రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి.

పాల ట్యాంకర్‌ను మినీ వ్యాన్ ఢీ కొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా కొరిశపాడు వద్ద ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. విశాఖపట్టణానికి చెందిన ఓ కుంటుంబ తిరుపతి వెళుతుండగా వారు ప్రయాణిస్తున్న వ్యాన్ పాల ట్యాంకర్‌ను ఢీకొంది. దీంతో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వారిని ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top