశారని ధ్వజమెత్తారు. రాజధాని ప్రాంతాల్లోని గ్రామాల్లో పర్యటనలో భాగంగా గురువారం సాయంత్రం వైఎస్ జగన్ లింగాయపాలెంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. రాజధాని పేరుతో బలవంతంగా ల్యాండ్ పూలింగ్ చట్టం పేరిట ఇష్టమొచ్చినట్లుగా భూములు లాక్కోవడం ఒక్క చంద్రబాబు నాయుడికే చెందిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు