కొత్త వెలుగులు!
రాష్ర్టంలో విద్యుత్ కొరతను తీర్చేందుకు ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. కరెంటు కోతలపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా ఉత్పత్తిని పెం చేందుకు ప్రయత్నిస్తోంది. వచ్చే రెండు మూడేళ్లలోనే మిగులు విద్యుత్ను సాధించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే విద్యుత్ సంస్థలను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం కొత్త విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుపై ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించారు. దీంతో రాబోయే మూడేళ్లలో 6 వేల మెగావాట్ల విద్యుత్ను అదనంగా ఉత్పత్తి చేసేందుకు టీ-జెన్కో సమాయత్తమైంది. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లా ఇల్లెందు సమీపంలోని పెనుగడప వద్ద 4 వేల మెగావాట్ల భారీ విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి ముఖ్యమంత్రి తాజాగా గ్రీన్సిగ్నల్ ఇచ్చారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు