'ప్రభుత్వం మెడలు వంచుతాం'

అక్రమాల విషయంలో ఏపీ ప్రభుత్వం మెడలువంచే ప్రయత్నం చేస్తామని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. మరికొద్ది సేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో గన్ పార్క్ నుంచి అసెంబ్లీ వరకు వైఎస్సార్సీపీ నేతలు ర్యాలీగా బయలు దేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ రిషితేశ్వరి విషయంలో బాబురావు.. వనజాక్షి విషయంలో చింతమనేని...పట్టిసీమలో కోట్లు వెనకేసుకుంటున్న దేవినేని, రాజధానిలో నారాయణ, నారయణ కళాశాలలో జరుగుతున్న ఆత్మహత్యల ఘటనలను చంద్రబాబు వెనుకేసుకొస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి దొంగలను వెనుకేసుకొస్తున్న దొంగ చంద్రబాబు నాయుడని, ఆ దొంగ మరికొంతమంది దొంగలను వెనకేసుకు వస్తున్నారని ఆరోపించారు. తమ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడబోతోందని చెప్పారు. ప్రత్యేక హోదా రాకుంటే ఏపీ సర్వనాశనం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top