ఎరుపెక్కిన ఏఓబీ.. మహిళా మావోయిస్టుల మృతి
ఆంధ్రా - ఒడిషా సరిహద్దు ప్రాంతం (ఏఓబీ) మళ్లీ ఎరుపెక్కింది. భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు మరణించారు. ఒడిషాలోని రాయగఢ్ జిల్లాలో మావోయిస్టులు సమావేశమైనట్లు విశ్వసనీయంగా సమాచారం అందడంతో ఒడిషాకు చెందిన ఎస్ఓటీ బలగాలు, సీఆర్పీఎఫ్ దళాలు అక్కడకు చేరుకున్నాయి. ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు జరగడంతో ఇద్దరు మహిళా మావోయిస్టులు మరణించారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ఒక గిరిజనుడు కూడా గాయపడినట్లు తెలుస్తోంది. మహిళా మావోయిస్టులు మరణించినట్లు చెబుతున్నా, వాళ్లు ఏ రాష్ట్రం, ఏ దళానికి చెందినవారనే విషయం మాత్రం ఇంకా గుర్తించాల్సి ఉంది.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు