నేడే యూపీ తొలిదశ ఎన్నికలు

కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా మారిన ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ తొలి విడత ఎన్నికలు శనివారం జరగనున్నాయి. పశ్చిమ యూపీలోని మీరట్, ఆగ్రా తదితర 15 జిల్లాల్లో 73 నియోజకవర్గాలకు జరగనున్న పోలింగ్‌లో 2.6 కోట్ల మంది ఓటేయనున్నారు. 839 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ కుమారుడు పంకజ్‌(నోయిడా), ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ అల్లుడు రాహుల్‌ సింగ్‌(బులంద్‌షహర్‌ జిల్లా సికందరాబాద్‌ నుంచి ఎస్పీ తరఫున) బరిలో ఉన్నారు. ముజఫర్‌నగర్‌ అల్లర్ల నిందితుడైన సర్దానా సిటింగ్‌ బీజేపీ ఎమ్మెల్యే సంగీత్‌ సోమ్‌ మళ్లీ పోటీ చేస్తున్నారు. ముజఫర్‌నగర్‌లోని 887 పోలింగ్‌ కేంద్రాల్లో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top