సైన్యం రక్తంతో బీజేపీ రాజకీయం
భారత సైన్యం రక్తంతో బీజేపీ రాజకీయాలు చేస్తోందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్సింగ్ విమర్శించారు. బుధవారం పాతబస్తీలోని చార్మినార్వద్ద టీపీసీసీ ఆధ్వర్యంలో 26వ రాజీవ్ సద్భావనాయాత్ర జరిగింది. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి, పార్టీ ముఖ్యనేతలు ఎస్.జైపాల్రెడ్డి, కొప్పుల రాజు, జానారెడ్డి, షబ్బీర్ అలీ, మల్లు భట్టివిక్రమార్క తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి దిగ్విజయ్సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాకిస్తాన్ పేరు చెప్పకుండా ఎన్నికల్లో పాల్గొనే పరిస్థితి బీజేపీకి లేదన్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు