స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం: వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలని ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు. స్పీకర్ మీద తమకు నమ్మకం, గౌరవం పోయాయని, అందుకే తాము అవిశ్వాస తీర్మానం పెడతామని ఆయన చెప్పారు. అసెంబ్లీ మీడియా పాయింటులో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు. జల సంరక్షణపై ప్రతిజ్ఞ చేయడానికి ముందు తన వెనక నిల్చుని ఉన్న చీఫ్ విప్ శ్రీనివాసులుతో ''ప్రతిజ్ఞ చేయించడం పూర్తి కాగానే సభను వాయిదా వేయించు'' అని సూచించారు. దీంతో కాలువ తల ఊపుతూ, చేయి ఊపుతూ స్పీకర్కు సైగ్ చేశారు. సీఎం ప్రతిజ్ఞ పూర్తికాగానే ప్రతిపక్ష నేత జగన్కు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా స్పీకర్ సభను గురువారానికి వాయిదా వేశారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు