బతికుండగానే పులుల బోనులో విసిరేశారు

చైనాలో ఓ వన్యమృగ పరిరక్షణ కేంద్రంలోని వాటాదారుల మధ్య ఏర్పడిన వివాదం మూగజీవుల పాలిట శాపంగా మారింది. తనను మూగజీవాలు తీసుకెళ్లేందుకు అడ్డుకున్నారని కోపంతో ఏకంగా బతికి ఉన్న ఓ గాడిదను నేరుగా కొంతమంది వ్యక్తుల సహాయంతో పులుల ఎన్‌క్లోజర్‌లో పడేశాడు. రెండు నిమిషాల్లోనే ఆ గాడిదపై పులులు దాడి చేసి చంపేశాయి. ఈ సంఘటన జూకు వచ్చిన వారిని కంటతడిపెట్టించింది. అతడు మరోసారి గొర్రెలను వేసే ప్రయత్నం చేయడంతో అతడిని అడ్డుకున్నారు. ఈ ఘటన చైనాలోని జియాంగ్‌సు ప్రావిన్స్‌లోని చాంగ్‌జౌలోని జూపార్క్‌లో చోటు చేసుకుంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top