రోడ్డు ప్రమాదంలో కేంద్ర మంత్రికి గాయాలు

రైల్వేశాఖ సహాయమంత్రి మనోజ్ సిన్హా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఓ కార్యక్రమంలో పాల్గొనడంలో భాగంగా శుక్రవారం రాత్రి బరాబంకీ నుంచి గోరఖ్‌పూర్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మంత్రి మనోజ్ సిన్హా గాయాలతో పడగా ఆయన ఎడమ చేతి ఫ్రాక్చర్ అయింది. గాయపడ్డ వెంటనే లలిత్ నారాయణ్ మిశ్రా రైల్వే నిలయం ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం గోరఖ్‌పూర్ లోని అపోలో ఆస్పత్రికి ఆయనను తరలించినట్లు సమాచారం. ఈశాన్య రైల్వే లో సీనియర్ అధికారి సంజయ్ యాదవ్ ఎడమ భుజం, మోచేతి మధ్య భాగంలో ఫ్రాక్చర్ అయిందని, శనివారం సర్జరీ కోసం ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top